Archive Page | Sakshi
Sakshi News home page

Warangal

  • రక్తదానం ప్రాణదానంతో సమానం

    మామునూరు: రక్తదానం ప్రాణదానంతో సమానమని, అర్హులైన ప్రతిఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాంనాయక్‌ సూచించారు. వరంగల్‌ మామునూరులోని జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రాంగణంలో స్థానిక కార్పొరేటర్‌ ఈదురు అరుణవిక్టర్‌ ఆధ్వర్యంలో జేఎన్‌వీ వరంగల్‌ అల్మినీ అసోసియేషన్‌ సహకారంతో ఉచిత వైద్యశిబిరం, మెగా రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంపీ బలరాం నాయక్‌ హాజరై మాట్లాడుతూ రక్తదానాన్ని మించిన దానం మరోటి లేదన్నారు. అనంతరం రక్తదాతలకు మెమోంటోలు, రక్తదాన ధ్రువీకరణ పత్రాలను అందజేసి ఎంపీ అభినందించారు.

Vizianagaram

  • జగన్‌కు పేరొస్తుందనే చంద్రబాబు కుట్రలు

    విజయనగరం:

    న్ని వర్గాల ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుడితే ప్రజల్లో ఆయనకున్న మంచి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబా బు, కూటమి ప్రభుత్వం భయపడుతోందని ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్‌, వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకర ణ చేసే దిశగా కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయా లు చేస్తోందని మండిపడ్డారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని, మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుని పేద ప్రజలకు మెరుగైన వైద్యం, వైద్య విద్య ఉచితంగా అందించేందుకు ప్రజా మద్దతో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12న బుధవా రం తలపెట్టనున్న ప్రజా ఉద్యమ ర్యాలీలకు సంబందించిన వాల్‌పోస్టర్‌లను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోలగట్ల కూటమి ప్రభుత్వం చేస్తోన్న మోసకారి పాలనపై పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12న విజయనగరం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు కోలగట్ల వెల్లడించారు. స్థానిక సీఎంఆర్‌ జంక్షన్‌ వద్ద గల దివంగత నేత డాక్టర్‌ వైఎస్సార్‌ విగ్రహం నుంచి స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మెయిన్‌ బ్రాంచి మీదుగా తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ సాగుతుందన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేయటం జరుగుతుందన్నా రు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజా సంఘా లు, కలిసి వచ్చే పార్టీలను భాగస్వాములు చేసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మోసపూరిత హమీలతో గద్దెనెక్కిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిందలు వేస్తూ పబ్బం గడుపుకోవటం విడ్డూరంగా ఉందని కోలగట్ల వాఖ్యానించారు.

    చేసిందేమీ లేకే..

    చెప్పుకునేందుకు చేసిందేమీ లేని కూటమి నాయకు లు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు పేర్లు మార్చి ప్రచారం చేసుకోవటమేనా వారు సాధించిన అభివృద్ధి అంటూ కోలగట్ల ప్రశ్నించారు. అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనంగా మార్చినా ఇప్పటికీ ప్రజలంతా అమ్మఒడిగానే పిలుస్తున్నారని చెప్పారు. సచివాలయాలను విజన్‌ యూనిట్‌లుగా మార్పు చేసినా ప్రజల గుండెల్లో మాత్రం సచివాలయాలగానే చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఇదే తరహలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన నవరత్నాలు, నాడు–నేడు పథకాలు ప్రజల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నాయన్నాయని వివరించారు. ఈ తరహాలో చంద్రబాబు అమలు చేసిన పథకాల్లో ప్రజలకు టక్కున గుర్తుకు వచ్చే ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఎన్నికలకు ముందు వేదికలపై ఊగిపోతూ ప్రసంగాలు చేసి పదవి వచ్చిన తరువాత యువతను మోసగించటం నిజం కాదా అని ప్రశ్నించారు. సమావేశంలో విజయనగరం కార్పొరేషన్‌ మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు, నగర పార్టీ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల పార్టీ అధ్యక్షుడు కెల్ల త్రినాధరావు, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి బోడసింగి ఈశ్వరరావు, కార్పొరేటర్‌లు జివి.రంగారావు, గాదం మురళి, బండారు ఆనంద్‌, ఎన్ని లక్ష్మణరావు, పార్టీ నాయకులు అవనాపు లక్ష్మణరావు, రెడ్డి గురుమూర్తి, బొంగ భానుమూర్తి, దుప్పాడ సునీత, తాళ్లపూడి పండు, రౌతు భాస్కరరెడ్డి, సప్పా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

