దుర్శేడ్‌లో పురోహితుడు.. అమెరికాలో దంపతులు | - | Sakshi
Sakshi News home page

దుర్శేడ్‌లో పురోహితుడు.. అమెరికాలో దంపతులు

Nov 10 2025 7:34 AM | Updated on Nov 10 2025 7:34 AM

దుర్శేడ్‌లో పురోహితుడు.. అమెరికాలో దంపతులు

దుర్శేడ్‌లో పురోహితుడు.. అమెరికాలో దంపతులు

కరీంనగర్‌రూరల్‌: ప్రస్తుతం ఆన్‌లైన్‌ వేదికగానే అన్ని పనులు కానిచ్చేస్తున్నారు. ఓ పురోహితుడు వీడియోకాల్‌ ద్వారా అమెరికాలోని దంపతులతో సత్యనారాయణస్వామి వ్రతం చేయించారు. పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్‌కు చెందిన వాల విజయ్‌కుమార్‌– వినీల దంపతులు ఉద్యోగరీత్యా అమెరికాలోని నార్త్‌ కరోలినాలో నివాసం ఉంటున్నారు. కార్తీకమాసం పురస్కరించుకుని శ్రీరమాసహిత సత్యనారాయణస్వామి వ్రతం చేయాలని నిర్ణయించుకున్నారు. అమెరికాలో బ్రాహ్మణులు అందుబాటులో లేకపోవడంతో కరీంనగర్‌ జిల్లా దుర్శేడ్‌లోని శ్రీమరకతలింగ రాజరాజేశ్వరస్వామి ఆలయ అర్చకుడు దేవరాజు ప్రశాంత్‌శర్మను ఫోన్‌లో సంప్రదించారు. ఆన్‌లైన్‌లో వ్రతం చేసే అవకాశముందని, అందుకు అవసరమైన వస్తువుల వివరాలను దంపతులకు వివరించారు. శనివారం రాత్రి 9.45గంటల నుంచి అర్ధరాత్రి 12.15గంటలవరకు వీడియోకాల్‌ ద్వారా వ్రతం చేయించారు. సత్యనారాయణస్వామి వ్రతానికి హాజరైన తెలుగువాళ్లకు వినీల దంపతులు తీర్థప్రసాదాలను అందించారు. కరోనా సమయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పూజకార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, వీడియోకాల్‌ ద్వారా విదేశాల్లో నివాసముంటున్న తెలుగువాళ్లకు శాంతి పూజలు, హోమాలు, ఇతరత్రా చేస్తున్నానని ప్రశాంత్‌ శర్మ తెలిపారు.

ఆన్‌లైన్‌ వేదికగా సత్యనారాయణస్వామి వ్రతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement