పశ్చిమ ఘాట్లకు రంగుల రక్ష | - | Sakshi
Sakshi News home page

పశ్చిమ ఘాట్లకు రంగుల రక్ష

Nov 10 2025 7:34 AM | Updated on Nov 10 2025 7:34 AM

పశ్చి

పశ్చిమ ఘాట్లకు రంగుల రక్ష

బనశంకరి: దక్షిణ భారతదేశంలో ఖ్యాతి గడించిన పశ్చిమ కనుమల సౌందర్యం, అక్కడి వన్యజీవులను కాపాడుకుందామంటూ రంగురంగుల చిత్ర ప్రదర్శన ఏర్పాటైంది. సిలికాన్‌ సిటీలోని చిత్రకళా పరిషత్‌లో ఏర్పాటుచేసిన ఈ పెయింటింగ్స్‌ ప్రదర్శన అందరికీ కనువిందు చేస్తోంది. హిడెన్‌ జెమ్స్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఘాట్స్‌ పేరుతో కొలువైన ప్రదర్శనలో అనేకమంది వర్ధమాన చిత్రకారులు, చిత్రకారిణులు గీసిన పెయింటింగ్స్‌ అబ్బురపరుస్తున్నాయి. పశ్చిమ కనుమలలోని అడవులు, జలపాతాలు, లోయలు, నదులు, పర్వతాలు, అక్కడ పేరుపొందిన పులులు, దున్నలు వంటి వన్యమృగాల చిత్రలేఖనాలను ఆకట్టుకునేలా గీశారు. అభివృద్ధి పేరుతో అడవులను నాశనం చేయరాదంటూ చెట్టు కాండం మీద గొడ్డళ్లు అమర్చిన నేచురల్‌ పెయింటింగ్‌ ఆలోచింపజేస్తుంది. ప్రకృతి వినాశనం వల్ల మానవాళి మనుగడకు తీవ్ర ముప్పు ఏర్పడుతుందనే సందేశాన్ని తమ పెయింటింగ్స్‌ ద్వారా కల్పించారు. పశ్చిమ కనుమల్లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కుద్రేముఖ్‌, ముళ్లయ్యనగిరి, నీల కురింజి, జోగ్‌ ఫాల్స్‌ను తమ చిత్రలేఖనాలలో బంధించారు. క్రిమిసంహారక మందులను విచ్చలవిడిగా ఉపయోగించి ప్రకృతిని నాశనం చేయరాదనే పెయింటింగ్‌ కూడా ఉంది. పర్యాటకులు సఫారీ వాహనాల వల్ల వన్యజీవులకు ఇబ్బంది కలుగుతోందని మరో పెయింటింగ్‌ కనిపిస్తుంది. టీ, కాఫీ తోటలు, పర్వత ప్రాంతాల చిత్రాలు కనువిందు చేస్తాయి. ఈ ప్రదర్శన సోమవారం సాయంత్రంతో ముగుస్తుంది.

చిత్రలేఖనాల వీక్షణం

పెయింటింగ్‌లో ఒదిగిన ప్రకృతి అందం

తిలకిస్తున్న విదేశీయులు

కొందరు చిత్రకారిణులు

చిత్రకళా పరిషత్‌లో

పెయింటింగ్స్‌ ప్రదర్శన

కాపాడాలని కుంచెతో విన్యాసం

పశ్చిమ ఘాట్లకు రంగుల రక్ష1
1/4

పశ్చిమ ఘాట్లకు రంగుల రక్ష

పశ్చిమ ఘాట్లకు రంగుల రక్ష2
2/4

పశ్చిమ ఘాట్లకు రంగుల రక్ష

పశ్చిమ ఘాట్లకు రంగుల రక్ష3
3/4

పశ్చిమ ఘాట్లకు రంగుల రక్ష

పశ్చిమ ఘాట్లకు రంగుల రక్ష4
4/4

పశ్చిమ ఘాట్లకు రంగుల రక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement