కేసీఆర్నగర్లో నీటితిప్పలు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని కేసీఆర్నగర్ కాలనీలో పైప్లైన్ దెబ్బతినడంతో మూడురోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్నగర్ను ఇందిరమ్మకాలనీ గ్రామపంచాయతీకి తాత్కాలికంగా కేటాయించడంతో వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నారు. అయితే కాలనీలో సుమారు 1,500 మంది జనాభా ఉండగా ట్యాంకర్ల ద్వారా అందిస్తున్న నీరు సరిపోవడం లేదు. రెండవ, మూడవ అంతస్తుల్లో ఉండేవారు నీటిని పైకి మోయలేక పాట్లు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు, మిషన్ భగీరథ, గ్రిడ్ అధికారులు వెంటనే స్పందించి పైప్లైన్ మరమ్మతులు చేపట్టి నీటి కష్టాలను తీర్చాలని కోరుతున్నారు.
రాష్ట్రస్థాయిలో కొత్తపల్లి విద్యార్థుల ప్రతిభ
గంభీరావుపేట(సిరిసిల్ల): మహబూబ్నగర్ జిల్లా కోస్గిలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్– 17 బాలుర, బాలికల హ్యాండ్బాల్ పోటీల్లో గంభీరావుపేట మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ప్రతిభచాటి తృతీయ స్థానంలో నిలిచారు. పోటీల్లో క్రీడాకారులు హర్షిని, భావన, స్వాతి, రాము, లక్ష్మణ్ సత్తాచాటారు. విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరామారావు, కోచ్ భార భాను, ఉపాధ్యాయులు అభినందించారు.
అమరవీరుల ఆశయాలు సాధిద్దాం
సిరిసిల్లటౌన్: అమరవీరుల ఆశయాలను సాధిద్దామని సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న పిలుపునిచ్చారు. ఆదివారం చండ్ర పుల్లారెడ్డి వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని శాంతినగర్ చౌరస్తాలో జెండా ఎగురవేశారు. అక్కడి నుంచి సభ ప్రాంగణం వరలక్ష్మి ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం అమరులైన చండ్రపుల్లారెడ్డి అతి చిన్న వయసులో విప్లవోద్యమానికి అంకితమయ్యారన్నారు. విద్యార్థి దశ నుంచి మొదలుకొని కార్మిక, కూలీల కోసం, అణచివేయబడ్డ ప్రజల కోసం నిరంతరం ప్రజా పోరాటాలు కొనసాగించారని వివరించారు. కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ న్యూ పార్టీ రాష్ట్ర నాయకుడు సోమిశెట్టి దశరథం, మోడం మల్లేశం, వొల్లాల కిషోర్, బామండ్ల రవీందర్, మచ్చ అనసూర్య, పెద్దోళ్ల సంగీత తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్నగర్లో నీటితిప్పలు


