గోదావరిఖని: రామగుండం నగరంలో దారిమైసమ్మ దే వాలయాలు కూల్చివేసిన నే పథ్యంలో ఈనెల 12న కేంద్ర మంత్రి బండి సంజయ్ గోదావరిఖనికి రానున్నట్లు బీజేపీ నాయకుడు కోమళ్ల మహేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రమంత్రితో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి, పలువురు నాయకులు ఖనికి రానున్నట్లు ఆయన పేర్కొన్నారు.
చైనా బృందంలో మనోడు
పాలకుర్తి(రామగుండం): వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్టెక్ వ్యవస్థపై అవగాహన కోసం మనదేశ సాఫ్ట్వేర్ నిపుణులు చైనాలో పర్యటిస్తున్నారు. ఇందులో ఈసాలతక్కళ్లపల్లి గ్రామానికి చెందిన పొన్నం సంతోష్గౌడ్కు చోటు దక్కింది. సంతోష్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. డిజిటల్ చెల్లింపులు, ఏఐ ఆధారిత సేవలు, అంత ర్జాతీయ ఆర్థిక వ్యూహాలు తదితర అంశాలపై బృందం అవగాహన పెంచుకుంటుంది. మనదేశం తరఫున 15మంది బృందం శనివారం చైనాకు బయలుదేరి వెళ్లింది. ఇందులో సంతోష్గౌడ్ కూడా ఉన్నారు. ఆయనను పలువు ప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు.
కోతుల పట్టివేత
పెద్దపల్లి: సుల్తానాబాద్లోని వివిధ ప్రాంతా లల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కో తులను ఆదివారం పట్టుకుని బోనులో బంధించారు. కోతులు ఇటీవల దాడి చేసి పలువురు పట్టణ ప్రజలు గాయాలపాలయ్యారు. దీంతో మున్సిపల్ కమిషనర్ రమేశ్ సూచన మేరకు కోతులు పట్టే బృందాలను ఇక్కడకు రప్పించారు. వారు ఆదివారం వివిధ ప్రాంతాల్లో కోతులను పట్టి బోనులో బంధించారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
పెద్దపల్లి: గోదావరిఖనిలో 46 మైసమ్మ ఆలయాలను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా మైసమ్మ ఆలయాలను ధ్వంసం చేయడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోదని ఆయన ఆరోపించారు. కూల్చివేసిన ప్రాంతాల్లో ఆలయాలు మళ్లీ నిర్మించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
15న సత్యనారాయణ వ్రతం
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఈనెల 15న ఉదయం 10.30 గంటలకు సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ చీకట్ల మొండ య్య తెలిపారు. ఈ మేరకు సామూహిక సత్యనారాయణ వ్రతం ప్రచార పోస్టర్ను ఆదివా రం స్థానిక ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 100 మందికిపైగా దంపతులు సామూహిక సత్యనారాయణ వత్రంలో పాల్గొంటాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన కోరారు. ఈకార్యక్రమంలో ఈవో సదయ్య, ఆలయ డైరెక్టర్ శ్రావణ్కుమార్, జూనియర్ అసిస్టెంట్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
నేడు యోగా దినచర్య
గోదావరిఖని: సింగరేణి కార్మిక కుటుంబాల ఆరోగ్య పరిరక్షణకోసం సోమవారం ప్రాచీన యోగా దినచర్య కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్జీ–1 అధికార ప్రతినిధి రవీందర్రెడ్డి తెలిపారు. యోగా సాధన ద్వారా కలిగే ఫలితాలు, ప్రయోజనాల గురించి హైదరాబాద్కు చెందిన యోగా గురువు షణ్ముక శివచంద్ర వివరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. స్థానిక ఆర్సీవోఏ క్లబ్లో ఉదయం 10గంటలకు నిర్వహించే కార్యక్రమంలో పెద్దసంఖ్యలో కార్మికులు, వారి కుటుంబాలు పాల్గొనాలని ఆయన కోరారు.
12న కేంద్రమంత్రి బండి రాక
12న కేంద్రమంత్రి బండి రాక


