పెండింగ్‌ డీఏలను చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ డీఏలను చెల్లించాలి

Nov 10 2025 7:16 AM | Updated on Nov 10 2025 9:00 AM

టీయూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

కాళోజీ సెంటర్‌: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీయూటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు రామినేని వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు. ఆదివారం వరంగల్‌లో సంఘం రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగ విరమణ భత్యాలు త్వరగా అందించాలన్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు పారదర్శకంగా చేయాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ను సత్వరమే పరిష్కరించి మండల విద్యాధికారి, జిల్లా ఉప విద్యాధికారి, జిల్లా విద్యాధికారి పోస్టులను రెగ్యులర్‌గా భర్తి చేసి పాఠశాల విద్యను మరింత పటిష్టం చేయాలన్నారు. ఈ సందర్భంగా నూతనకంటి బా బును సంఘం ముఖ్య సలహాదారుగా నియమించినట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు దార గణేశ్‌, లచ్చిమల్ల వెంకన్న, యర్రంశెట్టి స్నేహ, చెడుపాక కృష్ణమూర్తి, కందకట్ల సత్యనారాయణ, శ్రీవిద్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement