Archive Page | Sakshi
Sakshi News home page
breaking news

East Godavari

  • పెద్దిరెడ్డితో వైఎస్సార్‌ సీపీ నేతల ఆత్మీయ కలయిక

    సాక్షి, రాజమహేంద్రవరం: మాజీ మంత్రి, సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైఎస్సార్‌ సీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ములాఖాత్‌ అనంతరం ఆయన పార్టీ యువజన విభాగం రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ జక్కంపూడి గణేష్‌ నివాసానికి చేరుకున్నారు. ఆయనను కలిసిన వారిలో జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ ప్రముఖులు జక్కంపూడి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, చెల్లుబోయిన వేణు, పినిపే విశ్వరూప్‌, వంగా గీత, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, తలారి వెంకట్రావు, కొటారు అబ్యయ్య చౌదరి, డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, పినిపే శ్రీకాంత్‌, గన్నవరపు శ్రీనివాసరావు, కర్రి పాపారాయుడు, చెల్లుబోయిన శ్రీను, మేడపాటి షర్మిలారెడ్డి, సంకిన భవానీప్రియ ఉన్నారు.

  • యాప్‌లతో ఒత్తిడికి గురవుతున్నాం

    పాత సెల్‌ఫోన్లలో యాప్‌ల వల్ల అంగన్‌వాడీ కార్యకర్తలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నెట్‌వర్క్‌ సరిగా పని చేయకపోవడంతో ఒక్కో నమోదు అర గంటకు పైగా పడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5జీ సెల్‌ఫోన్లు లేదా ట్యాబ్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. మరోవైపు జీతాలు కూడా పెంచడం లేదు. చాలీచాలని జీతాలతోనే జీవనం సాగించాల్సి వస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూనియన్‌ నేతలతో ఒక్కసారీ మాట్లాడలేదు. అంగన్‌వాడీ కార్యకర్తలపై పని ఒత్తిడి పెరగడం వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. సమస్యలు పరిష్కరించే వరకూ, కొత్త సెల్‌ఫోన్లు ఇచ్చే వరకూ సెల్‌ఫోన్లతో పనిచేయడం జరగదు.

    – యాళ్ల బేబీరాణి, జిల్లా కార్యదర్శి,

    ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, తూర్పు గోదావరి

  • మార్కెట్‌లోకి కియా కారెన్స్‌ క్లావిస్‌ ఎలక్ట్రికల్‌ కార

    రాజమహేంద్రవరం సిటీ: నగరంలోని కంటిపూడి కియా షోరూంలో మంగళవారం కియా కారెన్స్‌ క్లావిస్‌ ఇండియాలో మొట్టమొదటి 7 సీటర్‌ ఫ్యామిలీ ఈవీని కంటిపూడి గ్రూప్‌ చైర్మన్‌ కంటిపూడి సర్వరాయుడు చేతుల మీదుగా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కారు సింగిల్‌ చార్జ్‌తో 490 కిమీ రేంజ్‌ కలిగి ఉందన్నారు. అధిక సామర్థ్యంతో 10 శాతం నుంచి 80 శాతం కేవలం 39 నిమిషాల్లో ఫాస్ట్‌ చార్జింగ్‌, లాంగ్‌ డ్రైవ్‌లకు సరిపోతుందన్నారు. దేశవ్యాప్తంగా 11,000 ప్లస్‌ చార్జి పాయింట్‌ ఆపరేటర్స్‌నీ కే, చార్జ్‌తో లొకేట్‌ చేసుకోవచ్చునన్నారు. 51.4 కేడబ్ల్యూహెచ్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ, ఐ–పెడల్‌ 4–లెవెల్‌ రీజనరేటివ్‌ బ్రేకింగ్‌, ప్యాడల్‌ షిఫ్టర్‌, లెవెల్‌ 2 సేఫ్టీ ఫీచర్లు, డ్యూయల్‌ పానారోమిక్‌ సన్‌రూఫ్‌, 6 ఎయిర్‌బ్యాగ్స్‌, 12.3 టచ్‌స్క్రీన్‌ కాక్‌పిట్‌, 8 బోస్‌ స్పీకర్లతో ప్రీమియం ఆడియో, స్మార్ట్‌ డాష్‌క్యామ్‌ డ్యూయల్‌ కెమెరాతో, ఎయిర్‌ ప్యూరిఫయర్‌ ఏక్యూఐ డిస్‌ప్లేతో, పర్యావరణ హితమైన ప్రయాణం, ఆధునిక సాంకేతికతతో అనుభూతిని మిళితం చేసే విధంగా ఉందన్నారు. కంటిపూడి గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.వినయ్‌ బాబు, ఎం.జగన్‌, సీహెచ్‌. సత్యనారాయణమూర్తి (చినబాబు), కె.మన్మోహన్‌రామ్‌, సి.ఈ.ఓ. సూర్య, ఎస్‌.ఎం కోమల పాల్గొన్నారు.

  • అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌

    కొబ్బరి రకం ధర (రూ.ల్లో)

    కొత్తకొబ్బరి (క్వింటాల్‌) 23,000 – 23,500

    కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000

    కురిడీ కొబ్బరి (పాతవి)

    గండేరా (వెయ్యి) 30,000

    గటగట (వెయ్యి) 27,000

    కురిడీ కొబ్బరి (కొత్తవి)

    గండేరా (వెయ్యి) 29,000

    గటగట (వెయ్యి) 26,000

    నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి)

    18,000 – 19,000

    కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 19,000

    కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000

    ఒక కిలో 400

  • భక్తు

    భక్తి ముసుగులో భారీగా దోపిడీ

    శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానంకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి సుదూ ర ప్రాంతాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు శ్రీపాద వల్లభ ఆలయానికి వస్తుంటారు. ఆలయా నికి వచ్చే భక్తుల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొంతమంది అక్రమార్కులు నివాస గృహాలను అద్దె గృహాలు (లాడ్జిలు)గా మార్చివేసి భారీగా అద్దెలు వసూలు చేస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తుండడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో నిర్మాణంలో ఉన్న భారీ భవనం పక్కకు వాలిపోయి కూలిపోయే స్థితికి చేరడంతో ఆ భవనం పక్కనే ఉన్న మరో భవన యజమాని అధికారులకు ఫిర్యా దు చేశారు. దీంతో అధికారులు పక్కకు వాలిపోయి కూలడానికి సిద్ధంగా ఉన్న భవన యజమానికి నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించారని, ప్రస్తుత భవనం పక్కకు వాలిపోయినట్లు గుర్తించామని, ఆ భవనం పడిపోతే ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మూడవ అంతస్తును తొలగించి, భవన నిర్మాణ పటిష్టత విషయమై కాకినాడ జేఎన్టీయూ నుంచి నిర్మాణ పటిష్టత ధ్రువీకరణ పత్రాన్ని 15 రోజుల్లోగా అందజేయాలని నోటీసులో పేర్కొన్నారు. కానీ అధికారుల నోటీసులు పట్టించుకోకుండా ఇక్కడ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి సలహా మేరకు కేవలం పై అంతస్తులు మాత్రమే తొలగించి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

    ప్రమాదం పునాదులపై కట్టడాలు

    ఇరుకు సందుల్లో బహుళ అంతస్తుల భవనాలు

    ఆటో కూడా వెళ్లలేని చోట అతి పెద్ద

    భవంతుల నిర్మాణం

    ఫైర్‌ ఇంజిన్‌, అంబులెన్సు కూడా వెళ్లలేని పరిస్థితి

    నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా అనుమతులు

    పిఠాపురం: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడెనిమిది అంతస్తుల భవనాలు. 50కి పైగా గదులు. ఒకేసారి 250 నుంచి 300 మంది వరకు ఒకే భవనంలో నివసించే విధంగా నిర్మాణాలు. కాన్నీ భవనం చుట్టూ నిలబడడానికి కూడా స్థలాలు కరవు. నిబంధనలను తుంగలో తొక్కి అవినీతి అధికారులు ఇష్టారాజ్యంగా ఇచ్చిన అనుమతులతో పిఠాపురం పట్టణంలో బహుళ అంతస్తుల భవనాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కనీసం ఆటో కూడా వెళ్లడానికి వీలు లేని ఇరుకు సందుల్లో అతి పెద్ద భవనాలు నిర్మించేశారు. దీంతో ఏదైనా పెద్ద ప్రమాదం సంభవిస్తే అంబులెన్సు గాని ఫైర్‌ ఇంజిన్‌ గాని వెళ్లలేని పరిస్థితి ఉన్నా ఏ ఒక్క అధికారి ఇటు వైపు చూడకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయాందోళనల నడుమ ఉంటున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    అవినీతితో అనుమతులు

    అత్యంత ప్రసిద్ధిగాంచిన పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానం ప్రతిష్టను దిగజార్చేలా కొంతమంది అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తుండడం, అక్రమార్కులకు మున్సిపాలిటీలోని టౌన్‌ ప్లానింగ్‌లో గతంలో పని చేసిన ఒక అధికారి సహకరించడం భక్తులకు శాపంగా మారింది. కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా సాగిన ఈ వ్యవహారం గతంలో నిర్మాణంలో ఉండగానే పక్కకు వాలిపోయి కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాల వ్యవహారంతో బయటపడింది. పిఠాపురం మున్సిపల్‌ పరిధిలో కేవలం జి ప్లస్‌ టు భవనాలను మాత్రమే నిర్మించాల్సి ఉంది. అంతకుమించి మరొక అంతస్తు నిర్మించాలంటే అనేక రకాల అనుమతి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ అవి ఏమీ లేకుండా అనుమతి పత్రాలకు బదులు శ్రీనోట్ల పత్రాల్ఙు సమర్పిస్తే నిబంధనలతో పని లేకుండా ఎన్ని అంతస్తులైనా ఎంచక్కా నిర్మించుకోవచ్చన్నది బహిరంగ రహస్యంగా మారింది. పిఠాపురం శ్రీపాద వల్లభ ఆలయం చుట్టుపక్కల కనీసం ఆటో కూడా వెళ్లలేని ఇరుకు వీధులలో ఐదంతస్తుల భవనాలను సైతం అవలీలగా నిర్మించడం వెనక భారీ ఎత్తున సొమ్ము చేతులు మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎటువంటి నిబంధనలు పాటించకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడంతో అవి ఎప్పుడు ఏ ప్రమాదాన్ని తెచ్చిపెడతాయోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

    ప్రమాదం జరిగితే అంతే సంగతి

    ఇరుకు సందులు చిన్న వీధుల్లో ఇష్టారాజ్యంగా నిర్మించిన పెద్ద భవనాల్లో ఏ ప్రమాదం జరిగినా ఒక్కరు కూడా తప్పించుకునే పరిస్థితి కనిపించదు. క్షతగాత్రులను తరలించడానికి కనీసం అంబులెన్సు కూడా వెళ్లలేని అత్యంత ప్రమాదకర పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏ భవనానికి అనుమతి ఇవ్వాలన్నా సేప్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. అక్కడ నివాసాలకు తగ్గట్టుగా పార్కింగ్‌ స్థలం ఉండాలి. కాని ఇక్కడ ఏ భవనం చూసినా గదులు పదుల సంఖ్యలో ఉంటే ఒక్క కారు కూడా పెట్టుకునే వీలు ఉండదు. శాశ్వత నివాసాలు కాకపోవడంతో యాత్రీకులు కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే ఉండి వెళ్లి పోతుండడంతో పార్కింగ్‌ వేరే చోట పెట్టి భవనాలను లాడ్జిలుగా ఉపయోగిస్తు రూ.లక్షల్లో దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్లానింగ్‌ విభాగపు అధికారుల చేతివాటం పట్టణ పరిధిలోని మరిన్ని భవనాల బహుళ అంతస్తులను పరిశీలిస్తే అవగతమవుతుంది. ఎవరు ఎలా పోతే మాకేంటి మా చేయి తడుస్తుంది అన్న రీతిలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎటువంటి అనుకోని సంఘటన జరిగినా ఫైర్‌ ఇంజిన్‌, పోలీస్‌, ఇతర శాఖల అధికారులు ప్రవేశించలేని ఇరుకు వీధులలో అక్రమ భవనాలకు లభించిన అనుమతులపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే మేల్కొంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    నిబంధనలు పాటించని వారిపై చర్యలు

    పిఠాపురం పట్టణంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేవారు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పట్టణంలో నిబంధనలు పాటించకుండా చేపట్టిన నిర్మాణలపై దృష్టి సారిస్తున్నాం. అటువంటి భవనాలపై కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటాం. – ఎస్‌.వల్లీప్రియ, పట్టణ ప్రణాళికా విభాగం అధికారిణి, పిఠాపురం మున్సిపాలిటీ

  • కుతుక

    బడుగులపై గొరిల్లా తరహా దాడులా :

    మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి

    అనపర్తి : నిర్దాక్షిణ్యంగా దాడులు చేసి ఆస్తులను గృహాలను నేలమట్టం చేసి పైశాచికానందం పొందుతున్నారని మండలంలోని కుతుకులూరు ఎస్సీపేట నిర్వాసితులు వాపోతున్నారు. అనపర్తి మండలం కుతుకులూరు ఎస్సీ పేటలో నివసిస్తున్న పదిమందికి చెందిన గుడిసెలను సోమవారం మధ్యాహ్నం భారీగా పోలీసులను మోహరించి జేసీబీలతో కూల్చివేశారని వారు చెప్పారు. ఈ ఘటనపై బాధితులు మాట్లాడుతూ సుమారు 50 ఏళ్లుగా ఈ కాలనీలో నివసిస్తున్నామని, తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో గుడిసెలను, పశువుల పాకలను వేసుకున్నామన్నారు. సోమవారం మధ్యాహ్నం పోలీసులు వచ్చి చెప్పా పెట్టకుండా అప్పటికప్పుడు జేసీబీలతో గుడిసెలను, పశువుల పాకలను కూల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మానవత్వం చూపకుండా తొలగించి తమను కావాలనే ఇబ్బందుల పాలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ సానుభూతిపరుల పక్కా భవనాల వైపు కనీసం కన్నెత్తి చూడలేదన్నారు. మారుమూల ఉండే ఆ ప్రదేశంలో విగ్రహాలు పెడతామని అంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    పేద బాతుకులపై గెరిల్లా దాడులా

    విషయం తెలుసుకున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి మంగళవారం బాధితులను పరామర్శించారు. జరిగిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఏదో ఒక మూల పేదలపై విరుచుకుపడి వారి ఇళ్లు, ఆస్తులు ధ్వంసం చేయడం పరిపాటిగా మారిందన్నారు. అనపర్తి నియోజకవర్గంలో అయితే మరో అడుగు ముందుకేసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డైరెక్షన్‌లో నిస్సహాయులైన బడుగుల జీవితాలపై గొరిల్లా తరహా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాత్రి సమయాల్లోను, తెల్లవారుజామున, సెలవు రోజుల్లోను వందలాది మంది పోలీసులను మోహరించి వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. వాటిలో దోమాడ తరహా అర్థిక పరమైన లాభాపేక్షతో చేసేవి కొన్నైతే బిక్కవోలు, కొమరిపాలెం, పందలపాక తదితర చోట్ల చేసినట్టు కక్షపూరితంగా కొన్ని చేస్తున్నారని ఆరోపించారు. దోమాడలో నిరుపేదల, కుతుకులూరులోని మారుమూల ఎస్సీపేటలో ప్రాణమున్న మనుషులను జీవచ్చవాలుగా మార్చి జీవం లేని విగ్రహాలు పెడతామని వింత వాదనను తీసుకువస్తున్నారని అన్నారు. ఈ కూల్చివేతల్లో పోలీసులతో పాటు మహిళా విభాగం నాయకురాలు కూడా ఉండి వారిని ప్రోత్సహిస్తున్నారంటే వారి రాక్షస మనస్తత్వం బయటపడుతుందన్నారు. అధికార పార్టీ నాయకులు పద్దతి మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవడం తథ్యం అని డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్‌ నాగిరెడ్డి ఉన్నారు.

  • సారా

    సామర్లకోట: సారా విక్రయం చేస్తూ ఇప్పటి వరకు ఆరు పర్యాయాలు కేసు నమోదు అయిన పండ్రవాడ గ్రామానికి చెందిన గెద్దాడ రాఘవకు పీడీ యాక్టు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశామని కాకినాడ, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సీఐ కె.రామమోహనరావు మంగళవారం తెలిపారు. ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ 2023 డిసెంబర్‌ నుంచి ఆమైపె నాటు సారా విక్రయం కేసులు నమోదు చేశామన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఆమె సారా వ్యాపారం చేస్తున్న కారణంగా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాకినాడ జిల్లా కలెక్టర్‌ రాఘవపై పీడీ యాక్టు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఈ మేరకు ఆమెను మంగళవారం రాజమహేంద్రవరం ప్రత్యేక మహిళా కారాగారానికి అప్పగించామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవోదయంలో భాగంగా ఈ పీడీ యాక్టు నమోదు చేశామని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సారా తయారీ, అమ్మకాలకు దూరంగా ఉండాలని సీఐ హెచ్చరించారు.

    పదిమందికి పదోన్నతులు

    కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్‌ పరిధిలో పనిచేస్తున్న ఏడుగురు జూనియర్‌ అసిస్టెంట్లకు, ముగ్గురు టైపిస్టులకు సీనియర్‌ అసిస్టెంట్‌లుగా పదోన్నతి కల్పిస్తూ జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు నియామకపు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ వేణుగోపాలరావు మాట్లాడుతూ ఖాళీలు ఏర్పడగానే అర్హులైన ఉద్యోగులకు పదోన్నతిపై నియామకపు ఉత్తర్వులు వెంటనే జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సాహంతో విధులు నిర్వర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజాసేవలో ముందుంటూ పంచాయతీరాజ్‌ సంస్థలను ప్రగతి పథంలో నడిపించడంలో భాగస్వామ్యం వహించాలని కోరారు. జెడ్పీ సీఈవో వీవీవీఎస్‌ లక్ష్మణరావు, ఉపముఖ్య కార్యనిర్వహణాధికారి జీఎస్‌ రామ్‌గోపాల్‌, ఏపీపీఆర్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌వీవీ రమేష్‌ పాల్గొన్నారు.

    నేడు జిల్లాస్థాయి జూనియర్‌ టార్గెట్‌ బాల్‌ జట్ల ఎంపిక

    చాగల్లు: చాగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 8,9 తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్‌ టార్గెట్‌ బాల్‌ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా జట్టును బుధవారం పాఠశాల ప్రాంగణంలో ఎంపిక చేయనున్నట్లు జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఆధార్‌కార్డుతో హాజరుకావాలని ఆమె పేర్కొన్నారు.

  • వెదుళ

    రుణాలు చెల్లించిన రైతుల ఆగ్రహం

    తమకు పాస్‌బుక్‌లు ఇవ్వాలని డిమాండ్‌

    సస్పెండైన సీఈవో లెటర్‌తో చైర్‌పర్సన్‌ ఎంపికపై అభ్యంతరం

    సీతానగరం: సస్పెండైన సీఈవో సురేంద్ర లెటర్‌తో చైర్‌ పర్సన్‌ పదవి ఇవ్వడమేంటని, రుణాలు చెల్లించిన రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌ను బ్యాంక్‌ నుంచి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ రైతులు వెదుళ్లపల్లి పీఏసీఎస్‌కు మంగళవారం తాళం వేశారు. వివరాల్లోకి వెళ్లితే పీఏసీఎస్‌లో రూ.64 లక్షలు గల్లంతయ్యాయని సాక్షి దినపత్రిక గత ఏడాది వెల్లడించింది. దాంతో సీఈవో సురేంద్ర, ఎరువుల సేల్స్‌ వుమెన్‌ భారతి, గుమస్తా పోశియ్యలను సస్పెండ్‌ చేశారు. రైతులు తీసుకున్న రుణాలు చెల్లించినా తప్పుడు రసీదులు ఇచ్చి అవినీతికి పాల్పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రుణాలు చెల్లించిన రైతులకు పట్టాదారు పాస్‌బుక్‌లు విచారణ పేరుతో అందించకుండా నిలిపివేశారు. తాజాగా పీఏసీఎస్‌ త్రిసభ్య కమిటీ ఏర్పాటుపై రైతులు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. లక్షలాది రూపాయల రుణాలు తీసుకుని ఓవర్‌ డ్యూలో ఉన్న కవల శ్రీనివాస్‌రావుకు సస్పెండైన సీఈవో సురేంద్ర లెటర్‌ ఇచ్చారని, అందులో శ్రీనివాస్‌ చెల్లించిన రుణ నగదు తానే వాడుకున్నానని, దానిని చెల్లిస్తానని లెటర్‌ ఇవ్వడంతో చైర్‌ పర్సన్‌ పదవి ఇవ్వడానికి విచారణాధికారి శివరామకృష్ణ సిద్ధపడ్డారని రైతులు మరిపిండి సోమరాజు, ఎ రుఘురామ్‌, మద్దుకూరి సత్యనారాయణ, బొల్లి సత్యనారాయణ, సానపల్లి సత్యనారాయణ, కొత్తపల్లి దోసాలరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండైన సీఈవో తాము చెల్లించిన రుణాలకు ఇదే విదంగా లెటర్‌ ఇస్తానని విచారణాధికారుల ఎదుట చెప్పాడని, లెటర్‌ తీసుకుని మా పట్టాదారు పాస్‌బుక్‌లు బ్యాంక్‌ నుంచి తమకు అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారం తేలే వరకు సొసైటీ తాళం తీయబోమని హెచ్చరించారు. రుణాలు చెల్లించిన రైతులకు న్యాయం చేయకుండా రుణాలు ఓవర్‌ డ్యూ అయిన వారికి లెటర్‌ ఆధారంగా సొసైటి చైర్‌ పర్సన్‌ పదవి ఇవ్వడం తగదని రైతులు అన్నారు.

  • ఉద్యోగులూ ఐక్యంగా ముందుకు సాగుదాం

    రామచంద్రపురం: రాష్ట్రంలో ప్రభుత్వం, కాంట్రాక్టు, ఔట్‌ర్సింగ్‌ ఉద్యోగులు, పెన్షనర్లు 13 లక్షల మంది ఉన్నారని వీరందరికీ 25 వేల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దాల బాపూజీ ఆరోపించారు. ఉద్యోగుల హక్కులు బాధ్యతలు తెలియజేసేందుకు, వారిని పోరాటంలో కార్యోన్ముకులను చేసేందుకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల రామ సూర్యనారాయణ పిలుపు మేరకు ఉద్యోగులను ఐక్యం చేసేందుకు ఉద్యోగులారా రండి.!.. టీ... తాగుతూ... మాట్లాడకుందాం.. పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బాపూజీ అన్నారు. అందులో భాగంగా రామచంద్రపురం తాలూకా కమిటీ అధ్యక్షుడు జి. శ్రీ మన్నారాయణ అధ్యక్షతన పట్టణంలో ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాపూజీ మాట్లాడుతూ ఉద్యోగులందరికీ నాలుగు డీఏలు, బకాయిలు ఉన్నాయని, ఐఆర్‌ ప్రకటించలేదని, సరండర్‌ లీవుల బకాయిలు చెల్లించడం లేదని, ఐదు సంవత్సరాలు దాటిన నేటికీ పీఆర్‌సీ ఏర్పాటు చేయలేదని బాపూజీ వాపోయారు. ఉద్యోగుల సమస్యలపై ఇతర సంఘాలు పోరాడటం లేదని, అందుకే ఏపీజీఏ కోనసీమ జిల్లా ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ఉద్యోగులలో చొచ్చుకుపోయేందుకు ఈ వినూత్న కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి ఇవ్వాల్సిన బకాయిలు ఎంత చెల్లించాలో నిర్ధారించాలని, బకాయి డబ్బులు ఎంత ఇవ్వాలో ఉద్యోగి సర్వీస్‌ రిజిస్టర్‌ (ఎస్‌ఆర్‌)లో నమోదు చేయాలని, ఉద్యోగి కోరుకున్న ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉంటే ఇండ్ల స్థలంగా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ కె.సుబ్బలక్ష్మి, కార్యదర్శి పైడిమల్ల సత్తిబాబు, పంపన విష్ణుమూర్తి, కరుణమ్మ, చీకట్ల వీరాంజనేయులు, సత్యవతి, దుర్గమ్మ, దుర్గ, శ్రీనివాస్‌, సత్తిబాబు పాల్గొన్నారు.

  • కన్నుల పండువగా వెంకన్న పవిత్రోత్సవాలు

    రెండోరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు

    కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు కన్నుల పండువగా నిర్వహించారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనము, ప్రోక్షణ, పవిత్ర ప్రతిష్ఠ ప్రధాన హోమాలు, అష్టకలశారాధన, మహాస్నపనము, నీరాజన మంత్రపుష్పాలు, సాయంత్రం స్వస్తివచనం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు దేవస్థానం తరఫున డీసీ అండ్‌ ఈఓ చక్రధరరావు పట్టు వస్త్రాలను అందజేశారు. వేదపండితులు, అర్చకులు వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణం శోభిల్లింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు ప్రసాద వితరణ జరిపారు.

National

  • కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, అసమ్మతి గళాలను ఆ పార్టీ చీఫ్, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా పరిగణిస్తున్నారు. సోమవారం లోక్‌సభలో పార్టీ చీఫ్‌ విప్‌ పదవికి సీనియర్‌ నేత కల్యాణ్‌ బెనర్జీ సమరి్పంచిన రాజీనామాను ఆమె ఆమోదించారు. ఆవెంటనే, కల్యాణ్‌ బెనర్జీ స్థానంలో కకోలీ ఘోష్‌కు చీఫ్‌ విప్‌ బాధ్యతలు అప్పగించారు. లోక్‌సభలో పార్టీ ఉపనేతగా శతాబ్ది రాయ్‌ను నియమించారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అసమ్మతిని, తిరుగుబాటు వైఖరిని సహించే ప్రసక్తేలేదని దీనిద్వారా ఆమె చెప్పకనే చెప్పినట్లయింది.

    ‘పార్టీ కంటే తామే మిన్న అని భావించే వారికి ఇదో హెచ్చరిక. వారికి ఇటువంటి గట్టి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది’అని టీఎంసీ సీనియర్‌ నేత ఒకరు పేర్కొన్నారు. మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిõÙక్‌ బెనర్జీకి లోక్‌సభలో పార్టీ నేతగా సోమవారం బాధ్యతలు అప్పగించడం తెల్సిందే. 

    పార్లమెంట్‌ సమావేశాలకు సరిగ్గా రాని ఎంపీలను వదిలేసి, తనది సమన్వయ లోపమని టీఎంసీ చీఫ్‌ మమత తప్పుబడుతున్నారంటూ కల్యాణ్‌ బెనర్జీ సోమవారం బహిరంగంగా వ్యాఖ్యానించడం తెల్సిందే. కొంతకాలంగా కల్యాaణ్‌ బెనర్జీ, పార్టీకే చెందిన మరో ఎంపీ మహువా మొయిత్రాలు మధ్య సోషల్‌ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటున్న నేపథ్యంలోనే ఈ పరిణామాలు సంభవించడం గమనార్హం. 

  • నెమ్రా: జార్ఖండ్‌ ముక్తిమోర్చా వ్యవస్థాపకుడు, జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్‌ అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. వేలాది మంది అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు తమ గురూజీకి కన్నీటి వీడ్కోలు పలికారు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శిబూ సోరెన్‌ సోమవారం ఢిల్లీ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.

    పార్దివదేహాన్ని తొలుత ఢిల్లీ నుంచి విమానంలో జార్ఖండ్‌ రాజధాని రాంచీకి తరలించారు. రాష్ట్ర అసెంబ్లీలో శిబూ సోరెన్‌ పార్దివదేహం వద్ద గవర్నర్‌ సంతోష్‌ గంగ్వార్, స్పీకర్‌ రవీంద్రనాథ్‌ మహతో, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు నివాళులరి్పంచారు. అనంతరం రామ్‌గఢ్‌ జిల్లాలోని శిబూ సోరెన్‌ స్వగ్రామం నెమ్రాకు భౌతికకాయాన్ని తరలించారు. కడసారి దర్శనం కోసం భారీగా జనం తరలివచ్చారు. గురూజీ అమర్‌ రహే అంటూ నినదించారు. అనంతరం అంతిమ యాత్ర మొదలైంది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.

    పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి వందనం సమర్పించారు. శిబూ సోరెన్‌ చితికి ఆయన పెద్ద కుమారుడు, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ నిప్పంటించారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి అర్జున్‌ ముండా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ హాజరు కాలేకపోయారు. వారు తొలుత విమానంలోని ఢిల్లీ నుంచి రాంచీకి చేరుకున్నారు.

    అక్కడి హెలికాప్టర్‌లో బయలుదేరాల్సి ఉండగా, సాంకేతిక సమస్యలతో హెలికాప్టర్‌ టేకాఫ్‌ కాలేదు. దాంతో రోడ్డు మార్గంలో సాయంత్రం కల్లా నెమ్రాకు చేరారు. హేమంత్‌ సోరెన్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు జార్ఖండ్‌ ప్రభుత్వం మూడు రోజులపాటు సంతాపం దినాలు ప్రకటించింది. మంగళవారం జార్ఖండ్‌లో పాఠశాలలు మూసివేశారు. జార్ఖండ్‌ అసెంబ్లీ సమావేశాలు సైతం నిరవధికంగా వాయిదా పడ్డాయి.   
     

Karimnagar

  • కరీంనగర్‌రూరల్‌: బొమ్మకల్‌లోని బిర్లా ఓపెన్‌మైండ్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన 3వ తరగతి విద్యార్థి మరియం భాను ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాస్థాయిలో ఎయిర్‌ రైఫిల్‌ షూటింగ్‌లో ప్రథమ బహుమతి సాధించినట్లు పీడీ సుంకరి మురళీధర్‌ తెలిపారు. ఈ నెల 3న స్వదేశ్‌ షూటింగ్‌ స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో ప్రతిభను ప్రదర్శించి ప్రథమ బహుమతి, రూ.10వేల నగదు గెలుచుకున్నట్లు వివరించారు. మంగళవారం విద్యార్థిని పాఠశాల చైర్మన్‌ దాసరి ప్రశాంత్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ బబితా విశ్వనాథన్‌ అభినందించారు.

  • డెంగీ

    కరీంనగర్‌టౌన్‌ :

    వర్షాకాలం.. వ్యాధులకు నిలయంగా మారుతోంది. దోమలు విజృంభించి వైరల్‌ ఫీవర్లు పెరుగుతున్నా యి. వాతావరణంలో మార్పులతో ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతుండగా.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ సంఖ్య పెరుగుతోంది. మరోవైపు జిల్లాలో డెంగీబెల్స్‌ మోగుతున్నాయి. చాపకింద నీరులా కేసులు పెరుగుతున్నాయి. ఫీవర్‌ సర్వేతో వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో పారిశుధ్య సమస్యలు ఏర్పడగా.. దోమల వృద్ధితో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతుతున్నాయి.

    ఇంటింటా సర్వే..

    గ్రామీణ ప్రాంతాలతో పాటు కరీంనగర్‌ సిటీలోనూ జ్వరపీడితులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంటింటా సర్వేతో వ్యాధుల కట్టడికి నిర్ణయించారు. గత నెల 27వ తేదీ నుంచి జ్వర పీడితులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సెప్టెంబర్‌ చివరి వరకు సాగే ఈ సర్వే కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 1,22,000 ఇళ్లలో పర్యటించి, 3,99,400 మందిని సర్వే చేశారు.

    అవగాహన.. వైద్యసేవలు

    పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడంతో పాటు జ్వరం వచ్చిన వారికి చికిత్స అందేలా పర్యవేక్షిస్తారు. జ్వరబాధితుల ఇళ్లలోని అనారోగ్యంతో ఉన్న వారి రక్తనమూనాలు సేకరిస్తారు. సాధారణ జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో బాధపడే వారికి మందులు ఇవ్వడంతో పాటు డెంగీ లక్షణాలు ఉంటే నిర్ధారించాక ఆస్పత్రులకు తరలిస్తారు. గ్రామాల్లో ఫాగింగ్‌ చేయించడం.. మురికి గుంతల్లో టీమోఫాస్‌ స్ప్రే, ఆయిల్‌ బాల్స్‌ వేయిస్తూ జ్వర పీడితులు ఎక్కువగా ఉన్నచోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నారు.

    14 డెంగీ కేసులు

    జిల్లాలో వ్యాధుల వ్యాప్తిని అరికట్టేలా నిర్వహిస్తున్న సర్వేతో 14 డెంగీ కేసులు బయటపడ్డాయి. వీరందరిని ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మామూలు జ్వరం ఉన్న వారికి అక్కడికక్కడే చికిత్స అందించడం, దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తరలించి మందులు ఇప్పించడం వంటివి చేస్తున్నారు. డెంగీ ప్రభావం గతేడాది కన్నా ప్రస్తుతం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆగస్టు వరకు జిల్లాలో 34 డెంగీ కేసులు నమోదయ్యాయి. దోమలు కుట్టకుండా రక్షణ పొందాలని, కాచి చల్లార్చిన నీరే తాగాలని, వేడివేడి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. గ్రామాల్లో తాగునీరు సరఫరా చేసే ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేయిస్తున్నారు.

    24 బృందాలతో పర్యవేక్షణ

    ఇంటింటి సర్వే పర్యవేక్షణకు 24 బృందాలను నియమించారు. ఈ బృందాలు వ్యాధుల సీజన్‌ ముగిసే వరకు క్షేత్ర స్థాయిలో ఇంటింటి సర్వే చేపట్టడమే కాకుండా, వైద్య పరీక్షలు నిర్వహిస్తాయి. ఈ బృందాలను జిల్లా వైద్యాధికారి నేతృత్వంలో డిప్యూటీ డీఎంహెచ్‌ సారథ్యంలో అధికారుల బృందం పర్యవేక్షణ చేస్తోంది.

    జిల్లాలో 14 కేసులు నమోదు

    ఫీవర్‌ సర్వేతో వెలుగులోకి

    4 లక్షల మందిని

    సర్వే చేసిన వైద్యబృందాలు

    నిరంతర పర్యవేక్షణ

    సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు కార్యాచరణ రూపొందించాం. ప్రతిరోజూ ఆరోగ్య బృందాలతో జ్వర సర్వే, డ్రై డే చేపడున్నాం. దోమల నియంత్రణ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే అవసరమైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేస్తున్నాం.

    – డాక్టర్‌ రాజగోపాల్‌రావు, డిప్యూటీ

    డీఎంహెచ్‌వో, జల్లా మలేరియా అధికారి

  • మానేర
    బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025
    ● మినీబీచ్‌ను తలపిస్తున్న ఎల్‌ఎండీ ● అందాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో తరలివస్తున్న పర్యాటకులు

    కరీంనగర్‌ నగరశివారులోని లోయర్‌ మానేరుడ్యాం మినీబీచ్‌ను తలపిస్తోంది. డ్యాంలో నీటిమట్టం తగ్గడంతో తిమ్మాపూర్‌ వైపు ఉన్న ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది. వీచే గాలులకు నీటి అలలు మురిపిస్తుండగా.. మినీ బీచ్‌ అందాలను తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. సెలవు రోజుల్లో ఈ ప్రాంతం జాతరను తలపిస్తోంది. సాయంత్రం పూట రద్దీ పెరుగుతుండగా.. పర్యాటకులు నీటిలో ఆడిపాడుతూ.. కేరింతలు కొడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, కరీంనగర్‌

    న్యూస్‌రీల్‌

  • పర్యా

    కొత్తపల్లి(కరీంనగర్‌): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ అన్నా రు. కొత్తపల్లిలోని రైతు వేదిక ఆవరణలో మంగళవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన వన మహోత్సవంలో మొక్కనాటి నీరు పోశారు. కొత్తపల్లిలో ఖాళీ స్థలాలను గుర్తిస్తే ప్రకృతి వనాలు పెంచేందుకు ప్రోత్సహిస్తామన్నారు. ఆర్డీవో కందారపు మహేశ్వర్‌, జిల్లా వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ భాగ్యలక్ష్మి, ఏడిఏ రణ్‌ధీర్‌రెడ్డి, ఏవో మామిడి కృష్ణ రైతులు తదితరులు పాల్గొన్నారు.