    మెరకముడిదాం: మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 12న తలపెట్టిన ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌, భీమిలి నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మండలంలోని చినబంటుపల్లిలో ప్రజా ఉద్యమానికి సంబంధించి పార్టీ ముఖ్యమైన నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రజా ఉద్యమం వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ హయాంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు కూటమి నాయకులు చీకటి ఒప్పందం చేసుకున్నారని, దీనిని వ్యతిరేకిస్తూ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీన చేపట్టిన ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా బైక్‌ ర్యాలీకి ప్రతీ గ్రామం నుంచి 20 బైక్‌లకు తక్కువ కాకుండా పాల్గొనే విధంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలన్నారు. బైక్‌ ర్యాలీ గరివిడి శంకర్‌ ఫంక్షన్‌ హాలు నుంచి బయలుదేరి చీపురుపల్లిలోని మూడురోడ్లు కూడలి వరకూ నిర్వహించనున్నామని తెలిపారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు ఎస్‌.వి.రమణరాజు, తాడ్డి వేణుగోపాల్‌రావు, కోట్ల విశ్వేశ్వరరావు, కె.ఎస్‌.ఆర్‌.కె.ప్రసాద్‌, బూర్లె నరేష్‌కుమార్‌, పప్పల కృష్ణమూర్తి, రేగిడి లక్ష్మణరావు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

  • రాష్ట

    ●విజయనగరం మండలానికి చెందిన బి.సంతోష్‌ అనే యువకుడికి బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో కొద్ది రోజులు క్రితం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్పించారు. అతన్ని

    పరీక్షించిన న్యూరో సర్జరీ వైద్యులు బ్రెయిన్‌ సర్జరీ విజయవంతంగా చేశారు.

    ఇప్పడు కోలుకుంటున్నాడు.

    ●గంట్యాడ మండలానికి చెందిన సాయి అనే యువకుడు ఇటీవల పురుగు మందులు సేవించడంతో అతని పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో

    చేర్పించారు. అతనికి 15 రోజుల పాటు

    ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు

    అందించడంతో కోలుకున్నాడు.

    ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు.

    సర్వజన ఆస్పత్రి అయిన తర్వాత ఓపీ సంఖ్య బాగా పెరిగింది. సూపర్‌ స్పెషాలిటీ సేవలు కూడా అందుబాటులోకి రావడంతో రోగులు అధికంగా వస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

    – డాక్టర్‌ అల్లు పద్మజ, సూపరింటెండెంట్‌, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి

    విజయనగరం ఫోర్ట్‌:

    రాష్ట్రంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టి న నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఆస్ప త్రులు కార్పొరేట్‌ను తలదన్నేలా రూపుదిద్దుకున్నా యి. నాటి ప్రభుత్వం చేసిన ఆస్పత్రుల అభివృద్ధి ఫలితాలు క్రమేణ రోగులకు నిత్యం అందుతున్నా యి. రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనే అప్పటి వరకు అందిన సూపర్‌ స్పెషాలిటీ సేవలు ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా అందుతున్నాయి. దీంతో రోగులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి తోనే తాము ఆరోగ్య సేవలు సంతృప్తికరంగా పొందగలుగుతున్నామని గుర్తు చేసుకుంటున్నారు.

    జగన్‌మోహన్‌రెడ్డి కృషితోనే..

    వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారు. గతంలో ఏ ప్రభుత్వం అలోచన చేయని విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే గొప్ప ఆలోచన చేశారు. జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. అంతేకాకుండా కళాశాలను కూడా త్వరితగతిన నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతోనే వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్‌ తరగతులు చదువుతున్నారు.

    2022లో అంకురార్పణ

    2022 వరకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఏవీవీపీ ఆధ్వర్యంలో జిల్లా ఆస్పత్రిగా ఉండేది. కేవలం 200 పడకలు మాత్రమే అప్పట్లో ఉండేవి. ఎటువంటి సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందేవి కావు. 2022లో జిల్లాకు వైద్య కళాశాల మంజూరు కావడంతో జిల్లా ఆస్పత్రి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా మారింది. వైద్య విధాన్‌ పరిషత్‌లో ఉన్న ఆస్పత్రి డీఏఈ (వైద్య విద్యా సంచాలకులు) పరిధిలోకి వచ్చింది. అప్పటి నుంచి సూపర్‌ స్పెషాలిటీ సేవలతో పాటు వైద్యులు, సిబ్బంది పెరిగారు.

