కల్వర్టు కష్టాలు
బోయినపల్లి(చొప్పదండి): జిల్లాతో పాటు.. మండల కేంద్రాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లోని లో లెవల్ కల్వర్టుల స్థానంలో హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణాలకు ఏళ్ల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. ఏటా వానాకాలంలో వేములవాడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో లోలెవల్ వంతెనల మీదుగా ప్రయాణం ఇబ్బందిగా మారింది. వర్షాలు కురిసిన సమయంలో కల్వర్టులపై నీరు ఉధృతంగా ప్రవహించి బోయినపల్లి నుంచి కరీంనగర్, సిరిసిల్ల జిల్లా కేంద్రాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఆరేళ్లుగా ఏటా వానాకాలంలో బోయినపల్లి గ్రామ పరిసరాల్లోని మూడు కల్వర్టుల మీదుగా నీటి ఉధృతి పెరిగి ప్రయాణం ప్రమాదంగా మారింది. వర్షాలు కురిసి కల్వర్టులపై నీరు పారినపుడు గ్రామపంచాయతీ వారితో పాటు, పోలీసులు బారికేడ్లతో రక్షణ చర్యలు చేపడుతున్నారు.
పడకేసిన గంజివాగు బ్రిడ్జి పనులు
బోయినపల్లి నుంచి వేములవాడ వెళ్లే దారిలో స్తంభంపల్లి గంజివాగు వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.80 కోట్లు మంజూరయ్యాయి. ఇక్కడ కూడా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాదిగా స్లాబ్ పనులకు మోక్షం లభించడం లేదు. బ్రిడ్జి నిర్మాణం సందర్భంగా వాగు పక్కనుంచి తాత్కాలికంగా వేసిన రోడ్డు చాలాసార్లు తెగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
తాత్కాలిక పనులతో ప్రజాధనం వృథా
బోయినపల్లి నుంచి మర్లపేట, విలాసాగర్ గ్రామా ల మీదుగా కరీంనగర్ వెళ్లే బీటీ రహదారిలోని కల్వర్టు నాలుగేళ్లుగా ఏటా తెగుతోంది. ప్రతీసారి సుమారు రూ.5 లక్షల నిధులతో తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. గతేడాది సైతం సుమారు రూ.7 లక్షల అంచనాలతో మరమ్మతు చేశారు. తా త్కాలిక మరమ్మతులకు ఇప్పటికీ సుమారు రూ.20 లక్షలు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేదు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ప్రమాదాలకు నిలయంగా కల్వర్టు
కోనరావుపేట మండలం మల్కపేట లోలెవల్ కల్వర్టు
కల్వర్టు కష్టాలు


