‘ఖని’లో మల్టీఫ్లెక్స్ నిర్మిస్తాం
గోదావరిఖని: మూడు జిల్లాలకు కేంద్రంగా ఉన్న గోదావరిఖనిలో మల్టీఫ్లెక్స్ నిర్మిస్తామని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. ఆదివారం ఆయన గోదావరిఖని ప్రాంతంలో పర్యటించారు. కొత్తగా నిర్మించే క్వార్టర్ల ప్రాంతం, మెయిన్ చౌరస్తాలో చేపట్టే షాపింగ్ కాంప్లెక్స్ పరిశీలించారు. జీడీకే–5 ఓసీపీని సందర్శించారు. బొగ్గు ఉత్పత్తి తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. డంప్యార్డుపై మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ మంచిర్యాల, భూపాలపల్లి ప్రాంతాల కార్మి క కుటుంబాలకు ఉపయోగపడేలా మల్లీఫ్లెక్స్ నిర్మి స్తామన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ పనులు కూడా త్వరగా పూర్తయ్యేలా చూస్తామని అన్నారు. వర్షాలతో ఆశించిన దానికన్నా ఆలస్యమైందని తెలిపారు. షాపింగ్ పనుల్లో వేగం పెంచేలా కాంట్రాక్టర్కు సూచించామని ఆయన తెలిపారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్రతీఒక్కరు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్, ఎస్వోటూ జీఎం చంద్రశేఖర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
● సింగరేణి సీఎండీ బలరాం