    600 మంది వరకు రోగులకు చికిత్స

    ప్రస్తుతం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో 600 మంది వరకు రోగులకు చికిత్స అందిస్తున్నారు. 18 విభాగాలు అందుబాటులోకి వచ్చాయి. 75మంది వైద్యు లు పనిచేస్తున్నారు. వీరే కాకుండే స్టాఫ్‌నర్సులు, క్లాస్‌ ఫోర్‌ ఉద్యోగులు, మినిస్టీరియల్‌ ఉద్యోగులు, పారా మెడికల్‌ ఉద్యోగులు అనేక మంది పెరిగారు.

  • ● నాల

    బొబ్బిలి: ఈపీఎఫ్‌ 95 పింఛన్‌ను రూ.9వేలకు పెంచాలని ఆ సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు పొట్నూరు శంకరరావు, ఉపాధ్యక్షుడు వి.శేషగిరిరావు అన్నారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. పరిశ్రమల్లో 30 నుంచి 40 ఏళ్ల పాటు సర్వీసు చేసి లక్షలాది రూపాయల తమ కష్టార్జితాన్ని దాచుకుంటే కేవలం రూ.700 నుంచి 2వేల లోపు మాత్రమే పెన్షన్‌ ఇవ్వడం దారుణమన్నారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెన్షన్‌ను పెంచాలని కోరుతున్నామన్నారు. పెన్షన్‌ అయినా ఇవ్వాలని లేకపోతే చనిపోవడానికి అనుమతులు అయినా ఇవ్వాలని కోరారు. సుమారు 20 కోట్ల మంది ఈపీఎఫ్‌ – 95 పెన్షన్‌ దారులున్నారనీ ఈపీఎఫ్‌ సంస్థ వద్ద రూ.25లక్షల కోట్లున్నాయన్నారు. కానీ అతి తక్కువ పెన్షన్లన్నీ రూ.700 నుంచే ఉన్నాయన్నారు. దీనిని నిరసిస్తూ ఈ నెల 11న ఉదయం 11 గంటలకు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జరపతలపెట్టిన నిరసన కార్యక్రమానికి కార్మికులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. వారి వెంట రామినాయుడు తదితరులు ఉన్నారు.

    విజయనగరం ఫోర్ట్‌: అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం, కందిపప్పు, నూనె సరుకులు చేరలేదనే అంశంపై సాక్షిలో ఈ నెల 8వ తేదీన అంగన్‌వాడీల్లో ఆకలి కేకలు అనే శీర్షికన ప్రచురించిన కథనానికి ఐసీడీఎస్‌ అధికారులు స్పందించారు. మోంథా తుఫాన్‌ కారణంగా అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా ఆలస్యమైందని ఐసీడీఎస్‌ పి.డి విమ లరాణి తెలిపారు. ఈ నెల 12వ తేదీ నాటికి సరుకులు కేంద్రాలకు చేరుతాయని తెలిపారు.

    బొబ్బిలి: పట్టణ పరిధిలోని గొల్లపల్లి నుంచి మండలంలోని అలజంగి – కారాడ గ్రామాల మధ్యలో ఉన్న అతి పెద్ద గోతుల్లో లారీ దిగబడిపోయి ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఆదివారం వేకువ జాము నుంచి ఉదయం 8.30 గంటల వరకూ సుమారు నాలుగు గంటలు పైబడి వందల సంఖ్యలో లారీలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లారీల డ్రైవర్లు, సిబ్బంది ఆహారం కోసం అల్లాడిపోయారు. ఆ సమయంలో అవసరమై న సరుకులు దొరక్క, లారీలు విడిచి వెళ్లలేక అవస్థలు పడ్డారు. మరో పక్క వాహనాలను తప్పించుకుని రావాల్సిన ఆటోలు, మోటారు బైక్‌లు, ఇతర వాహనాలతో రాలేక ఇబ్బందులు పడ్డారు. సోషల్‌ మీడియాలో ఆయా వాహనాల యజమానులు, డ్రైవర్లు, స్థానికులు రోడ్ల దుస్థితి, తమ ఇబ్బందులపై పోస్టులు పెడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. చివరకు ట్రాఫిక్‌ ఎస్సై పి.జ్ఞానప్రసాద్‌ తన సిబ్బందితో వెళ్లి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

  • ప్రణాళిక విభాగంతోనే అభివృద్ధి సాధ్యం

    విజయనగరం: నగరాలు, పట్టణాలు అభివృద్ధిలో పట్టణ ప్రణాళిక విభాగం కీలకమని, క్షేత్ర స్థాయి విధుల నిర్వహణలో అనేక ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందని ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని ఓ హోటల్లో అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడు తూ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో క్షేత్ర స్థాయి సిబ్బంది కొరత ఉందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు భర్తీ కావటం లేదని సచివాలయ ప్లానింగ్‌ సెక్రటరీలకు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌లుగా వినియోగించుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం స్పందించి పూర్తిగా వారికి బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతలు కల్పించాలన్నా రు. దీనికోసం సచివాలయ ప్లానింగ్‌ సెక్రటరీల సర్వీస్‌ రూల్స్‌ను అమెండమెంట్‌ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ప్లానింగ్‌ విభాగాన్ని మరింతగా బలోపేతం చేయటం ద్వారా పట్టణాలు, నగరాలు, స్మార్ట్‌ సిటీలలో అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. నూతనంగా ఏర్పా టు చేస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు వాటికి కనెక్టింగ్‌ రోడ్లు నిర్మాణానికి ప్రణాళిక విభాగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సభ్యులకు గ్రూప్‌ ఇన్సూ రెన్స్‌ ఏర్పాటు చేసేందుకు అవసరమైన విధి విధానాలను పరిశీలించాలని సూచించారు. అసోసియేషన్‌ కార్యదర్శి మోహన్‌బాబు మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఓ మారు సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తున్నామని, సభ్యుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. జోనల్‌ అధ్యక్షులు వసీంబేగ్‌ మాట్లాడుతూ నగరాల్లో పట్టణ ప్రణాళిక విభాగంపైనే అధికంగా ఒత్తిడి ఉంటుందని, నగర పౌరులకు ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా ముందుగా ఈ విభాగమే గుర్తుకు వస్తుందన్నారు. సమావేశంలో అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ సత్తార్‌, ఆర్డీడీపీ నాయు డు, మొదటి జోన్‌ అధ్యక్షుడు ఐ.వి.రమణమూర్తి, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, జి. కృష్ణ, రతన్‌రాజు, టీపీఎస్‌ సునీత, మతిన్‌ పలువు రు సభ్యులు పాల్గొన్నారు.

  • పేదలకు ఉచిత న్యాయ సహాయం

    డెంకాడ: పేద ప్రజలు న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం, సలహాలు పొందవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. జిల్లా న్యాయ సేవా దినోత్సవాన్ని పురష్కరించుకు ని మండలంలోని డి.కొల్లాం గ్రామంలో న్యాయ అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు. సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ సమ న్యాయం పొందడం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. రూ.3 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారందరూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించి న్యాయ సహాయం పొందవచ్చని చెప్పారు. ఆర్థిక, ఇతర కారణాలు వలన ఏ ఒక్కరూ న్యాయం పొందే అవకాశం కోల్పోకూడదన్న ఉద్దేశంతో 1987 సంవత్సరంలో లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ప్రకారం డీఎల్‌ఎస్‌ఏగా ఏర్పాటైందన్నారు. దీని ద్వారా ఉచితంగా న్యాయ సహాయం అందించడమే లక్ష్యమన్నారు. వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాలు అందేందుకు కూడా సహాయం చేస్తుందని తెలిపారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ నేరుగా గాని, టోల్‌ఫ్రీ నంబరు 15100కు ఫోన్‌ చేసి న్యాయ సహాయం పొందవచ్చని వివరించారు.

    శక్తి యాప్‌పై విస్తృత ప్రచారం

    విజయనగరం డీఎస్పీ ఆర్‌.గోవిందరావు మాట్లాడు తూ బాలికలకు, మహిళలకు రక్షణగా ఉండే శక్తి యాప్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. సోషల్‌ మీడియా వలన మంచి, చెడులు కూడా ఉన్నాయని, అందువలన జాగ్రత్తగా వ్యవహరించా లని చెప్పారు. సదస్సులో సర్పంచ్‌ అట్టాడ కృష్ణ, జిల్లా బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు కె.రవిబాబు, సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు, న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

