న్యూస్రీల్
నిజామాబాద్
ప్రజావాణికి 94 ఫిర్యాదులు
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
మంగళవారం శ్రీ 11 శ్రీ నవంబర్ శ్రీ 2025
– 8లో u
అసలే
అక్రమం..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రోస్టర్ పాటించకుండా అడ్డదారిలో నియామకమైన తెలంగాణ వర్సిటీ అధ్యాపకులు.. క్యాంపస్లో సరికొత్తగా నీచ రాజకీయాలకు తెరతీశారు. 2014లో కేసు కోర్టులో ఉన్న సమయంలోనే ఉద్యోగంలో నియామకమయ్యేటప్పుడు కోర్టు తీర్పునకు కట్టుబడతామని సదరు అధ్యాపకులు రాసిచ్చారు.
తీరా ఇప్పుడు హైకోర్టు సదరు నియామకాలను రద్దు చేసినప్పటికీ అవేవీ తమకు పట్టవంటున్నట్లు ఉంది వారి తీరు. ఒకసారి ఉద్యోగంలో చేరిన తరువాత తమను ఎవరూ ఏంచేయలేరంటూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కోర్టు తీర్పును ధిక్కరిస్తూ వర్సిటీకి వస్తున్న సదరు 45 మంది అధ్యాపకులు తాజాగా మరో నీచ రాజకీయానికి బీజం వేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఎన్ఎస్యూఐ పేరిట సదరు అధ్యాపకులే తమకు కావాలంటూ వర్సిటీలో ఆందోళన చేయించారు. ఇలా చేసిన కొద్ది వ్యవధిలోనే ఎన్ఎస్యూఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా మాజీ అధ్యక్షుడు వరదభట్టు వేణురాజ్ ఈ ప్రకటన విడుదల చేశాడు. ఎన్ఎస్యూఐ ఉపాధ్యక్షుడిగా చెప్పుకుంటున్న నవీన్కు యూనియన్తో ఎలాంటి సంబంధం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. అతనికి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల ద్వారా ఎలాంటి నియామక పత్రం ఇవ్వలేదన్నారు. గతంలో తెలంగాణ వర్సిటీ ఎన్ఎస్యూఐ కమిటీలో పనిచేసినవారెవరూ ప్రస్తుతం అందుబాటులో లేనందున కొత్త కమిటీని నియమించలేదన్నారు. కొందరు వర్సిటీ విద్యార్థులు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాళ్లపై తగిన సమయంలో చర్యలు తీసుకుంటామని వివరించారు. 2012 నోటిఫికేషన్ మీద హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆయా అధ్యాపకుల పోస్టులను క్రమబద్ధీకరించాలంటూ చేసిన ఆందోళనకు ఎన్ఎస్యూఐకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటనలో పేర్కొన్నారు. దీన్నిబట్టి కొందరు విద్యార్థులను సదరు అధ్యాపకులే ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు అర్థమవుతోంది.
● కోర్టు తీర్పును ధిక్కరిస్తున్న ఆ అధ్యాపకులు మరోవైపు అధికార పార్టీ నాయకుల ప్రతిష్టను సైతం దెబ్బతీసే పనిని చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్లను కూడా వాడుతున్నారు. అధికార పార్టీ అండ తమకుందంటూ వర్సిటీలో విభజన రాజకీయాలు చేస్తున్నారు. విద్యార్థి సంఘాలను భ్రష్టు పట్టించేందుకు కుయుక్తులు పన్నిన ఈ అధ్యాపకులు ఏకంగా ప్రభుత్వంలో, అధికార పార్టీలో కీలకంగా ఉన్న నేతనూ బదనాం చేస్తుండడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో తగినవిధంగా ముందుకు వెళ్లేందుకు వీసీ యాదగిరిరావు సంసిద్ధం అవుతున్నప్పటికీ రిజిస్ట్రార్ యాదగిరి మాత్రం కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడుతున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
తెయూలోకి అడ్డదారిలో ప్రవేశించిన 45 మంది అధ్యాపకులు రాజకీయాలకు తెరలేపారు. ఆ అధ్యాపకుల నియామకాన్ని రద్దు చేస్తూ ఇటీవల హై కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆ అధ్యాపకులే తమకు కావాలంటూ అధికార కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఎన్ఎస్యూఐ పేరుతో వర్సిటీలో ఆందోళన చేయించారు. ఇలా చేసిన కొద్ది వ్యవధిలోనే ఆ ఆందోళనతో తమకు సంబంధం లేదని ఎన్ఎస్యూఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది.
అడుగడుగునా అడ్డదారులు
వెతుకుతున్న అక్రమ అధ్యాపకులు
హైకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యార్థి
సంఘాలనూ భ్రష్టు పట్టించే పనిలో
ఆ అధ్యాపకులు
అధికార పార్టీ నేతలనూ
బదనాం చేస్తున్న వైనం
ఎన్ఎస్యూఐ పేరిట ఆందోళన చేయించడంతో.. ఖండిస్తూ
ఆ సంస్థ ప్రకటన
కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో అప్పటి వీసీ అక్బర్ అలీఖాన్ చేసిన ఈ ని యామకాలపై ఆ ప్రభుత్వం రెండు కమిటీలు వేి సంది. ఈ నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా చేసినట్లు ఆ రెండు కమిటీలు నివేదికలు ఇవ్వగా తరువాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం స దరు నివేదికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టింది. ఈ అధ్యాపకుల నియామకాలను, వీళ్లకు ప్రమోషన్లు ఇచ్చే విషయమై పాలకమండలి ప్రతిసారి తిరస్కరిస్తూ వచ్చింది.
మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది. హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అమలు చేసే విషయంలో ప్రభుత్వం నుంచి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సదరు అధ్యాపకులు కీలక నేతలను బదనాం చేసే పనిలో బిజీగా ఉండడం విశేషం.
ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కొందరు బ్యూరోక్రాట్లు ఈ అక్రమాన్ని సక్రమం చేసేందుకు శాయశక్తులా కృషి చేయడం, ఇప్పటికీ చేస్తుండడం గమనార్హం.
ఆపై రాజకీయం


