‘సూచిక’తో సరి.. మరమ్మతులేవి?
ప్రమాదకరంగా కామారెడ్డి–కరీంనగర్ రహదారి రోడ్డు దెబ్బతిన్న స్థలాల్లో చెట్లకొమ్మలు, బోర్డులు ఏర్పాటు ఏడాదిగా మరమ్మతుకు నోచుకోని దారి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నిత్యం వందలాది వాహనాలతో బీజీగా ఉండే కామారెడ్డి–కరీంనగర్ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. జిల్లాలోని బోయిన్పల్లి నుంచి గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజీ వరకు 60 కిలోమీటర్ల మేర రోడ్డు ఉంది. గుంతలతో ప్రమాదాలు జరుగుతుండగా, వాహనదారులే గుంతలవద్ద మట్టి నింపి చెట్ల కొమ్మలను ప్రమాదసూచికంగా పెడుతున్నారు.
రోడ్డు పొడవునా గుంతలే..
ఏడాదిన్నరగా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ నుంచి తిమ్మాపూర్ వరకు కిలోమీటర్కు ఓ పెద్ద గుంత చొప్పున ఏర్పడి వాహనాదారులు ఇబ్బందిపడుతున్నారు. పదిర బ్రిడ్జిపై పెద్ద గుంత ఏర్పడగా.. దినపత్రికల్లో అనేక కథనాలు వచ్చినా అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు సిమెంట్ కాంక్రీట్తో నింపారు. మళ్లీ అదే బ్రిడ్జిని ఆనుకుని ఓ సైడ్ మట్టికొట్టుకుపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది. అధికారులు తాత్కాలిక మరమ్మతు చేపట్టి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం ఆ బ్రిడ్జి రోడ్డు మధ్యలో సిమెంట్, కాంక్రీటు లేచి లోపల స్టీలు రాడ్లు విరిగి పెద్ద రంధ్రం పడింది. వాహనదారులు అక్కడ చెట్ల కొమ్మలను ప్రమాదసూచికగా పెట్టగా, అధికారులు దాన్ని తొలగించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. పగటిపూట హెచ్చరిక సూచికలను వాహనదారులు అనుసరిస్తారు కానీ రాత్రిపూట గమనించకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకే వెంకటాపూర్– తిమ్మాపూర్ మధ్యలో జరిగిన ప్రమాదాల్లో కొందరు మృతి చెందగా, మరికొందరు తీవ్రగాయాలపాలయ్యారు.
పదిర వంతెనపై పెద్ద గుంత
రాగట్లపల్లి వద్ద చెట్టుకొమ్మలు
‘సూచిక’తో సరి.. మరమ్మతులేవి?
‘సూచిక’తో సరి.. మరమ్మతులేవి?
‘సూచిక’తో సరి.. మరమ్మతులేవి?
‘సూచిక’తో సరి.. మరమ్మతులేవి?