    ప్రజలకు అందుబాటులో ఉండాలి

    కరీంనగర్‌ నగరపాలక సంస్థ డివిజన్లలోని ప్రజలకు వార్డు ఆఫీసర్లు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించాలని కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ సూచించారు. కొత్తపల్లి, చింతకుంటలలో మంగళవారం పర్యటించి, పలు సూచనలు చేశారు. నగర పాలక సంస్థలో విలీన డివిజన్లలో పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా పర్యవేక్షించాలన్నారు. డిప్యూటీ కమిషనర్‌ వేణు మాధవ్‌, ఖాదర్‌ మోహియోద్దీన్‌ పాల్గొన్నారు.

    ‘బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ ప్లేట్‌ ఫిరాయింపు’

    కరీంనగర్‌టౌన్‌: బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్లేట్‌ ఫిరాయించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి విమర్శించారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంపై పార్టీ ముఖ్యనేతలు, ప్రోగ్రాం ఇన్‌చార్జీలతో మంగళవారం రేకుర్తి లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సమీక్ష నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ హర్‌ ఘర్‌ బీజేపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలే కాంగ్రెస్‌కు తగిన గుణ పాఠం చెప్తారన్నారు. యాదగిరి సునీల్‌ రావు, గుగ్గిల్లపు రమేశ్‌, కోమల ఆంజనేయులు, బంగారు రాజేంద్రప్రసాద్‌, మేకల ప్రభాకర్‌ యాదవ్‌, వాసాల రమేశ్‌, తాళ్లపల్లి శ్రీనివాస్‌ గౌడ్‌, బత్తుల లక్ష్మీనారాయణ, మాడ వెంకటరెడ్డి, బోయిన్‌పల్లి ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.

    ‘ఆపద మిత్ర’ శిక్షణ విజయవంతం

    కరీంనగర్‌ అర్బన్‌: విపత్తు సమయంలో ప్రజలను రక్షించేందుకు జిల్లాలో మూడు బ్యాచ్‌లుగా సుమారు 300 మందికి ‘ఆపదమిత్ర’ శిక్షణ ఇచ్చామని, రాష్ట్రంలో మొట్టమొదటగా జిల్లాలో శిక్షణ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. కరీంనగర్‌ బీసీ స్టడీ సర్కిల్‌లో విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో ఆపదమిత్ర మూడో దఫా శిక్షణ ముగింపు కార్యక్రమానికి డీఆర్వో హాజరయ్యారు. జిల్లాలోని కళాశాల విద్యార్థులు, ఎన్‌సీసీ వలంటీర్లు, వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగులతో పాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన 300మంది వలంటీర్లకు మూడు దఫాలుగా 12 రోజులు శిక్షణ విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనే విధంగా ఈ శిక్షణను ఇచ్చామని తెలిపారు. మెడికల్‌, ఫారెస్ట్‌, ఎకై ్సజ్‌, పోలీస్‌, సైబర్‌, ఫైర్‌, రూరల్‌, అగ్రికల్చర్‌ తదితర శాఖల ఆధ్వర్యంలో ఆపదమిత్ర వలంటీర్లు పకడ్బందీ శిక్షణ పొందారని అన్నారు.

    పవర్‌కట్‌ ప్రాంతాలు

    కొత్తపల్లి: విద్యుత్‌ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపుతోపాటు డీటీఆర్‌ పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.సుభాష్‌నగర్‌ ఫీడర్‌ పరిధిలోని సుభాష్‌నగర్‌, బుట్టిరాజారాంపల్లికాలనీ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్‌ 1 ఏడీఈ పంజాల శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.

    క్వింటాల్‌ పత్తి రూ.7,600

    జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్‌లో మంగళవారం క్వింటాల్‌ పత్తి రూ. 7,600 పలికింది. క్రయ విక్రయాలను ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్‌–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.

  • మాటల మంటలు
    ● అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌, మాజీ చైర్మన్ల మధ్య వార్‌ ● పోటాపోటీగా ప్రెస్‌మీట్లు ● చర్చకు సిద్ధమా అని చైర్మన్‌ సవాల్‌ ● బ్యాంకు పరువు తీయొద్దన్న మాజీ చైర్మన్‌

    కరీంనగర్‌ అర్బన్‌: కరీంనగర్‌ సహకార అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌, మాజీ చైర్మన్ల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఇన్నాళ్లు అంతర్గతంగా జరిగిన అధిపత్యపోరు ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంతో రచ్చకెక్కింది. అర్బన్‌ బ్యాంకులో అక్రమాలు జరిగాయని, ఏకంగా మాజీ చైర్మన్‌ కర్ర రాజశేఖర్‌తో పాటు 15మంది సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్లు బ్యాంకు చైర్మన్‌ గడ్డం విలాస్‌రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. మంగళవారం గడ్డం విలాస్‌రెడ్డి, కర్ర రాజశేఖర్‌ పోటాపోటీగా ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. కరీంనగర్‌ సహకార అర్బన్‌ బ్యాంకులో విలాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 3న జరిగిన సర్వసభ్య సమావేశాన్ని మాజీ చైర్మన్‌ రాజశేఖర్‌ తప్పుపట్టాడని ఆరోపించారు. హైకోర్టు ఆర్డర్‌లను తప్పుపట్టడం విడ్డూరమని అన్నారు. నకిలీ బంగారం విషయంలో కిందివారిపై చర్య తీసుకోకుండా బ్యాంక్‌ అధికారిని సస్పెండ్‌ చేసింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. 2017లో ఎన్నికల వాయిదాకు, ఒకే ఇంట్లో 125 ఓట్లను చేర్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూశారని విమర్శించారు. ఇంటింటి సర్వే ద్వారా 9000 ఓట్లు తీసేశారని, అవి బోగస్‌ ఓట్లు కాదా అన్నారు. సర్వేకు రూ.5లక్షల నష్టం జరిగిందని అది గత పాలకవర్గం తప్పు వల్లే అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటూ డైరెక్టర్‌గా ఉండేందుకు కుయుక్తులు చేస్తున్నారని అన్నారు. అన్ని అంశాలపై చర్చించేందుకు మీరు సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

    బ్యాంకు పరువు తీయొద్దు: కర్ర రాజశేఖర్‌

    అర్బన్‌ బ్యాంక్‌ పీఏసీ కమిటీ చైర్మన్‌ గడ్డం విలాస్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు బ్యాంక్‌ పరువును దెబ్బతీసేలా ఉన్నాయని మాజీ చైర్మన్‌ కర్ర రాజశేఖర్‌ మండిపడ్డారు. మంగళవారం నగరంలో మాట్లాడుతూ 2007 నుంచి 2017 వరకు పాలకవర్గంగా పనిచేశామని, ఇప్పుడెందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. గత నెల 27న జరిగిన జనరల్‌ బాడీ మీటింగ్‌ కోరమ్‌ లేకుండా వాయిదా పడిందని, ఈ నెల 3న మరోసారి 208 మంది సభ్యులతో సమావేశం పెట్టినా అదే పరిస్థితి ఎదురైందని తెలిపారు. తమపై ఇప్పటివరకు ఎలాంటి చట్టబద్ధమైన విచారణ జరగలేదని, ఎనిమిదేళ్లుగా ఎంకై ్వరీ లేదని పేర్కొన్నారు. బ్యాంకులో ఓవర్‌రైటింగ్‌ జరిగిందన్న ఆరోపణలకు తాము బాధ్యులు కాదని, మెంబర్షిప్‌ బుక్స్‌ సీఈఓ వద్ద ఉంటాయన్నారు. అప్పుడు పనిచేసిన రాజారాంరెడ్డి అనే సీఈఓపై తాము చర్యలు తీసుకున్నామని, ఆయన కోర్టు ద్వారా తిరిగి ఉద్యోగంలోకి వచ్చారని వివరించారు. 1982లో బ్యాంక్‌ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటినుంచి 25 ఏళ్లలో రూ.24కోట్లు మాత్రమే డిపాజిట్‌ కాగా, తమ పాలనలోనే రూ.60కోట్ల డిపాజిట్లు వచ్చాయని వివరించారు. 2017 తర్వాత 8 ఏళ్లలో కేవలం 10 కోట్లు మాత్రమే పెరిగాయని తేల్చిచెప్పారు. విలాస్‌రెడ్డికి తమ మెంబర్‌షిప్‌ రద్దు చేసే హక్కు లేదన్నారు.

  • కేసీఆర్‌ను ముట్టుకుంటే తెలంగాణ అగ్గే

    కొత్తపల్లి(కరీంనగర్‌): కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ భగ్గుమంటుందని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ కుట్రలు.. కమిషన్‌ వక్రీకరణలు, వాస్తవాలు’ అనే అంశంపై ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ను చింతకుంటలోని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు. అనంతరం కమలాకర్‌ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్‌రావు ప్రజెంటేషన్‌ తెలంగాణ ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైందన్నారు. ప్రభుత్వం తమదేనని విర్రవీగుతున్న కాంగ్రెస్‌ కొన్ని మీడియా సంస్థలకు కాళేశ్వరంపై లీకులు ఇస్తూ తప్పుడు ప్రచారం చేయిస్తోందని, ఆనాడు తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్మినట్లే ప్రస్తుతం కుట్రలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఆనాడు సమాజమంతా కేసీఆర్‌ వెంటే ఉండి తెలంగాణను సాధించుకుందని, ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ కుట్రలను భగ్నం చేసేందుకు సమాజమంతా కేసీఆర్‌ వెంటే ఉందని చెప్పారు. ఆనాడు నెహ్రూ ఎస్సారెస్పీకి 1963లో పునాది వేస్తే..మళ్లీ 2016లో కెసిఆర్‌ కాళేశ్వరానికి శంకుస్థాపన చేశారన్నారు. తెలంగాణలో 600 కిలో మీటర్లు ప్రవహించే గోదావరి నదిపై ఎందుకు ప్రాజెక్టులు నిర్మించలేదని ప్రశ్నించారు. ఉత్తర తెలంగాణను ఎడారి చేసే కుట్రలో భాగంగానే ఆనాటి పాలకులంతా నీటినంతా ఆంధ్రాకు తరలించారని మండిపడ్డారు. ఎడారిగా మారుతున్న తెలంగాణను సశ్యశ్యామలం చేసేందుకు కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి కేవలం మూడేళ్లలోనే పూర్తి చేశారన్నారు. దీంతో ఎల్‌ఎండీ, మిడ్‌మానేరు, చెరువులు, కుంటలన్నీ నిండి భూమికి బరువైన పంటలు పండాయన్నారు. రాష్ట్రంలో వలసలు తగ్గి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆభ్యంతరంతోనే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజె క్టు కట్టలేదని, సీడబ్ల్యూసీ అనుమతులు కూడా లభించకపోవడం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన జరిగిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే చంద్రబాబు పరిపాలన నడుస్తోందని, అందరూ ఒక్కటై మళ్లీ తెలంగాణను ఆంధ్రాలో కలిపే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు హైదరాబాద్‌లో వాలితే తెలంగాణ వాసులంతా వలసలు వెళ్లే ప్రమాదం పొంచి ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బండ శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, పొన్నం అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

    కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీలో ఎండగడతాం

    కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

  • ముఖ గుర్తింపు హాజరు పెంచాలి
    ● ఎంఈవోలు మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించాలి ● కలెక్టర్‌ పమేలా సత్పతి

    కరీంనగర్‌: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ గుర్తింపు హాజరు నమోదు శాతం పెంచాలని కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, రాష్ట్ర మోడల్‌ స్కూల్స్‌ ప్రిన్సి పాళ్లు, మండల విద్యాధికారులతో కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థుల హాజరు 85శాతానికి తగ్గకుండా ఉండాలని అన్నారు. తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థుల హాజరు శాతాన్ని తెలియజేయాలని, రోజు పిల్లల్ని పంపించే విధంగా కౌన్సెలింగ్‌ నిర్వహించాలన్నారు. కేజీబీవీ, మోడల్‌ స్కూళ్ల హాస్టళ్లలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలని ఆదేశించారు. హరిత విద్యాలయ రిజిస్ట్రేషన్లలో జిల్లా ప్రథమస్థానంలో నిలవాలని సూచించారు. మండల విద్యాధి కారులు జిల్లాలోని పాఠశాలలు, మోడల్‌ స్కూ ళ్లు, కేజీబీవీలను తరచూ సందర్శిస్తూ అల్పాహా రం, మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీ లించాలని ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌, జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్‌ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్‌, ఆంజనేయులు, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి పాల్గొన్నారు.

    రోగులకు ఇబ్బంది ఏర్పడొద్దు

    కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని క్రిటికల్‌ కేర్‌ విభాగం, మాతా శిశు కేంద్రాన్ని కలెక్టర్‌ పమేలా సత్పతి మంగళవారం సందర్శించారు. వైద్య సేవలు, పలు సౌకర్యాలను పరిశీలించారు. ఐసీయూ, వార్డులు, ఆపరేషన్‌ థియేటర్‌ను సందర్శించారు. క్రిటికల్‌ కేర్‌ విభాగం నిర్వహణకు అవసరమైన ఆక్సిజన్‌లైన్‌ సమకూర్చుకోవాలని ఆదేశించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఓపీ విభాగం, స్కానింగ్‌ గదిని పరిశీలించారు. గర్భిణులతో మాట్లాడి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఓపీ విభాగంలో ఉక్కపోతతో గర్భిణులు, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున వెంటనే ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభు త్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీరారెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్‌ నవీనా పాల్గొన్నారు.

  • సూచిక బోర్డులు.. ప్రమాదాలకు నిలయాలు

    ప్రమాదాలు నివారించేందుకు ఏర్పాటు చేస్తున్న సూచికలే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కరీంనగర్‌– జగిత్యాల ప్రధాన రహదారిపై కొత్తపల్లి వైద్య కళాశాల వద్ద రోడ్డుపై ఏర్పాటు చేసిన స్టాఫర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాల పేరిట రహదారిపై ఏర్పాటు చేసిన స్టాఫర్లకు రేడియం మెరుపులు లేకపోవడంతో రాత్రి వేళల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కరీంనగర్‌, జగిత్యాల నుంచి రాత్రి వేళల్లో వేగంగా వచ్చే వాహనదారులకు స్టాఫర్లు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. స్టాఫర్లకు రేడియం స్టిక్కర్లు అంటించాలని వాహనదారులు కోరుతున్నారు. – కొత్తపల్లి(కరీంనగర్‌)

Karnataka

  • బస్సు

    బనశంకరి: బకాయి ఉన్న 34 నెలల వేతనంతో పాటు వివిధ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కేఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం సమ్మె చేయడంతో బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. అర్జంటు పని ఉండి గమ్యానికి చేరలేక అయోమయానికి గురయ్యారు. బెంగళూరుతో సహా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాలకు ఉదయం నుంచి బస్సు సంచారం నిలిచిపోయింది. సోమవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య , ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. బస్‌ సౌలభ్యం లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీఎంటీసీ బస్సులు కూడా డిపోలకే పరిమితం అయ్యాయి.

    ఒక్కో జిల్లాలో ఒక్కోలా

    ● మైసూరులో నగరంలో బస్‌సంచారం స్తంభించిపోయింది. కొడగు జిల్లాలో పెద్ద ఇబ్బంది కనిపించలేదు. హాసన్‌– మైసూరు బస్సులు కుశాలనగరలో నిలిచిపోయాయి.

    ● రాయచూరులో 50 శాతం బస్సులు మాత్రమే సంచరించాయి. హుబ్లీ–ధార్వాడ జంట నగరాల్లో బస్సులు బంద్‌ అయ్యాయి.

    ● సరిహద్దు జిల్లాల్లో ఆంధ్ర, తెలంగాణ బస్సులు మామూలుగా తిరిగాయి. చిక్కబళ్లాపుర జిల్లాలో బంద్‌ ప్రభావం కనబడలేదు. కానీ ప్రయాణికులు బంద్‌ అని బస్టాండ్లు రాలేదు. మంగళూరులోనూ బంద్‌ కనిపించలేదు.

    ● చిక్కమగళూరులో బస్సులు సంచారం నిలిచిపోవడంతో దీంతో ప్రజలు ప్రైవేటు బస్సులను ఆశ్రయించారు.

    ● అనేక జిల్లాల్లో దూరపు ప్రయాణానికి బస్టాండ్ల వద్దకు చేరుకున్న మహిళలు, ప్రయాణికులు ఉస్సూరుమన్నారు. బస్టాండ్లు ఖాళీగా కనిపించాయి.

    ● అత్యవసర కార్యక్రమాల కోసం వెళ్లే అనేకమంది ప్రైవేటు వాహనాల్లో అధిక డబ్బులు ఇచ్చి ప్రయాణించారు. ప్రయాణ వసతి లేక పాఠశాలల్లో హాజరు తగ్గింది. పలు కాలేజీలు, వర్సిటీలలో పరీక్షలను వాయిదా వేశారు.

    బలవంతంగా డ్రైవింగ్‌

    శిక్షణలో ఉన్న డ్రైవర్లతో ఆర్టీసీ అధికారులు బలవంతంగా కొన్ని బస్సులను నడిపించారు. సమ్మెకు మద్దతు తెలిపిన డ్రైవర్లు, కండక్టర్లను అధికారులు బెదిరిస్తున్నారని ఉద్యోగ నేతలు చెప్పారు. విధులకు వెళ్లేవారిని ఇబ్బంది పెట్టబోమని, తమది శాంతియుత సమ్మె అని తెలిపారు. అయితే కోలారు, కొప్పళ యలబుర్గా వద్ద ఆర్టీసీ బస్సులపై అల్లరిమూకలు రాళ్లు విసిరారు. కిటికీల అద్దాలు పగిలాయి.

    రాష్ట్రమంతటా ఆర్టీసీ సమ్మె

    అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు

    మధ్యాహ్నం 4 వరకు అవస్థలు

    హైకోర్టు ఆదేశాలతో సమ్మె సమాప్తం

    బెంగళూరులో ఎఫెక్ట్‌

    ఆర్టీసీ, బీఎంటీసీ బంద్‌ ఎఫెక్టు బెంగళూరు నగరంపై ఓ మోస్తరుగా పడింది. విద్యార్థులు, ఉద్యోగులు దిక్కులు చూశారు. మెజెస్టిక్‌ కెంపేగౌడ బస్టాండు, శాంతినగర, కేఆర్‌.మార్కెట్‌, ఎలక్ట్రానిక్‌సిటీ, టిన్‌ ఫ్యాక్టరీ తదితర అనేక బస్టాండ్లకు ఉదయం నుంచి వచ్చినవారు తెల్లమొహం వేశారు. దూర ప్రాంతాలకు అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. బుకింగ్‌ డబ్బులు వెనక్కి తీసుకోవడానికి రద్దీ ఏర్పడింది. మరో పక్క బెంగళూరులో ఎలక్ట్రిక్‌ బస్సులు సంచరించాయి. కేఆర్‌.మార్కెట్‌లో ప్రైవేటు బస్సులకు గిరాకీ ఏర్పడింది. ఉదయం 9, 10 తరువాత బీఎంటీసీ బస్సులు రోడ్లపైకి వచ్చాయి.

    సమ్మైపె హైకోర్టు స్టే

    శివాజీనగర: ఆర్టీసీ సమ్మైపె దాఖలైన పిటిషన్లను హైకోర్టు మంగళవారం విచారించింది. సమ్మైపె ఇచ్చిన స్టేను 2 రోజులు పొడిగించింది. సమ్మెతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగిందని ఏజీ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం, ఉద్యోగుల చర్చల సమాచారాన్ని తెలిపారు. కోర్టు ధిక్కారానికి పాల్పడవద్దని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల న్యాయవాదికి జడ్జిలు హెచ్చరించారు. సమ్మెను నిలిపేశారా? అని అడిగారు. హైకోర్టు ఆదేశాలతో మధ్యాహ్నం 4 గంటల నుంచి బంద్‌ను విరమించారు. రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ సమ్మెను ముగిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల జాయింట్‌ క్రియా సమితి అధ్యక్షుడు అనంత్‌ సుబ్బారావ్‌ తెలిపారు.

  • కులాస

    మైసూరు: ఈ సంవత్సరం అట్టహాసంగా జరగబోయే విశ్వవిఖ్యాత నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవాలలో పాల్గొనేందుకు అడవి నుంచి మైసూరుకు విచ్చేసిన గజ దళం సేదదీరుతోంది. హుణసూరు తాలూకా వీరనహొసహళ్లి హాడి నుంచి గజపయన ద్వారా సోమవారం సాయంత్రం మైసూరులోని అశోకపురంలోని అరణ్య భవన్‌ ఆవరణకు చేరుకున్నాయి. అక్కడే కెప్టెన్‌ అభిమన్యు నేతృత్వంలో 9 దసరా గజాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి. ప్రయాణ బడలికతో ఉన్నందున మంగళవారం అధికారులు పూర్తి విశ్రాంతి కల్పించారు. ఏనుగులకు మావటీలు, కాపలాదారులు స్నానాలు చేయించారు. వరిగడ్డి, పచ్చ గడ్డిని మేతగా అందజేశారు.

    అంబారీ అభిమన్యుకే

    పశువైద్యులు ఆరోగ్య పరీక్షలను చేశారు. ఏనుగులను దూరం నుంచే వీక్షించేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. అటవీ అధికారి డాక్టర్‌ ప్రభుగౌడ విలేకరులతో మాట్లాడుతూ ఈసారి కూడా అభిమన్యునే బంగారు అంబారీని మోస్తుందని తెలిపారు. మరో మూడు ఏనుగులకు కూడా అంబారీతో తాలీము చేయిస్తామన్నారు. అన్ని ఏనుగులు ఆరోగ్యంగా ఉన్నాయన్నారు.

    ఈసారి సాయంత్రం స్వాగతం

    10వ తేదీన సాయంత్రం 6.40 నుంచి 7.20 గంటల మధ్య మకర గోధూళి లగ్నంలో అంబావిలాస్‌ ప్యాలెస్‌లోని జయ మార్తాండ ద్వారం ద్వారా ఏనుగులను తోడ్కొని వెళ్తారు. ఇక నుంచి దసరా ముగిసేవరకు ప్యాలెస్‌ ఆవరణలోనే బస చేస్తాయి. ఆదివారం సాయంత్రం నుంచి రాజప్రసాదాన్ని విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. దీంతో పర్యాటకుల సందడి మరింత పెరగనుంది. సాయంత్రం వేళ విద్యుద్దీప వెలుగుల్లో గజరాజుల స్వాగతోత్సవం జరుగుతుంది. తద్వారా కొత్త రీతిలో ప్రచారం లభిస్తుందని అధికారులు తెలిపారు.

    అడవుల నుంచి మైసూరుకు చేరిక

    ఆదివారం వైభవంగా ప్యాలెస్‌ ప్రవేశం

  • బాడీబిల్డర్‌ హఠాన్మరణం

    హాసన్‌లో విషాదం

    యశవంతపుర: ఇనుప కండరాలు, ఉక్కు లాంటి నరాలతో బాడీబిల్డర్‌గా యువతకు ఆదర్శంగా నిలిచాడు. కానీ ఆకస్మిక మృతి నుంచి తప్పించుకోలేకపోయాడు. శ్వాసకోస వ్యాధితో బాడీ బిల్డర్‌ చనిపోయిన ఘటన హాసన్‌ జిల్లా సకలేశపుర తాలూకా బెళగోడు గ్రామంలో జరిగింది. సోమశేఖర్‌ (30) జిమ్‌ సోమగా పేరుగాంచాడు. సోమ వర్కౌట్లు, దేహధారుడ్య పోటీల పోటోలు, వీడియోలు వైరల్‌ అయ్యేవి. సోమశేఖర్‌ ఆరున్నర అడుగులు, 110 కేజీల బరువుతో పెద్ద వస్తాదులా కనిపించేవాడు. బాడీ బిల్డింగ్‌నే వృత్తిగా ఎంచుకుని ఆ రంగంలో అనేక టైటిళ్లను గెలుపొందాడు. సోమశేఖర్‌ జాతీయస్థాయి బాడీ బిల్డర్‌ పోటీలను నిర్వహించాలని నిర్ణయించాడు. కానీ వారం రోజుల నుంచి శ్వాసకోశ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం బెంగళూరులోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స ఫలించక సోమవారం రాత్రి మరణించాడు. సోమ మృతితో కుటుంబం, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. హాసన్‌ జిల్లాలో ఆకస్మిక గుండెపోట్లతో ఎంతోమంది చనిపోతుండడం తెలిసిందే.

    డ్రగ్స్‌ ఫ్యాక్టరీ కేసులో పోలీసు సస్పెండ్‌

    మైసూరు: నగరంలో డ్రగ్స్‌ ఫ్యాక్టరీని కనుకొన్న కేసులో నగర పోలీస్‌ కమిషనర్‌ ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. ఏసీపీ దేవరాజ్‌ డివిజన్‌ కార్యాలయంలో పనిచేసే పోలీసు ప్రదీప్‌ సస్పెండయ్యాడు. ముంబై పోలీసులు మైసూరులో దాడిచేసి ఓ మత్తు పదార్థాల ఫ్యాక్టరీని కనుగొన్నారు. రూ. 390 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొన్నారు. అక్కడ ఫ్యాక్టరీ ఉందని తెలిసినప్పటికీ ఉన్నతాధికారులకు తెలియజేయలేదని, ముడుపులు తీసుకుంటూ ఉన్నారని ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్‌ వ్యాపారులతో కుమక్కయ్యారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో ముగ్గురు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. అలాగే నగర వీధుల్లో గంజాయి, డ్రగ్స్‌ సేవించేవారిని వెతికి పట్టుకుని కేసులు పెడుతున్నారు. ఇప్పటికి వంద మందికి పైగా వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి.

    బస్సు– క్యాంటర్‌ ఢీ,

    ఇద్దరు మృతి

    యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా తరీకెరె తాలూకా శివపుర వద్ద మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నిద్రమంపురంలో క్యాంటర్‌ కేఎస్‌ ఆర్టీసీ బస్సు ఓ క్యాంటర్‌ను వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో క్యాంటర్‌ డ్రైవర్‌, క్లీనర్‌ అక్కడే దుర్మరణం చెందారు. హుబ్లీ నుంచి క్యాంటర్‌ మైసూరు వైపు వెళుతుండగా, కడూరు నుంచి ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొనింది. మృతులిద్దరూ హుబ్లీకి చెందినవారుగా పోలీసులు తెలిపారు. బీరూరు పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

    యువ నటుడు అకాల మరణం

    యశవంతపుర: శాండల్‌వుడ్‌ యువ నటుడు సంతోష్‌ బాలరాజ్‌ (34) అనారోగ్యంతో మరణించారు. కరియ–2, గణప తో పాటు అనేక సినిమాలలో నటించి మంచి నటునిగా పేరు సంపాదించారు. సంతోష్‌ కొన్నిరోజుల నుంచి కాలేయ జబ్బుతో బాధపడుతున్నారు. బనశంకరిలోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస వదిలారు.

  • మహిమల

    మైసూరు: రాజభవనాల నగరంలో ఆర్థిక మోసాలు అధికమవుతున్నాయి. సైబర్‌ మోసగాళ్ల చేతిలో నిత్యం కొందరు వంచనకు గురవుతున్నారు. ఓ బాధితుడు మరో రకమైన మోసానికి గురై రూ. 2.19 కోట్లకు పైగా నగదు, నగలు పోగొట్టుకొని కన్నీరు పెట్టుకొంటున్నాడు. మైసూరులోని జేఎస్‌ఎస్‌ లేఔట్‌ నివాసి అరుణ్‌కుమార్‌ (54) బాధితుడు. మూఢ నమ్మకాలతో నిండా మునిగిపోయాడు.

    దేవుడు నా ఒంట్లోకి వస్తాడు, ఇతరుల కష్టాల్లో ఉంటే సహాయం చేయకపోతే మీ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది అని చెప్పి భయాన్ని సృష్టించి అరుణ్‌కుమార్‌ దంపతుల నుంచి రూ. 2.19 కోట్ల నగదు, 202 గ్రాముల బంగారు ఆభరణాలను కొట్టేశారు. దక్షిణ కన్నడకు చెందిన రూపశ్రీ, ఆమె భర్త సందేష్‌ దంపతులు ఈ కపటడానికి పాల్పడ్డారు.

    త్వరలో జర్మనీకి వెళ్తారని

    2017లో వాట్సప్‌ ద్వారా రూపశ్రీ.. అరుణ్‌కుమార్‌తో మాట్లాడింది. అప్పాజీ అనే స్వామీజీ మహిమ కలవాడు, హిమాలయాలలో, కేరళలో తపస్సు చేశాడు. ఆయన మా అమ్మమ్మ క్యాన్సర్‌ను నయం చేశాడు అని తెలిపింది. మీరు పనికి వెళ్లేటప్పుడు ప్రమాదాలు జరుగుతాయని, దీనిని నివారించడానికి పరిష్కారం సూచిస్తారు అని చెప్పి దఫదఫాలుగా డబ్బులు వసూలు చేసింది. మహిమలు జరిగినట్లు చూపే కొన్ని నకిలీ వీడియోలను అరుణ్‌కుమార్‌ కుమార్‌కు పంపింది. అప్పాజీ జోస్యం మేరకు మీరు జర్మనీ యాత్ర చేయబోతున్నారు అని చెప్పింది. ఆ విధంగా అరుణ్‌కుమార్‌ భార్య జర్మనీకి వెళ్లింది. తరువాత అతని కుమారుడు కూడా జర్మనీకి వెళ్లారు. దీంతో అరుణ్‌కుమార్‌కు మరింత నమ్మకం కుదిరింది. ఆ రీతిలో రూ.2.19 కోట్ల నగదు, 202 గ్రాముల బంగారాన్ని రూపశ్రీ తీసుకుంది. అప్పాజీ స్వామిని చూడాలని అరుణ్‌కుమార్‌ కోరగా, కుదరదని చెప్పింది. దీంతో అనుమానం వచ్చి ఆరా తీయగా మోసమని తేలింది. మోసగాళ్లను అరెస్టు చేయాలని, తన డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితుడు మైసూరు సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు.

    రూ. 2.19 కోట్లు స్వాహా

    మైసూరులో ఘరానా మోసం

  • సెంట్

    యశవంతపుర: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హాసన్‌ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ 35వ పుట్టిన రోజును జైల్లో చేసుకున్నారు. ఇంటి పనిమనిషి మీద అత్యాచారం కేసులో యావజ్జీవ శిక్ష పడిన ప్రజ్వల్‌ రేవణ్ణ బెంగళూరు పరప్పన అగ్రహర జైల్లో ఖైదు అనుభవిస్తున్నారు. ఆదివారం ఆయనకు ఖైదీలు ధరించే యూనిఫారాన్ని అందజేశారు. సోమవారం నుంచి ఏమేం పనులు చేయాలో జైలు సిబ్బంది వివరించారు. వారానికి ఆరు రోజులు నిబంధనల ప్రకారం పనులు చేయాలని తెలిపారు. రోజువారి కూలీ రూ.540 ఇస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం ప్ర జ్వల్‌ వైభవంగా నిర్వహించిన జన్మదినం వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మరోవైపు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించాలని ఆయన న్యాయవాదులు సిద్ధమయ్యారు.

    శృంగేరిలో తండ్రి పూజలు

    తనయుడు ప్రజ్వల్‌ జన్మదినం సందర్భంగా తండ్రి హెచ్‌డీ రేవణ్ణ శృంగేరి శారదాంబ దేవస్థానంలో విశేష పూజలు చేశారు. సోమవారం రాత్రి శృంగేరికి వెళ్లి గురుపీఠం మరాధిపతిని కలిశారు. మంగళవారం ఉదయం శారదా మాతను దర్శించుకుని పూజలు చేశారు.

    రోజువారీ కూలీ పనుల అప్పగింత

  • పథకాలు కార్మికుల దరి చేరాలి

    శ్రీనివాసపురం : ప్రభుత్వ పథకాలు, సౌలభ్యాలను అర్హులైన కార్మికులకు అందించాలని అధికారులకు ఎమ్మెల్యే జీకే వెంకటశివారెడ్డి సూచించారు. పట్టణంలోని పురసభ వాణిజ్య సముదాయ ప్రాంగణంలో కార్మిక శాఖ, కార్మిక సంక్షేమ శాఖ మండలి ఆధ్వర్యంలో మంగళవారం ఆయన కార్మికులకు కిట్లు పంపిణీ చేసి మాట్లాడారు. సంఘటిత, అసంఘటిత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌలభ్యాలను కల్పిస్తోందని, వాటిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్మిక సంఘం నాయకుడు ఆనంద్‌, నవీన్‌కుమార్‌, మల్లప్ప, సిబ్బంది పాల్గొన్నారు.

  • మధ్యాహ్న భోజనం శుచిగా ఉండాలి

    కోలారు : విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం రుచిగా, శుచిగా ఉండాలని డిప్యూటీ కలెక్టర్‌ మంగళ ఉపాధ్యాయులకు సూచించారు. తాలూకాలోని అరాభికొత్తనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆమె సందర్శించి మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. సాంబారులో ఆకుకూరలు అధికండా ఉండేలా చూడాలన్నారు. శ్రావణ మాసం సందర్భంగా కొంతమంది పిల్లలు కోడిగుడ్లను తినడం లేదని గుర్తించిన డిప్యూటీ కలెక్టర్‌.. రోజుకో గుడ్డును తినడం వల్ల ఉత్తమ ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఆర్‌ఐ రాజేంద్రకుమార్‌, గ్రామ లెక్కాధికారి అనిత, గ్రామ పంచాయతీ స్థాయీ సమితి అధ్యక్షుడు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

  • వర్గీకరణపై అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించండి

    రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అమలుకు నిర్ణయం తీసుకోవాలని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి సంచాలకుడు మారెప్ప డిమాండ్‌ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ ఆందోళనలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కార్‌కు వర్గీకరణకు అనుకూలంగా జిస్టిస్‌ నాగమోహనదాస్‌ నివేదికను కూడా అందించారన్నారు. ఆ నివేదికపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం ప్రకటించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలను వివరించారు. తెలంగాణలో లేని ఎస్సీ వర్గీకరణకు అడ్డంకులు కర్ణాటకలో ఎందుకు అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ సర్కారులే ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో అమలు చేసిన ఆర్డినెన్సులను చూడాలన్నారు. విలేఖర్ల సమావేశంలో హేమరాజ్‌, ఆంజనేయ, శ్రీనివాస్‌, నరసింహులు, తాయప్ప, కృష్ణలున్నారు.

    8 నుంచి అగ్నిపథ్‌

    సేనా ర్యాలీకి ఏర్పాట్లు

    రాయచూరు రూరల్‌: నగరంలో అగ్ని పథ్‌ సేనా ర్యాలీకి మౌలిక సౌకర్యాలను కల్పించినట్లు ఆహార పౌర సరఫరాల శాఖ ఇంచార్జి అధికారి కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 8వ తేదీ నుంచి రెండు రోజులపాటు రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రాంగణంలో జరగనున్న సేనా ర్యాలీలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే యువతకు బంజార సేవా సంఘం భవన్‌, వాల్మీకి భవన్‌, సంతోష్‌ హబ్‌, కేఈబీ కళాశాలలో మౌలిక సౌకర్యాలను కల్పించామన్నారు. ఉచిత వసతి, భోజనం, రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరంలోని సంఘ సంస్థలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నట్లు వివరించారు. ర్యాలీలో 20 వేల మంది పాల్గొంటారని అన్నారు. విలేఖర్ల సమావేశంలో తహసీల్దార్‌ సురేష్‌ వర్మ, చంద్రశేఖర్‌, మల్లనగౌడ, పురుషోత్తంలున్నారు.

