వేతన వెతలు | - | Sakshi
Sakshi News home page

వేతన వెతలు

Nov 10 2025 7:22 AM | Updated on Nov 10 2025 7:22 AM

వేతన

వేతన వెతలు

పెద్దపల్లి: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో సేవలు అందిస్తున్న రెండో ఏఎన్‌ఎంలకు వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరు కాంట్రాక్ట్‌ పద్ధతిన పనిచేస్తున్నారు. సుమారు 18ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా కష్టాలు తీరడంలేదు. రెండు నెలలుగా వేతనాలు అందడంలేదు. పండుగలు, ఇంటి కిరాయి, పిల్లల ఫీజు చెల్లించేందుకు అప్పు చేయాల్సి వస్తోంది. గత ప్రభుత్వం ప్రతీనెల ఐదోతేదీలోగా వేతనాలు చెల్లించేదని, ప్రస్తుత ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. మొదటి ఏఎన్‌ఎంలతో సమానంగా పనులు చేయిస్తున్నా.. ఒకటో తేదీన వారికి చెల్లించినట్లు తమకు ఎందుకు చెల్లించడం లేదని రెండో ఏఎన్‌ఎంలు ప్రశ్నిస్తున్నారు. వారి దీనస్థితి గురించి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారితోపాటు కమిషనర్‌కు మొరపెట్టుకున్నారు.

రెండో ఏఎన్‌ఎంలే అధికం..

జిల్లాలో 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు 8 అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇందులో అత్యధిక మంది రెండో ఏఎన్‌ఎంలే ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. విషజ్వరాలు, ఇతరత్రా సీజనల్‌ వ్యాధుల సర్వేతోపాటు ఎన్‌సీడీ, టీబీ, వ్యాక్సినేషన్‌ తదితర కార్యక్రమాలు వీరే చేపడతారు. వారంలో రెండురోజులు గర్భిణుల రిజిస్ట్రేషన్‌, వైద్య పరీక్షలు వీరి నే తృత్వంలోనే సాగుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేసుకునేలా చైతన్యవంతం చేస్తున్నారు. గ ర్భిణులు పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించడం, బాలింతల సంరక్షణ, తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణలోనూ పాలుపంచుకుంటున్నారు.

రెండో ఏఎన్‌ఎంలకు అందని జీతాలు

ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలు

హక్కుల సాధనకు పోరుబాట

17 నుంచి నిరవధిక సమ్మెకు సన్నద్ధం

ఇప్పటికే సమ్మె నోటీసు అందించిన వైనం

వేతన వెతలు 1
1/1

వేతన వెతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement