వృద్ధురాలి అనుమానాస్పద మృతి
హుజూరాబాద్: హుజూరాబాద్లోని ప్రతాపవాడలో వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రతాపవాడకు చెందిన పంపిరి పద్మ(70) భర్త ఎకై ్సజ్శాఖలో ఉద్యోగంచేసి మరణించాడు. కొడుకు, కూతురు ఉన్నారు. స్థానికంగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆదివారం సాయంత్రం కరెంట్ బిల్లు కొట్టేందుకు వచ్చిన ట్రాన్స్కో ఉద్యోగికి ఇంట్లోంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారికి విషయం చెప్పాడు. స్థానికులు తలుపులు తెరిచి చూడగా పద్మ మృతదేహం కనిపించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రెండు రోజుల క్రితమే మృతిచెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పద్మ కొడుకు ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో పద్మ మరణంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


