రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

Nov 10 2025 7:26 AM | Updated on Nov 10 2025 7:26 AM

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

పేకాడుతున్న నలుగురి అరెస్టు

రుద్రూర్‌: మండల కేంద్రంలో శనివారం రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. అలాగే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు వివరించారు.

ఆగని ఇసుక అక్రమ రవాణా

పోతంగల్‌ మండలంలోని మంజీరా నది నుంచి ని త్యం ఇసుక అక్రమ రవాణ కొనసాగుతూనే ఉంది. అక్రమార్కులు ఇసుక రీచ్‌ల నుంచి విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరిపి పట్టణ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కోటగిరి, పోతంగల్‌, రుద్రూర్‌ మండలాల్లో రహస్య ప్రాంతాల్లో డంప్‌ చేసి నిబంధనలకు విరుద్దంగా రాత్రివేళల్లో టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పత్రికల్లో వార్తలు వచ్చినపుడు మాత్రమే ఒకటి, రెండు ట్రాక్టర్లను పట్టుకుని పోలీసులు కేసు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఎల్లారెడ్డి: మండలంలోని బ్రాహ్మణపల్లి పరిసరప్రాంతంలోగల పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకొని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.12,510 నగదుతోపాటు నాలుగు ఫోన్లు, మూడు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

వృద్ధురాలి అదృశ్యం

మోపాల్‌: మోపాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముదక్‌పల్లి గ్రామానికి చెందిన కంజర్ల రాజవ్వ ఈనెల 6 నుంచి కనిపించడం లేదని ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. గురువారం మధ్యాహ్నం రాజవ్వ చందూరు గ్రామంలోని తన చిన్న కుమార్తె ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లింది. ఇప్పటికీ ఇంటికి రాలేదు. దీంతో ఆమె కుమారుడు కంజర్ల భూమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై ఆదివారం తెలిపారు. రాజవ్వ ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్‌ స్టేషన్‌కి లేదా మోపాల్‌ పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement