ఒకే రోజు ఐదు క్షేత్రాల దర్శనం | - | Sakshi
Sakshi News home page

ఒకే రోజు ఐదు క్షేత్రాల దర్శనం

Nov 10 2025 7:38 AM | Updated on Nov 10 2025 7:38 AM

ఒకే రోజు ఐదు క్షేత్రాల దర్శనం

ఒకే రోజు ఐదు క్షేత్రాల దర్శనం

డాబాగార్డెన్స్‌: పవిత్ర కార్తీకమాసంలో ఒకే రోజున పంచారామాలు దర్శనం చేసేందుకు వీలుగా ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సులు ఆదివారం ద్వారకా బస్టేషన్‌ నుంచి బయలుదేరాయి. జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు, ద్వారకా బస్టేషన్‌ డిపో మేనేజర్‌, సూపర్‌వైజర్‌ ఈ బస్సులను దగ్గరుండి పంపించారు. ఈ సందర్భంగా ప్రజా రవాణా అధికారి మాట్లాడుతూ పంచారామ దర్శినికి వెళ్లే భక్తుల కోసం ఈ నెల 15, 16 తేదీల్లో కూడా బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. ఒకే రోజులో అమరావతి(అమరేశ్వరస్వామి), భీమవరం(సోమేశ్వరస్వామి), పాలకొల్లు(క్షీర రామలింగేశ్వరస్వామి), ద్రాక్షారామం(భీమేశ్వరస్వామి), సామర్లకోట(కుమార రామలింగేశ్వరస్వామి)లో దర్శనాలు చేసుకునేందుకు వీలుగా యాత్ర సాగుతుందన్నారు. ప్రయాణ చార్జీలను సూపర్‌ లగ్జరీకి రూ.2,150గా, అల్ట్రా డీలక్స్‌కు రూ.2,100గా నిర్ణయించారు. www. apsrtconline. in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌ చేసుకోవచ్చని, అలాగే రిజర్వేషన్‌ కౌంటర్ల వద్ద కూడా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం భక్తులు 9959225602 నంబర్‌లో సంప్రదించవచ్చు. ఇదే నంబరులో శబరిమల యాత్రకు సంబంధించిన టూర్లు, ఆన్‌లైన్‌ రిజర్వేషన్ల గురించి కూడా తెలుసుకోవచ్చని ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు వివరించారు.

పంచారామ దర్శినికి

బయలుదేరిన ఆర్టీసీ బస్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement