ఆనందం.. ఆధ్యాత్మికం
● కుల సంఘాల ఆధ్వర్యంలో
వన భోజనాలు
● ఆటపాటలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో
పాల్గొన్న ప్రజలు
గంగపుత్రుల వన భోజన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తున్న ఎస్వీ మోహన్రెడ్డి
కాటసాని రాంభూపాల్రెడ్డిని సన్మానించిన దృశ్యం
కర్నూలు కల్చరల్: కార్తీక వన భోజన కార్యక్రమాలు ఆదివారం ఆనందంగా, ఆధ్యాత్మికంగా సాగాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పలు కుల సంఘాల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో వనసమారాధన కార్యక్రమాలు నిర్వహించారు. తులసి చెట్టు, ఉసిరి చెట్టుకు పూజలు, గోమాత పూజలను భక్తి శ్రద్ధలతో చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చిన్నారులు, మహిళలకు ఆటల పాటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కళాకారులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు. కుల ప్రముఖుల సందేశాలిచ్చారు. ఆయా రంగాల్లో ప్రతిభావంతులకు అభినందనలు తెలుపుతూ సత్కారాలు చేశారు.
● కర్నూలు రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నగర శివారులోని జీఆర్సీ కన్వెన్షన్లో రెడ్ల కార్తీక మాస వన భోజన మహోత్సవం జరిగింది. వేలాది మంది కుల సంఘీయులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులు పుల్లకుర్తి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా వన భోజన కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. దాతల సహకారంతో రెండు వృద్ధాశ్రమాలు, పేద రెడ్డి విద్యార్థులకు విద్యానిధి ద్వారా విద్యాభ్యాసానికి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్రెడ్డి, కాటసాని రాంభూపాల్రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు ఎస్వీ విజయ మనోహరి మాట్లాడారు. సిని కళాకారుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తన మిమిక్రీతో సందడి చేశారు. సంఘం అధ్యక్షులు ప్రభాకర రెడ్డి, ఉపాధ్యక్షులు దొనపాటి ఎల్లారెడ్డి, దామోదర్ రెడ్డి, విక్రమ్ సింహారెడ్డి, లోకేశ్వర్రెడ్డి, జి.పుల్లారెడ్డి ట్రస్ట్ సభ్యులు రాఘవ రెడ్డి, ఏకాంబర్ రెడ్డి, సుబ్బారెడ్డి, కేజే రెడ్డి కేవీ సుబ్బారెడ్డి, సరేష్ రెడ్డి, హనుమంత రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆనందం.. ఆధ్యాత్మికం