    23 కోట్ల మంది రైతులకు పంటల బీమా లబ్ధి

    రూ.1.75 లక్షల కోట్ల మేర ఖాతాలకు సొమ్ము జమ

    హుబ్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన పరికరాలు, ఇతర సౌకర్యాలను అందించి వారిలో ఆత్మవిశ్వాసం, జీవనోత్సాహం కల్గిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ధార్వాడ తాలూకా హెబ్బళ్లిలో ఏర్పాటు చేసిన జాతీయ వయోశ్రీ యోజన ద్వారా 136 మంది వృద్ధులకు, అడిప్‌ యోజన ద్వారా 22 మంది దివ్యాంగులకు రూ.14.60 లక్షల వ్యయంతో బ్యాటరీ సైకిళ్లు, ఇతర పరికరాలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. రైతులకు పంటల బీమా యోజన అమలు చేశామన్నారు. గత ఏడాది దేశంలో 12 వేల కోట్ల ప్రీమియం సొమ్మును ప్రభుత్వం చెల్లించిందన్నారు. 23 కోట్ల మంది రైతులకు 1.75 లక్షల కోట్ల బీమా సొమ్ము జమ అయిందన్నారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుకు 4 శాతం వడ్డీ ధరతో అందించే రుణాలను రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అమృత్‌ దేశాయి మాట్లాడుతూ ప్రహ్లాద్‌ జోషి ఎంపీగా, కేంద్ర మంత్రిగా యావత్‌ దేశ బాధ్యతలు ఉన్నా గ్రామ గ్రామానికి వెళ్లి అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. అంతేగాక ప్రభుత్వ నిధులు కాకుండా సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా కూడా ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి పాటు పడుతున్నారన్నారు. సదరు గ్రామంలో చెత్త నిర్వహణ యూనిట్‌తో పాటు ఆ ఊరిలో పాఠశాల గదులను జోషి ప్రారంభించారు. బీజేపీ నేతలు, సంబంధిత అధికారులు ఈ సందర్భంగా పాల్గొన్నారు.

    నేహా హత్య కేసు

    నిందితుడికి షాక్‌

    బెయిల్‌ అర్జీని తిరస్కరించిన కోర్టు

    హుబ్లీ: విద్యార్థిని నేహా హత్య కేసు నిందితుడు సమర్పించిన బెయిలు దరఖాస్తుపై విచారణ చేపట్టిన హుబ్లీ 1వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు సదరు అర్జీని తిరస్కరించింది. విచారణ ప్రక్రియను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేస్తు నిందితుడిని స్వయంగా హాజరు పరచాలని కోర్టు సూచించింది. సదరు కోర్టు న్యాయమూర్తి బీఆర్‌ పల్లవి సుదీర్ఘ వాద ప్రతివాదనలను ఆలకించి బెయిలు దరఖాస్తును తిరస్కరించారు. పోలీసులు అరెస్ట్‌ ప్రక్రియ సక్రమంగా చేపట్టలేదు. తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ఆధారంగా నిందితుడు ఫయాజ్‌కు బెయిలు ఇవ్వాలని అతని తరఫున న్యాయవాది విజ్ఞప్తి చేశారు. సీఐడీ ప్రత్యేక న్యాయవాది మహేష్‌ వైద్య ప్రభుత్వం తరఫున వాదించారు. నేహా హిరేమఠ తల్లి తరఫున రాఘవేంద్ర ముతర్గికర్‌ వాదించారు. నిందితుడు ఫయాజ్‌ తరపున జెడ్‌ఎం అత్తరికి వాదించారు. ఫయాజ్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి బెయిలు తిరస్కరించడంపై విధి తాత్కాలిక జయం సాధించిందని శ్రీరామ సేన చీఫ్‌ ప్రమోద్‌ ముతాలిక్‌ అభిప్రాయ పడ్డారు. బెయిలు అర్జీ తిరస్కరణ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసును తర్వగా పరిష్కరించాలని నేహా తండ్రి నిరంజనయ్య హిరేమఠ విజ్ఞప్తి చేశారు. నిందితుడికి బెయిలు ఇవ్వరాదు, ఉరిశిక్ష వేయాలి. ఇలాంటి వారికి బెయిలు ఇస్తే సమాజానికి తప్పుడు సందేశం వెళుతుందని ఆయన ఆరోపించారు. కాగా బెయిలు నిరాకరణతో శ్రీరామ సేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసి సంబంధిత న్యాయవాదిని సన్మానించి తాత్కాలిక విజయం లభించిందని నినాదాలు చేశారు.

  • నేడు

    వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం

    రాయచూరు రూరల్‌: రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా హట్టికి బుధవారం ముఖ్యమంత్రి సిద్దరామయ్య వస్తారని హట్టి బంగారు గనుల కంపెనీ అధ్యక్షుడు జీ.టీ.పాటిల్‌ తెలిపారు. బుధవారం హట్టి బంగారు గనుల కంపెనీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హట్టి బంగారు గనుల కంపెనీ సిబ్బందికి, కార్మికులకు రూ.998 కోట్లతో నూతన వసతిగృహాల నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారన్నారు. సమావేశానికి 15 వేల మంది హాజరవుతారని, ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ముఖ్యమంత్రి ప్రజలు, కార్మికులు, రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్సీలు శరణే గౌడ బయ్యాపూర్‌, వసంత్‌ కుమార్‌, శాసన సభ్యులు వజ్జల్‌ మానప్ప, మాజీ ఎమ్మెల్యే హొలిగేరి, జిల్లాధికారి నితీష్‌, ఎస్పీ పుట్టమాదయ్య, ఏసీ బసవణ్ణప్ప, ఎండీ శిల్పా తదితరులు పాల్గొన్నారు.

    ఎడమ కాలువలో

    గేజ్‌ కాపాడండి

    రాయచూరు రూరల్‌: తుంగభద్ర ఎడమ కాలువ కింద 47, 69వ మైలు వద్ద భూములకు సక్రమంగా నీరందాంలంటే నీటి గేజ్‌ను కాపాడాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లాలోని మాన్వి తాలూకాలో పర్యటించి మాట్లాడారు. 69వ మైల్‌ వద్ద నీటి నిర్వహణ గేజ్‌ సామర్థ్యాన్ని కాపాడి ఆయకట్టు చివరి భూములకు నీరందించాలన్నారు. 47వ మైల్‌ వద్ద ఏడు అడుగుల మేర నీరు ఉండడంతో ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదన్నారు.

    అక్షరాస్యతా శాతాన్ని పెంచండి

    రాయచూరు రూరల్‌: యాదగిరి జిల్లాలో అక్షరాస్యతా ప్రమాణాన్ని పెంచాలని విద్యా శాఖ సాక్షరతా విభాగం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రశ్మి అధికారులకు సూచించారు. మంగళవారం యాదగిరి తాలూకాలోని అల్లీపురలో అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాల, కళాశాలలను పరిశీలించి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు బోధన, మౌలిక సౌకర్యాల గురించి విద్యార్థులతో చర్చించారు. ఈసందర్భంగా కేకేఆర్‌డీ కార్యదర్శి నళిన్‌ అతుల్‌, విద్యా శాఖ కమిషనర్‌ రాహుల్‌ తుకారాం పాండేలున్నారు.

    కార్మిక నేతలకు స్మృత్యంజలి

    బళ్లారి టౌన్‌: నగరంలో ఎస్‌యూసీఐ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్మిక నేత ఫ్రెడరిక్‌ ఎగ్గెల్స్‌, ఎస్‌యూసీఐ పార్టీ సంస్థాపకుడు కామ్రెడ్‌ శివదాస్‌ ఘోష్‌ స్మరణ దినోత్సవాలను జరిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ ఉపాధ్య మాట్లాడుతూ వారు చేసిన సేవలు శ్లాఘనీయం అని కొనియాడారు. జిల్లా సమితి నేతలు సోమశేఖర్‌ గౌడ, ఎంఎస్‌ మంజుల, డీ.నాగలక్ష్మి, ప్రమోద్‌, నాగరత్న, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.

    మెరుగైన సదుపాయాలు కల్పించండి

    కోలారు: కోలారు నగరంలోని అంతరగంగ బుద్ధి మాంద్య విద్యా సంస్థను మంగళవారం జెడ్పీ సీఈఓ ప్రవీణ్‌ పి బాగేవాడి సందర్శించారు. వంటగది, విద్యార్థుల వసతి, వయోవృద్ధుల వసతి గదులను పరిశీలించారు. సీఎస్‌ఆర్‌ నిధులను ఉపయోగించుకుని మరింత అభివృద్ధి చేయాలని విద్యా సంస్థ నిర్వాహకులకు సూచించారు. ఆ విద్యాసంస్థ సంస్థాపక కార్యదర్శి డాక్టర్‌ శంకర్‌ మాట్లాడుతూ మరిన్ని వసతి గదుల నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు ప్రజ్ఞా మాట్లాడుతూ అంబా సంస్థ ద్వారా పిల్లలకు కంప్యూటర్‌ శిక్షణ నిస్తున్నామని తెలిపారు. ఎంఎస్‌ రామయ్య ఆస్పత్రిలో డాటా ఎంట్రీ ఉద్యోగానికి సంస్థ నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయ్యారన్నారు. జిల్లా వికలాంగ సంక్షేమ శాఖ అధికారి మంజుల పాల్గొన్నారు.

  • ప్రభు

    హుబ్లీ: క్యాంపస్‌ సెలెక్షన్స్‌ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులకు మాత్రమే పరిమితం అన్న మాటలు వినిపిస్తుంటాయి. అయితే బెళగావి జిల్లాలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గత నాలుగేళ్ల నుంచి క్యాంపస్‌ సెలెక్షన్లు జరుగుతున్నాయి. ఆ మేరకు 1000 మందికి పైగా విద్యార్థులు ఎంఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు. అందులోను డిగ్రీ ఫైనల్‌ సెమిస్టర్‌ ఫలితాలు రావడంతోటే ఉద్యోగాలు దొరకడం ఆ విద్యార్థుల్లో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అవును.. క్యాంపస్‌ టు కార్పొరేట్‌ కంపెనీ. బెళగావి ప్రభుత్వ ఫస్ట్‌ గ్రేడ్‌ మహిళా కళాశాల ప్రొఫెసర్ల వినూత్న కార్యక్రమం విద్యార్థుల వృత్తి జీవితానికి దిక్సూచి కానుంది. ప్రైవేట్‌ కళాశాలల్లో సాధ్యం అయ్యే క్యాంపస్‌ సెలెక్షన్లు ఇక్కడి ప్రభుత్వ కళాశాలలో చేపట్టడం ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులకు డిగ్రీ ముగిసిన వెంటనే ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి. ఇందులో 90 శాతం మంది విద్యార్థినులే కావడం విశేషం. అక్కడి అధ్యాపక సిబ్బంది కృషి ఫలితంగానే ఇది సాధ్యం అయింది. ఎందుకై నా బీఏ, బీకాం, డిగ్రీ చదివామా? అని బాధపడే విద్యార్థులకు అలాంటి చింత వేధించరాదన్న సదుద్దేశంతోనే సదరు కళాశాల ప్లేస్‌మెంట్‌ అధికారి ప్రొఫెసర్‌ షంషుద్దీన్‌ నదాఫ్‌ తోటి ప్రొఫెసర్ల అండదండలతో గత మూడేళ్ల నుంచి క్యాంపస్‌ సెలెక్షన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 730 మందికి పైగా విద్యార్థినులు టాటా ఎలక్ట్రానిక్‌, టాటా మోటర్స్‌ హోండా, ఫాక్స్‌కాన్‌, క్వేస్‌ తదితర ఎంఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ప్రత్యక్ష ఇంటర్వ్యూల్లో విద్యార్థులు ఈ ఘనత సాధించారని అధికారి ఎంతో గర్వంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

  • సందిగ

    రాయచూరు రూరల్‌: కర్ణాటక రాష్ట్రానికి ఆనుకొని ఉన్న పొరుగు రాష్ట్రాల్లోని గడినాడు ప్రాంతాల్లో కన్నడ పాఠశాలల మూసివేతకు సర్కార్‌ సిద్ధమైందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గడినాడు ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని ఆదోని, ఆలూరు, మంత్రాలయం, హాలహర్వి, హొళగుంద, కౌతాళం, హెబ్బటం, రారావి, గూళ్యం, ఎమ్మిగనూరు, నందవరం, చింతకుంట, రాయదుర్గం, కల్యాణదుర్గం కర్ణాటకలోని కోలారు, బాగేపల్లి, చింతామణి, చిత్రదుర్గ, తుమకూరు, రాయచూరు, బీదర్‌, యాదగిరి, కలబుర్గి జిల్లాల్లో కన్నడ భాషలో విద్యనభ్యసించే 20 వేల మంది విద్యార్థులు నష్టపోవడమే కాకుండా ఉన్నత విద్యను పొందడానికి అర్హతను సాధించలేక పోతున్నారు. గడినాడు కన్నడ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదవడానికి అవకాశం ఉంది. దీంతో ఇంటర్‌లో చేరడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    తెలంగాణలోనూ..

    తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర జిల్లాలో కృష్ణ, కుసుమూర్తి, హిందూపుర, మక్తల్‌, నారాయణపేట, మరికల్‌, గుడేబల్లూరు వంటి ప్రాంతాల్లో విద్యార్థులు ఉన్నత విద్యకు తిలోదకాలు పలికేందుకు కర్ణాటక సర్కార్‌ గడినాడులో ఉన్న కన్నడ పాఠశాలలను మూసివేతకు పావులు కదపడమే కారణంగా తెలుస్తోంది. నాటి కన్నడ భాషాభివృద్ధి మండలి అధ్యక్షుడు, గడినాడు కన్నడ భాషా ప్రాధికార అధ్యక్షుడు కుంబార వీరభద్రప్ప సర్కార్‌కు నివేదిక అందించి దశాబ్దం గడిచినా ఆ నివేదికపై ఏనాడూ కూడా ప్రభుత్వాలు స్పందించక పోగా నేడు గడినాడు కన్నడ పాఠశాలల మూసివేతకు సర్కార్‌ సిద్ధం కావడంతో విద్యార్థులకు హాస్టల్‌ సౌకర్యం కూడా లభించడం లేదు. తమకు పూర్తి స్థాయిలో తెలుగు భాషలో చదవడానికి అవకాశం కల్పించాలని మొర పెట్టుకున్న సమయంలో స్పందించని సర్కార్లు రాత్రికి రాత్రే గడినాడు కన్నడ పాఠశాలల మూసివేతకు నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థుల పరిస్థితులు తారుమారయ్యాయి.

    సర్కార్‌ నుంచి మూసివేత సంకేతాలు?

    విద్యార్థుల భవిష్యత్తుపై నీలిమేఘాలు

  • కర్ణాటక సాగు నీటి పథకాలకు ఏపీ మోకాలడ్డు

    రాయచూరు రూరల్‌: కర్ణాటకలో సాగు నీటి పథకాలకు ఆంధ్రప్రదేష్‌ ప్రభుత్వం మోకాలడ్డుతోందని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు్‌ ఆరోపించారు. మంగళవారం తమ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర డ్యాంలో పేరుకున్న పూడికతో నష్టపోతున్న నీటి వాటాను భర్తీ చేసుకునేందుకు, వరద జలాలను నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రత్యామ్నాయంగా నవలి వద్ద రూ.20 వేల కోట్లతో మినీ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సమావేశాలు నిర్వహించాలని విన్నవించినా నేటికీ స్పందించక పోవడాన్ని తప్పుబట్టారు.

    బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణానికి సమీక్ష

    రాయచూరు జిల్లాలో మాన్వి తాలూకా చీకలపర్వి వద్ద బ్రిడ్జి కం బ్యారేజీ, రాయచూరు తాలూకా చిక్కమంచాలి వద్ద బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణం చేపట్టడానికి అవకాశం కల్పించాలని కర్నూలులో సమావేశం నిర్వహించామన్నారు. ఈ విషయం కేసీ కెనాల్‌ పరిధిలో ఉన్నందున కర్నూలు, నంద్యాల లోక్‌సభ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి నిరభ్యంతర లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం అడ్డు పడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ పరివాహక ప్రాంత పరిధిలో బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణం చేపట్టడానికి గతంలో అవకాశం కల్పించిందని గుర్తు చేశారు.

    జిల్లాలో యూరియా ఎరువుల కొరత లేదు

    రాయచూరు జిల్లాలో ఎరువుల కొరత లేదన్నారు. ఆగస్టు నెలలో 8,146 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. రాయచూరుకు ఎయిమ్స్‌ మంజూరు విషయంపై కేంద్రం వివక్షత చూపుతోందన్నారు. తుంగభద్ర డ్యాంలో 32 గేట్లను మార్పు చేయడానికి తుంగభద్ర బోర్డు అధ్యక్షుడి అనుమతి అవసరం అన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒకరు గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్నారని, వారి ఆదేశాల మేరకు బోర్డు నిర్ణయం తీసుకోవడం వల్ల కర్ణాటక కేవలం పాత్రధారి మాత్రమే అన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచరాదని కేంద్ర జలవనరుల మంత్రికి మహారాష్ట్ర ప్రతినిధులు వినతిపత్రం ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ నిరసన తెలపడం సహజమన్నారు.

    చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు

  • ఆర్టీ

    రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని ఆర్టీసీ ఉద్యోగుల, కార్మికుల సంఘం అధ్యక్షుడు ముద్దుకృష్ణ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆర్టీసీ బస్టాండ్‌లో చేపట్టిన ఆందోళననుద్దేశించి ఆయన మాట్లాడారు. గత 38 నెలల నుంచి సక్రమంగా వేతనాలు చెల్లించక పోవడాన్ని తప్పుబట్టారు. మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. ఉదయం బస్సులను నిలిపివేసి సమ్మెలో పాల్గొన్నారు. అనంతరం యథావిధిగా బస్సుల సంచారానికి అవకాశం కల్పించారు. ప్రయాణికులు లేక బస్టాండ్‌ బోసిపోయింది. సమ్మెతో సగం మేర బస్సులు సంచారానికి రాలేదు.

    రాయచూరు జిల్లాలో మిశ్రమ ప్రతిక్రియ

  • 60 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ

    రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 60 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని హైదరాబాద్‌ కర్ణాటక జనాందోళన సమితి జిల్లా సంచాలకుడు రాఘవేంద్ర కుష్టిగి డిమాండ్‌ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కళ్యాణ కర్ణాటకలోని ఆరు జిల్లాల్లో 20 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయక పోవడంతో 2024–25వ సంవత్సరంలో పదో తరగతిలో తక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆరు వేల కన్నడ భాష ప్రాథమిక పాఠశాలలను మూసి వేయడానికి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. రాయచూరు జిల్లాలో 500 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయన్నారు. కళ్యాణ కర్ణాటకలో 9 వేల మంది సైన్సు, గణితం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండడంతో పాస్‌ కాలేక పోయారన్నారు. విద్యా శాఖా మంత్రి మధు బంగారప్పను మంత్రి పదవి నుంచి తప్పించి అనుభవమున్న వారికి ఆ పదవిని కేటాయించాలన్నారు. బసవరాజ్‌, శారద, ఈరణ్ణ, జాన్‌ వెస్లిలున్నారు.

Kurnool

  • ● తగ్గిన సంతానోత్పత్తి రేటు ● కర్నూలు జిల్లాలో 1.8, నంద్యాల జిల్లాలో 1.36 రేటు ● జీవనశైలి మారడంతో తగ్గుదల ● యువతుల్లో స్థూలకాయం, పీసీఓడీ ● పురుషుల్లో తగ్గుతున్న శుక్రకణాల సంఖ్య ● 20 శాతం మందికి సంతానలేమి సమస్య ● పెరిగిన సంతాన సాఫల్య కేంద్రాలు

    కర్నూలు(హాస్పిటల్‌): సృష్టిలో ప్రతి సీ్త్ర తను ఒక బిడ్డకై నా జన్మనిచ్చి అమ్మకావాలని భావిస్తుంది. ఈ మేరకు వివాహమైన నాటి నుంచి పరితపిస్తుంది. పుట్టిన బిడ్డ ఆమె పెంపకంలో పెరుగుతూ ఎదుగుతూ ఉంటే ఆ తల్లి పడే ఆనందానికి హద్దులు ఉండవు. కానీ ఈ వరం ఇప్పుడు అందరి తల్లులకు కలగడం లేదు. కొందరికి ఆలస్యంగా పిల్లలవుతుంటే మరికొందరికి అసలు కావడం లేదు. దంపతులిద్దరిలో లేదా ఒకరిలో లోపం ఉండటం వల్లే ఇలా జరుగుతోంది. జీవనశైలిలో వచ్చిన మార్పులే దీనికి ప్రధాన కారణమని వైద్యులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సంతానలేమి సమస్యతో బాధపడే వారి సంఖ్య అధికమైంది. ఒకప్పుడు వందలో ఒకరిద్దరు మాత్రమే సంతానలేమితో బాధపడేవారు. ఇప్పుడు ఆ సంఖ్య పట్టణాల్లో 20 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 10 శాతం వరకు ఉంటోంది. 2023–24 సంవత్సరంలో రాష్ట్రంలో సగటు సంతానోత్పత్తి రేటు 1.21 ఉండగా ఇందులో కర్నూలు జిల్లాలో 1.80, నంద్యాల జిల్లా 1.36గా నమోదైంది. కాగా జిల్లాలోని ఆదోని, పత్తికొండ వంటి ప్రాంతాల్లో సంతానోత్పత్తి 3, 3.5 రేటు ఉండగా కర్నూలు, నంద్యాల వంటి పట్టణ ప్రాంతాల్లో మాత్రం 1.5 కంటే తక్కువగా సంతానోత్పత్తి రేటు పడిపోవడం ఆందోళనకరం.

    పెరిగిన సంతాన సాఫల్య కేంద్రాలు

    పిల్లలు కలగని దంపతులు ఒకప్పుడు సమీప గైనకాలజిస్టులను కలిసి చికిత్స తీసుకునేవారు. అప్పటికీ పిల్లలు కలగకపోతే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి సంతా న సాఫల్య కేంద్రాల్లోని వైద్యులను సంప్రదించేవారు. వీరి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సిటీల్లో ని సంతాన సాఫల్య కేంద్రాలు పట్టణాల్లోనూ ఏర్పాటవుతున్నాయి. ఈ కారణంగా కర్నూలు, నంద్యాల, ఆదోని వంటి ప్రాంతాల్లోనూ సంతానసాఫల్య కేంద్రాలు వెలిశాయి. కర్నూలు జిల్లాలోనే వైద్య ఆరోగ్యశాఖ వద్ద రిజిస్టర్‌ అయిన సంతాన సాఫల్య కేంద్రాలు 16 ఉన్నాయి. ఆయా కేంద్రాలకు ప్రస్తుతం ప్రతిరోజూ 50 నుంచి 60 మంది దాకా దంపతులు చికిత్స కోసం వెళ్తున్నారు. కాగా కొన్ని కేంద్రాలు వీరి ఇబ్బందులను ఆసరాగా తీసుకుని అధిక మొత్తంలో డబ్బును డిమాండ్‌ చేస్తున్నారు. వెళ్లిన ప్రతిసారి రూ.4వేల నుంచి రూ.5వేలు ఖర్చు అయ్యేలా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని కేంద్రాలు సంతానం కలగకపోవడానికి గల కారణాన్ని బట్టి గంపగుత్తగా రూ.1లక్ష నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తున్నాయి.

    సంతానలేమికి కారణాలు

    ఇటీవల కాలంలో చాలా మంది యువతీయువకులు జీవితంలో స్థిరపడ్డాక వివాహం చేసుకుంటున్నారు. దీనికితోడు చదువుకున్న అమ్మాయిలు అధి కం కావడం, వారికి సరిపడా అబ్బాయిలు లభించకపోవడం, అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాల వల్ల ఆలస్యంగా వివాహం చేసుకోవడం, మారిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం, సీ్త్రలలో పీసీఓఎస్‌ (అండాశయంలో తిత్తులు), ఎండోమెట్రియాసిస్‌ సమస్యలు, రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రపోవడం,జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం, మొబైల్‌ఫోన్‌ స్క్రీన్‌ ఎక్కువగా చూడటం వల్ల, అన్యోన్య దాంపత్యం లేకపోవడం వల్ల సంతానలేమికి కారణాలు. అయితే గ్రామాల్లో ఇప్పటికీ త్వరగా వివాహాలు కావడం, చిన్న వయస్సులోనే (టీనేజిలో) పిల్లలు అవుతున్నారు. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా కనిపిస్తోంది. పట్టణాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు.

    ఇలా చేయాలి...

    సమతుల ఆహారం తీసుకోవాలి. రోజూ తగినంత వ్యాయామం చేయాలి. బయటి ఆహారానికి ముఖ్యంగా జంక్‌ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

    స్థూలకాయం తగ్గించుకోవాలి. ఇందుకోసం జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి.

    దూమపానం, మద్యపానం మానేయాలి.

    మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ఇందుకోసం యోగా, ధ్యానం చేయాలి.

    వివాహమై ఏడాది దాటినా గర్భం దాల్చకపోతే వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి.

    ఇలా చేయాలి

    తప్పనిసరిగా రిజిస్టర్‌ చేసుకోవాలి

    సంతాన సాఫల్య కేంద్రాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా వైద్య ఆరోగ్యశాఖలో రిజిస్టర్‌ చేసుకోవాలి. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు మాత్రమే వాటిని నిర్వహించాలి. రిజిస్ట్రేషన్‌ చేయకుండా ఏఆర్‌టీ కేంద్రాలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాము. జిల్లాలో గతంలో కంటే ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రాలు పెరిగాయి. సంతానోత్పత్తి రేటు తగ్గడమూ దీనికి ఒక కారణం కావచ్చు.

    –డాక్టర్‌ పి.శాంతికళ, డీఎంహెచ్‌ఓ, కర్నూలు

    జీవనశైలిలో మార్పులే కారణం

    జీవనశైలిలో వచ్చిన మార్పులే సంతానోత్పత్తి రేటు తగ్గడానికి కారణం. ఇది పురుషుల్లో 30 శాతం, మహిళల్లో 30 శాతం ఉంది. పురుషుల్లో వీరకణాల సంఖ్య తక్కువగా ఉండటం, మహిళల్లో ఇన్‌ఫెక్షన్లు, పీసీఓఎస్‌, స్థూలకాయం, మానసిక ఒత్తిడి కారణాలు. పట్టణాల్లో ఆలస్యంగా వివాహం చేసుకోవడం, ఆలస్యంగా పిల్లలను కనాలనే ప్రణాళిక వేసుకోవడం కూడా సంతానోత్పత్తి రేటు తగ్గడానికి మరో కారణం.

    –డాక్టర్‌ ఎస్‌.సావిత్రి, హెచ్‌ఓడీ, గైనకాలజి విభాగం, జీజీహెచ్‌, కర్నూలు

  • ● విద

    కర్నూలు కల్చరల్‌: ఇంటర్‌ ఫలితాలు వచ్చి నాలుగు నెలులు కావస్తున్నా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కాలేదు. నేటికీ నోటిఫికేషన్‌ విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంకెంతకాలం నిరీక్షించాలని కూటమి సర్కారును ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 82 డిగ్రీ కళాశాలలున్నాయి. ఇంటర్‌ పూర్తయిన విద్యార్థుల్లో సగం మంది ఇంజినీరింగ్‌ వైపు వెళితే మిగతా వారు డిగ్రీలో ప్రవేశానికి ఆసక్తి చూపుతారు. సివిల్స్‌, సర్వీస్‌ కమీషన్‌, పోలీస్‌ శాఖ, అగ్ని మాపక, అటవీ శాఖ, బ్యాంకింగ్‌, రైల్వే ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం ఉండటంతో డిగ్రీ కోర్సులపై దృష్టి సారిస్తారు. అయితే. గతంలో ఎప్పుడూ లేని విధంగా కూటమి సర్కారు ప్రవేశాల ప్రక్రియలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఈనెల 18 నుంచి ప్రవేశాలకు నోటిిఫికేషన్‌ ఇస్తామని ప్రకటించింది. ఆ ప్రకారం నోటిఫికేషన్‌ వస్తుందా.. లేదా అనే సందిగ్ధంలో

    విద్యార్థులున్నారు. ఇప్పటికే అకడమిక్‌ క్యాలెండర్‌ దెబ్బతిందని భవిష్యత్తులో ఉద్యోగాల నియామక నోటిఫికేషన్లు, పీజీ ప్రవేశాలకు అర్హత కోల్పోతామని పలువురు ఆవేదన చెందుతున్నారు.

    ఎమ్మిగనూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముఖ ద్వారం

    ఆర్‌యూ పరిధిలో డిగ్రీ కళాశాలల వివరాలు

    ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 14

    పైవేట్‌ డిగ్రీ కళాశాలలు 68

    మొత్తం కళాశాలల సంఖ్య 82

    గత ఏడాది ప్రవేశాలు పొందిన

    విద్యార్థులు సంఖ్య 9,204

    అబ్బాయిల సంఖ్య 4,714,

    అమ్మాయిల సంఖ్య 4,490

    బీఏ 1,469

    బీకాం 3,291,

    బీఎస్సీ 3,367,

    బీబీఏ 380

    బీఏసీ 697 మంది

    విద్యార్థుల జీవితాలతో చెలగాటం

    కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. ఇప్పటికే పలు అసంబద్ధ నిర్ణయాలు అమలు చేయడంతో విద్యా రంగం గాడితప్పింది. ఇంటర్‌ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా డిగ్రీ ప్రవేశాల్లో నిర్లక్ష్యం ప్రదర్శించడం ప్రభుత్వానికి విద్యా వ్యవస్థపై ఏమాత్రం ప్రేమ ఉందో అర్థమవుతోంది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం మాని అకడమిక్‌ క్యాలెండర్‌ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి.

    – భాస్కర్‌, రాష్ట్ర అధ్యక్షులు, పీడీఎస్‌యూ

    సమన్వయ లోపంతోనే ఇలాంటి పరిస్థితి

    ఉన్నత విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలి మధ్య సమన్వయ లోపంతోనే డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్‌ ఆలస్యమవుతోంది. సింగిల్‌ లేదా డ్యూయల్‌ మేజర్‌ సబ్జెక్టులపై స్పష్టత ఇవ్వడంలో, అవగాహన కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. దీంతో మెరిట్‌ విద్యార్థులు ఇతర రాష్ట్రలకు వెళుతున్నారు. డిగ్రీ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలి. లేని పక్షంలో ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ విద్యార్థులను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమాలు చేయాల్సి వస్తుంది.

    – స్వామి, ఏబీవీపీ కర్నూలు విభాగ్‌ కన్వీనర్‌

  • విద్య

    ఎమ్మిగనూరురూరల్‌: మండల పరిధిలోని చెన్నాపురం గ్రామం సమీపంలోని స్టోన్‌ క్రస్రర్‌ మిషన్‌ ఫ్యాక్టరీ దగ్గర మంగళవారం ప్రమాదవశాత్తూ విద్యుత్‌ షాక్‌కు గురై సంతోష్‌ (22) అనే యువకుడు మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ యువకుడు కొన్ని రోజు క్రితం తమ ప్రాంతానికి చెందిన మేసీ్త్ర ద్వారా చెన్నాపురం స్టోన్‌ క్రస్రింగ్‌ మిషన్‌ ఫ్యాక్టరీలో పనిలో చేరాడు. రోజు మాదిరిగానే ఉదయం ఫ్యాక్టరీ దగ్గర వెల్డింగ్‌ వర్క్‌ చేస్తున్నారు. అయితే, ఆ సమయంలో వర్షం రావడంతో షార్ట్‌ సర్క్యూట్‌కు గురై కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి కార్మికులు సంతోష్‌ను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ట్రైనీ ఎస్‌ఐ మల్లికార్జున ప్రభుత్వాసుప్రతికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును, మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పోస్టుమార్టుం కోసం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులకు ప్రమాదం విషయం తెలియజేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు విలేకరులకు తెలిపారు.

    కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య

    జూపాడుబంగ్లా: కుటుంబ కలహాలతో మండలంలోని తర్తూరు గ్రామంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల మేరకు.. సి.బెళగల్‌కు చెందిన గనిమల్లేశ్వరి (23)కి తర్తూరు గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తితో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి కొడుకు, కుమార్తె సంతానం. భర్త మతిస్థిమితం లేకపోవటం, మామ వెంకటేశ్వర్లు దివ్యాంగుడు కావడంతో కుటుంబపోషణ భారమంతా గనిమల్లేశ్వరిపై పడింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య మన స్పర్థలు తలెత్తడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె మంగళవారం పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు చికిత్స నిమిత్తం నందికొట్కూరుకు తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గ్రామానికి చేరుకొని బోరున విలపించారు. మల్లేశ్వరి మృతికి భర్త, మామే కారణమని వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

    మెట్లపై నుంచి జారి

    లారీ డ్రైవర్‌ మృతి

    బేతంచెర్ల: పట్టణంలోని బైటిపేట కాలనీకి చెందిన ఓ లారీ డ్రైవర్‌ మెట్లపై నుంచి జారీ పడి మృతి చెందాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్ర శేఖర్‌ వివరాల మేరకు.. సానె దుశ్యంత్‌ కుమార్‌ (33) సోమవారం ఇంటి పైనుంచి కిందికి వచ్చే క్రమంలో మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తూ జారి పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం నంద్యాల శాంతిరామ్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్ర శేఖర్‌ మంగళవారం వెల్లడించారు.

    డివైడర్‌ను ఢీకొన్న కారు

    కర్నూలు (రూరల్‌): కారు అతివేగంతో డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాలు.. హైదరాబాదుకు చెందిన సోదరులు శివ, మంజునాథ్‌, శివ సతీమణి, కూతురుతో కలిసి బెంగళూరులో గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరై తిరుగు పయనమయ్యారు. సోమవారం అర్ధరాత్రి పంచలింగాల సమీపాన శివ కారును వేగంగా నడపడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో పక్కన కూర్చున్న సోదరుడు మంజునాథ్‌ (42) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో శివ, ఆయన భార్య, కూతురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తాలూకా అర్బన్‌ సీఐ శ్రీధర్‌ తెలిపారు.

  • అట్టహ

    నంద్యాల(న్యూటౌన్‌): నంద్యాల డయాసిస్‌ బిషప్‌గా కామనూరి సంతోష్‌ ప్రసన్నరావు పట్టాభిషేక కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా జరిగింది. హోలీక్రాస్‌ కెథడ్రల్‌ సెంటినరీ చర్చి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి నంద్యాల డయాసిస్‌ పరిధిలో ఉన్న పాస్టరేట్‌ డీనరీ చైర్మన్లు, పాస్టర్లు, కౌన్సిల్‌ మెంబర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా హాజరైన చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా(చైన్నె) మోడరేటర్‌ రూబెన్‌ మార్క్‌ నూతన బిషప్‌ సంతోష్‌ ప్రసన్నరావుతో ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు. సంతోషరావు క్రమంగా బిషప్‌ స్థాయికి ఎదగడం అభినందనీయమని చెప్పారు. అవినీతికి తావు లేకుండా నంద్యాల డయాసిస్‌ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రమాణ స్వీకారం అనంతరం బిషప్‌ ప్రసన్నరావును రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఎంఎస్‌నగర్‌ నుంచి ఊరేగింపు నిర్వహించారు. హోలీక్రాస్‌ కెథడ్రల్‌ ఆలయ ఆవరణలో బిషప్‌ దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో బిషప్‌లు ఐజక్‌ వరప్రసాద్‌, జార్జికొర్నెలి, పద్మారావు, తిమోతి, రవీందర్‌, హేమచంద్రకుమార్‌, జయసింగ్‌ ప్రిన్సిన్స్‌ ప్రభాకరన్‌లతో పాటు డయాసిస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వరప్రసాద్‌, డయాసిస్‌ సెక్రటరీ స్టాండ్లీ విలియం, సెంటినరీ చర్చి సెక్రటరీ ప్రభుదాసు, నందం ఐజక్‌తో పాటు అన్ని పాస్టరేట్ల డీనరీ చైర్మన్లు, చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా దక్షిణ ఇండియా సంఘం చైన్నె కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

    క్రీస్తు మార్గంలో నడుస్తా

    క్రీస్తు బోధనలు అనుసరిస్తూ ఆయన అడుగు జాడల్లో నడుస్తానని నంద్యాల డయాసిస్‌ అధ్యక్ష ఖండం పీఠాధిపతి(బిషప్‌) సంతోష్‌ ప్రసన్నరావు అన్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. డయాసిస్‌ పరిధిలో ఉన్న ఆస్తులను కాపాడుతూ, నంద్యాలలో విద్య, వైద్య సేవలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.

