క్రీడల్లో ఉన్నతస్థాయికి ఎదగాలి
నిజామాబాద్నాగారం: క్రీడాకారులు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగాలని జిల్లా మైనారిటీ సంక్షేమాధికా రి కృష్ణవేణి అన్నారు. నగరంలోని నాగారంలోని రా జారాం స్టేడియంలో ఖైసర్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఈ కారక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ మొదటి విద్యా శాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం పురస్కరించుకుని, మైనారిటీ ఎడ్యుకేషన్ డే సందర్బంగా అథ్లెటిక్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ సయ్యద్ ఖైసర్ మాట్లాడుతూ... ప్రతి ఏడాది ఈటోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అండర్–12, 16, 19 విభాగాల నుంచి బాలబాలికలకు పోటీలు జరిగాయి. 80మీటర్లు, 100మీ,150మీ, 200మీ, 300మీ, 400మీ, 600మీ, 800 మీటర్లలో పోటీల్లో పాల్గొన్న విన్నర్, రన్నర్లకు మెడల్స్ సర్టిఫికెట్లు, టీషర్టులు అందజేశారు. పోటీల్లో ఓవరల్ చాంపియన్గా నిలిచిన నాగారంమైనారిటీ బాలుర గురుకుల పాఠశాల క్రీడాకారుల కు క్యాష్అవార్డుతో పాటు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. బాలికల్లో చాంపియన్గా నిలిచిన మైనారి టీ బాలికల–4 జట్టుకు సైతం అందజేశారు. గురుద్వార్ వైస్ ప్రెసిడెంట్ సోరన్సింగ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళ అధ్యక్షులు రేవతి, కరాటే రమేష్, సర్దార్ నరేందర్ సింగ్, షేక్ హుస్సేన్, ఉషు రాష్ట్ర కార్యదర్శి ఉమర్, నాయకులు ప్రవీణ్ పాల్గొన్నారు.