    అవినీతికి తావు లేకుండా నంద్యాల డయాసిస్‌ అభివృద్ధికి కృషి చేయాలి

    నూతన బిషప్‌ సంతోష్‌ ప్రసన్నరావుకు మోడరేటర్‌ రూబెన్‌మార్క్‌ పిలుపు

  • శ్రీమ

    మంత్రాలయం: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం మంగళవారం సినీనటుడు సాయికుమార్‌ విచ్చేశారు. ఆయన మఠం కారిడార్‌కు చేరుకోగా ధార్మిక అధికారి శ్రీపతి ఆచార్‌, సహాయ పీఆర్వో వ్యాసరాజాచార్‌లు సాంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. ఆయన ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని అర్చన సహిత హారతులు పట్టా రు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూలబృందావనానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయనకు మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు శేషవస్త్రం కప్పి, స్వామి వారి అక్షితలు అందజేసి ఆశీర్వదించారు. స్వామి వారి జ్ఞాపికను బహూకరించారు.

    చేనేత దినోత్సవం

    ఘనంగా నిర్వహిద్దాం

    కర్నూలు(అర్బన్‌): ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం స్థానిక బిర్లా కాంపౌండ్‌లో ఆలిండియా వీవర్స్‌ ఫెడరేషన్‌, చేనేత కుల సంఘాల సమాఖ్య కర్నూలు యూనిట్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ చేనేత దినోత్సవం సందర్భంగా 7న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి, అనంతరం 11.30 గంటలకు చేనేత జౌళి శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో చేనేత సమస్యలపై చర్చించి మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రాలను అందిస్తామన్నారు. చేనేత సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. నాయకులు చింత శ్రీనివాసులు, దాశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

  • అధిక

    హాలహర్వి: నిట్రవట్టి గ్రామంలో మంగళవారం శ్రావణ శుద్ధ దశమి వేడుకలు ఘనంగా జరిగాయి. వసిగేరప్ప తాత భక్తుడు కె.ఏజీ భవిష్యవాణి వినిపించారు. ముంగారి వర్షాలు విశేషంగా గాలి నుంచి మేఘాల ద్వారా వస్తాయని, అయినా రైతులకు సుఖం ఉండదన్నారు. హింగారి వర్షాలు ఏడు కార్తీలు ఉరుములు, మెరుపుల ద్వారా వస్తాయన్నారు. రెండు తుపాన్‌లు ఉంటాయన్నారు. తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం వెనుకా ముందు పరుగులు పెడతాయని చెప్పారు. ఆరు మూడు అవుతుంది, మూడు ఆరు అవుతుందని వివరణ ఇచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో భవిష్యవాణిని వినేందుకు తరలించ్చారు.

    భవిష్యవాణి వినిపించిన వసిగేరప్పతాత భక్తుడు

Dr B R Ambedkar Konaseema

  • సమయపా

    అంగన్‌వాడీ

    కార్యకర్తలకు బకాయిలు

    అంగన్‌వాడీ కార్యకర్తలకు మార్చి నుంచి ఈవెంట్స్‌ బిల్లులు బకాయి పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చాక టీఏ, డీఏలు చిల్లిగవ్వ కూడా చెల్లించలేదు. తీవ్ర ఆందోళనల నేపథ్యంలో ఇటీవల గౌరవ వేతనాలు మాత్రం జమ చేసింది. మరోవైపు యాప్‌ యాతనలు పడలేమంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు రెండు రోజులుగా మొబైల్‌ ఫోన్లను ప్రభుత్వాధికారులకు వెనక్కి ఇచ్చేస్తున్నారు.

    క్లాప్‌ మిత్రలు,

    పారిశుధ్య కార్మికులు

    స్వచ్ఛ భారత్‌ మిషన్‌ అమలులో భాగంగా తడి, పొడి చెత్త సేకరించేందుకు 250 కుటుంబాలకు ఒకరు చొప్పున క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) మిత్రలను తీసుకున్నారు. గత ఏడాది నుంచి తమ జీతాల నుంచి పీఎఫ్‌, ఈఎస్‌ఐలకు నగదు మినహాయించినప్పటికీ సుమారు రూ.50 లక్షలు జమ చేయలేదని క్లాప్‌ వాహన డ్రైవర్ల సంఘం ఆరోపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని పంచాయతీల్లో ఉన్న సంపద సృష్టి కేంద్రాల్లో క్లాప్‌మిత్రలు రూ.6 వేల జీతానికి పని చేస్తున్నారు. తర్వాతి కాలంలో మిషన్‌ నుంచి నిధులు నిలిచిపోవడంతో వీరి జీతాల భారం పంచాయతీలపై పడింది. పంచాయతీల ఆర్థిక పరిస్థితులు బాగోలేక వీరి జీతాలు బకాయిలు పేరుకుపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అత్యధిక పంచాయతీల్లో గ్రీన్‌ అంబాసిడర్స్‌ (పారిశుధ్య కార్మికుల)కు 3 నెలలకు పైగా గౌరవ వేతనాలు బకాయిలున్నాయి.

    కపిలేశ్వరపురం: ప్రభుత్వమంటే సామాన్య ప్రజలకు, వారికి సేవలందించే ప్రభుత్వ ఉద్యోగులు, సేవకులకూ భరోసా ఇచ్చేదిగా ఉండాలి. గెలవాలన్న తపనతో నోటికొచ్చిన హామీలిచ్చేసి, గెలిచాక ఆర్థిక సంక్షోభమంటూ లెక్కలేసుకోవడం ప్రజాస్వామ్యయుతమైన పాలన కానేకాదు. 2024 జూన్‌ 12న అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం పాలన సామాన్యులు, చిరుద్యోగులను తీవ్ర యాతనకు గురి చేస్తోంది. వారికి సంక్షేమ పథకాలను అమలు చేయాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులంటూ వాటిని ఎగవేస్తోంది. వేతనాలు ఇచ్చేటప్పుడు పూర్తి స్థాయి ఉద్యోగులు కాదంటూ కోతలు పెడుతోంది. ఇచ్చేది స్వల్ప వేతనమే అయినా దానిని కూడా నెలల తరబడి బకాయి పెడుతూండటంతో వివిధ శాఖల్లో పని చేస్తున్న చిరుద్యోగులు నానా అగచాట్లూ పడుతున్నారు. ఐవీఆర్‌ఎస్‌ సర్వే పేరుతో నేరుగా ప్రజలకు ఫోన్‌ చేసి సిబ్బంది సేవలు సంతృప్తికరంగా ఉన్నాయా అని అడుగుతున్న ప్రభుత్వం.. సిబ్బందికి భారీగా బకాయిలపై మాత్రం నోరు మెదపడం లేదు.

    అత్యవసర సేవకులకు అవస్థలు

    అత్యవసర సేవలందించే 108, 104, 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లను గతంలో అరబిందో సంస్థ నిర్వహించేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం భవ్య హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అప్పగించింది. ఈ మార్పు క్రమంలో రెండు నెలల పాటు వేతనం, ఇంక్రిమెంట్లు ఆలస్యంగా అందజేశారు. వీరి వేతనాన్ని రూ.4 వేలు పెంచుతామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. ఆచరణకు వచ్చేసరికి 108 సిబ్బందికి రూ.500, 104 సిబ్బందికి రూ.1,500 తగ్గించి వేతనాలిస్తున్నారు. వాహనం బ్రేక్‌డౌన్‌ అయ్యినప్పుడు ఉద్యోగికి వేతనం తగ్గిస్తూనే సేవలు మాత్రం కొనసాగించినట్టు చూపుతున్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సిబ్బందికి 4 నెలలుగా వేతనాలు బకాయి పెట్టారు.

    ‘డొక్క’లెండుతున్నాయ్‌

    మధ్యాహ్న భోజన పథకానికి ఆంధ్రా అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరు పెట్టామని గొప్పగా చెబుతున్న ప్రభుత్వం.. ఆ పథకం నిర్వాహకులను మాత్రం అనేక అవస్థలకు గురి చేస్తోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 1,258 ప్రాథమిక, 85 ప్రాథమికోన్నత, 229 ఉన్నత పాఠశాలల్లో 62,464 మంది, కాకినాడ జిల్లాలో 1,285 ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు అప్పులు చేసి అన్నం పెడుతున్నారు. ప్రతి విద్యార్థికి మెనూ చార్జి కింద రూ.20 ఇవ్వాలని, వంట గ్యాస్‌ సిలిండర్‌, కూరగాయలను ప్రభుత్వమే ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోని పరిస్థితి. వారికి ఇచ్చే రూ.3 వేల వేతనాన్ని కూడా రెండు నెలలకోసారి అందజేస్తున్నారు. మెనూ చార్జి బిల్లులను మార్చి నుంచి బకాయి పెట్టింది. పథకం నిర్వహణను ప్రైవేటు వారికి అప్పజెప్పిన ప్రాంతాల్లో కార్మికులకు రూ.3 వేలు కాకుండా రూ.1,500 మాత్రమే ఇస్తున్నారు. రౌతులపూడి, తుని, శంఖవరం, కోటనందూరు, తొండంగి, గొల్లప్రోలు తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది.

    స్కూల్‌ ఆయాలకు ఆరు నెలలుగా..

    పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతున్న ఆయాకు నెలకు కేవలం రూ.6 వేల గౌరవ వేతనమిస్తున్నారు. అది కూడా జనవరి నుంచి ఆరు నెలల పాటు బకాయి పెట్టారు. పాఠశాలకు ఒక్కరు చొప్పున కాకుండా పాఠశాల విస్తీర్ణం ప్రామాణికంగా ఆయాలను తీసుకోవాలని సంఘం కోరుతోంది.

    ఉద్యోగ, ఉపాధ్యాయులకు..

    రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎరియర్స్‌, డీఏలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్ల రూపాల్లో రూ.కోట్లలో బకాయిలున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇటీవల బదిలీ అయిన 1,500 మంది ఉపాధ్యాయులకు జూన్‌, జూలై నెలల వేతనాలు ఇప్పటికీ చెల్లించలేదు. స్కూల్‌ అసిస్టెంట్‌ సమాన క్యాడర్‌ బదిలీలు జూన్‌ 9తో, ఎస్జీటీ బదిలీలు జూన్‌ 14తో ముగిసినప్పటికీ సాంకేతిక సమస్యల సాకుతో వేతనాలు చెల్లించడం లేదు. డీఎస్సీ–98 మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ (ఎంటీఎస్‌) ఉపాధ్యాయులు ఆందోళనలు చేసిన అనంతరం జూన్‌ నెల వేతనాన్ని ఇటీవల అందుకున్నారు.

    ఇంకా..

    సీఎంఆర్‌ ద్వారా రైతులు అమ్మిన రబీ ధాన్యానికి సైతం ప్రభుత్వం ఇంకా డబ్బు చెల్లించలేదు. తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించాలంటూ జూలై 7న అమలాపురం కలెక్టరేట్‌ వద్ద కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. పవన్‌ కల్యాణ్‌ పల్లె పండగ పేరుతో ఉపాధి హామీ పథకం నిధులతో రూ.170 కోట్ల పనులు చేయించగా ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదని వారు నిరసన తెలిపారు.

    బాంబింగ్‌ను

    అడ్డుకున్న గ్రామస్తులు

    మామిడికుదురు: పాశర్లపూడి–పాశర్లపూడిలంక గ్రామాల సరిహద్దులో ఓఎన్‌జీసీ క్షేత్రంలో డ్రిల్లింగ్‌ నిర్వహిస్తున్న సైటులో మంగళవారం బాంబింగ్‌ నిర్వహించారు. బాంబుల శబ్ధానికి తమ ఇళ్లు బీటలు తీశాయంటూ స్థానిక శ్రీరామ్‌పేటవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను గ్రామ సర్పంచ్‌ కొనుకు ప్రేమజ్యోతి, మాజీ సర్పంచ్‌ కొనుకు నాగరాజు దృష్టికి తీసుకు వెళ్లారు. మాజీ సర్పంచ్‌ అక్కడకు చేరుకుని ఓఎన్‌జీసీ అధికారులతో మాట్లాడారు. ముందస్తుగా ఏవిధమైన సమాచారం లేకుండా బాంబింగ్‌ ఎందుకు చేశారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల ఆందోళనతో ఓఎన్‌జీసీ అధికారులు బాంబింగ్‌ను నిలుపుదల చేశారు. ఈ–2003 నంబర్‌ రిగ్‌తో ఇక్కడ డ్రిల్లింగ్‌ నిర్వహించారు. డ్రిల్లింగ్‌ చివరి దశకు చేరుకున్న సమయంలో గత నెల 9వ తేదీన భారీ శబ్ధంతో గ్యాస్‌ కిక్‌ ఇచ్చింది. దీంతో అయోమయానికి గురైన ఓఎన్‌జీసీ సిబ్బంది పరుగులు తీశారు. స్థానికుల తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాంబింగ్‌ నిర్వహించడంతో స్థానికులు భయపడ్డారు. ఎమ్మార్వో సునీల్‌కుమార్‌ను వివరణ కోరగా తమకు ఏ విధమైన సమాచారం లేదన్నారు. దీనిపై పరిశీలన చేస్తున్నామని చెప్పారు.

    అమలాపురం రూరల్‌: జలవనరుల శాఖ ఇంజినీర్లు ముఖ ఆధారిత హాజరు నమోదుతో పాటు సమయపాలన పాటిస్తూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ వీడియో కాన్ఫరెనన్స్‌ ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు జలవనరులు, డ్రైనేజీ విభాగపు ఇంజినీర్ల పనితీరుపై ఈఈ, డీఈ ఈ, సహా ఇంజినీర్లతో సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో జలవనులశాఖ పనులలో ఆశించిన పురోగతి లేదని ఉన్నతాధికారుల సమీక్షలో వెల్లడైన నేపథ్యంలో మంచి ఫలితాలు సాధించాలన్నారు. డీఆర్‌ఓ కె.మాధవి ఆర్డీవోలు పి.శ్రీకర్‌, డి.అఖిల, ఎస్‌ఈ వెంకట స్వామి, డీఈలు వెంకటేశ్వరరావు డ్రైనేజీ విభాగం ఈఈ ఎంవీవీ కిషోర్‌ పాల్గొన్నారు.

    అంతర్వేది ఆలయ భూముల

    రీ సర్వే పూర్తి చేయాలి

    అంతర్వేది లక్ష్మినరసింహ స్వామి దేవస్థాన భూముల రీ సర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని రెవెన్యూ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌, దేవదాయ, ధర్మాదాయ అధికారులను జేసీ నిషాంతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో దేవస్థాన భూముల సర్వేపై సమీక్షిస్తూ 895 ఎకరాలలో 139 ఎకరాలు దేవస్థానం అధీనంలోనే ఉందని, ఇప్పటివరకు 211 ఎకరాలలో సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. నోటీసులు ఇచ్చి 15 రోజులలో ఆక్రమణదారులను ఖాళీ చేయించాలన్నారు. దేవస్థానం కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి భూములకు అద్దెలు, లీజుల ధరలు నిర్ణయించాలన్నారు.

    నవరాత్రి వేడుకలకు ఏర్పాట్లు

    అయినవిల్లి లో వేంచేసియున్న వరసిద్ధి వినాయక స్వామి ఈ నెల 27వ తేదీ నుంచి వినాయక చతుర్థి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు సిద్ధం చేయాలని జేసీ నిషాంతి దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా ఉత్సవాల నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. సెప్టెంబర్‌ 4 వరకు నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వ హించాలన్నారు.

    వేతనాల చెల్లింపు భారం అనుకోవడం సరికాదు

    మానవ సమాజంలో సంపదను సృష్టించేది మానసిక, శారీరక శ్రమ చేసే శ్రామికులే. వారికి వేతనాలు రూపంలో ఖర్చు చేసేది భారంగా ప్రభుత్వం భావించకూడదు. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడే స్థాయిలో వేతనాలను పెంచి , క్రమం తప్పకుండా చెల్లించాలి.

    – చెక్కల రాజ్‌కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ, కాకినాడ జిల్లా

    ఉమ్మడి జిల్లాలో

    చిరుద్యోగులకు వేతన వెతలు

    వేతన, బిల్లుల బకాయిలతో అవస్థలు

    అత్యవసర సిబ్బందికీ సమస్యలే

    ఉద్యోగ ఉపాధ్యాయులూ బాధితులే

    ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు

    ఫోన్‌లను తిరిగి ఇచ్చేస్తున్న

    అంగన్‌వాడీలు

  • మహిళా

    బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం జోన్‌–2 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మాజీ ఎంపీ, పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ వంగా గీత నియమితులయ్యారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఈ నియామకం చేపట్టారు. వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

    ఇళ్ల స్థలాలకు

    జర్నలిస్టుల వినతి

    అమలాపురం రూరల్‌: అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఏపీయుడబ్ల్యూజే శాఖ అధ్వర్యంలో అమలాపురంలో కలెక్టరేట్‌ వద్ద మంగళవారం నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు మండేల నాగప్రసాద్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులు తమ సమస్యలపై ఆందోళన చేశారు. బిహార్‌ తరహాలో జర్నలిస్టులకు పెన్షన్‌ పథకం ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కోవిడ్‌లో చనిపోయిన పాత్రికేయులకు ఆర్ధిక సాయం అందించాలని, జర్నలిస్టులు బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఎలక్ట్రానిక్‌ మీడియా అధ్యక్షుడు కోర్లపాటి ప్రదీప్‌, ఉమ్మడి తూర్పుగోదావరి మాజీ కార్యదర్శి సుంకరప్రసాద్‌, ప్రెస్‌క్లబ్‌ ప్రింట్‌ మీడియా అధ్యక్షుడు కొండేపూడి సత్య నారాయణ, మాజీ అధ్యక్షుడు రంబాల నాగ సత్య నారాయణ, అమలాపురం నియోజకవర్గ ఏపీయుడబ్ల్యూజే అధ్యక్షుడు అరిగెల రుద్ర శ్రీనివాస్‌రావు, నాయకులు నిమ్మకాయల సతీష్‌బాబు, పరసా సుబ్బారావు, పొట్టుపోతు నాగు, వట్టి కూటి గోవింద్‌, ఆకుల రవితేజ, దొమ్మేటి వెంకట్‌, కాకిలేటి సూరిబాబు పాల్గొన్నారు.

    నేడు రాష్ట్ర కోకో రైతుల సదస్సు

    అంబాజీపేట: ఏపీ రాష్ట్ర కోకో రైతు సదస్సును బుధవారం మధ్యాహ్నం అంబాజీపేట కోప్రా మర్చంట్‌ హాల్‌లో నిర్వహించనున్నట్లు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కోకో రైతు సంఘ నాయకులు తెలిపారు. ఈ సదస్సులో కోకో రైతులు ధరల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఎఫ్‌పీఓలు ఏర్పాటు తదితర అంశాలపై చర్చిస్తారన్నారు.

    ఎల్‌ఆర్‌ఎస్‌పై అవగాహన

    అమలాపురం టౌన్‌: జిల్లాలో చాలా అనధికార లే అవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని అమలాపురం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అఽథారిటీ (అముడా) చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు ఆ లే అవుట్ల యాజమానులకు సూచించారు. ఇందుకు అనధికార లే అవుట్ల క్రమబద్ధీరణ స్కీమ్‌ను (ఎల్‌ఆర్‌ఎస్‌) జిల్లాలోని రియల్టర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

    స్థానిక అముడా కార్యాలయంలో జిల్లాలోని లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు, ఇంజినీర్లతో అనధికార లేవుట్లపై మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో చైర్మన్‌ స్వామినాయుడు మాట్లాడారు. అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు తుది గడువు వచ్చే అక్టోబర్‌ 24వ తేదీ అన్నారు. అనధికార లే అవుట్లలో ప్లాట్‌లు కొనుగోలు చేసినవారు కూడా ఎస్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అముడా ప్లానింగ్‌ ఆఫీసర్‌ ఎ.సత్యమూర్తి ఎస్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌పై, దానికి విధించిన తుది గడువు. దరఖాస్తులు చేసుకునే విధి విధానాలపై సర్వేయర్లు, ఇంజినీర్లకు అవగాహన కల్పించారు. అముడా అసిస్టెంట్‌ ప్లానింగ్‌ అధికారి పి.ఉమా మహేశ్వరరావు, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ చిట్టిబాబు ఎల్‌ఆర్‌ఎస్‌ నియమ నిబంధనలు వివరించారు.

  • పుష్కరాలకు అంచనాలు

    అమలాపురం రూరల్‌: 2027లో రానున్న పుష్కరాలకు జిల్లాలో ఉన్న స్నాన ఘట్టాల మరమ్మతులు, నూతన స్నాన ఘట్టాల ఏర్పాటు, కల్పించాల్సిన మౌలిక వసతులపై నియోజకవర్గాల వారీగా అంచనాలను రూపొందించి సమర్పించాలని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జలవనరుల శాఖ స్నాన ఘట్టాలు, స్నాన ఘట్టాల వద్దకు వెళ్లే అప్రోచ్‌ సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, తాత్కాలిక పిండ ప్రధాన షెడ్లు, పుష్కరనగర్‌ ఏర్పాట్లు, మహిళలు దుస్తులు మార్చుకునే షెడ్లు, దైవ దర్శనాలకు, స్నాన ఘట్టాలకు వెళ్లే మార్గాలలో సైనింగ్‌ బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నదీ తీర ప్రాంతంలో, ప్రముఖ దేవాలయాలలో దర్శన ఏర్పా ట్లు, డార్మెట్రీలు, లైటింగ్‌ వంటి మౌలిక సదు పాయాలను కల్పించాలన్నారు.11 శాఖలు నిర్దేశిత పారామీటర్ల వారీగా ప్రతిపాదనలు రూపొందించాల్సి ఉంటుందన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.నిషాంతి, డీఆర్‌ఓ కె.మాధవి, పీ.శ్రీకర్‌, డీ.అఖిల,జిల్లా అధికారులు పాల్గొన్నారు.

    స్వాతంత్య్ర దినోత్సవానికి

    ఏర్పాట్లు చేయాలి కలెక్టర్‌

    15వ తేదీన జరిగే 79వ భారత దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ అధికారులకు సూచించారు మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా ఉండాలన్నారు. ఉత్తమంగా పనిచేస్తున్న ఉద్యోగుల పేర్లను ప్రతిపాదించాలని అధికారులను ఆదేశించారు.

Nizamabad

  • బోధన్‌: జిల్లాలో 11వేల మెట్రిక్‌ టన్నుల ఎరువుల స్టాక్‌ ఉండగానే మళ్లీ స్టాక్‌ తెప్పిస్తున్నామని, ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటుండడంతో ఎక్కడా కొరత ఏర్పడలేదని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లిలో కలెక్టర్‌ మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలోని పల్లె దవాఖాన, సొసైటీ ఎరువుల గోదామును తనిఖీ చేశారు. పల్లె దవాఖానలో సిబ్బంది హజరు, అవుట్‌ పేషంట్‌ల రిజిస్టర్లను తనిఖీ చేశారు. దోమల నియంత్రణకు ఫాగింగ్‌ చేయడం లేదని తెలిసి గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేశ్‌పై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి డీపీవోకు ఫోన్‌ చేసి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఫాగింగ్‌ చేపట్టేలా చూడాలని ఆదేశించారు. సహకార సొసైటీ గోదాములో స్టాక్‌ను తనిఖీ చేసిన కలెక్టర్‌.. సరిపడా ఎరువులు అందుతున్నాయా? అని అక్కడికి వచ్చిన రైతులను ప్రశ్నించారు. ఒకే సారి కాకుండా అవసరానికి అనుగుణంగా ఎరువులు తీసుకెళ్లాలని రైతులకు సూచించారు.

    ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.30కోట్ల రుణాలు

    ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా నిర్మాణానికి ఆర్థికస్థోమత లేని లబ్ధిదారులకు స్వయం సహాయక మహిళా పొదుపు సంఘాల ద్వారా రూ.లక్ష చొప్పున రుణ సదుపాయం కల్పిస్తున్నామని, రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో లబ్ధిదారులకు రూ.30కోట్లకు పైగా రుణాలు అందించామని కలెక్టర్‌ వెల్లడించారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుండగా, ఉచితంగా ఇసుకను సమకూరుస్తున్నామన్నారు. అయినప్పటికీ లబ్ధిదారులు ఎవరైనా ఇంటి నిర్మాణానికి ముందుకు రాకపోతే వారి నుంచి రాతపూర్వకంగా లేఖలు తీసుకుని జాబితాలో నుంచి వారి పేర్లను తొలగించి వారి స్థానంలో అర్హులకు ఇల్లు కేటాయించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను అర్హులకు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో ఆఫీస్‌ల్లో ప్రజా పాలన సేవా కేంద్రాలు కొనసాగుతున్న విషయం ప్రజలందరికీ తెలిసేలా ఆఫీస్‌ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

    ఎక్కడా కొరత లేదు

    ఇందిరమ్మ ఇళ్లకు ఎస్‌హెచ్‌జీ

    ద్వారా రుణం

    నిర్మాణం పూర్తయిన ‘డబుల్‌’ ఇళ్లను అర్హులకు కేటాయించాలి

    అధికారులకు కలెక్టర్‌

    వినయ్‌ కృష్ణారెడ్డి ఆదేశాలు

  • సీఎంసీ మెడికల్‌ కాలేజ్‌ పేరిట మోసం!

    పలువురి వద్ద రూ.కోట్లు వసూలు చేసిన నిందితుడు!

    ఆలస్యంగా వెలుగులోకి ఘటన

    నిజామాబాద్‌నాగారం/డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి శివారులో గల సీఎంసీ (క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌) పేరిట ఓ వ్యక్తి నగరంలోని పలు వురి వద్ద రూ.కోట్లలో డబ్బులను వసూలు చేశాడు. కానీ వైద్యశాలకు అనుమతి రాకపోవడం, సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో నిందితుడిని నిలదీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. కర్ణాటకకు చెందిన షణ్ముఖ మహాలింగం అనే వ్యక్తి సీఎంసీని ఇటీవలే పునఃప్రారంభించారు. ఈక్రమంలో అతడు ఓ ఐఎంఏ నేతకు డైరెక్టర్‌ పదవి ఇస్తానని చెప్పి రూ. 3కోట్ల వరకు నొక్కేసినట్లు సమాచారం. దీంతోపాటు వైద్యులను ఫ్యాకల్టీగా పెట్టుకుంటానని చెప్పడంతో జిల్లాలో ఉన్న పలువురు వైద్యుల వద్ద షణ్ముక లింగం చెప్పినట్లు అతడు డబ్బులు వసూలు చేసి ఇచ్చినట్లు సమాచారం. అలాగే కాంట్రాక్టర్‌ ద్వారా పనులు చేయించడంతో పాటు మూడు నెలలుగా కొంతమంది డా క్టర్లు, స్టాప్‌ నర్సులు, ఇతర ఉద్యోగులను,శానిటేషన్‌, సెక్యూర్టీగార్డ్స్‌ తదితర సిబ్బందిని నియమించుకున్నారు. నియామకాల్లో కూడా ఒక్కోక్కరి వద్ద రూ. 50వేల నుంచి రూ. 1లక్ష వరకు వసూలు చేసిన్నట్లు సమాచారం. కానీ జీతాలు ఇవ్వకపోవండతో సీఎంసీ చైర్మన్‌ అని చెప్పుకునే షణ్ముకమహాలింగంను కొన్ని రోజుల క్రితం సిబ్బంది నిలదీయడంతో వెలుగులోకి వచ్చింది. పోలీసులు వచ్చి షణ్ముకను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుతో డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది.

    అనుమతి ఇవ్వని ఎన్‌ఎంసీ..

    సీఎంసీని పున:ప్రారంభించడంతో నెల కిందటే ఎన్‌ఎంసీ బృందం ఢిల్లీ నుంచి వచ్చి పరిశీలించింది. నిబంధనలు పాటించలేదని అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పేశారు. సీఎంసీ కాలేజ్‌లో ఆస్పత్రి ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా వైద్యారోగ్యశాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. దీంతో నిర్వాహకులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో మూడు నెలల ప్రాథమిక అనుమతి ఇచ్చారు. ఇందుకోసం అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నారని శాఖలో ఉద్యోగులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

    చీటింగ్‌ కేసు నమోదు చేశాం..

    సీఎంసీ కాలేజీకి సంబంధించి డాక్టర్‌ అజ్జ శ్రీనివాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ మహాలింగంపై చీటింగ్‌ కేసు నమోదు చేశాం. విచారణ చేస్తున్నాం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం.

    –మహమ్మద్‌ షరీఫ్‌, డిచ్‌పల్లి ఎస్సై

  • మోతీరాంనాయక్‌ తండాలో ఉద్రిక్తత

    మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌): మండలంలోని బైరాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని మోతీరాంనాయక్‌ తండాలో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అటవీభూమిలో పంట సాగుచేయడంతో ఫారెస్టు అధికారులు పంటకు గడ్డి మందు పిచికారి చేయడంతో అధికారులకు, గిరిజనులకు మధ్య వా గ్వాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో ఓ రైతు ఆ త్మహత్యకు యత్నించాడు. వివరాలు ఇలా.. తండా కు చెందిన ప్రకాశ్‌ అనే గిరిజన రైతు అటవీ భూమి లోని 3ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నా డు. ఏప్రిల్‌ 29న రైతు ఆ భూమి చదును చేయగా, ఫారెస్ట్‌ అధికారులకు ఫిర్యాదు రావడంతో చదును చేయవద్దన్నారు. అవేమీ పట్టించుకోకుండా సదరు రైతు పంట సాగుచేయడంతో మేలో నోటీసులిచ్చా రు. అయినా అతడు స్పందించకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎఫ్‌ఆర్‌వో రాధిక స మక్షంలో ఫారెస్ట్‌ అధికారులు గడ్డి మందు స్ప్రే చేశా రు. వెంటనే అధికారులను ప్రకాష్‌ కుటుంబంతోపాటు గిరిజనులు అడ్డుకున్నారు. కొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందని, ఆ తర్వాత పంట వేయబో మని నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రెండెకరాల్లో మందును స్ప్రే చేసినట్లు గిరిజనులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువురిని సముదాయించారు. చేతికొచ్చిన పంటను అధికారులు నాశనం చేయడంతో మనస్తాపానికి గురైన రైతు ప్రకాష్‌ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆయనను వెంటనే నగరంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా ప్రకాశ్‌ గడ్డి మందు తాగలేదని, తమను బెదిరించేందుకు అలా చేశారని ఫారెస్ట్‌ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా అటవీభూమిని సాగుచేయడమే కాకుండా ఫారెస్టు అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు రైతు ప్రకాష్‌, అతడి భార్య కవిత, బంధువైన జలెందర్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

    అటవీ భూమిలో వేసిన మొక్కజొన్న

    పంటకు గడ్డిమందు స్ప్రేకు

    ఫారెస్టు అధికారుల యత్నం

    అడ్డుకున్న గిరిజనులు

    మనస్తాపంతో గడ్డి మందు తాగిన రైతు!

  • క్రైం కార్నర్‌

    చెరువులో పడి ఒకరి మృతి

    సిరికొండ: మండలంలోని రావుట్ల గ్రామంలోని ఊర చెరువులో పడి ఒకరు మృతిచెందినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన జాగర్ల నరహరి(43) అనే వ్యక్తి ఈ నెల 3న స్నానం చేయడానికి ఊర చెరువులోకి వెళ్లాడు. కానీ ఈత రాకపోవడంతో అతడు నీట మునిగి, మృతిచెందాడు. మృతుడి భార్య లహరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

    చికిత్స పొందుతూ ఒకరు...

    మాక్లూర్‌: ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని ధర్మోరా గ్రామానికి చెందిన అరుణ్‌(28) కుటుంబ గొడవల కారణంగా ఈనెల 3న ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మంగళవారం పరిస్థితి విషమించడంతో అతడు మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉండటంతో అరుణ్‌ అంత్యక్రియలు పూర్తయ్యేవరకు పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు.

    చోరీ కేసులో ఒకరికి ఏడాది జైలు శిక్ష

    బాల్కొండ: మండల కేంద్రంలోని ఓ వైన్స్‌ దుకాణంలో చోరీకి పాల్పడిని వ్యక్తికి ఆర్మూర్‌ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించినట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రామకృష్ణ తెలిపారు. వివరాలు ఇలా.. బాల్కొండలోని తుల్జా భవాని వైన్స్‌ షాపులో 2024 సెప్టెంబర్‌ 4న నిర్మల్‌ మండలం కొండపూర్‌ గ్రామానికి చెందిన నక్క పోశెట్టి చోరీకి పాల్పడ్డాడు. షట్టర్‌ తాళం పగలగొట్టి రూ. 14వేల నగదుతోపాటు కొన్ని మందు బాటిళ్లను ఎత్తుకెళ్లాడు. ఈఘటనపై అప్పటి ఎస్సై నరేష్‌ కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకొని, ఆర్మూర్‌ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి సరళరాణి సాక్ష్యాధారాలను పరిశీలించి, మంగళవారం అతడికి ఏడాది జైలుశిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఆయన తెలిపారు.

    అట్రాసిటీ కేసులో ఒకరికి..

    నిజామాబాద్‌ లీగల్‌: కులం పేరుతో దూషించి, దాడి చేసిన కేసులో ఒకరి కి నిజామాబాద్‌ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. వివరాలు ఇలా.. నగరంలోని మిర్చి కాంపౌండ్‌ చెందిన దుర్గయ్యను, తన కొడుకును క్రాంతి కుమార్‌ అనే వ్యక్తి 24 డిసెంబర్‌ 2020న కులం పేరుతో దూషించి దాడి చేశాడు. బాధితులు వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుని కోర్టులో హాజరుపర్చారు. విచారణ చేపట్టిన జడ్జి నిందితుడికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ.2,400 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

  • చేయూత పెన్షన్‌ పెంచాలి

    పెర్కిట్‌(ఆర్మూర్‌): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హా మీ మేరకు వెంటనే చేయూత పెన్షన్‌ను పెంచి, అర్హులకు అందించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్య క్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. ఆర్మూ ర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌లో మంగళవారం మహాగర్జన సన్నాహక సభ నిర్వహించారు. ఈసందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు చే యూత పింఛన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలు, వికలాంగుల పింఛన్లను రూ.4 వేల నుంచి రూ.6 వేలు పెంచుతామని హామీలిచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా సీఎం రేవంత్‌ రెడ్డి పింఛన్‌ పెంపు విషయంలో ముఖం చాటేస్తున్నారన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి దేశంలోనే నెంబరు వన్‌ మోసగాడని, అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌ నంబరు వన్‌ అసమర్థ నాయకుడని అన్నారు. పించను పెంచే విషయంలో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికే హైదరాబాద్‌లో ఈ నెల 13న చేయూత, వికలాంగుల పింఛన్‌దారులతో మహాగర్జన సభ చేపడుతున్నట్లు వెల్లడించారు. సభను ప్రజలు భారీ గా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు. ఎమ్మార్పీఎస్‌ ప్రతినిధులు సుజాత సూర్యవంశీ, బీరప్ప, సలీం, ఖలీం, స్వామి, పోశెట్టి, బా లు, కనక ప్రమోద్‌, రాజేశ్‌, స్వామి దాస్‌, శ్యామ్‌, కృష్ణవేణి, సరిత, గంగాధర్‌ పాల్గొన్నారు.

  • వారిద
    నిజామాబాద్‌

    సబ్సిడీపై వ్యవసాయ..

    సాగులో రైతులకు వెన్నుదన్నుగా ఉండేందుకు వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రారంభించింది.

    బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025

    – 10లో u

    ● ఆర్మూర్‌ నియోజకవర్గంలో 192 పనులకుగాను 41 పనులు పూర్తి అయ్యాయి. ఒక పని పురోగతిలో ఉంది. 150 పనులు ఇంకా ప్రారంభించలేదు. ఇప్పటి వరకు రూ.1,11,37,346 ఖర్చు చేశారు.

    ● బాల్కొండ నియోజకవర్గంలో 290 పనులకు గాను 55 పనులు పూర్తి అయ్యాయి. ఒక పని పురోగతిలో ఉంది. 234 పనులు ఇంకా ప్రారంభించలేదు. రూ.1,70, 52,858 ఖర్చు చేశారు.

    ● బోధన్‌ నియోజకవర్గంలో 158 పనులు చేపట్టాలని నిర్ణయించారు. వీటిలో 14 పనులు మాత్రమే పూర్తి అయ్యాయి. ఒక పని పురోగతిలో ఉంది. 143 పనులు ఇంకా ప్రారంభించలేదు. రూ.67,73,847 ఖర్చు చేశారు.

    ● నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో 178 పనులను చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 29 పనులు మాత్రమే పూర్తి చేశారు. ఒక పని పురోగతిలో ఉంది. 148 పనులు ఇంకా ప్రారంభించలేదు. రూ.1,52,52,025 ఖర్చు చేశారు.

    ● నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో 304 పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 86 పనులు పూర్తి అయ్యాయి. ఒక పని పురోగతిలో ఉంది. 217 పనులు ప్రారంభం కాలేదు. రూ.1,91,19,168 ఖర్చు చేశారు.

    సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : అధికారం మనదే కదా, మనం ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన ప్రత్యేక నిధులను అధికార పార్టీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ద్వారా తమ ఇష్టం వచ్చిన పనులకే ఖర్చు పెడుతున్నారు.

    జిల్లాలోని ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ రూరల్‌, నిజామాబాద్‌ అర్బన్‌, బాల్కొండ నియోజకవర్గాలకు 2024–25 సంవత్సరానికి గాను రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.50 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధుల ద్వారా ఈ ఐదు నియోజకవర్గాల్లో మొత్తం 1,122 పనులు మంజూరయ్యాయి. వీటిలో 225 పనులు పూర్తయ్యాయి. 5 పనులు జరుగుతున్నాయి. మరో 892 పనులు ఇంకా మొదలు కాలేదు.

    మొత్తం రూ.50 కోట్ల లో ఇప్పటివరకు రూ. 6,93,35,244 ఖర్చు చేశా రు. నియోజకవర్గాల్లో ప్రజలచేత గెలుపొంది ప్రాతి నిధ్యం వహిస్తున్న విపక్ష ఎమ్మెల్యేలను కాదని అధి కార పార్టీ నాయకులు చెప్పినట్లే పనులు చేస్తున్నా రు. ప్రజల ఓట్లతో గెలుపొంది ప్రాతినిధ్యం వహిస్తున్న తమకు అభివృద్ధి పనుల కోసం ఒక్క పైసా లేకుండా చేయడమేమిటని బాల్కొండ బీఆర్‌ఎస్‌ ఎ మ్మెల్యే వేముల ప్రశాంత్‌రె డ్డి, ఆర్మూర్‌ బీజేపీ ఎమ్మె ల్యే పైడి రాకేష్‌రెడ్డి, నిజా మాబాద్‌ అర్బన్‌ బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు.

    సీడీపీ నిధులు పైసా ఇవ్వలేదు..

    నగరాభివృద్ధిని కాంక్షించిన ప్రజలు నన్ను ప్రజాప్ర తినిధిగా గెలిపించారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కపైసా సీడీపీ నిధులు ఇవ్వలేదు. ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద వచ్చిన డబ్బుల్లో ఒక్కపైసా కూడా ఎమ్మెల్యే ద్వారా ఖర్చు చేయడం లేదు. అధికార పార్టీ నాయకులే ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నా రు. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు.

    – ధన్‌పాల్‌ సూర్యనారాయణ, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే

    అప్రజాస్వామికం..

    ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై న ఎమ్మెల్యేలకు అభివృద్ధి నిధులు కేటాయించకపోవడం శోచనీయం. అధికార పార్టీ నాయకులు పూర్తి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అసమర్థతపై ప్రశ్నిస్తే ఇళ్లపై దాడులు చేసే సంస్కృతికి తెరతీశారు. ఇది మంచి పద్ధతి కాదు.

    – వేముల ప్రశాంత్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే

    ఇది మంచి పద్ధతి కాదు..

    ఆర్మూర్‌ ప్రజలు భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు. నా దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కో సం ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌కు మాత్రం రూ.వెయ్యి కోట్లు కేటాయించడం అసమతుల్యానికి నిదర్శనం. అధికార పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు చేస్తే భవిష్యత్‌ తరాలకు ఏమి చెప్పాలి.

    – పైడి రాకేష్‌రెడ్డి, ఆర్మూర్‌ ఎమ్మెల్యే

    న్యూస్‌రీల్‌

    విపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గ్గాల్లో

    అధికార పార్టీ నేతల పెత్తనం

    వారు ప్రతిపాదించిన పనులకే

    ప్రత్యేక నిధుల వినియోగం

    జిల్లా ఇన్‌చార్జి మంత్రి ద్వారా

    నిధుల కేటాయింపులు

    నిస్సహాయ స్థితిలో విపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు

    ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని

    ఆగ్రహావేశాలు

  • మంజూర
    సవాళ్లు ముందున్నాయి..

    గ్రామీణ విద్యార్థులకు అందుబాటులోకి సాంకేతిక విద్య

    తెయూలో ఇంజినీరింగ్‌ కళాశాల

    మంజూరుతో నెరవేరిన ఆకాంక్ష

    నాలుగు కోర్సులు.. 264 సీట్లు

    మూడో విడత కౌన్సెలింగ్‌లో సీట్ల భర్తీ

    కంప్యూటర్‌ సైన్స్‌లో ఆధునిక కోర్సులు

    తెయూ(డిచ్‌పల్లి) : తెలంగాణ వర్సిటీలో రాష్ట్ర ప్ర భుత్వం ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు చేయడంతో ఉమ్మడి జిల్లా వాసుల దశాబ్దాల కల నెరవేరింది. యూనివర్సిటీ ఏర్పడిన కొత్తలో మొదటి వీసీగా పని చేసిన ప్రొఫెసర్‌ కాశీరాం వర్సిటీలో సాంప్రదా య కోర్సులతోపాటు సాంకేతిక కోర్సులు ఉంటే బాగుంటుందని భావించారు. అప్పటి నుంచే ప్ర ణాళికలు సిద్ధం చేయగా, సుమారు 18 ఏళ్ల తర్వాత కల నెరవేరింది. ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబా ద్‌ జిల్లాలకు చెందిన గ్రామీణ పేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తోంది. కంప్యూ టర్‌ సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) నా లుగు కోర్సులను ప్రభుత్వం మంజూరు చేసింది. కోర్సుకు 60 సీట్లతోపాటు ఈడబ్యుఎస్‌ కోటా కింద 6 చొప్పున మొత్తం 264 సీట్లు అందుబాటులో ఉ న్నాయి. మూడో విడత ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వా రా సీట్లను భర్తీ చేయనున్నారు.

    వెబ్‌ ఆప్షన్స్‌

    విద్యార్థులు ఈనెల 5, 6, 7 తేదీల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని వెబ్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి. ఈఏపీసెట్‌ వెబ్‌సైట్‌లో 162 క్రమసంఖ్యలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలకు ‘టీయూసీఈ’ కోడ్‌ కేటాయించారు. ఇంజినీరింగ్‌ కళాశాలలో చేరిన వారు ప్రభుత్వం నిర్ణయించిన రూ.50వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. 10వేల లోపు ర్యాంకు సాధించిన వారు ఫీజు చెల్లించనక్కర్లేదు. 10వేలకు పైగా ర్యాంకు వచ్చిన విద్యార్థులకు రూ.35 వేల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పోను కేవలం రూ.15 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

    నిరంతర పర్యవేక్షణ అవసరం

    ప్రస్తుతం ప్రవేశ పెట్టి న నాలుగు కోర్సులు మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ఆధునిక కోర్సులని చెప్పొ చ్చు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకని వారికి సరైన బోధన అందించేందుకు క్వాలిఫైడ్‌ అండ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఫ్యాకల్టీని ఎంపిక చేయాలి. తగినంత కంప్యూటర్‌ ల్యాబ్స్‌ సౌకర్యం కల్పించాలి. విద్యార్థులకు రెగ్యులర్‌ సిలబస్‌ తో పాటు వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాలపై పూర్తి పట్టు ఉండేటట్లు సిలబస్‌ డిజైన్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రసిద్ధి చెందిన కంపెనీలతో వర్సిటీ ఒప్పందం చేసుకుని విద్యార్థులకు ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌, ఉద్యోగాల కల్పన సౌకర్యం కల్పించేందుకు కృషి చేయాల్సి ఉంటుంది. ఈ విషయమై వర్సిటీ ఉన్నతాధికారు లు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుంది.

    ఇంజినీరింగ్‌ విద్యలో క్వాలిటీ ప్రమాణాలు చాలా వరకు తగ్గిపోయాయని పలు రిపోర్టులు, రీసెర్చ్‌లు చెబుతున్నాయి. ఉపాధి పొందేందుకు అవసరమైన టెక్నికల్‌ నైపుణ్యాలు విద్యార్థుల్లో కొరవడ్డాయని తెయూ ఇంజినీరింగ్‌ కళాశాల కూడా అదే దారిలో ప్రయాణిస్తే ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు ఆవశ్యకత మరుగున పడిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. యూనివర్సిటీ అధికారులు ఇంజినీరింగ్‌ సిలబస్‌, బోధనా పద్ధతులు, పారిశ్రామిక రంగానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు అందించడం, ఉద్యోగాల కల్పనపై జాగ్రత్తలు వహించాలని విద్యా వేత్తలు సూచిస్తున్నారు.

    డిమాండ్‌ ఉన్న కోర్సులు..

    ప్రస్తుతం మంజూరైన నాలు గు కంప్యూటర్‌ కోర్సులు ప్రస్తుతం మార్కెట్‌లో బా గా డిమాండ్‌ ఉన్నవి. విద్యా ర్థులు ఈఏపీసెట్‌ మూడో విడత కౌన్సెలింగ్‌ ద్వారా ప్రవేశాలు పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వచ్చే విద్యా సంవత్సరం ఈసీఈ, ఈఈఈ, ఈఐఈ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తాం. – సీహెచ్‌ ఆరతి. ప్రిన్సిపాల్‌

    అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు..

    ప్రస్తుతం తెయూ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారు. ఐదుగురు రెగ్యులర్‌ అధ్యాపకుల్లో ఒకరు సీనియర్‌ ప్రొఫెసర్‌, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండగా, మరో ఇద్దరు కాంట్రాక్ట్‌ అధ్యాపకులు ఉన్నారు. అలాగే కంప్యూటర్‌ ల్యాబ్‌లు ఉన్నాయి. – ఎం.యాదగిరి, రిజిస్ట్రార్‌, తెయూ

  • ఆగమవు

    బాల్కొండ: సాగునీటి కోసం ఎస్సారెస్పీ ప్రధాన కాలువల్లో ఒకటైన లక్ష్మి కాలువ ఆయకట్టు రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. పంటల సాగు తోపాటు చెరువులు నింపేందుకు 2 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని, ప్రాజెక్టులో అవసరానికి అ నుగుణంగా నీరున్నా లక్ష్మి కాలువకు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది ఆగస్టు మొదటి వారంలో నీటివిడుదల ప్రారంభమయ్యేదని, ప్రాజెక్టు నిర్మాణం కోసం త్యాగం చేసిన తమ పరిస్థితి ఈ ఏడాది అగమ్యగోచరంగా మారిందని అంటున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రా జెక్ట్‌ నుంచి లక్ష్మి కాలువ ద్వారా 150 క్యూసెక్యుల చొప్పున నీటిని విడుదల చేయాలని పాలకులు అధికారులపై ఒత్తిడి తెస్తుండగా, ఆయకట్టు రైతులు సైతం ఇదే డిమాండ్‌ చేస్తున్నారు. మెండోరా, ముప్కాల్‌, బాల్కొండ, వేల్పూర్‌, మోర్తాడ్‌, కమ్మర్‌పల్లి మండలాల పరిధిలో కాలువ కింద 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటికే 70 నుంచి 80 శాతం నాట్లు పూర్తికాగా, వర్షాభావ పరిస్థితుల కారణంగా మరో 20 శాతం భూముల్లో నాట్లు ఇప్పటికీ పూర్తికాలేదు. అయితే నాట్లు పూర్తయిన భూములకు నీరందకపోవడంతో అక్కడక్కడ పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇటు వర్షాలు కురవక, అటు ఎస్సారెస్పీ నుంచి లక్ష్మి కాలువ ద్వారా నీరందక రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

    అవసరం మేరకు నీరున్నా..

    లక్ష్మి ఆయకట్టు పరిధిలోని 50వేల ఎకరాల్లో పంటలు గట్టెక్కడంతోపాటు చెరువులను నింపేందుకు 2 టీఎంసీల నీరు సరిపోతుందని ప్రాజెక్టు అధికారుల రికార్డులు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 40.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. లక్ష్మి కాలువ ద్వారా నీటి విడుదల చేపడితే పెద్దగా ప్రాజెక్ట్‌లో నీరు అందకుండా పోయే ప్రమాదమేమీ ఉండదు. కాకతీయ కాలువ ద్వారా నిరంతరం 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారని, అటువంటప్పుడు లక్ష్మికాలువ ద్వారా నీటిని విడుదల చేస్తే తప్పేమిటని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు.

    లక్ష్మి కాలువ

    ఎస్సారెస్పీ నుంచి విడుదల కాని నీరు

    కాలువ కింద ఇప్పటికీ

    పూర్తికాని నాట్లు..

    వేసిన నాట్లు ఎండిపోయే పరిస్థితి

    ప్రాజెక్టులో ప్రస్తుతం

    40.5 టీఎంసీల నీటి నిల్వ

    ఆయకట్టుకు 2 టీఎంసీలే అవసరం..

    కొత్త లొల్లి..

    పరిస్థితుల నేపథ్యంలో లక్ష్మి కాలువకు ప్రస్తుతం అనధికారికంగా కొంత నీరు విడుదలవుతోంది. అయితే ఇది ఎక్కడా రికార్డులో నమోదు కావ డం లేదు. అనధికారికంగా విడుదలవుతున్న నీ రు చాలామట్టుకు ఆవిరవుతోంది. డీ3 వరకు అరకొరగా నీరందుతుండగా, డీ4 ఆయకట్టు రై తులకు అసలే లేదు. ముప్కాల్‌ మండలం న ల్లూర్‌ వాసులు ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ గ్రామాన్నే కోల్పోయామని గ్రామ శివారులోని కాలువలో అడ్డుకట్ట వేసి నీటిని చెరువులోకి మ ళ్లించుకుంటున్నారు. దీంతో కొత్త లొల్లి షురూ అయ్యిందని రైతులు ఆందోళన చెందుతున్నా రు. లక్ష్మి కాలువ నిర్వహణ మైనర్‌ ఇరిగేషన్‌ (బాల్కొండ శాఖ) పర్యవేక్షిస్తుంది. నీరు మా త్రం ప్రాజెక్ట్‌ అధికారుల కంట్రోల్‌లో ఉంటుంది. పాలకులు స్పందించి నీటిని విడుదల చేసే లా చర్యలు తీసుకోవాలని, లేకుంటే జల వివా దాలు తలెత్తుతాయని రైతులు అంటున్నారు.

    వెంటనే నీటిని విడుదల చేయాలి

    లక్ష్మికాలువ ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలి. కాలువలో ఇప్పుడు వదులుతున్న నీరు చివరాయకట్టు వరకు రావడం లేదు. దీంతో వరి నాట్లు వేయలేక పోతున్నాం. కొన్ని నీళ్లు ఎందుకు ఇస్తున్నారు. కాలువలోనే ఇంకి పోతున్నాయి. పంటలను కాపాడేందుకు నీళ్లు వదలాలి.

    – ఆకుల రాజన్న, ఆయకట్టు రైతు

  • నిజాం

    నిజాంసాగర్‌: నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు మంగళవారం నీటి విడుదల చేపట్టినట్లు నీటిపారుదల శాఖ ఏఈ అక్షయ్‌ తెలిపారు. 600 క్యూసెక్కుల చొ ప్పున నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రధాన కాలువ ద్వారా ప్రవహిస్తున్న నీటిని ఆయకట్టు ప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

    ఎస్సారెస్పీకి తగ్గిన వరద

    బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగు వ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుము ఖం పట్టింది. ప్రాజెక్ట్‌లోకి 4,150 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 462 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ ద్వారా తాగు నీటి అవసరాలకు 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1078.30(40.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు.

    ఎత్తిపోతల ద్వారా

    నీటిని విడుదల చేయాలి

    నిజామాబాద్‌ సిటీ: అలీసాగర్‌, గుత్ప ఎత్తిపోతల ద్వారా కావాల్సిన నీటిని ప్రభుత్వం విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు వేల్పూరు భూమయ్య డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో మంగళవారం ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా రైతులు వరి నాట్లు వేశారని, సకాలంలో వర్షాలు పడక వరి నాట్లు ఎండిపోతు న్నాయన్నారు. అధికారులు ప్రతి ఏడాది జూ న్‌, జూలైలో అలీసాగర్‌, గుత్ప ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేసేవారని, ఈ ఏ డాది ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి నీటిని విడు దల చేయాలని కోరారు. నాయకులు దేశెట్టి సాయిరెడ్డి, హగ్గు ఎర్రన్న, బోరిగాం సాయి లు, రాపాని గంగాధర్‌, సాయి పాల్గొన్నారు.

    ల్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలి

    డిచ్‌పల్లి: సైన్స్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌లను స ద్వినియోగం చేసుకుని చదువుతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు డీఈవో అశోక్‌ సూచించారు. వ్యాపారవేత్త ఏనుగు దయానంద్‌రెడ్డి సహకారంతో రూ.2.5 లక్షల వ్యయంతో ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన సైన్స్‌, కంప్యూటర్‌ ల్యా బ్‌ను డీఈవో మంగళవారం ప్రారంభించా రు. ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, గెజిటెడ్‌ హెచ్‌ఎం సీతయ్య, మాజీ సర్పంచ్‌ సుదర్శన్‌, గంగాధర్‌, అమ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్‌ సావిత్రి, ఉపాధ్యాయులు, విద్యార్థు లు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలను అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ సందర్శించారు. ల్యా బ్‌లను పరిశీలించి తరగతి గదుల్లో విద్యార్థులతో మాట్లాడారు.

    ఎంఈడీ పరీక్ష ఫీజు

    చెల్లించండి

    తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధి లోని ఎంఈడీ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లా గ్‌ పరీక్ష ఫీజును ఈనెల 18 వరకు చెల్లించాల ని కంట్రోలర్‌ సంపత్‌కుమార్‌ ఒక ప్రకటన లో తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో జరగబోయే ఎంఈడీ 4వ సెమిస్టర్‌ రెగ్యుల ర్‌, 1, 2, 3వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ థియరీ ప రీక్షల కు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 18వరకు ఫీజు చెల్లించాలన్నారు. రూ.100 అపరాధ రుసుముతో 21 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందన్నారు.

    కారులో పీపీపీ వీక్షించిన వేముల

    వేల్పూర్‌ : కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌నుంచి ఇ చ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌(పీపీపీ)ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కారులో ప్రయాణిస్తూ వీక్షించారు. జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆ రాష్ట్రానికి వెళ్లిన వేముల రాంచీ నుంచి సోరె న్‌ స్వగ్రామానికి కారులో ప్రయాణిస్తూ పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ను వీక్షించారు. అ నంతరం నిజామాబాద్‌లో పీపీపీని వీక్షించిన నాయకులతో మాట్లాడారు.

  • జాప్యానికి కారణమేమిటి?

    నిజామాబాద్‌ అర్బన్‌ : భూభారతి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని పదేపదే చెబుతున్నా అర్జీల సత్వర పరిష్కారానికి ఎందుకు చొరవచూపడం లేదని పలు తహసీల్దార్ల తీరుపై కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. దరఖాస్తుల పరిష్కారం ఆలస్యమవుతున్న మండలాల తహసీల్దార్లను జాప్యానికి కారణాలు ఏమిటని ప్రశ్నించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఆర్‌ఐలు, సర్వేయర్లతో భూభారతిపై మంగళవారం సమీక్షించారు. రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తుల వివరాలు మండలాల వారీగా తెలుసుకున్న కలెక్టర్‌.. ఎన్ని దరఖాస్తులను పరిష్కరించారు? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? ఎంత మందికి నోటీసులు ఇచ్చారు? క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యిందా? తదితర వివరాలను తెలుసుకున్నారు. ఆర్డీవోలు ప్రతిరోజూ ఒక మండలాన్ని తప్పనిసరిగా సందర్శించి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను పర్యవేక్షించాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లాలని సూచించారు. నిర్ణీత గడువు లోగా అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని, ఆమోదించిన దరఖాస్తులను 24 గంటలలోగా ఆర్డీవోల ఆమోదం కోసం పంపించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆన్‌లైన్‌లో అందిన దరఖాస్తులను సైతం వెంటనే పరిష్కరించాలన్నారు. సాదా బైనామా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వీలుగా నోటీసులు రూపొందించుకుని అన్ని విధాలుగా సమాయత్తం కావాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ డిచ్‌పల్లి నుంచి వీసీలో పాల్గొన్నారు.

    భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై కలెక్టర్‌ అసంతృప్తి

    ఎందుకు చొరవ తీసుకోవడం

    లేదని తహసీల్దార్లకు ప్రశ్న

    ఆమోదించిన దరఖాస్తులను

    24గంటల్లో ఆర్డీవోలకు పంపించండి

    వీడియోకాన్ఫరెన్స్‌లో

    కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

  • కాళేశ్వరంతో రాష్ట్రం ధాన్యగారమైంది

    నిజామాబాద్‌అర్బన్‌ : కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ ధాన్యగారంగా మారిందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను ఆన్‌లైన్‌లో వీక్షించిన అనంతరం మాజీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి జీవన్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అపోహాలను తొలగించేందుకే హరీశ్‌రావు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ సృష్టించిన అపోహలను పటాపంచలు చేస్తున్నామన్నారు. కేవలం కేసీఆర్‌ను అరెస్టు చేసేందుకే తప్పుడు నివేది కలు సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడడం ఓర్వలేని ద్రోహులంతా ఒకటై కేసిఆర్‌ పై కక్ష సాధింపు పాల్పడుతున్నారని విమర్శించారు. ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదిక అంతా బోగస్‌ కొట్టిపారేశారు. కేసీఆర్‌ జోలికి వస్తే తెలంగాణ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌ పాలనపై జిల్లా నుంచి సమర శంఖం పూరిస్తామని ప్రకటించారు. నీరు లేక నోరు తెరిచిన నిజాంసాగర్‌ను కాళేశ్వరం ద్వారా నిండుకుండలా మా ర్చిన ఘనత కేసీఆర్‌కు ఉందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌, జెడ్పీ మాజీ చైర్మన్‌ విఠల్‌రావు, సీనియర్‌ నాయకులు ప్రభాకర్‌, సత్యప్రకాశ్‌, సుజిత్‌ సింగ్‌ ఠాకూర్‌, జగన్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

    బోగస్‌ నివేదికలతో తప్పుడు ప్రచారం

    బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి

Orissa

  • ఎస్‌ట
    బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025
    దుకాణాలపై..
    శ్రమదానంతో కర్ర వంతెన ఏర్పాటు

    భువనేశ్వర్‌:

    ళాశాలలు తదితర విద్యా సంస్థల సమీపంలోని దుకాణాల్లో రహస్యంగా మాదక ద్రవ్యాల విక్రయాలు జోరందుకుంటున్నట్లు సమాచారం అందడంతో ఒడిశా పోలీసుల ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ (ఎస్‌టీఎఫ్‌ ) ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. మంగళవారం నగర వ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థల పరిసర ప్రాంతాల్లో సందిగ్ధ దుకాణాలపై దాడులు నిర్వహించింది. దాడుల్లో భాగంగా దుకాణంలో విక్రయం అవుతున్న సామగ్రి తనిఖీ చేసింది. తనిఖీల్లో పలు సందిగ్ధ మాదక ద్రవ్యాల్ని గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని తదుపరి పరీక్షల కోసం సన్నాహాలు చేపట్టారు. విద్యార్థులకు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్న దుకాణాలను లక్ష్యంగా చేసుకుని, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి ఆకస్మిక దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. విద్యా సంస్థల సమీపంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల ముప్పును అరికట్టడానికి కీలక ప్రాంతాలలో ఆకస్మిక దాడులు ప్రారంభించినట్లు వివరించారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సహా ప్రముఖ విద్యా సంస్థలకు నిలయంగా ప్రసిద్ధి చెందిన పటియా, ఖండగిరి ప్రాంతాల్లో నగర కమిషనరేటు పోలీసులు, ఎస్‌టీఎఫ్‌ బృందాలు సమన్వయంతో దాడులు నిర్వహించాయి. విద్యార్థులు, యువతకు నిషేధిత పదార్థాలను విక్రయిస్తున్నట్లు అనుమానిస్తూ కళాశాల క్యాంపస్‌ల సమీపంలో ఉన్న చిన్న దుకాణాలు, కియోస్క్‌లను గురి పెట్టి ప్రత్యేకంగా ఈ దాడులు చేపట్టడం విశేషం. విద్యార్థులు ఎక్కువగా ఉండే క్యాంపస్‌ తదితర ప్రాంతాల్లో చుట్టుపక్కల బ్రౌన్‌ షుగర్‌, గంజాయి (గంజాయి) వంటి మాదక ద్రవ్యాల అమ్మకాలకు సంబంధించి విశ్వసనీయ రహస్య సమాచారం ఆధారంగా ఈ చర్యకు ప్రత్యేక టాస్క్‌ఫోర్సు నడుం బిగించింది. రహస్యంగా మాదకద్రవ్యాల విక్రయం యువకులను వ్యసనానికి ప్రేరేపిస్తుందనే ఆరోపణలు బలం పుంజుకున్నాయి. ఈ ప్రభావాన్ని ఆదిలోనే అణగదొక్కాలనే దృఢ సంకల్పంతో దాడులు, తనిఖీలు కొనసాగిస్తున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. దాడుల సమయంలో అనేక దుకాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పలు సందిగ్ధ మాదక ద్రవ్యాల్ని స్వాధీనపరచుకున్నారు. వాటిని ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం నమూనాలను సిఫారసు చేశారు. నగరంలో విద్యా సంస్థల పరిసర దుకాణాల్లో రహస్యంగా మాదక ద్రవ్యాల విక్రయాల కట్టడికి క్రైం శాఖ లోగడ దాడులు నిర్వహించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పునరుద్ఘాటించారు.

    న్యూస్‌రీల్‌

  • రాయగడ
    ● విక్రయ స్టాళ్లు ఏర్పాటు

    రాయగడ: ఒడిశా రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మార్కెటింగ్‌ సొసైటీ (ఒర్మాస్‌), జిల్లా యంత్రాంగం సంయుక్తంగా స్థానిక కొత్తబస్టాండు సమీపంలోని ట్రైబల్‌ వరల్డ్‌ వద్ద రాఖీ ఉత్సవాలను ఏర్పాటు చేసింది. జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వాహక అధికారి అక్షయ్‌ కుమార్‌ ఖెముండొ ముఖ్యఅతిథిగా హాజరై మంగళవారం ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు రూపొందించిన ఈ రాఖీలను ఖరీదు చేయాలని పిలుపునిచ్చారు. వీటి అమ్మకాలతో వారికి మనం ఆర్థికంగా ఆసరా కల్పించినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. వెదురు వంటి సహజ సిద్ధమైన ముడిసరుకును వినియోగించి అతి సుందరంగా తయారు చేసిన రాఖీలు ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయని అన్నారు. ఓర్మాస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ జి.లక్ష్మణరావు మాట్లాడుతూ.. స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలను ప్రొత్సాహించాలన్న ముఖ్యఉద్దేశంతో రాఖీ ఫెస్టివల్‌ పేరిట విక్రయ కేంద్రాన్ని నిర్వహించామని అన్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ వరకు విక్రయ కేంద్రం కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలొ సబ్‌ కలెక్టర్‌ రమేష్‌ కుమార్‌ జెన్న, తహసీల్దార్‌ ప్రియదర్శిని స్వయి, ప్రజా సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ బసంత కుమార్‌ ప్రధాన్‌ పాల్గొన్నారు.

  • భారీగా విదేశీ మద్యం  పట్టివేత

    మల్కన్‌గిరి: జిల్లాలోని పోడియా సమితిలో పోడియా పోలీసులు సోమవారం పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో ఒక బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 165 లీటర్ల విదేశీ మద్యాన్ని పట్టుకున్నారు. దీంతో రవాణా చేస్తున్న ధర్మేంద్ర కుమార్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆయనను విచారించగా కలిమెల సమితి ఉండ్రుకొండ గ్రామంలో ఈ మద్యం అమ్మకానికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయనను కోర్టుకు తరలించినట్లు పోడియా ఐఐసీ నిరోద్‌ కుమార్‌ బాగ్‌ తెలియజేశారు.

    భక్తిశ్రద్ధలతో ఏకాదశి పూజలు

    రాయగడ: శ్రావణమాసం పవిత్ర దినాల్లో భాగంగా మంగళవారం స్థానిక బాలాజీ నగర్‌లోని కళ్యాణ వేంకటేశ్వర ఆలయంలో పుత్రదా ఏకాదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రాంజీ ఆచార్యుల ఆధ్వర్యంలో స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, అభిషేకం, పుష్పార్చన పూజలు చేశారు. అనంతరం శ్రీరమా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. పూజల్లో అధికసంఖ్యలో మహిళలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

    అగ్ని ప్రమాదంలో ఇల్లు

    దగ్ధం

    జయపురం: జయపురం పట్టణంలోగల హైదరాబాద్‌ లైన్‌లో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల విలువైన ఆస్తి కాలిబూడిదైంది. హైదరాబాద్‌ లైన్‌లో సయ్యద్‌ మహమ్మద్‌ ఇంటిలో ఎలక్ట్రికల్‌ సామాన్లు ఇతర వస్తువులు అగ్ని ప్రమాదంలో కాలి పోయాయి. అగ్ని ప్రమాదం మంటలు చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక విభాగానికి తెలియ జేసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదంలో కాలిపోయిన వస్తువుల విలువ దాదాపు రూ.4 లక్షలు ఉంటుందని ఇంటి యజమాని వెల్లడించారు. అగ్నిమాపక విభాగ ఏఎస్‌సీ బారిక్‌ అగ్నిమాపక సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. విషయం తెలిసి మహమ్మద్‌ కుటుంబం ఇంటికి చేరుకున్నారు.

    చోరీ కేసులో ఐదుగురికి జైలు శిక్ష

    రాయగడ: ఒక చోరీ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులకు జిల్లా అదనపు జడ్జి వర్షా దాస్‌ మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు. అదేవిధంగా ఒక్కొక్కరూ రూ.10 వేల జరిమానా చెల్లించాలని పేర్కొన్నారు. జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో 7 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. శిక్ష పడినవారిలో అశ్రఫుల్‌ షేక్‌, మహ్మద్‌ రాని శేఖ్‌, మహ్మద్‌ అలిమిన్‌, శేఖ్‌ బాబు, సమీర్‌ శేఖ్‌లు ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఏడాది మే 13వ తేదీన స్థానిక డీఎఫ్‌వో కార్యాలయం సమీపంలోని మూడోలైన్‌లో నివసిస్తున్న బసంత కుమార్‌ స్వయి అనే వ్యక్తి తన ఇంటికి తాళం వేసుకుని కుటుంబంతో తమ సొంత గ్రామానికి వెళ్లాడు. ఈ క్రమంలో మే 17వ తేదీన గుర్తు తెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లోని రూ.60 వేల నగదు, బంగారు ఆభరణాలు దొంగిలించుకు వెళ్లినట్లు మే 18వ తేదీన బాధితుడు బసంత కుమార్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. దీనికి సంబంధించి సోమవారం 11 మంది సాక్షులను విచారించిన న్యాయస్థాఽనం ఈ మేరకు నిందితులకు జైలు శిక్షను విధించింది.

  • శ్రీ మందిరం ప్రవేశానికి విఫలయత్నం

    భువనేశ్వర్‌: ప్రపంచ ప్రఖ్యాత పూరీ శ్రీ జగన్నాథుని దేవస్థానం లోపలి ప్రాకారంలో దృశ్యాల చిత్రీకరణ పూర్తిగా నిషేధం. ఇటీవల కాలంలో ఈ నిషేధ ఆంక్షల్ని అధిగమించి అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో పవిత్ర శ్రీ మందిరం లోపలి దృశ్యాల్ని చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంగళ వారం పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిపుల్‌ పాల్‌ అనే భక్తుడు రహస్య కెమెరా అమర్చిన కళ్ల జోడుతో ప్రవేశించి శ్రీ మందిరం లోపలి దృశ్యాలు చిత్రీకరించబోయి పట్టుబడ్డాడు. గత 8 రోజుల స్వల్ప వ్యవధిలో ఇలాంటి సంఘటన వరుసగా ఇది మూడోది కావడంతో శ్రీ మందిరం భద్రతా వ్యవస్థ నిర్వాహక వర్గాలు కలవరపడుతున్నాయి. తాజా సంఘటనలో శ్రీ మందిరం పశ్చిమ ద్వారం ప్రాంగణంలో భక్తుని సందిగ్ధ కదలికలపై సందేహించిన ఆలయ పోలీసులు అదుపులోకి తీసుకుని పరిశీలించారు. పరిశీలనలో సందేహం ధ్రువీకరించి సింహ ద్వారం ఠాణా పోలీసులకు నిందితుడిని అప్పగించారు. అతడికి వ్యతిరేకంగా కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సింహ ద్వారం ఠాణా పోలీసు వర్గాలు తెలిపాయి.

    ఆలయ భద్రత కోసం ప్రత్యేక ఎస్‌ఓపీ జారీ: ఎస్పీ

    శ్రీ మందిరం లోపలి దృశ్యాల అక్రమ చిత్రీకరణ కట్టడికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ పినాక్‌ మిశ్రా తెలిపారు. ప్రధానంగా ఇటీవల కాలంలో రహస్య కెమెరా అమరికతో కళ్లజోడు ధరించి లోనికి ప్రవేశించి అలజడి రేపుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ చర్యల కట్టడికి త్వరలో నిర్ధారిత కార్యాచరణ విధానం ఎస్‌ఓపీ జారీ చేయనున్నట్లు ఎస్పీ వివరించారు. రహస్య కెమెరా కళ్లజోడు వ్యవహారం గుర్తించడంలో భద్రతా సిబ్బందికి ప్రత్యేక తర్ఫీదు కల్పిస్తారు. అవసరమైతే, మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కొంత మంది యూట్యూబర్లు డబ్బు సంపాదించడం కోసం ఇలా చేస్తున్నారు. దీనిని నివారించడానికి ఒక చట్టం తీసుకురావాలని శ్రీ మందిరం పాలక మండలితో చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు.

  • వ్యాప

    రాయగడ : ఒక వ్యాపారిని అత్యంత దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని స్థానిక హలువ తోట సమీపంలో గల శ్మశానంలో పూడ్చివేసిన ఘటనకు సంబంధించి కొరాపుట్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం నాడు దుండగుడిని తీసుకువచ్చి పూడ్చి వేసిన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే.. కొరాపుట్‌ జిల్లాలొని నందపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గల మెడిపూట్‌ గ్రామానికి చెందిన సొమనాథ్‌ జాని (34) అనే పనసకాయల వ్యాపారిని హత్య చేసిన అనంతరం ఆ మృతదేహాన్ని దుండగులు రాయగడ సమీపంలో గల హలువా తోటకు దగ్గరలొ గల శ్మశానంలో పూడ్చి వేశారు. గత మూడు నెలలుగా వ్యాపారం కోసం వెళ్లిన సోమనాథ్‌ కనిపించడం లేదని కొరాపుట్‌ జిల్లా నందపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సొమనాథ్‌ హత్యకు గురయ్యాడని తెలుసుకుని అందుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో వారిని దర్యాప్తు చేయగా విషయం బయట పడింది. తామే వ్యాపారి సోమనాథ్‌ను హత్యచేసి మృతదేహాన్ని రాయగడకు తీసుకువెళ్లి పూడ్చి వేశామని నిందితులు పోలీసుల వద్ద అంగీకరించారు. ఈ మేరకు నిందితుల్లో ఒకరిని నందపూర్‌ పోలీసులు మంగళవారం నాడు రాయగడ తీసుకువచ్చి మృతదేహాన్ని పూడ్చివేసిన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.

  • ● తీరిన నదీ కష్టాలు

    రాయగడ: నది మీదుగా తమ గ్రామానికి వెళ్లేందుకు వీలుగా గ్రామస్తులు శ్రమదానంతో కర్ర వంతెనను నిర్మించుకున్నారు. ఎవరో వస్తారని ఎదురు చూడకుండా తమ రాకపోకలకు మార్గం సుగమమం చేసుకున్నారు. జిల్లాలోని కాసీపూర్‌ సమితి గొడిబాల్లి పంచాయతీ పరిధిలోని పనసగుడ గ్రామానికి చేరాలంటే మధ్యలో ఉన్న నదిని దాటుకుంటూ వెళ్లాల్సిందే. వర్షాకాలంలో వరద ప్రభావంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు వంతెనను నిర్మించాలని అధికారులకు అనేకసార్లు విజ్ఞప్తి చేసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో గ్రామస్తులంతా ఏకమై సమీపంలోని అడవుల నుంచి కర్ర దుంగలను సమీకరించారు. వీటితో సుమారు పది అడుగుల దూరం వరకు నదిపై వంతెనను నిర్మించుకుని రాకపొకలకు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ గ్రామం మీదుగా మరో అయిదు గ్రామాలకు చెందిన ప్రజలకు రాకపోకలకు అవకాశం వచ్చింది.

  • పాముకాటుతో యువకుడికి అస్వస్థత

    ాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్‌ సమితి సెరిగుమ్మ పంచాయతీ పర్లాపాయి గ్రామానికి చెందిన కార్తీ పిడిసిక అనే యువకుడు పాముకాటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. పర్లాపాయి గ్రామానికి చెందిన కార్తీ పిడిసిక తమ పొలంలో కాపుకాసిన మొక్కజొన్న పొత్తులను సేకరించేందుకు వెళ్లాడు. మొక్కజొన్న పొత్తులు ఏరుతున్న సమయంలో ఒక పాము అతని కాలిపై కాటు వేయడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. పొలంలోకి వెళ్లిన కార్తీ ఇంటికి రాలేదని తండ్రి వెళ్లి చూడగా ఆపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీంతో గ్రామస్తుల సాయంతో ఇంటికి తీసుకొచ్చి నాటువైద్యం చేయించాడు. అయితే నాటువైద్యం వల్ల ఎటువంటి ఫలితం దక్కకపోవడంతో వెంటనే అతనిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్సావస్థలో ఉన్న కార్తీ ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు చెబుతున్నారు.

  • రాష్ట

    పర్లాకిమిడి: రాష్ట్ర స్థాయి అస్మితా తైక్వాండ్‌ లీగ్‌ పోటీలు భఽఽద్రక్‌ జిల్లాకేంద్రంలోని బిజూ పట్నాయక్‌ మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియంలో ఈ నెల రెండు, మూడు తేదీల్లో జరిగాయి. వాటిలో ఒడిశా నుంచి 250 మంది బాలికలు పాల్గొనగా.. గజపతి జిల్లా తైక్వాండో అకాడమి నుంచి నలుగురు మహిళా క్రీడాకారులు హాజరయ్యారు. వాటిలో ముఖ్యంగా రెండు విభాగాలలో పోటీ జరిగింది. ఈ పోటీలు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగ్గా ఖేలో ఇండియా నిర్వహించింది. వీటిలో పర్లాకిమిడికి చెందిన బర్షితా దాస్‌ స్వర్ణం, కాంస్య పతకాలు సాధించగా, పి.సాయిస్మితా వెండి, అనుష్కా అనహితా సాహు వెండి పతకాలు సాధించారు. ముగ్గురు పర్లాకిమిడి నుంచివిజేతలుగా నిలిచినందుకు జిల్లా తైక్వాండ్‌ అకాడమి కోచ్‌ కార్తీక్‌ మహాపాత్రో అభినందనలు తెలియజేశారు. గజపతి జిల్లా తైక్వాండో అకాడమి గౌరవ అధ్యక్షులు కోడూరు నారాయణరావు విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

  • విద్యార్థులకు కంటిఅద్దాల పంపిణీ

    జయపురం: జయపురం పట్టణం, సమితి ప్రాంతాలలోని వివిధ ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. స్థానిక బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ అధికారి కార్యాలయంలో విద్యా విభాగ సాధన కేంద్రంలో నేత్ర పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా 101 మంది విద్యార్థులకు కంటిఅద్దాలను సమకూర్చారు. కార్యక్రమంలో సమితి విద్యాధికారి కె.గోపాలరావు, సమితి అధికారి సోమనాథ్‌ గదబ, సమితి రిసేర్చ్‌ పర్సన్‌ డాక్టర్‌ సుభద్రా పాత్రో, ఎస్‌.గణేష్‌ ప్రసాద్‌ చౌధురి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

  • ఒడిశా

    భువనేశ్వర్‌: శోభన మహంతి రాష్ట్ర మహిళా కమిషన్‌ కొత్త చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నియామకం మొదలుకొని ఆమె మూడేళ్ల పాటు నిరవధికంగా ఈ హోదాలో కొనసాగుతారు. శోభన మహంతి బాలాసోర్‌ జిల్లా రెముణ ప్రాంతానికి చెందిన వారు. మరో నలుగురిని మహిళా కమిషన్‌ సభ్యులుగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రతిభ శత్పతి, ఊర్మిళ మహాపాత్రో, కల్పనా మల్లిక్‌, ముక్తా సాహు మహిళా కమిషన్‌ సభ్యులుగా నియమితులైనట్లు పేర్కొన్నారు.

    అరాచక పాలన..

    మరో ఉదాహరణ

    టీడీపీ వేధింపులకు గురై మహిళ ఆత్మహత్యాయత్నం

    డీలర్‌షిప్‌ రద్దు చేసి వేరొకరికి కట్టబెట్టడంతో మనస్తాపం

    బతుకు తెరువు లేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం

    శ్రీకాకుళం పాతబస్టాండ్‌: కూటమి అరాచక పాలనకు మరో ఉదాహరణ తారసపడింది. ఆమదాలవలస నియోజకవర్గంలో ఈ అరాచకం పరాకాష్టకు చేరింది. అసలే ఇసుక మాఫియా, భూ దందాలతో ఈ నియోజకవర్గం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దీనికి వేధింపులు తోడవుతున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా లేని వారు మనుషులే కాదన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఏ పార్టీకి సంబంధం లేకపోయినా వారి జీవన హక్కును కూడా కాలరాస్తున్నారు. కూటమి పాలకుల కుట్రకు ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. పదేళ్లుగా ఆమె నిత్యావసర సరుకుల డీలర్‌షిప్‌ నిర్వహిస్తుంటే.. కేవలం తమ అనుకూలురుకు ఇచ్చేందుకు ఆమె డీలర్‌షిప్‌ను రద్దు చేశారు. దీనిపై ఆమె కోర్టుకు వెళితే కేసు ఉంటుండగానే మరొకరికి ఆ డీలర్‌షిప్‌ ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమదాలవలస మండలం మునగవలస గ్రామానికి చెందిన మునగవలస ధనలక్ష్మి మంగళవారం కలెక్టరేట్‌ వద్ద కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ కార్యాలయానికి వస్తున్న సమయంలో విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. వివరాల్లోకి వెళితే..

    ఆమదాలవలస మండలం మునగవలస గ్రామానికి చెందిన మునగవలస శారదాంబ ఊరిలో రేషన్‌ డీలర్‌షిప్‌ నిర్వహించేవారు. ఆమె గతంలో చట్టపరంగా ఒక బాలికను దత్తత తీసుకున్నారు. ఆమెనే వారసురాలిగా ప్రకటించారు. శారదాంబ నిర్వహించే ఎఫ్‌పీ షాపు నిర్వహణ కూడా తన వారసురాలు ధనలక్ష్మికి అప్పగించారు. గత ప్రభుత్వం హయాంలో ఎలాంటి సమస్య లేకుండా ఆమె పనిచేసుకున్నారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. దీంతో కొందరు గ్రామస్తులు షాపును డ్వాక్రా సంఘాలకు అప్పగించారు. అయినా డ్వాక్రా గ్రూపు లీడర్‌గా ధనలక్ష్మి ఆ షాపును నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఆమె డీలర్‌ షిప్‌ను రద్దు చేసి వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగించేందుకు టీడీపీ వర్గీయులు ప్రయత్నాలు ప్రారంభించారు. టీడీపీ కుట్రలు తెలుసుకున్న ధనలక్ష్మి తన డీలర్‌ షిప్‌ను నిలబెట్టుకునేందుకు హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో కోర్టులోనే ఉన్నా టీడీపీ నాయకులు వెరవకుండా వేరొకరికి డీలర్‌షిప్‌ కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. న్యాయస్థానంలో ధనలక్ష్మికి వ్యతిరేకంగా అఫిడవిట్‌ కూడా దాఖలు చేశారు. విషయం తెలుసుకున్న ధనలక్ష్మి తనకు ఉపాధి పోతుందన్న భయంతో మంగళవారం ఉదయం సుమారుగా 11 గంటల సమయంలో కలెక్టరేట్‌ వద్ద విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. వెంటనే అక్కడున్న వారు ఆమెను పొన్నాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తర్వాత కలెక్టర్‌ ఆదేశాల మేరకు రిమ్స్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ధనలక్ష్మి రిమ్స్‌లో అత్యవసర విభాగంలో వైద్య సేవలు పొందుతోంది.

    ‘ఆదికర్మయోగి’పై శిక్షణ

    శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేసే అధికారులకు ఆది కర్మ యోగి శిక్షణ ద్వారా పరిపాలనలో సమర్థత పెరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం, గ్రామ స్థాయిలో శాశ్వత మార్పులకు దోహదపడుతుందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులకు ఆది కర్మ యోగి–రెస్పాన్సివ్‌ గవర్నెన్‌న్స్‌ ప్రోగ్రాంపై ప్రాథమిక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూం గిరిజన ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థంగా చేరాలంటే, అధికారులు వారి జీవన పరిస్థితులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఇది ఒక వినూత్నమైన ప్రజా భాగస్వామ్య కార్యక్రమమని గ్రామాల్లో యువత, మహిళలు, వలంటీర్లను శిక్షణతో నైపుణ్యం కలిగించి, స్థానిక సేవలలో మార్పునకు మార్గం వేయాలన్నదే లక్ష్యమని చెప్పారు.

  • స్వాతంత్య్ర వేడుకలకు సన్నాహాలు

    డ్‌ వరకు దారి పొడవునా ప్రత్యేక అలంకరణతో సౌందర్య ఆకర్షణను పెంచాలని శర్మ సూచించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన సంస్థలు విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు. రాష్ట్రం అంతటా జిల్లా మరియు సబ్‌–డివిజన్‌ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో ఉత్తమ బృందాలు, ప్రదర్శన వర్గాలకు అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా సమాచారం, ప్రజా సంబంధాలు విభాగం ప్రచురించిన ఉత్కళ్‌ ప్రసంగ్‌, ఒడిశా రివ్యూ (ఆంగ్లం) ప్రత్యేక సంచికలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ఆహ్వాన పత్రికల ముద్రణ, పంపిణీని వ్యవహారం రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాలు విభాగం పర్యవేక్షిస్తుంది.

    ఈ సమావేశంలో డివిజనల్‌ డైరెక్టర్‌ అనుజ్‌ కుమార్‌ దాస్‌ పట్నాయక్‌, అదనపు కార్యదర్శి బిష్ణుప్రియ సాహు, డిప్యూటీ డైరెక్టర్‌ (రీజియన్‌) సుచేతా ప్రియదర్శిని, ఆర్థిక సలహాదారు పృథ్వి రాజ్‌ పాణి తదితర సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

    భువనేశ్వర్‌: రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి హేమంత్‌ శర్మ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో ఆగస్టు 15న జరగనున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఏర్పాట్లు ఖరారు చేశారు. ఈ సంవత్సరం, ముఖ్యమంత్రి మోహన్‌ చరణ్‌ మాఝీ రాష్ట్ర స్థాయి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. స్థానిక మహాత్మా గాంధీ మార్గ్‌లో జరిగే కవాతులో ఆయన జాతీయ పతాకం ఆవిష్కరిస్తారు. ఈ నెల 11 నుంచి 13 వరకు పరేడ్‌ ప్రదర్శన సాధన చేస్తారు. ఆగస్టు 15న జరిగే ప్రధాన కార్యక్రమంలో ఉదయం బిగుల్‌ కాల్‌, ఉత్సవ రామ్‌ధున్‌, టీవీ మరియు సోషల్‌ మీడియా చానెళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసార కవరేజ్‌ ఉంటాయి. రాజ్‌ భవన్‌ నుంచి పరేడ్‌ గ్రౌం

  • పంటల సాగుపై దృష్టిసారించాలి

    రాయగడ: జిల్లా కలెక్టర్‌ కార్యాలయం సద్భావనా సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి అధ్యక్షతన జిల్లాస్థాయి వ్యవసాయ ప్రణాళిక సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఏ పంటలపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు, రైతులకు ఎటువంటి వాణిజ్య పంటలు వారికి మేలు చేకూరుస్తాయి తదితర అంశాలపై సంబంధిత శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాగునీటి వనరులు, విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంటున్నాయా..లేదా అని ఆరా తీశారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడంతోపాటు వాటిని సంరక్షించడంపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. నూనెగింజలు, వాణిజ్య పంటల్లో భాగంగా పత్తి, తృణధాన్యాల సాగును విస్తృతపరచాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులకు అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. సేంద్రియ ఎరువల వినియోగంతో కలిగే లాభాల గురించి తెలియజేయాలని సూచించారు. దీని ద్వారా సాగుభూములు సారవంతాన్ని కోల్పోవన్న విషయం రైతులకు పూర్తిగా అవగాహన కలిగేలా సంబంధిత శాఖ అధికారులు శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. రైతులకు ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా పథకం ద్వారా కలిగే ప్రయోజనాలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 43,201 హెక్టార్లలో వివిధ పంటలను పండించేందుకు ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో లక్ష్యంగా పెట్టుకున్నట్టు వ్యవసాయశాఖాధికారులు వివరించారు.

    కలెక్టర్‌ అశుతోష్‌ కులకర్ణి

  • రెవెన

    భువనేశ్వర్‌: సుపరిపాలన చర్యల్లో భాగంగా సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్‌ హాజరు నమోదు వ్యవస్థని ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఈ దిశలో రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం తొలి అడుగు వేయడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యు కార్యాలయాల్లో సిబ్బంది సకాలంలో విధులకు హాజరు విషయం పరిశీలనకు అనుకూలంగా బయోమెట్రిక్‌ వ్యవస్థని అమలు చేయాలని విభాగం అదనపు ప్రధాన కార్యదర్శి దిగంత రౌత్రాయ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు లేఖలు రాశారు. ఈ మేరకు సత్వర చర్యలు చేపట్టి బయోమెట్రిక్‌ వ్యవస్థ ఏర్పాటు సమగ్ర వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. గత నెల 21వ తేదీన రాష్ట్ర రెవెన్యు, విపత్తు నిర్వహణ విభాగం మంత్రి కటక్‌ ప్రాంతంలో విభాగం ప్రభుత్వ కార్యాలయం సందర్శించారు. ఈ సందర్భంగా అత్యధిక సిబ్బంది, అధికారులు గైర్హాజరుని మంత్రి గుర్తించారు. ఆరా తీయగా ఆలస్యంగా విధులకు హాజరు అవుతున్నట్లు తేలింది. దీంతో మంత్రి బయోమెట్రిక్‌ హాజరు నమోదు వ్యవస్థ అమలు కోసం ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన వాస్తవ కార్యాచరణకు సన్నాహాలు ఊపందుకున్నాయి.

    బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ కొత్త అధ్యక్షురాలిగా బబితా పాత్రో

    భువనేశ్వర్‌: ఒడిశా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఓఎస్‌ సీపీసీఆర్‌) అధ్యక్షురాలిగా బబితా పాత్రోను నియమించినట్లు మంగళ వారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరో ఆరుగురిని ఈ కమిషన్‌ సభ్యులుగా నియమించారు. బబితా పాత్రో బరంపురం సోమనాథ్‌ నగర్‌ మయూర్‌ విహార్‌ నివాసిని. ఆరుగురిని ఒడిశా రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం సభ్యులుగా నియమించారు. వారిలో సుకేషి ఓరం (చంపువా – కెంజొహర్‌), కల్పనా లెంక (బసంతి కాలనీ, రౌర్కెలా), చందనా దాస్‌ (బొడొగొడొ బ్రిట్‌ కాలనీ, భువనేశ్వర్‌), కస్తూరి మిశ్రా (బాపూజీ నగర్‌, భువనేశ్వర్‌), మనస్మిత ఖుంటియా (చొరొంపా, భద్రక్‌), సుజాతా నాయక్‌ (బొమిఖల్‌, భువనేశ్వర్‌) ఉన్నారు.

  • దులీప్‌ ట్రోఫీకి విజయ్‌ ఎంపిక

    శ్రీకాకుళం న్యూకాలనీ: టెక్కలికి చెందిన క్రికెటర్‌ త్రిపురాణ విజయ్‌ మరో మెగా టోర్నీకి ఎంపికయ్యాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే ప్రతిష్టాత్మక దులీప్‌ ట్రోఫీలో మెరవనున్నాడు. ఈ పోటీలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి. జిల్లా నుంచి దులీప్‌ ట్రోఫీకి ఎంపికై న మొట్టమొదటి జిల్లా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. సౌత్‌జోన్‌ జట్టుకు ఆంధ్రా నుంచి ఇద్దరు క్రికెటర్లు ఎంపిక కాగా.. అందులో విశాఖకు చెందిన రిక్కీబుయ్‌ ఒకరు కాగా.. మరొకరు త్రిపురాన విజయ్‌ కావడం గమనార్హం.

    2023–24 సీజన్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ అయిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో 26 వికెట్లు సాధించి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. రంజీ మ్యాచ్‌లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా దులీప్‌ ట్రోఫీకి ఎంపికై నట్లు క్రికెట్‌ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ఎంపికై అందర్నీ ఆశ్చర్యపరిచిన విజయ్‌ తాజాగా ఏపీఎల్‌ నాల్గో సీజన్‌లో రికార్డు స్థాయిలో రూ. 7.55 లక్షలు దక్కించుకున్నాడు. రైటార్మ్‌ ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌, మిడిలార్డర్‌ బ్యాటింగ్‌తోపాటు బెస్ట్‌ ఫీల్డర్‌గా రాణిస్తున్నాడు. విజయ్‌ తల్లిదండ్రులు వెంకటకృష్ణరాజు, లావణ్య టెక్కలిలోని అయ్యప్పనగర్‌ కాలనీలో నివాసం ఉంటారు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. విజయ్‌ ప్రస్తుతం టెక్కలిలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు.

    చాలా సంతోషంగా ఉంది

    దులీప్‌ ట్రోఫీకి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ టోర్నీలో నిలకడగా రాణించి జట్టు విజయాల్లో భాగస్వామ్యం అవుతాను. త్వరలో జరగనున్న ఏపీఎల్‌లో రాణించేందుకు కఠోర సాధన చేస్తున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, కోచ్‌లు, సంఘ పెద్దలకు కృతజ్ఞతలు.

    – త్రిపురాణ విజయ్‌, క్రికెటర్‌

    జిల్లా నుంచి దులీప్‌ ట్రోఫీకి ఎంపికై న మొట్టమొదటి క్రికెటర్‌గా గుర్తింపు

    బీసీసీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌లో జరగనున్న పోటీలు

  • అడవి

    మల్కన్‌గిరి: అడవి పందుల కోసం వేసిన వలలో ఎలుగుబంట్లు చిక్కాయి. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి బురిడిగూడ రిజర్వ్‌ అడవిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అటుగా పెట్రోలింగ్‌ కోసం వెళ్లి అటవీ సిబ్బందికి వలలో చిక్కకొని గాండ్రిస్తున్న తల్లీపిల్ల భల్లూకాలు తారసపడ్డాయి. దీంతో సహాయక చర్యలు ప్రారంభించారు. అటవీశాఖ మాత్తిలి ప్రాంత ఫీల్డ్‌ సిబ్బంది ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందంతో కలిసి వలలో చిక్కుకున ఎలుగుబంట్లను సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే అవి సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయాయి. అటవి జంతువులను వెటాడే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని సిబ్బంది హెచ్చరించారు.

Narayanpet

  • ఫేిషయల్‌ అటెండెన్స్‌ ఉపాధ్యాయులకు అమలు చేయడం శుభపరిణామం. దీంతో మరింత పారదర్శకత పెరుగుతోంది. ఈ విధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా విద్యాశాఖ నిరంతరం పర్యవేక్షించాలి.

    – ఎండీ బాల్‌చేడ్‌, ఉపాధ్యాయుడు, ఎల్లంపల్లి ప్రాథమిక పాఠశాల

    వంద శాతం నమోదుతో అమలు

    యాప్‌లో వందశాతం వివరాలను నమోదు చేసిన వెంటనే ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరును మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ ఫేషియల్‌ రికగ్నేషన్‌ ఎంతో సహకరిస్తుంది. ఎఫ్‌ఆర్‌ఎస్‌ను జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

    – విద్యాసాగర్‌, ఏఎంఓ, నారాయణపేట

  • పీయూలో అధికారుల నియామకం

    మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు అధికారులను నియమిస్తూ వీసీ శ్రీనివాస్‌ ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు లా కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌గా పొలిటికల్‌ సైన్స్‌ సీనియర్‌ అధ్యాపకులు భూమయ్యను నియమించారు. ఇంజనీరింగ్‌ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌గా కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ గౌస్‌ మోయినోద్దీన్‌ను నియమించారు. పీఆర్వోగా సోషల్‌ వర్క్‌ విభాగానికి చెందిన గాలెన్నను నియమించారు. అకాడమిక్‌ ఆడిట్‌ సెల్‌ కోఆర్డినేటర్‌గా రవికుమార్‌ను నియమించారు. తమపై నమ్మకం ఉంచి భాద్యతలను అప్పగించినందుకు అధికారులు వీసీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు, ఆడిట్‌సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, ప్రిన్సిపాళ్లు, కరుణాకర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, రవికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

  • రాయిత

    కోస్గి: వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, మహిళా, చిన్నకారు, సన్నకారు రైతులకు 50 శాతం రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల వ్యవసాయ పనిము ట్లు అందజేస్తుందని, కోస్గి, గుండుమాల్‌, మ ద్దూర్‌, కొత్తపల్లి మండలాల పరిధిలోని ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఏడీఏ రామకృష్ణ ఓ ప్రకటనలో కోరారు. నిబంధనల మేరకు అర్హత ఉన్న రైతులకే ఈ రాయితీ పరికరాలు అందజేస్తున్నామని, ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్‌ కా ర్డు, భూమి పట్టాపాస్‌ బుక్‌, ( కేవలం ట్రాక్టర్‌ పనిముట్లకు దరఖాస్తు చేసే వారు మాత్రం ట్రాక్టర్‌ ఆర్సీ) జిరాక్స్‌లను ఆయా మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓలకు అందజేయాలన్నారు. రాయితీపై బ్యాటరీ స్పేయర్లు, పవర్‌ స్పేయర్లు, రోటో వేటర్స్‌, కల్టీవేటర్లు, కేజీ వీల్స్‌, బండ్‌ ఫార్మర్‌ అందుబాటులో ఉన్నాయన్నారు.

    చట్టాలపై అవగాహన తప్పనిసరి

    నారాయణపేట రూరల్‌: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సురేష్‌ తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని బొమ్మన్‌పాడు ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం చట్టాలు, ర్యాగింగ్‌ ముప్పు నివారణ గూర్చి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాగింగ్‌ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ర్యాగింగ్‌ చేసినా, సహకరించిన వారికి సమాన శిక్ష ఉంటుందని తెలిపారు. సీనియర్‌ విద్యార్థులు కొత్తగా వచ్చిన విద్యార్థులకు మనస్థాపం కలిగించే రీతిలో ప్రవర్తించరాదని, బాల్య వివాహాలు, మానసికంగా, శారీరకంగా మాటలతో హింసించడం, విద్యార్థిని, విద్యార్థులను ప్రేమ పేరుతో వేధించడం, అవమాన పర్చడం వంటివి నేరంగా పరిగణించి ఆరునెలల జైలు శిక్షతో రూ.వేయి జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. టోల్‌ ఫ్రీ హెల్ప్‌లైన్‌ 18001805522 కి సంప్రదించాలని తెలిపారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, రూ.మూడు లక్షల లోపు ఆదాయం కలిగిన బీసీలకు ఉచిత న్యాయ సేవలు అందుతాయన్నారు. న్యాయ సలహాల కోసం 15100 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యను చెప్తే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మీపతిగౌడ్‌, పంచాయతీ కా ర్యదర్శి వేణుగోపాల్‌, అనిల్‌, కుర్మన్న, మల్లికా ర్జున్‌, కృష్ణవేణి, చంద్రకళ, ఉపాధ్యాయులు, పోలీస్‌ అధికారులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

    పేట వాసులకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డు

    నారాయణపేట రూరల్‌: చేనేత రంగంలో అందించే కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డులు ఈ ఏడాదికి గాను నారాయణపేట జిల్లావాసులను వరించాయి. సాంప్రదాయ కాటన్‌ చీరల నేత విభాగంలో మండలంలోని చిన్నజట్రం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు జన్ను ఆంజనేయులు, పట్టు శాలువా డిజైనర్‌ విభాగంలో మండలంలోని కోటకొండకు చెందిన యంగల్‌ ఆంజనేయులు అవార్డు దక్కించుకున్నాడు. అదే గ్రామానికి చెందిన మాస్టర్‌ వీవర్‌ రఘురాములు పట్టు వస్త్రంపై 33 జిల్లాలతో కూడిన తెలంగాణ పటానికి ఎడమ వైపు సీఎం రేవంత్రెడ్డి చిత్రం, కుడి వైపు ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించి మగ్గంపై నేసినందుకు అవార్డు పొందినాడు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి లో అందించే ఈ అవార్డు కింద ఒక్కొక్కరికి రూ. 25వేల నగదు బహుమతిని అందిస్తారు. ఈ నెల 7న హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డు పీపుల్‌ ప్లాజాలో జరిగే జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో అవార్డులు అందించనున్నారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్‌ బి.శ్రీనివాస్‌రెడ్డి వారిని ఆహ్వానిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

    పెసర క్వింటాల్‌కు రూ.8,419

    నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం పెసర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.8,419, కనిష్టంగా రూ.5,909 పలికింది. వ్యాపారస్తులు పోటీ పడి మార్కెట్‌కు వచ్చిన 254 బస్తాల పెసరను కోనుగోలు చేశారు. గిట్టుబాటు ధరలు వస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • ఆస్పత్రి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

    మక్తల్‌/కృష్ణా: పట్టణ కేంద్రంలోని 150 పడకల ఆస్పత్రి, కృష్ణా మండల కేంద్రంలోని ఆస్పత్రి నిర్మాణ పనుల్లో పెంచాలని కలెక్టర్‌ సిక్తాపట్నాయాక్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పనులు ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. నియోజకవర్గ కేంద్రంలోని ఆస్పత్రి నిర్మాణం కోసం రూ.34 కోట్లు, కృష్ణా ఆస్పత్రి కోసం రూ.1.56 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని కాంట్రాక్టర్‌కు సూచించారు. మెడికల్‌ ఆఫీసర్‌, స్టాఫ్‌ గదులు, ఫార్మసీ, ఇమ్యూనైజేషన్‌ గదులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అదే విధంగా కృష్ణా మండలంలోని ముడుమాల్‌ గ్రామంలో జింకల పార్కు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ స్థలాన్ని అటవీ శాఖ అప్పగించారా అని రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. అందుకు కావల్సిన అన్ని రికార్డులను వేగంగా అటవీ అధికారులకు అప్పగించాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ ప్రణయ్‌కుమార్‌, టీజీఎస్‌ఐడీసీ ఈఈ వేణుగోపాల్‌, డీఈ కృష్ణమూర్తి, ఏఈ సాయిమురారి, తహసీల్దార్లు సతీష్‌కుమార్‌, శ్రీనివాస్‌ ఎంపీడీఓ రమేష్‌కుమార్‌, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

    అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వద్దు

    నారాయణపేట రూరల్‌: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. టీజీఎంఎస్‌ఐడీసీ ప్రాజెక్టు పరిధిలో రూ.26 కోట్ల వ్యయంతో మండలంలోని అప్పక్‌పల్లి సమీపంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, జిల్లా ఆస్పత్రి పక్కన కొనసాగుతున్న నర్సింగ్‌ కాలేజీ, రూ.40 కోట్ల నిధులతో చేపట్టనున్న ఎంసీహెచ్‌ (మెటర్నిటీ చైల్డ్‌ హెల్త్‌) సెంటర్‌ పనులను మంగళవారం కలెక్టర్‌ పరిశీలించారు. నర్సింగ్‌ కాలేజీ పరిసరాల్లో సర్వే చేసి, స్థలం కబ్జాకు గురి కాకుండా చూడాలని తహసీల్దార్‌ అమరేంద్రకృష్ణను ఆదేశించారు. మెడికల్‌ కళాశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. ఆస్పత్రికి వచ్చే రోగులను దృష్టిలో ఉంచుకొని బస్సు సౌకర్యం కొనసాగించాలని డిపో మేనేజర్‌ లావణ్యకు సూచించారు. సింగారం క్రాస్‌ రోడ్డులో రూ.8.50 కోట్లతో చేపపడుతున్న హ్యాండ్‌లూమ్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. అదేవిధంగా సెంటర్‌ చుట్టూ ప్రహరీ నిర్మాణం, సీసీ రహదారి నిర్మాణం, టాయిలెట్‌ బ్లాక్‌ పనుల కోసం అదనంగా రూ.4 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంతోష్‌కుమార్‌

    కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

  • భరత్‌

    సుదీర్ఘకాలంగా రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రి రాములు గత పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. తన కుమారుడు భరత్‌ప్రసాద్‌ రాజకీయ భవిష్యత్‌ కోసం పార్టీలో చేరి.. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. రానున్న కాలంలోనూ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న ఆశతో ఉన్నారు. అయితే గులాబీ పార్టీలో గువ్వలలో అంతర్గత పోరులో భాగంగా బీజేపీలో చేరితే.. ఇప్పుడు మళ్లీ గువ్వల రూపంలోనే పోటీ ఎదురవుతోందన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. అచ్చంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే, మంత్రిగా, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా పనిచేసిన రాములు కార్యక్షేత్రంపైనే ఆయన తనయుడు భరత్‌ ఆశలు పెట్టుకున్నారు. బీఆర్‌ఎస్‌లో ఉండగా జెడ్పీ చైర్మన్‌ పదవి, అచ్చంపేట ఎమ్మెల్యే సీటు, నాగర్‌కర్నూల్‌ ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ప్రధానంగా గులాబీ పార్టీలో గువ్వల బాలరాజు ప్రభావంతో తమకు అవకాశాలు దక్కలేదని భరత్‌ప్రసాద్‌ భావించారు. ఈ కారణాలతోనే రాములు సైతం కుమారుడితో కలసి పార్టీని వీడి అనూహ్యంగా బీజేపీలో చేరాల్సి వచ్చింది. ఇప్పుడు గువ్వల సైతం బీజేపీలోనే చేరుతుండటంతో భరత్‌ప్రసాద్‌ భవితవ్యంపై వారి అనుచరులు బెంగ పెట్టుకుంటున్నారు.

  • ‘కాళేశ్వరం’పై కాంగ్రెస్‌వి తప్పుడు ఆరోపణలు

    నారాయణపేట: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్‌ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం మాజీ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరించడాన్ని జిల్లా కేంద్రానికి సమీపంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధులతో కలిసి తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని కాంగ్రెస్‌ భావిస్తే అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఒక్క అనుమ తి తీసుకు రాలేదన్నారు. అక్కడ ప్రాజెక్ట్‌ కడితే మహారాష్ట్ర నుంచి అభ్యంతరం ఉంటుందని తెలిసినా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం పనులు ప్రారంభించిందని ఆరోపించారు. కానీ సీఎం కేసీఆర్‌ కేంద్రం నుంచి 11అనుమతులు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేశారని కొనియాడారు.

    రైతుల నోట్లో మట్టి కొడితే ఖబడ్దార్‌

    జిల్లాలో చేపడుతున్న నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి డీపీఆర్‌ ఎక్కడుందని.. కొడంగల్‌లో ఇచ్చిన విధంగానే నష్ట పరిహారం నారాయణపేట, మక్తల్‌ నియోజవకర్గాలోని రైతులకు ఇవ్వాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన ఉద్యమిస్తామని ఎస్‌ఆర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మక్తల్‌లో మంత్రి, ఎమ్మెల్యే కలిసి సీఎం రేవంత్‌రెడ్డిపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. 95 శాతం పూర్తయిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కాల్వ పనులు ఎందుకు చేపట్టడం లేదన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అశోక్‌గౌడ్‌, గ్రంథాలయ మాజీ చైర్మన్‌ రామకృష్ణ, నాయకులు సుదర్శన్‌రెడ్డి, వేపూరి రాములు, సుధాకర్‌రెడ్డి, విజయ్‌సాగర్‌, కన్నా జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

SPSR Nellore

  • మత్తు

    రెడ్‌బుక్‌ రాజ్యాంగం.. అక్రమ కేసులు, అరెస్ట్‌లు

    కూటమి అధికారంలోకి వచ్చాక పోలీస్‌ వ్యవస్థ పూర్తిగా ప్రతిపక్ష నేతలపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేసే పనిలో నిమగ్నం కావడంతో నేరస్తులు చెలరేగిపోతున్నారు. గంజాయి, మత్తు మాదక ద్రవ్యాలు, మద్యం విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలో నేరస్తులను గుర్తించి, వారిపై నిఘా ఉండడంతోపాటు వారి దినచర్యలను పర్యవేక్షించి కటకటాలపాల్జేయాల్సిన పోలీస్‌ యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, అరెస్ట్‌లు, కస్టడీలు, విచారణలతో కాలక్షేపం చేస్తోంది.

    ● ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో నెల్లూరుకు చెందిన ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించి వారిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఆ ఇద్దరు యువకులు ఎవరిని హత్య చేస్తున్నారో కూడా వారికే తెలియదు. కేవలం రూ.30 వేలిచ్చి హత్య చేసేందుకు కిరాయి ముఠా పిలిపించుకుని దారుణ హత్యలో పాల్గొనేలా చేసింది. వీరు కేవలం గంజాయి మత్తు కోసం ఈ దారుణ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

    ● హైదరాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు కేతావత్‌ చందు రాథోడ్‌ హత్యకు గురయ్యాడు. గత నెల 15న మార్నింగ్‌ వాకింగ్‌కు వెళ్లి ఇంటికి వస్తుండగా కిరాయి హంతకులు కళ్లల్లో కారం కొట్టి తుపాకీతో కాల్చి చంపారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దారుణ హత్యలో నెల్లూరు జిల్లాకు చెందిన అర్జున్‌, రాంబాబు సుపారీ తీసుకుని భాగస్వామ్యం అయ్యారు. అక్కడి పోలీసులు నిందితులను కావలి సమీపంలోని ముసునూరు టోల్‌గేట్‌ వద్ద అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు.

    ● గతంలో హైదరా బాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో జరిగిన రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ వినియోగం సమాచారంపై పోలీసులు దాడులు చేస్తే నెల్లూరుకు చెందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కుమారుడు పట్టుబడ్డాడు. అతనే ఆర్గనైజర్‌గా తేల్చారు. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి కీలక అనుచరుడు కావడంతో రంగంలోకి దిగి కేసు మాఫీ కోసం అష్టకష్టాలు పడ్డారు.

    ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మత్తు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపింది. అక్రమార్కుల బెండు తీసి కటకటాల వెనక్కి నెట్టింది. జిల్లాలో నేరాలు గణనీయంగా తగ్గాయి. ప్రజలు హాయిగా జీవించారు.’

    ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. జిల్లాలో క్రమేపి శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు, బెల్టుషాపులు, మాదక ద్రవ్యాల సరఫరా పెరిగింది. నేరాలు, మారణహోమాలు మితిమీరాయి.’

    సాక్షిప్రతినిధి, నెల్లూరు: జిల్లా కేంద్రం నుంచి మారుమూల ప్రాంతాల వరకు నేరప్రవృత్తి పేట్రేగి పోతోంది. ప్రధానంగా నెల్లూరు నగరంలో నేరమేథం వేళ్లూనుకుంటోంది. గంజాయి, మత్తు ఉత్ప్రేరకాలకు బానిసలైన యువత విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతోంది. వ్యసనాలను తీర్చుకునేందుకు డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఒంటరిగా వెళుతున్న వారిని కత్తులతో బెదిరించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఎదురు తిరిగిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ పరిణామాలతో ఇళ్లు విడిచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంటోంది. జిల్లాలో జరుగుతున్న హత్యలు, హత్యాయత్నాలు, దాడుల్లో అధిక శాతం గంజాయి మత్తులోనే జరుగుతున్నాయని పోలీసుల విచారణలో తేలింది. నెల్లూరు నగరంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు నిత్యకృత్యంగా మారాయి. గంజాయి దొరకని ప్రాంతం లేదు. యువత, విద్యార్థులు లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నారు. తొలుత ఫ్యాషన్‌కు అలవాటు పడిన వారు క్రమేపి బానిసలై మత్తు లేకపోతే బతకలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు.

    శివారు ప్రాంతాల్లోనే గంజాయి విక్రయాలు

    నెల్లూరు నగరంలోని కపాడిపాళెం, పొర్లుకట్ట, భగత్‌సింగ్‌కాలనీ, పాతచెక్‌పోస్టు, ఎన్‌టీఆర్‌నగర్‌, హరనాథపురం ఎక్స్‌టెన్షన్‌ ఏరియా, వెంగళ్‌రావునగర్‌, కొత్తూరు, పుత్తాఎస్టేట్‌, రాజీవ్‌గృహకల్ప సమీపం, విజయమహల్‌గేటు తదితర ప్రాంతాల్లో గంజాయి మత్తులో యువత నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితుల్లో కొందరు పోలీసులకు ఫిర్యాదులు చేస్తుండగా మరి కొందరు భయంతో పోలీసుస్టేషన్ల వరకు వెళ్లడం లేదు. ఇదే అదనుగా భావించిన కొందరు నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు.

    లాఠీ దెబ్బలను మాన్పుతున్న మత్తు ఇంజెక్షన్లు

    చాలా మంది యువకులు గంజాయి ఇచ్చే మత్తు చాలక, కేన్సర్‌ రోగులకు చివరి దశలో ఇచ్చే శక్తి వంతమైన మార్ఫిన్‌, పెథిడిన్‌, ఫోర్ట్విన్‌, ఫినార్గోన్‌ వంటి పెయిన్‌ కిల్లర్‌ ఇంజెక్షన్లు వేసుకొంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. సమాచారం. వీటిని వాడడం వల్ల శరీరం మొత్తం మత్తు ఆవహించి, మొద్దుబారిపోతోంది. ఈ ఇంజెక్షన్‌ వేసుకున్న వారికి నొప్పి కూడా తెలియదంట. పోలీసులు లారీతో చావబాదినా ఈగ వాలినట్లు కూడా ఉండదని, దీంతో పోలీసులు ఎన్నిసార్లు లాఠీలు ఝుళిపించినా.. నిజాలు బయటకు రావడం లేదని తెలుస్తోంది.

    .. అడ్డాగా నెల్లూరు

    కళ్లల్లో మత్తు.. చేతుల్లో కత్తులు, తుపాకీలు.. మాటా మాటకే కత్తులు ఝళిపిస్తున్నాయి. సుపారీలతో తుపాకీలు పేలుతున్నాయి. పాత కక్షలు, ఆస్తి తగాదాలు, మద్యం మత్తులో విభేదాలు నరమేధానికి ప్రేరేపిస్తున్నాయి. చిన్న గొడవలు రక్తపాతాన్ని సృష్టిస్తున్నాయి. రాత్రి పూటే కాదు పగలు కూడా రహదారుల్లో తిరగాలంటే వెన్నులో వణుకు పుడుతోంది. ఎక్కడ కత్తి కరుస్తుందో అనే ఆందోళన కనబడుతోంది. సుపారీ నేరాలు నెల్లూరు నుంచి అంతర్‌ జిల్లాలు, అంతర్రాష్ట్ర స్థాయి వరకు ఎగబాకాయి. ఎక్కడ నేరం జరిగినా.. నేరస్తుల మూలాలు నెల్లూరులోనే చూపిస్తున్నాయి. నేరాలను నియంత్రించాల్సిన పోలీసులు ఈ పనికి స్వస్తి పలికి.. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో ప్రత్యర్థి పార్టీ నేతలపై అక్రమ కేసులు, అరెస్ట్‌ల్లో తలమునకలు అవుతున్నారు. గడిచిన ఏడాది కాలంగా జిల్లాలో జరిగిన మారణహోమం ఇందుకు దర్పణం.

    ఏడాది కాలంలో జిల్లాలో ఘటనలు మచ్చుకు కొన్ని..

    నెల్లూరు ప్రగతినగర్‌లో గంజాయి, మద్యం మత్తులో కొందరు యువకులు కారు డ్రైవర్‌ను అతి కిరాతకంగా హత్య చేశారు.

    ముత్తుకూరు బస్టాండ్‌ వద్ద గంజాయి మత్తులో ఇద్దరు యువకులు ఓ మహిళను చంపుతామని బెదిరించి రెండు సెల్‌ఫోన్లను దోచుకెళ్లారు.

    తల్పగిరికాలనీ వద్ద నాగేంద్రను కత్తులతో చంపుతామని బెదిరించి అతని ఫోన్‌పే నుంచి రూ.5 వేల నగదును దుండగులు ట్రాన్సఫర్‌ చేయించుకున్నారు.

    టిఫిన్‌ విషయంలో మాటామాటా పెరిగి టెంపో ట్రావెల్స్‌ నిర్వాహకుడు అల్లాభక్షును మత్తులో ఉన్న రంగనాయకులపేటకు చెందిన షేక్‌ ఇషాక్‌ హత్య చేశాడు.

    మద్యం మత్తులో మాటామాటా పెరగడంతో సుల్తాన్‌ అనే వ్యక్తిని ఇద్దరు హత్య చేశారు.

    గంజాయి మత్తులో ఉన్న కొందరు నెల్లూరు సుజాతమ్మకాలనీలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి విధ్వంసం సృష్టించారు.

    మత్తులో ఉన్న ముగ్గురు యువకులు రైల్వేస్టేషన్‌ వద్ద బైక్‌పై వెళుతున్న బ్యాంకు ఉద్యోగిని చంపుతామని కత్తులతో బెదిరించి నగదు దోచుకున్నారు.

    ఇటీవల నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి సెంటర్‌లో ఓ యువకుడు హోటల్‌ కెళ్లి టిఫన్‌ ఆర్డర్‌ ఇచ్చాడు. తనకంటే వెనకున్న ఓ వ్యక్తి ఆర్డర్‌ ఇచ్చారు. ముందుగా తాను టిఫిన్‌ ఆర్డర్‌ ఇచ్చినా వెనకొచ్చిన వ్యక్తికి ఇచ్చాడని కారణంతో ఇద్దరు మధ్య జరిగిన చిన్న వివాదంతో దారుణంగా కత్తితో పొడిచి చంపాడు.

    నెల్లూరు రామలింగాపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో రౌడీషీటర్‌ కత్తి రవి (32)ని దారుణంగా హత్య చేసిన నిందితులు.

    ఆర్థిక విభేదాల నేపథ్యంలో ముత్యాలపాళెంలో ఎం.పౌల్‌ (35)ను దారుణంగా హత్య చేసిన నిందితులు.

    కొండాపురం మండలంలో తిరుపాల్‌ (55) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసి 25 మేకలను అపహరించుకెళ్లారు.

    ఉదయగిరిలో జనం చూస్తుండగానే వరుసకు బావను బావమరుదులే హత్య చేశారు. ఆస్తి తగాదాలే కారణం.

    కలువాయి మండలంలోని పల్లంకొండలో గోపి అనే యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు.

    కొడవలూరు మండలం టపాతోపు వద్ద హిజ్రా నాయకురాలు హాసీనిని ప్రత్యర్థులు దారుణంగా చంపారు

    కొడవలూరు మండలం మిక్కిలింపేట వద్ద బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన స్టీల్‌వ్యాపారి రమేష్‌ హత్యకు గురైయ్యాడు.

    నెల్లూరు ఉడ్‌హౌస్‌ సంఘంలో సస్పెక్ట్‌ షీటర్‌ కళ్యాణ్‌ను పాతకక్షల నేపథ్యంలో హత్య చేసిన దుండగులు.

    ఇందిరాగాంధీనగర్‌లో రౌడీషీటర్‌ సుజనకృష్ణ అలియాస్‌ చింటూను స్నేహితులే కిరాతకంగా హత్య చేశారు.

    తాజాగా జాకీర్‌ హుస్సేన్‌నగర్‌ న్యూకాలనీలో మద్యం మత్తులో దూషించాడని భర్త శ్రీనివాసకుమార్‌ను హత్య చేసిన భార్య.

    అంతర్రాష్ట్ర స్థాయిలో

    నేరాల మూలాలు ఇక్కడే

    గంజాయి, మద్యం, మత్తు ఇంజెక్షన్లతో విచక్షణ కోల్పోతున్న యువకులు

    సుపారీ హత్యలకు తెగబడుతున్న యువత

    గంజాయి బ్యాచ్‌కు అధికార పార్టీ నేతల అండదండలు

    హంతకులను వెనకేసుకొస్తుండడంతో పోలీసుల మౌనం

    ఆరు నెలల్లో ఒక్క నెల్లూరులోనే

    20 పైగా హత్యలు

    అక్రమ కేసులు, అరెస్ట్‌లతో

    నేర నియంత్రణను మరిచిన ఖాకీలు

    సింహపురిలో తిరగాలంటే

    భయం.. భయం

    ప్రతి నెలా నార్కోటిక్స్‌ కోఆర్డినేషన్‌ కమిటీ సమన్వయ సమావేశంలో కలెక్టర్‌, ఎస్పీలు అన్ని శాఖల సమన్వయంతో జిల్లాను డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూనే ఉన్నారు. వారి ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికారులు మొక్కుబడి చర్యలకే పరిమితమవుతున్నారు. అడపాదడపా దాడులతో సరిపెట్టుకుంటున్నారు. మత్తు, మాదక ద్రవ్యాల నిర్మూనలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈగల్‌ ఊసే జిల్లాలో లేకుండాపోయింది. అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రజల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నామని, బీట్‌లు పెంచామని, డ్రోన్లతో నిఘా పెట్టామని పోలీసులు చెబుతున్నప్పటికీ ప్రజలకు మాత్రం తగినంత భరోసా దొరకడం లేదు.

  • ఇతర జ

    నెల్లూరు (పొగతోట): రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ఇతర జిల్లాల రైస్‌మిల్లర్లతో ధాన్యాన్ని కొనుగోలు చేయించేలా చర్యలు చేపడుతున్నామని డీఎస్‌ఓ విజయకుమార్‌ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో ప్రకాశం, వైఎస్సార్‌ కడప, తిరుపతి జిల్లాల రైస్‌మిల్లర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరు నుంచి కోతలు ప్రారంభమయ్యే అవకాశమున్న నేపథ్యంలో, జిల్లానే కాకుండా ఇతర జిల్లాల రైస్‌మిల్లర్లతో కొనుగోలు చేయించేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. రైతులు నష్టపోకుండా ప్రభు త్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేయనున్నామని పేర్కొన్నారు. సివిల్‌ సప్లయ్స్‌ డీఎం అర్జున్‌రావు తదితరులు పాల్గొన్నారు.

    వైఎస్సార్‌సీపీకి

    ఓట్లు వేశామని..

    దౌర్జన్యంగా ఆక్రమించి రోడ్డు వేశారు

    నెల్లూరురూరల్‌: గత ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీకి ఓటు వేశామనే అక్కసుతో మా పట్టా పొలంలో టీడీపీ వర్గీయులు అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టారని వెంకటాచలం మండలం తిక్కవరపాడు గ్రామస్తులు తమలపాకుల ఏడుకొండలు, తమలపాకుల వెంకటేశ్వర్లు, తమలపాకుల రామయ్య పేర్కొన్నారు. నగరంలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తిక్కవరపాడులోని సర్వే నంబర్‌ 2120–2, 5, 9ల్లో 7.68 ఎకరాల విస్తీర్ణంలో తమకు వారసత్వంగా 3.48 ఎకరాల వ్యవసాయ భూమి సంక్రమించిందని తెలిపారు. మా పొలానికి చుట్టు పక్కల ఉన్న టీడీపీ నేతలు అధికార, అంగబలంతో ఈ నెల 2, 3 తేదీల్లో శని, ఆదివారాల్లో జేసీబీలు, ట్రాక్టర్లతో అక్రమంగా రోడ్డు నిర్మాణం సాగించారని వాపోయారు. ఆ సమయంలో తాము పొలం దగ్గర ఉండి ఉంటే చంపేసే వాళ్లని ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే, రెవెన్యూ కోర్టు ఆర్డర్లను ధిక్కరించి రోడ్డు నిర్మాణం చేపట్టారని బాధితులు తెలిపారు. కలెక్టర్‌, రెవెన్యూ అధికారులు స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో బాధితులు తమలపాకుల ఏడుకొండలు, వెంకటేశ్వర్లు, రామయ్య, పద్మమ్మ, శ్రీదేవమ్మ తదితరులు పాల్గొన్నారు.

    అంగన్‌వాడీ పోస్టులకు

    దరఖాస్తుల ఆహ్వానం

    నెల్లూరురూరల్‌: జిల్లాలోని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలో 12 ప్రాజెక్ట్‌ల పరిధిలోని 28 అంగన్‌వాడీ కార్యకర్తలు, 168 అంగన్‌వాడీ హెల్పర్లకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ ఆనంద్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5 నుంచి 26వ తేదీ సాయంత్రంలోగా అభ్యర్థులు తమ పరిధిలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, జూలై 2025 నాటికి 21 సంవత్సరాలు నిండి, 35 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. వివాహిత మహిళ అయి ఉండాలని, అవివాహితులు అనర్హులని తెలిపారు. పోస్టుల ఎంపిక ప్రక్రియ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రూల్‌ ఆఫ్‌ రిజిర్వేషన్‌ మేరకు జరుగుతుందన్నారు. ఆయా ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఏ కులం నిర్ణయించబడిందో సదరు కులానికి చెందిన వారే అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్స్‌లోని పోస్టులకు ఆయా సామాజికవర్గాలు మాత్రమే అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్‌లోని పోస్టులకు 10వ తరగతి పాసైన వారు లేని పక్షంలో ఆ తదుపరి తరుగతుల వారు అర్హులన్నారు. ఆయా ఖాళీల వివరాలను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ నోటీసు బోర్డుల్లో ప్రచురించడం జరుగుతుందన్నారు. సీడీపీఓలు పత్రిక ప్రకటనల్లో నోటిఫికేషన్‌ జారీ చేస్తారన్నారు.

    కిలో పొగాకు

    గరిష్ట ధర రూ.280

    కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం కిలో గరిష్ట ధర రూ.280 లభించింది. జనరల్‌ క్లస్టర్‌కు చెందిన రైతులు 331 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకురాగా 212 బేళ్లను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా వేలం నిర్వహణాధికారి శివకుమార్‌ మాట్లాడుతూ కిలో పొగాకు గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.160 పలుకగా, సరాసరి రూ.226.79 లభించిందన్నారు. వేలంలో 19 కంపెనీలు పాల్గొన్నాయని వివరించారు.

  • భూముల

    కలువాయి (సైదాపురం): అధికారమే అండగా కూటమి పార్టీల నేతలు చెలరేగిపోతున్నారు. కంటికి కనిపించిన ఇసుకనూ, మట్టినీ వదల్లేదు. ఇప్పుడు చెరువులు, అటవీ, పోరంబోకు భూములనూ కబ్జా చేస్తున్నారు. తాజాగా కలువాయి మండలం 598 సర్వే నంబర్‌లోని కుల్లూరు ఎర్ర చెరువును ఆనుకుని ఉన్న రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూములను సైతం దాదాపు 20 ఎకరాలను మంగళవారం దర్జాగా కబ్జా చేసి చదును చేశారు. అడిగేవారు ఎవరూ లేకపోవడంతో స్ధానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకుని గ్రామ రెవెన్యూ అధికారి సహకారంతో దర్జాగా ఎర్ర చెరువు పోరంబోకు, రిజర్వ్‌ ఫారెస్టు భూములను చదును చేసి చుట్టూ కంచె కూడా వేశారు. ఈ విషయంపై గ్రామస్తులు పిఱ్యాదు చేయడంతో ఇన్‌చార్జి తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి అక్కడ జరిగే పనులను అడ్డుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఫారెస్ట్‌ అధికారులకు ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఫోన్‌ చేయగా వారు స్విచ్ఛాఫ్‌ చేసుకుని ఉండడం గమనార్హం. దీన్ని బట్టి అటవీ శాఖ అధికారుల హస్తం కూడా గ్రామస్తులు భావిస్తున్నారు. మూడు రోజుల నుంచి ఎవరికీ తెలియకుండా బ్రాహ్మణపల్లి, వెంకటరెడ్డిపల్లి రిజర్వ్‌డ్‌ ఫారెస్ట్‌లో 20 ఎకరాల భూమిని చదువు చేయడాన్ని చూసి రెవెన్యూ అధికారులు అవాక్కయారు. గ్రామ రెవెన్యూ అధికారి గ్రామంలోకి వచ్చినప్పటి నుంచి ఇటీవల కుల్లూరు గ్రామంలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయిని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల ఎర్ర చెరువు అలుగు ప్రాంతాన్ని ఆక్రమిస్తున్న విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాలకు ఆత్మకూరు ఆర్డీఓ పావని స్పందించి పనులు వెంటనే ఆపాలని అప్పటి తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల మళ్లీ కూటమి నాయకులు భూములు చదును చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందరికీ తెలిసే ప్రదేశం కాదు కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా మూడు రోజుల నుంచి పనులు చకచకా చేసేస్తున్నారు. రిజర్వ్‌ ఫారెస్టు చెరువు పోరంబోకు పొలాల్లో ఆక్రమణలు చేపడితే చర్యలు తప్పవని ఇన్‌చార్జి తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు వారిని హెచ్చరించారు.

  • జలాశయానికి కృష్ణా జలాలు

    36 టీఎంసీలు దాటిన సోమశిల

    సోమశిల: జలాశయానికి కృష్ణా జలాల ఇన్‌ఫ్లో క్రమక్రమంగా పెరుగుతోంది. కృష్ణా జలాలు రాక ముందు 28.660 టీఎంసీలు నిల్వ ఉన్నా యి. మంగళవారం నాటికి 36 టీఎంసీలు దాటింది. జలాశయానికి గత నెల 11వ తేదీ నుంచి వరద జలాలు వస్తున్నాయి. మంగళవారం నాటికి 14,105 క్యూసెక్కులకు చేరుకుంది. జలాశయం నుంచి పెన్నార్‌ డెల్టాకు క్రస్ట్‌గేట్ల ద్వారా 1100, పవర్‌ టర్నెల్‌ ద్వారా 2,500, ఉత్తరకాలువకు 370, కండలేరు కాలువకు 6 వేల క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు.

  • జోనల్‌–4 ప్రెసిడెంట్‌గా కాకాణి పూజిత

    నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జోన్ల వారీగా రాష్ట్ర విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్లను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె కాకాణి పూజితను నెల్లూరు, ప్రకాశం, అన్నమ్మయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల(జోన్‌–4)కు వర్కింగ్‌ ప్రెసిడెంగ్‌గా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి, దాదాపు 70 రోజులుగా జిల్లా జైల్లో అక్రమ నిర్బంధంలో ఉంచింది. కాకాణిని అరెస్ట్‌ చేసి సర్వేపల్లిలో వైఎస్సార్‌సీపీని బలహీనపరచాలని కూటమి నేతలు భావించారు. తన తండ్రిని జైల్లో పెట్టిన తర్వాత పార్టీ కేడర్‌కు తానున్నాంటూ భరోసా కల్పిస్తూ పార్టీ నేతలకు అండగా నిలిచారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న పూజిత సేవలను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తిస్తూ పార్టీ జోనల్‌ స్థాయిలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనపై పెట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు.

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీకాలం మరో 3 నెలలు పొడిగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టు అధికార వర్గాల సమాచారం. ఏప్రిల్‌ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణారావు ఈనెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. 

    అయితే ఆయన పదవీకాలం పొడిగించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో మరో మూడు నెలలు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగే అవకాశం ఏర్పడింది. రామకృష్ణారావు పదవీ విరమణ చేస్తే ఆయన స్థానంలో సీఎస్‌గా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేశ్‌రంజన్, వికాస్‌రాజ్‌ పోటీలో ఉన్నా రు. కేంద్ర సరీ్వసులో ఉన్న సంజయ్‌ జాజు రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా లేరని సమాచారం. అలాగే ఢిల్లీలో తెలంగాణ భవన్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశాంక్‌ గోయల్‌కు సీఎస్‌గా అవకాశం లేదని సమాచారం.   

Krishna

  • రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ మంగళవారం గుంటూరు, విజయవాడ డివిజన్‌ల పరిధిలోని పగిడిపల్లి–గుంటూరు–కృష్ణా కెనాల్‌–విజయవాడ సెక్షన్‌లో తనిఖీలు నిర్వహించారు. ముందుగా విజయవాడ, గుంటూరు డివిజన్‌ల డీఆర్‌ఎంలు మోహిత్‌ సోనాకి యా, సుధేష్ణసేన్‌లతో కలసి ఆయా సెక్షన్‌లలో రియర్‌ విండో తనిఖీల ద్వారా ఆ సెక్షన్‌లలోని సిగ్నలింగ్‌ వ్యవస్థ, భద్రత అంశాలు, ట్రాక్‌ల నిర్వహణను పరిశీలించారు. అక్కడ నుంచి నల్గొండ స్టేషన్‌లో వెయిటింగ్‌ హాల్‌, దివ్యాంగుల టాయిలెట్‌లు, లిఫ్ట్‌లు, తాగునీటి సౌకర్యం, ప్రయాణికుల మౌలిక సదుపాయాల ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో జరుగుతున్న స్టేషన్‌ పునరాభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం గుంటూరు డివిజనల్‌ కార్యాలయంలో.. ఆ తర్వాత విజయవాడ డివిజనల్‌ కార్యాలయంలో అధికారులతో సమావేశమై పనితీరుపై చర్చించారు.

    ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య

    కంకిపాడు: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై స్థానిక పోలీసుస్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. ఎస్‌ఐ డి.సందీప్‌ తెలిపిన కథనం మేరకు.. కంకిపాడు పట్టణంలోని రెల్లికాలనీకి చెందిన వడ్డాది లక్ష్మీనారాయణ(22) పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన లక్ష్మీనారాయణ ఈనెల 4వ తేదీన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మంగళవారం ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్‌ తెలిపారు.

  • కానిస్టేబుల్స్‌గా ఎంపికై న హోంగార్డుల పిల్లలకు అభినందన

    లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కానిస్టేబుల్స్‌ ఫలితాల్లో నగరంలో పనిచేస్తున్న హోంగార్డుల పిల్లలు ఎంపికయ్యారు. వారిని మంగళవారం పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖరబాబు, డీసీపీ కేజీవీ సరితలు అభినందనలు తెలిపారు. తొలి ప్రయత్నంలోనే సివిల్‌ కానిస్టేబుల్స్‌గా ఎంపికై న హోంగార్డు వంగూరి చిట్టిబాబు ఇద్దరు కుమార్తెలు రత్నశ్రీ, జయశ్రీలను ప్రత్యేకంగా అభినందించారు. జి. కొండూరు మండలం, బీమావరప్పాడుకు చెందిన వంగూరు చిట్టిబాబు 1991 నుంచి హోంగార్డుగా పనిచేస్తూ ముగ్గురు కుమార్తెలను చదివించాడు. వారిలో ఇద్దరు ఇప్పుడు సివిల్‌ కానిస్టేబుల్స్‌గా ఎంపికవడం పట్ల సీపీ, డీసీపీలు అభినందనలు తెలిపారు. కాగా మరో ఇద్దరు హోంగార్డులు అస్లామ్‌ బేగ్‌ కుమారుడు మొగల్‌ అబ్దుల్‌ అలీం బేగ్‌, రాఘవులు కుమారుడు పూర్ణనాగార్జున కూడా కానిస్టేబుల్‌గా సెలెక్ట్‌ కావడంతో వారికి శుభాకాంక్షలు తెలిపారు.

West Godavari

  • పశ్చిమలో పేకాట దందా

    సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట దందా మూడు షోలు.. ఆరు ఫుల్లులుగా సాగుతోంది. డ్రాప్‌నకు రూ.20 వేలు, మిడిల్‌ డ్రాప్‌నకు రూ.40 వేలు, ఫుల్‌ కౌంట్‌కు రూ.1.60 లక్షలు.. ఇదీ జిల్లా ప్రధాన కేంద్రమైన భీమవరంలో సాగుతున్న ప్రత్యేక పేకాట శిబిరంలోని ప్రధాన గేమ్‌. టీడీపీ నేతలే నిర్వాహకులు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులకు వారం మామూళ్లు ఫిక్స్‌ చేసి ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే పేకాట జాతర మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు నిర్విరామంగా సాగుతోంది. భీమవరం సహా పశ్చిమ గోదావరిలోని ప్రధాన పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాకపోతే నిర్వాహకుల స్థాయిని బట్టి సభ్యులు, ఆట స్థాయి మారుతుంది.

    భీమవరంలో స్పెషల్‌ శిబిరం

    భీమవరంలోని మురుగు కాల్వ గట్టు సమీపంలో ఓ శిబిరం భారీ స్థాయిలో సాగుతోంది. పట్టణంలోని ఓ ప్రముఖ క్లబ్‌లో సభ్యుడిగా ఉన్న వ్యక్తి నిర్వాహకుడుగా మారి ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఆట సాగుతుంది. 11 మంది సభ్యులతో మూడు కట్టలతో కనష్ట బోర్డు.. ఏడుగురితో మరో బోర్డును ఏర్పాటుచేసి గంటకు 7–10 ఆటలు ఆడిస్తున్నారు. ఓకుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిగే బోర్డు అందుబాటులో పెట్టారు. ఓకుకు రూ. 20 వేలు చొప్పున.. ఫుల్‌ కౌంట్‌ పడితే రూ.1.60 లక్షలు చెల్లించే గేమ్‌కు రూ.5 లక్షలు డిపాజిట్‌, మరో రూ.4.80 లక్షలు అంటే మూడు ఫుల్‌గేమ్‌ల మొత్తం వెరసి రూ.9.80 లక్షలు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్‌ మొత్తం కిలోమీటరు దూరంలో ఉండే మరో వ్యక్తి ప్రత్యేకంగా లాకర్లు, ఇతర జాగ్రత్తలతో నగదును సేకరించి టోకెన్లు ఇచ్చి శిబిరానికి పంపుతారు. మరో ప్రత్యేక అంశమేమిటంటే.. సదరు నిర్వాహకుడు సభ్యుడిగా ఉన్న క్లబ్‌లో గెస్ట్‌ల పేరుతో కొందరిని అక్కడి ఆటకు పంపించడం, గెలుపోటములు పూర్తయ్యాక వెళ్లే సమయంలో స్లిప్‌ ద్వారా వసూళ్లు, చెల్లింపులు చేస్తున్నారు. భీమవరంలో పేకాట నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉన్న సదరు వ్యక్తి ఆటకు రూ.4 వేలు చొప్పున నిర్వహణ ఖర్చులు వసూలు చేస్తున్నాడు. రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు శిబిరం నిర్వాహకులకే దక్కుతోంది. వీటిల్లో పోలీసులకు, స్థానిక ప్రజాప్రతినిఽధికి వారం, నెలవారీలు మామూళ్లను ఖరారుచేసి పంపుతూ జోరుగా శిబిరం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సన్నిహితులే చూస్తుండటంతో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణాజిల్లా నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. స్థానిక ఎస్‌ఐ మొదలుకుని ఉన్నతాధికారుల వరకు ఈ విషయం తెలిసినా పొలిటికల్‌ గేమ్‌ పేరుతో పట్టించుకోకపోవడం గమనార్హం. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదుల పెరగడంతో కొద్ది రోజులుగా శిబిరాల్ని నడపడం లేదు. మరో అనువైన ప్రదేశం కోసం వేట సాగుతున్నట్లు సమాచారం

    ఒక్కొక్కచోట ఒక్కోలా

    తణుకు మండలంలో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఒకరోజు పైడిపర్రులో, మరోరోజు తేతలి, ఇంకోరోజు వేల్పూరులో.. ఇలా ప్రతిరోజూ ఒక్కో ప్రాంతంలో పెట్టి ఎప్పుడూ వచ్చే వంద మంది జూదరులకు మెసేజ్‌ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. ఉండి, ఆకివీడు, పాలకొల్లులో ఎంపిక చేసిన రొయ్యల చెరువుల వద్ద నిత్యం పెద్దఎత్తున జూదక్రీడ కొనసాగుతోంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెదతాడేపల్లి, పెంటపాడు, రూరల్‌లో వారానికి రెండు ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతిచోటా ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో పోలీసుల దాడులు, కేసుల ఊసు లేకపోవడం గమనార్హం.

    టీడీపీ నేతల కన్నుసన్నల్లో శిబిరాల నిర్వాహకులు

    భీమవరంలో ఒక్క ఆటకు రూ.1.60 లక్షలు

    జిల్లాలో నిత్యం రూ.5 కోట్లకు పైగా టర్నోవర్‌

    ఉభయ గోదావరి జిల్లాల నుంచి పేకాటరాయుళ్లకు ప్రత్యేక ఆహ్వానాలు

    తణుకులో రోజూ మారుతున్న శిబిరాలు

    పాలకొల్లు, ఉండి, తాడేపల్లిగూడెంలోనూ ఇదే దందా

    టీడీపీ కూటమి సర్కారు రాగానే..

    పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెంలలో పదుల సంఖ్యలో అనధికారిక శిబిరాలు.. అనుమతుల పేరిట పాలకొల్లు, భీమవరంలో క్లబ్బుల్లో పేకాట నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో పేకాటపై ఉక్కుపాదం మోపి క్లబ్‌లను మూసివేశారు. దీంతోపాటు జూద క్రీడలను పూర్తిగా నిషేధించి వందల కేసులు నమోదు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నేతలే పేకాట శిబిరాల నిర్వాహకులుగా అవతారమెత్తి మూడు ముక్కలాట మొదలుకుని కనష్ట గేమ్‌ వరకు భారీగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా పేకాటరాయుళ్లను పెద్దఎత్తున ఆహ్వానించి నిత్యం రూ.5 కోట్లకు పైగా టర్నోవర్‌ చేస్తూ నిర్వాహకులే నిత్యం లక్షల్లో గడిస్తున్నారు.

  • పరాకాష్టకు పీ–4

    సాక్షి, భీమవరం: పేదరిక నిర్మూలన కోసమంటూ చంద్రబాబు సర్కారు చేపట్టిన పీ–4 కార్యక్రమం వేధింపులు పరాకాష్టకు చేరాయి. సర్కారు పిలుపునకు సంపన్నుల నుంచి స్పందన రాక ఉద్యోగులను బాధ్యులను చేసే పనిలో ఉంది. మార్గదర్శులుగా మ్యాపింగ్‌కు ఒత్తిడి తెస్తోంది. పీ–4 అమలులో సర్వే లక్ష్యం చేరుకోలేదంటూ సచివాలయ ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు జారీ ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అట్టడుగు పేద కుటుంబాలను సంపన్నుల సాయంతో అభివృద్ధి చేసేందుకు పబ్లిక్‌– ప్రైవేట్‌ – పీపుల్‌ పార్టనర్‌షిప్‌ (పీ–4) కార్యక్రమం తెచ్చినట్టు ప్రభుత్వం చెప్పుకుంటోంది. పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 4,92,292 కుటుంబాలకు పలు వడపోతల తర్వాత 64,940 కుటుంబాలను అర్హులుగా ఎంపిక చేశారు. సంపన్నులను మార్గదర్శులుగా చేర్పించి ఆయా కుటుంబాలను వారికి అనుసంధానించాలి. దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆర్థిక చేయూత, లేదా జీవనోపాధికి అవసరమైన నైపుణ్యాలను నేర్పించడం ద్వారా వారి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి.

    ఉద్యోగుల పైనే భారం

    బంగారు కుటుంబాలు, మార్గదర్శుల గుర్తింపు, అనుసంధానం మొత్తం బాధ్యతలను ప్రభుత్వం ఉద్యోగ వర్గాలపైనే మోపింది. ఈ నెల 15 నాటికి జిల్లాలో 15 వేల మంది మార్గదర్శులను గుర్తించాలని లక్ష్యంగా నిర్ణయించారు. పీ–4లో భాగస్వాములుగా చేరి బంగారు కుటుంబాలను బాగుచేసేందుకు కూటమి పక్షాల్లోని సంపన్న నేతలు ఆసక్తి చూపడం లేదు. శనివారం నాటికి జిల్లాలో 1,700 మంది మాత్రమే మార్గదర్శులుగా రిజిస్టర్‌ చేసుకున్నారు. వీరికి 35 వేల కుటుంబాలను మ్యాపింగ్‌ చేశారు. ఉన్నతస్థాయి నుంచి వస్తున్న ఒత్తిడితో త్వరితగతిన మిగిలిన కుటుంబాల మ్యాపింగ్‌ పూర్తిచేసేందుకు జిల్లా యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఉన్నతాధికారులు నిరంతర సమీక్షలు చేస్తున్నారు. పారిశ్రామిక, వ్యాపారవేత్తలు, పెద్ద రైతులు, రైస్‌ మిల్లర్స్‌, విద్యాసంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు, మద్యం, ఎరువుల షాపుల యజమానులు, డీలర్లు తదితర వర్గాల వారితో సమావేశాలు ఏర్పాటుచేసి మార్గదర్శులుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని కోరుతున్నారు. పెద్దగా ఫలితం కనిపించకపోవడంతో మార్గదర్శుల భారాన్ని ప్రభుత్వం ఉద్యోగ వర్గాలపై మోపుతోంది. ఒక్కో కుటుంబాన్ని మ్యాపింగ్‌ చేసుకోవాలంటూ వస్తున్న ఒత్తిళ్లతో ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. నైపుణ్యాలను నేర్పించే ఆప్షన్‌లో ఒక్కో ఉద్యోగి ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకోమంటున్నారని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు. ఏడాదికి ఒక్కో ఉద్యోగి కనిష్టంగా దత్తత కుటుంబానికి రూ.5 వేలు సాయం అందించాలని, ఈ మేరకు తమ జీతం నుంచి మినహాయించుకుంటుందన్న ఆందోళన వారిని వెంటాడుతోంది.

    ఆదిలోనే తిప్పికొట్టిన ఉపాధ్యాయ సంఘాలు

    పీ–4 అమలులో టీచర్లను భాగస్వాములను చేసే ప్రయత్నాలను ఉపాధ్యాయ సంఘాలు ఆదిలోనే తిప్పికొట్టాయి. ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్‌కు ఏలూరు విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్రవ్యాప్తంగా సంఘ నాయకులు ఖండించారు. సంపన్నవర్గాలకు చెందిన పీ–4 అమలుకు మధ్య తరగతి శ్రేణిలో ఉండే ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల వారిపై భారం మోపడం సరికాదని, వేరే కుటుంబాలను దత్తత తీసుకుని సాయపడే పరిస్థితి ఉండదనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలంటూ ఫ్యాప్టో చురకలంటించింది. ఉపాధ్యాయ వర్గాలు ఆందోళనలకు సిద్ధంకావడంతో ఉత్తర్వులను విద్యాశాఖ వెనక్కి తీసుకుంది.

    సచివాలయ ఉద్యోగులకు షోకాజ్‌

    పీ–4 సర్వే లక్ష్య సాధనలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ భీమవరం మున్సిపాల్టీకి చెందిన 26 మంది సచివాలయ అడ్మిన్‌, ఎడ్యుకేషన్‌, డేటా ప్రాసెసింగ్‌ ఉద్యోగులకు ఉన్నతాధికారులు షోకాజ్‌ నోటీసుల జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. పింఛన్ల పంపిణీ, రకరకాల సర్వేల పేరిట క్షణం తీరిక లేకుండా పనిచేస్తుంటే నోటీసులు ఇవ్వడం సరికాదని ఉద్యోగులు వాపోతున్నారు. జిల్లాలోని మిగిలిన మున్సిపాల్టీల్లోనూ ఈ తరహా ఒత్తిళ్లు అధికంగా ఉన్నట్టు చెబుతున్నారు. పేదలకు మేలు చేయాలన్న చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే నేరుగా వారిని ఆదుకోవాలని, ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు.

    మార్గదర్శులుగా ముందుకురాని కూటమి నేతలు

    ఉద్యోగులనే మార్గదర్శులుగా మ్యాపింగ్‌కు ఒత్తిళ్లు

    భీమవరంలో 26 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు

    ఎంపీడీవోలు, ఇతర అధికారులపైనా తీవ్ర ఒత్తిడి

  • అక్రమ ఆయుధాలు స్వాధీనం

    పెనుమంట్ర: ఎస్పీ ఆదేశాల మేరకు పెనుమంట్ర ఎస్సై కె స్వామి తన సిబ్బందితో పొలమూరులో ఆక్వా చెరువుల వద్ద తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 5 నాటు తుపాకులు, 10 కిలోల గన్‌పౌడర్‌, 3 కిలోల గోళీలు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై స్వామి తెలిపారు. ఆక్వారైతులు ఎవరైనా అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే వాటిని వెంటనే పోలీసులకు అప్పగించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఆర్‌.విజయ్‌కుమార్‌ హెచ్చరించారు.

    ఆక్వా జోన్‌ సర్వే పూర్తి చేయాలి

    భీమవరం (ప్రకాశంచౌక్‌): ఆక్వా జోన్‌ సర్వేలో నిబంధనలు కచ్చితంగా పాటించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ చాంబర్‌లో మంగళవారం మత్స్య, గృహ నిర్మాణ శాఖలపై సమీక్షించారు. నాచు పెంపకం (సీవీడ్‌) పై ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు నిపుణులతో శిక్షణ ఇప్పించి ప్రోత్సహించాలని, ఈ కార్యక్రమాన్ని రెండు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. సమృద్ధిగా పండే వ్యవసాయ భూమిని ఆక్వా జోన్‌లోకి ప్రతిపాదించవద్దని అధికారులకు సూచించారు.

    క్రమబద్ధీకరణకు గడువు పొడిగింపు

    ఏలూరు(మెట్రో): అనధికార లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ నిబంధనల ప్రకారం గడువు పొడిగించామని జేసీ పి.ధాత్రిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు జూన్‌ 30, 2025 లోపు దరఖాస్తుచేసి క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. సదరు క్రమబద్ధీకరణ రుసుం 45 రోజుల్లో చెల్లిస్తే 10 శాతం రాయితీ, తదుపరి 90 రోజుల్లో చెల్లిస్తే 5 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 99668 48055 నెంబరులో సంప్రదించాలన్నారు.

    అంగన్‌వాడీలపై వేధింపులు ఆపాలి

    ఏలూరు (టూటౌన్‌): ఫోన్లను అంగన్‌వాడీ కార్యాలయంలో అప్పగించిన వారిపై వేధింపులు మానుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌. లింగరాజు, ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడి ప్రసాద్‌ విజ్ఞప్తి చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు తమ ఫోన్‌లను ఐసీడీఎస్‌ కార్యాలయాల్లో అప్పగించారన్నారు. ఫోన్లు పనిచేయడం లేదని చెప్పినా వినకుండా టార్గెట్ల పేరుతో తీవ్రంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెట్‌ సిగ్నల్స్‌ లేకపోవడం, సర్వర్‌ పనిచేయకపోవడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారుల బెదిరింపులకు అంగన్‌వాడీలు లొంగరన్నారు. సమస్య సానుకూలంగా పరిష్కరించాల్సిన అధికారులు ఇంతవరకూ స్పందించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తక్షణమే అంగన్వాడీలకు 5 జీ ఫోన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అన్ని యాప్‌లను కలిపి ఒక యాప్‌గా మార్చాలని, ఇతర సమస్యలు పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

    పుస్తకాల కోసం

    ఉరుకులు పరుగులు

    దెందులూరు: ప్రభుత్వ తాజా ఆదేశాలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే యాప్‌లతో ఇబ్బంది పడుతున్న తమకు బోధనకు సమయం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం ఏలూరు సుబ్బమ్మ దేవి పాఠశాలకు వెళ్లి విద్యార్థుల పుస్తకాలు తీసుకెళ్లాలని ఫోన్‌లకు మెసేజ్‌లు పంపారు. పాఠశాల పనివేళల్లో పుస్తకాలు మోయడానికి ఉపాధ్యాయులను కేటాయించడం ఏంటని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో వాహనాల ద్వారా మండలంలో ఒక సెంటర్‌ను ఏర్పాటు చేసి ఆ సెంటరుకు పుస్తకాలను సరఫరా చేసేవారు. ఆ కేంద్రం నుంచి ఉపాధ్యాయులు వెళ్లి తెచ్చుకునేవారు. ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్తి చెప్పి జిల్లా కేంద్రానికి వెళ్లి పుస్తకాలు తెచ్చుకోమనడంపై మండిపడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో సింగిల్‌ టీచర్‌ పనిచేస్తున్నారని.. ఉన్న ఒక్క టీచరు పుస్తకాలు తేవడానికి జిల్లా కేంద్రానికి వెళ్తే విద్యార్థుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదేశాలు పాటించకపోతే మళ్లీ ఏం చేస్తారో అని తప్పని పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలపై ఏలూరు వెళ్లి పుస్తకాలు తీసుకువచ్చామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పుస్తకాలు తీసుకోవడానికి ఏలూరు రమ్మని మెసెజ్‌లు ఇచ్చిన సంగతి వాస్తవమేనని ఏలూరు రూరల్‌ మండలం ఎంఈఓ అరుణ్‌ పేర్కొన్నారు.

  • స్మార్ట్‌ మీటర్ల బిగింపు ఆపాలి

    భీమవరం: విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు తక్షణం రద్దు చేసి ట్రూఅప్‌ చార్జీలు ఉపసంహరించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు జేఎన్‌వీ గోపాలన్‌, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు చెల్లబోయిన రంగారావు డిమాండ్‌ చేశారు. ప్రజా వేదిక పిలుపులో భాగంగా మంగళవారం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి దగ్గరలో విద్యుత్‌ సబ్‌స్ట్షేన్‌ వద్ద ప్రజావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాట్లాడారు, అదానీతో విద్యుత్‌ ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో వాడుకున్న విద్యుత్‌కు అదనపు రుసుం ఇప్పుడు వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణలను రాష్ట్రం అమలు చేయడం దారుణమని పెంచిన విద్యుత్‌ భారాలు ఉపసంహరించకపోతే మరో పోరాటానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఏఐసీటియు, టీయుసీసీ నాయకులు లంక కృష్ణమూర్తి, కొల్లాబత్తుల మహంకాళి మాట్లాడుతూ.. విద్యుత్‌ ఒప్పందాలు రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎలక్ట్రికల్‌ జేఈకి వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో ప్రజా వేదిక నాయకులు బి.వాసుదేవరావు, జక్కంశెట్టి సత్యనారాయణ, కె.క్రాంతిబాబు, ఇంజేటి శ్రీను, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లోనూ ప్రజా వేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు.

  • కారు
    ద్వారకాతిరుమల మండలం లక్ష్మీపురంలో ఆటోను కారు అతి వేగంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 10లో u
    తణుకు ప్రభుత్వాసుపత్రిలో పారిశుద్ధ్య పనులు

    తణుకు అర్బన్‌: తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలో మురుగునీరు తిష్టతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రని సాక్షి దినపత్రికలో ‘సర్కారు దవాఖానాలో మురుగునీరు తిష్ట’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనానికి వైద్యాధికారులు స్పందించారు. ఆస్పత్రి సూప రింటెండెంట్‌ డాక్టర్‌ కాకర్లమూడి సాయి కిరణ్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ ఎ.తాతారావు సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి జేసీబీ ద్వారా డ్రెయినేజీలో ఉన్న మురుగును తొలగించే చర్యలకు చేపట్టారు. మురుగునీరు ప్రవహించేలా పనులు పూర్తిచేయించడంతోపాటు ఆస్పత్రి ఆవరణలో బ్లీచింగ్‌ చిమ్మించారు.

  • ఉద్యోగుల సమస్యలపై చర్చకు ప్రత్యేక కార్యక్రమం

    భీమవరం: రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో టీ తాగుతూ మాట్లాడుకుందాం రండి అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సంఘం రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు రవీంద్రరాజు చెప్పారు. మంగళవారం భీమవరం పట్టణంలోని జిల్లా పెన్షనర్స్‌ అసోసియేషన్‌ భవనంలో జిల్లా అధ్యక్షుడు యాళ్ళ మెహన రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగులంతా సమస్యలపై చర్చించి ప్రభుత్వం వద్ద పేరుకుపోయిన రూ.30 వేల కోట్ల బకాయిలు, పెండింగ్‌ డీఏలు, ఐఆర్‌, పీఆర్సీ కమిషన్‌ వంటిపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఉద్యోగులను చైతన్య పర్చడానికి టీ తాగుతూ మాట్లాడుకుందాం రండి కార్యక్రమం శ్రీకారం చుట్టామన్నారు. వారానికో సమస్యపై ఉద్యోగులంతా టీ తాగుతూ చర్చిస్తామని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వైఖరిని తెలియచేస్తామని రవీంద్రరాజు చెప్పారు. సంఘం జిల్లా కార్యదర్శి జక్రయ్య, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు షేక్‌ ఉమర్‌ అలీషా, ఉపాధ్యక్షులు రాజేష్‌ కుమార్‌, మానస తదితరులు పాల్గొన్నారు.

  • పీ4 మార్గదర్శులకు అవగాహన

    భీమవరం (ప్రకాశంచౌక్‌): డీఆర్డిఏ, డ్వామా శాఖలతో ప్రేరేపితులై ముందుకు వచ్చిన పీ4 మార్గదర్శులతో మంగళవారం కలెక్టరేట్‌ వశిష్ట సమావేశ మందిరంలో ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వివిధ మార్గాలుద్వారా సేవలందిస్తున్న సమాజ నిర్దేశకులందరినీ ఒకే తాటిపై తీసుకువచ్చి మార్గదర్శకులుగా నమోదు చేసి బంగారు కుటుంబాలకు సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మార్గదర్శకులుగా నమోదు కావడానికి మనసున్న ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. నమోదయ్యే సందర్భంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టి తీసుకురావాలన్నారు. ప్రతి సచివాలయంలో నమోదుకు ఉచితంగా అవకాశం కల్పించామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్గదర్శిగా ఆర్థికంగా ఒక్కటే కాదని, సేవా తత్పరతతో చేసే ఏ కార్యక్రమం అయినా నిర్వహించవచ్చన్నారు.

Nalgonda

  • కొత్త డిజైన్‌ అవార్డు తెచ్చింది

    సంస్థాన్‌ నారాయణపురం: సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కొలను శంకర్‌ లెనిన్‌ డబుల్‌ ఇక్కత్‌ చీర తయారుచేశారు. లెనిన్‌ డబుల్‌ ఇక్కత్‌ చీర నేయడం దేశంలో ఇదే మొదటిసారి. ఈ చీర 15 షేడులు, సున్నితమైన దారాలతో రంగు వెలిసిపోని చీర. ఈ చీర డిజైన్‌ కోసం సంవత్సరం కాలం పట్టిందని శంకర్‌ తెలిపారు. చీర తయారీకి రూ.50వేలు ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తన 30సంవత్సరాల అనుభవంలో ఎన్నో రకాల చీరలు తయారు చేశానని, కానీ అవార్డు కోసం ఎప్పుడూ దరఖాస్తు చేసుకోలేదన్నారు. ఈ చీరకు దరఖాస్తు చేసుకోవడంతో కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డు వచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

  • పదహారు ఆకృతులతో తేలియా రుమాల్‌పై..

    సంస్థాన్‌ నారాయణపురం: మండలంలోని పుట్టపాక గ్రామానికి చెందిన గూడ పవన్‌ పదహారు ఆకృతులతో తేలియా రుమాల్‌ అనే వస్త్రంతో చీర తయారుచేసి కొండ లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. ఈ చీర బంతిపూలు, రథం, త్రీడీ డిజైన్‌తో పాటు అనేక డిజైన్‌లతో కూడి ఉంటుంది. మడతలు పడకుండ మృదవైన పట్టును వాడినట్లు ఆయన తెలిపారు. రంగు వెలవని ఈ చీర తయారీకి రూ.75వేలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇదే చీరకు ఆయన జాతీయ చేనేత అవార్డు కూడా అందుకోనున్నారు. జాతీయ, రాష్ట్ర అవార్డులు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

  • చిన్నతనం నుంచే జీతమున్నా..

    చండూరు: చండూరు మండల కొండాపురం గ్రామానికి చెందిన అవ్వారి రవీందర్‌ తయారు చేసిన ఇక్కత్‌ రాజ్‌కోట్‌ చీరకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డు దక్కింది. ఇవి వేరే దేశాలతో పాటు రాజస్తాన్‌, అహ్మదాబాద్‌ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను 10 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే మగ్గం పనిచేసే వారి వద్ద జీతం ఉన్నానని, ఆ తర్వాత బొంబాయికి వలస వెళ్లి అక్కడ పదేళ్లు ఉండి సాంచన్‌లు నడిపి తిరిగి కొండాపురం గ్రామం వచ్చినట్లు రవీందర్‌ తెలిపారు. కొత్తగా వచ్చే డిజైన్లను గమనించి చీరలు తయారు చేయడం తనకు అలవాటని ఆయన పేర్కొన్నారు. 20 ఏళ్ల కిందటే 5 మగ్గాలతో చీరలు నేయించినట్లు వివరించారు. ప్రసుత్తం తనకు 69 ఏళ్లని, ఇన్నేళ్లకు తనకు గుర్తింపు లభించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

  • మన చే
    కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డుకు 13 మంది చేనేత కార్మికులు ఎంపిక

    జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని

    చేనేతలో విశేష ప్రతిభ కనబర్చిన కళాకారులను ప్రతి యేటా కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డుతో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ సత్కరిస్తోంది. ఈ అవార్డుకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు చేనేత కళాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పుసర్కరించుకుని హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

    శైలజా రామయ్యర్‌ చేతులమీదుగా వారు రూ.25వేల నగదు పురస్కారం, మెమొంటో,

    ప్రశంసా పత్రం అందుకోనున్నారు.

    జీవ వైవిధ్యం ప్రతిబింబించేలా

    మడ్తాస్‌ ఇక్కత్‌ చీర

    భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు మంగళపల్లి శ్రీహరి వినూత్న డిజైన్లతో మడ్తాస్‌ ఇక్కత్‌ చీరను రూపొందించి ఉత్తమ వీవర్‌గా కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. ఏడాది పాటు కష్టపడి 234 కొయ్యలు, రిపిట్‌ లేకుండా ఆరు వరుసల్లో వైట్‌ బేస్‌ చీరలో ప్రకృతి అందాలతో పరవశించి నృత్యం చేస్తున్న అంబారీ, నెమలిని రూపొందించారు. అంతేకాక మధ్యమధ్యన మన తెలంగాణ పండుగను ప్రతిబించేలా బతుకమ్మ, పద్మాల డిజైన్లను వేశారు. డిజైన్లు స్పష్టంగా కన్పించేలా వైట్‌ బేస్‌ చీరలో ఆనంద, బ్లాక్‌, మెరూన్‌, పసుపు, ఆకుపచ్చ రంగులను వినియోగించారు. డిజైన్లును రూపొందించడం, వాటిని గ్రాఫ్‌పై గీయడం, అందుకనుగుణంగా చిటికి కట్టడం, మగ్గం నేయడం కోసం మూడు నెలలు కష్టపడినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాక ఆయన నాలుగు మగ్గాలను పెట్టి నాలుగు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నారు. తాను పడిన కష్టానికి తగిన గుర్తింపు వచ్చిందని శ్రీహరి ఆనందం వ్యక్తం చేశారు.

    50 ఏళ్ల కష్టానికి దక్కిన ఫలితం

    గట్టుప్పల్‌: గట్టుప్పల్‌ మండల కేంద్రానికి చెందిన చేనేత కార్మికుడు గుర్రం యాదయ్య గత 50 ఏళ్లుగా చేనేత వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. చేనేతలో కొత్త కొత్త డిజైన్లు తయారు చేస్తేనే మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంటుందని గుర్తించి.. తన భార్య జయమ్మ సహకారంతో పోచంపల్లి డబుల్‌ ఇక్కత్‌ మల్బరీ సిల్క్‌తో వైరెటీ చీర తయారు చేశారు. ఇందుకు గాను ఆయన కొండా లక్ష్మణ్‌ బాపూజీ అవార్డుకు ఎంపికయ్యారు.

    నలభై ఏళ్ల అనుభవానికి గుర్తింపు

    వలిగొండ: మండలంలోని గొల్లపల్లికి చెందిన చేనేత కార్మికుడు చల్లమల్ల కృష్ణ కొండా లక్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. గత 40 ఏళ్లుగా చేనేత కళాకారుడిగా పనిచేస్తున్న ఆయన తెల్ల రుమాల్‌, డబుల్‌ ఇక్కత్‌ 100% కాటన్‌ చీరలు నేస్తున్నారు. తన అనుభవానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం తనను కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపిక చేసిందని ఆయన అన్నారు. అవార్డుకు ఎంపికై న కృష్ణను కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అభినందించారు.

    డబుల్‌ ఇక్కత్‌ చీర నేస్తున్న చిట్టిప్రోలు ధనుంజయ్య

    త్రీడీ ఎఫెక్ట్‌తో రూపొందించిన చీర

    సంస్థాన్‌ నారాయణపురం:రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డుకు సంస్థాన్‌ నారాయణపురం మండల పరిధిలోని పుట్టపాక గ్రామానికి చెందిన సామల భాస్కర్‌ ఎంపికయ్యారు. భాస్కర్‌ తన 33 సంవత్సరాల చేనేత అనుభవంతో త్రీడీ ఎఫెక్ట్‌ ఉండేలా కొత్త డిజైన్‌తో చీరను రూపొందించారు. సాధారణంగా ఒక చీరకు 30 మెట్లు ఉంటే.. భాస్కర్‌ 1450 మెట్లతో నెమలి దేవత ఆకృతులతో గ్రాఫిక్‌ డిజైన్‌తో రూపొందించారు. నిలువు, 4అచ్చెలతో ప్యూర్‌ సిల్క్‌ చీరను 10 నెలల్లో తయారు చేశారు. ఈ చీర తయారీకి 7 రంగులను వాడినట్లు ఆయన పేర్కొన్నారు. తన భార్య విజయలక్ష్మి సహకారంతో కొత్త చీరను రూపొందించానని, దానికి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని భాస్కర్‌ తెలిపారు. ఈ అవార్డుతో తమ చీరకు మార్కెటింగ్‌ ఏర్పడి తమ జీవనపాధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అవార్డుకు ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

    పోచంపల్లి డబుల్‌ ఇక్కత్‌ చీర..

    చిట్యాల: చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు చిట్టిప్రోలు ధనుంజయ్య మగ్గంపై నేసిన పోచంపల్లి డబుల్‌ ఇక్కత్‌ తరహాలోని చీరకు కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డు దక్కింది. ఈ అవార్డుకు ఎంపిక చేసిన ప్రభుత్వానికి, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ధనుంజయ్యకు అవార్డు రావటం పట్ల చిట్యాల మండలానికి చెందిన పలువురు పద్మశాలీలు హర్షం వ్యక్తం చేశారు.

    డిజైనింగ్‌లో ప్రతిభ

    గట్టుప్పల్‌: చేనేత చీరల డిజైనింగ్‌లో ప్రతిభ కనబర్చిన గట్టుప్పల్‌ మండల కేంద్రానికి చెందిన గాజులు అనిల్‌ కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డు ఎంపికయ్యారు. ఆయన 2012 నుంచి పోచంపల్లి ఇక్కత్‌(జకార్డ్‌) చీరల బార్డర్లపై అన్ని రంగులతో డిజైన్లు వేస్తున్నారు. ఈ చీరలకు మార్కెట్‌లో ఎంతో డిమాండ్‌ ఉంది. అనిల్‌ ప్రతిభను గుర్తించిన రాష్ట్ర చేనేత, జౌళి శాఖ అధికారులు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అనిల్‌కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

  • జాతీయ రహదారిపై  ట్రాఫిక్‌ జాం

    ఇబ్బందులు పడిన వాహనదారులు

    చౌటుప్పల్‌ రూరల్‌: విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ మండలం తుఫ్రాన్‌పేట గ్రామంలో ట్రాఫిక్‌ జాం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాలు.. సోమవారం అర్ధరాత్రి నల్లగొండ వైపు నుంచి సిమెంట్‌ లోడ్‌తో హైదరాబాద్‌కు వెళ్తున్న లారీ తూప్రాన్‌పేట గ్రామంలో హైవేపై మరమ్మతులకు గురైంది. హైవేపై పెట్రోలింగ్‌ చేస్తున్న పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ట్రాఫిక్‌ జాం కాకుండా వాహనాలను పంపించారు. అయితే మంగళవారం తెల్లవారుజామున పోలీసులు ఘటనా స్థలం నుంచి వెళ్లిపోవడంతో మధ్యాహ్నం వరకు తూప్రాన్‌పేట గ్రామంలో హైదరాబాద్‌ వెళ్లే వైపు సుమారు 2 కి.మీ. మేర ట్రాఫిక్‌ జాం అయ్యింది. దీంతో హైదరాబాద్‌ వైపు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం ట్రాఫిక్‌ పోలీసులు, సివిల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని లారీని రోడ్డు పక్కకు తొలగించడంతో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదలిలాయి.

    రోడ్డు ప్రమాదంలో

    కానిస్టేబుల్‌ దుర్మరణం

    చివ్వెంల(సూర్యాపేట): అతివేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి బైక్‌ వస్తున్న కానిస్టేబుల్‌ ట్రాక్టర్‌ను ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామంలో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం పాశ్చ్యానాయక్‌ తండా గ్రామానికి చెందిన ధరావతు సోమాని(55) సూర్యాపేట సబ్‌ జైలులో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం బైక్‌పై సూర్యాపేటకు వెళ్తుండగా.. మార్గమధ్యలో బీబీగూడెం వద్ద మండల కేంద్రం నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. వెనుక నుంచి బైక్‌పై వస్తున్న సోమాని అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీకొని కిందపడ్డాడు. అదే సమయంలో సూర్యాపేట వైపు వెళ్తున్న మరో బైక్‌ సోమాని పైనుంచి వెళ్లడంతో అతడి తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం స్థానికులు అతడిని సూర్యాపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ వి. మహేశ్వర్‌ తెలిపారు.

    రైలు ఢీకొని వృద్ధురాలు మృతి

    వలిగొండ: వలిగొండ మండలం ఏదుళ్లగూడెం రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జి వద్ద ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన మంగళవారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం తాజపూర్‌కు చెందిన గుళ్ళని పోచమ్మ (90) ఏదుళ్లగూడెంలో తన బంధువుల ఇంటికి వస్తుండగా.. గ్రామ సమీపంలోని రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జి కింద ఇటీవల కురిసిన వర్షానికి నీరు నిలిచి ఉండడంతో బ్రిడ్జి పైనుంచి రైలు పట్టాలు దాటుతుండగా.. రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

  • నకిరేకల్‌ పట్టణంలో కార్డెన్‌ సెర్చ్‌

    నకిరేకల్‌: నకిరేకల్‌ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, 20 మంది ఎస్‌ఐలు, 300మంది పోలీస్‌ సిబ్బంది కలిసి కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తాటికల్‌ రోడ్డులోని ఎస్సీ కాలనీ, వడ్డెర కాలనీ, మొండివారి కాలనీల్లోని ఇళ్లను తనిఖీ చేశారు. ఉదయం 7 గంటల వరకు ఈ కార్డన్‌ సెర్చ్‌లో సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను, గంజాయి అనుమానితులను, వివిధ కేసుల్లో ఉన్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కార్డెన్‌ సెర్చ్‌ ముగిసిన తర్వాత నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ నకిరేకల్‌కు చేరుకుని తాటికల్‌ రోడ్డులోని ఎస్సీ కమ్యూనిటీ హల్‌ నందు ఉంచిన పట్టుబడిన వాహనాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ముందుస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగానే కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలను సమన్వయం చేస్తూ శాంతిభద్రతలను కాపాడటం కోసం కార్డెన్‌ సెర్చ్‌, కమ్యూనిటీ కాంటాక్ట్‌ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్డెన్‌ సెర్చ్‌లో సరైన ధ్రువపత్రాలు లేని 130 బైక్‌లు, 10 ఆటోలు, మరో 120 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 8 మంది పాత నేరస్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 18 మంది గంజాయి అనుమానితులను కూడా పట్టుకున్నామన్నారు. ముగ్గురు నేపాల్‌ దేశస్తులను గుర్తించినట్లు తెలిపారు. ఒక షెడ్డులో 15 గోవులను గుర్తించి పట్టుకున్నామన్నారు. ఆయా కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ఇళ్లు అద్దెకు ఇచ్చేముందు పూర్తి వివరాలు తెలుసుకున్నాకే అద్దెకు ఇవ్వాలని కోరారు. ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్లు, విక్రయించినట్లు తెలిస్తే డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో శాలిగౌరారం, చండూరు, నల్లగొండ ట్రాఫిక్‌, మహిళా పోలీస్‌ స్టేషన్ల సీఐలు కొండల్‌రెడ్డి, రాఘవరావు, ఆదిరెడ్డి, కరుణాకర్‌, మహాలక్ష్మయ్య, వివిధ మండలాల ఎస్‌ఐలు పాల్గొన్నారు.

    300 మంది పోలీసులతో సోదాలు

    250 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

    గంజాయి అనుమానితుల అరెస్ట్‌

    పాత నేరస్తుల గుర్తింపు

  • న్యూ

    చండూరు: న్యూ మ్యాట్రిక్‌ టిల్‌ ఇక్కత్‌ విధానంలో చీర నేసి చండూరు మండల కేంద్రానికి చెందిన కర్నాటి సద్గురు కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. ఈ స్పెషల్‌ ఇక్కత్‌ చీర నేసేందుకు ఐదు నెలల సమయం పట్టిందని ఆయన పేర్కొన్నారు. డిజైన్‌ ఫైనల్‌ చేయడం, మగ్గంపై డిజైన్‌ నూలుపై సెట్‌ చేయడానికే రెండు నెలల సమయం పట్టిందన్నారు. 25 ఏళ్లుగా మగ్గం నేస్తున్నానని, తనకున్న అనుభవంతో కొత్త డిజైన్లతో చీరలు రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ చీర ధర రూ.25వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ తరహా చీర నల్లగొండ జిల్లాలో తానొక్కడినే చేశానని, అంత ప్రత్యేకం కాబట్టే అవార్డుకు ఎంపికై ందని ఆయన తెలిపారు. సబ్సిడీ ముడి సరుకుల డిపో నల్లగొండ లేదా చౌటుప్పల్‌ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

  • విద్యుత్‌ మోటార్ల చోరీ నిందితుల రిమాండ్‌

    కట్టంగూర్‌: దొంగిలించిన విద్యుత్‌ మోటార్లను ట్రాలీ ఆటోలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా కట్టంగూర్‌ మండల కేంద్రంలో మంగళవారం స్థానిక పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను కట్టంగూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నల్లగొండ ఏఎస్పీ జి. సురేష్‌, మంగళవారం విలేకరులకు వెల్లడించారు. ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌ పట్టణానికి చెందిన ఎడ్ల సురేష్‌, నాగిళ్ల ముత్తయ్య, గోపగాని రమేష్‌, ఆవుల రాజాలు, నాగిళ్ల ఎల్లయ్య కలిసి ఇటీవల కట్టంగూర్‌ మండలం ఈదులూరు గ్రామ శివారులోని వెంకటేశ్వర డెయిరీ ఫాం వద్ద, అయిటిపాముల గ్రామ శివారులో, శాలిగౌరారం మండల పరిధిలో వ్యవసాయ బావులు, ఫాంహౌజ్‌ల వద్ద విద్యుత్‌ మోటార్లు, పైపులు చోరీ చేశారు. చోరీ చేసిన విద్యుత్‌ మోటార్లు, పైపులను ఆటోలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మంగళవారం కట్టంగూర్‌ మండల కేంద్రంలోని నల్లగొండ క్రాస్‌ రోడ్డు వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేశారు. వారి వద్ద నుంచి 14 విద్యుత్‌ మోటార్లు, 33 బోర్‌ పైపులు, 8 బ్యాటరీలు, రాగి వైరు, మంచం, రెండు సీలింగ్‌ ఫ్యాన్లులు, రెండు కుర్చీలు, ఫ్రిజ్‌, చోరీకి ఉపయోగించిన ట్రాలీ ఆటో, రూ.1,74,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. అంతేకాకుండా నిందితుల ఇంటి వద్ద ఉన్న మిగతా వస్తువులను సైతం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్‌తో పాటు ఐదుగురు నిందితులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి విచారించినట్లు తెలిపారు. ఎడ్ల సురేష్‌, నాగిళ్ల ముత్తయ్య మూడేళ్ల క్రితం తిప్పర్తి మండల పరిధిలో ఆగి ఉన్న రైలు బోగీ నుంచి 39 బ్యాటరీలను చోరీ చేసి జైలుకు వెళ్లి వచ్చినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. నిందితులను రిమాండ్‌ తరలించినట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీసులను ఏఎస్పీ అభినందించారు. ఈ విలేకరు సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐ కొండర్‌రెడ్డి, ఎస్‌ఐ మునుగోటి రవీదర్‌, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • మూడేళ్లు.. ముగ్గురు  అన్నదమ్ములకు అవార్డులు

    చండూరు: చండూరు మండల కేంద్రానికి చెందిన చిలుకూరి శ్రీనివాసులు సహజ సిద్ధమైన రంగులతో డబుల్‌ ఇక్కత్‌ దుపట్టాను తయారు చేసి కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. శ్రీనివాసులు అన్న చిలుకూరి క్రిష్ణయ్య 2023లో, తమ్ముడు చిలుకూరి ధనుంజయ 2024లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డులు అందుకున్నారు. దాదాపు 35 సంవత్సరాలుగా ముగ్గురు అన్నదమ్ములు డబుల్‌ ఇక్కత్‌ పైనే ప్రావీణ్యం సంపాదించారు. మూడేళ్ల క్రితం వరకు రసాయన రంగులతో డబుల్‌ ఇక్కత్‌ వస్త్రాలు నేసినా ఆ తర్వాత నుంచి సహజ సిద్ధమైన రంగులకు మారి మంచి ఆదరణ పొందుతున్నారు. ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ కూడా ఉంది. దుపట్టా తయారు చేసేందుకు రెండు నెలల సమయం పట్టిందని, శ్రీనివాసులు తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీపై ముడి సరుకులు ఇచ్చి చేనేత కార్మికులను ప్రోత్సహిస్తే ఉత్పత్తిని పెంచి తక్కువ ధరల్లో వస్త్రాలు అందుబాటులో ఉంచేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. తనకు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

  • 108 డిజైన్లు.. 29 రంగులు

    గట్టుప్పల్‌: ఎంతో శ్రమించి 108 డిజైన్లు, 29 రంగులతో చీరను తయారుచేశారు గట్టుప్పల్‌కు చెందిన కర్నాటి కృష్ణయ్య. ఆయన గత 40 ఏళ్లుగా చేనేత మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చేనేతలో కొత్తదనం సృష్టించాలనే తపనతో కృష్ణయ్య ఏడాది క్రితం 108 డిజైన్లు, 29 రంగులతో చీర తయారు చేయడం ప్రారంభించారు. నెలరోజుల క్రితం ఈ చీర తయారీ పూర్తయ్యింది. క్వాలిటీ, కలర్స్‌, డిజైన్స్‌ను పరిశీలించిన చేనేత శాఖ అధికారులు కృష్ణయ్యను కొండా లక్ష్మణ్‌ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపిక చేశారు. ఇన్నేళ్ల తన కష్టానికి సరైన గుర్తింపు దక్కడంతో కృష్ణయ్య ఆనందం వ్యక్తం చేస్తున్నారు.