  • ఇక జైలుకే.. : ఎస్పీ

    బొబ్బిలి: గతంలో మద్యం తాగి వాహనాలు నడిపి తే రూ.10వేల జరిమానా విధించే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు దానితో పాటు వారిని జైలుకు కూడా పంపించి శిక్ష అనుభవించి చేసిన తప్పులు తెలుసుకునేలా చేస్తామని ఎస్పీ దామోదర్‌ అన్నారు. ఆది వారం రాత్రి పట్టణంలోని పోలీసు సర్కిల్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గంజాయి తరలించినా, సేవించినా కఠినమైన చర్యలుంటాయన్నారు. అలాగే మహిళలు, మైనర్‌ బాలికలతో లైంగిక వేధింపులు చేసే వారిపై పోక్సో, గృహ హింస చట్టాలను అమలు చేస్తామన్నారు. డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడే ఆన్‌లైన్‌ మోసగాళ్లను ఇటీవల అరెస్ట్‌ చేశామన్నారు. అనంతరం మండలంలో ని దిబ్బగుడ్డివలసలో గ్రామస్తులకు సైబర్‌ నేరాలు, గృహ హింసలపై అవగాహన కల్పించారు. డీఎస్పీ జి.భవ్యారెడ్డి, సీఐలు కె.సతీష్‌కుమార్‌, నారాయణరావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Yadadri

  • పత్తి

    సంస్థాన్‌ నారాయణపురం, చౌటుప్పల్‌ రూరల్‌: పత్తి రైతుల పేరిట దళారులు, బ్రోకర్లు జీరో దందా చేస్తున్నారు. ట్రేడ్‌ లైసెన్స్‌, జీఎస్టీ నంబర్‌ లేకుండా నింబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పత్తి కొనుగోలు చేస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు. రైతుల పేరు చెప్పి మిల్లులకు అమ్ముతూ జీఎస్టీ చెల్లించకుండా ఎగనామం పెడుతున్నారు. ఈ తంతు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. జిల్లాలో 65,108 మంది రైతులు 1,27,060 ఎకరాల్లో ఈసారి పత్తిపంటను సాగు చేశారు. సుమారు ఆరు లక్షల నుంచి ఎనిమిది లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ కలిసిరాక దిగుబడి తగ్గింది. వచ్చి కాస్త దిగుబడిని కూడా దళారులు, బ్రోకర్లు కొనుగోలు చేసి రూ.లక్షలు సంపాదిస్తుంటే రైతులు మాత్రం నష్టాలను చవిచూస్తున్నారు.

    దందా ఎలా చేస్తున్నారంటే..

    గ్రామాల్లో రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న దళారులు, బ్రోకర్లు ఎలాంటి లైసెన్స్‌, జీఎస్టీ నంబర్‌ లేకుండానే వారి నుంచి క్వింటాకు రూ.6,100 నుంచి రూ.6,300కు పత్తి కొనుగోలు చేస్తారు. పత్తి కొనుగోలు చేసినట్లు రైతులకు రశీదులు ఇవ్వకుండా చిన్నచిన్న కాగితం ముక్కల మీద రాసి ఇస్తున్నారు. కొనుగోలు చేసిన పత్తిని లారీలు, డీసీఎంల ద్వారా పత్తి మిల్లులకు తరలించి రైతుల పేరిట అమ్ముతారు. మిల్లుల యాజమాన్యం రైతుల పేరిట ఇచ్చే చెక్కులను తీసుకొచ్చి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. అనంతరం రైతులతో డ్రా చేయించి అందులోంచే రైతులకు డబ్బులు చెల్లిస్తారు. జీఎస్టీ, మార్కెటింగ్‌ ఆధికారులకు ఎక్కడా దొరకకుండా జీఎస్టీకి ఎగనామం పెడుతూ ప్రభుత్వానికి ఆదాయం సమకూరకుండా పత్తి దందా సాగిస్తున్నారు.

    కాలం చెల్లిన కాంటాలతో మోసం

    దళారులు, బ్రోకర్లు.. రైతుల వద్ద కొనుగోలు చేసే సమయంలో కాలం చెల్లిన గొలుసు కాంటాలు వాడుతూ తూకంలోనూ మోసం చేస్తున్నారు. ప్రభుత్వ నింబంధనల ప్రకారం కంప్యూటర్‌ కాంటాలు వాడాల్సినప్పటికి వాడటం లేదు. ఈ క్రమంలో తూకం వేసిన తర్వాత క్వింటాకు కిలో చొప్పున కోత విధిస్తూ దోచుకుంటున్నారు. ఽఈ క్రమంలో దళారులు, బ్రోకర్లు కలిసి సిండికేట్‌గా ఏర్పడి గ్రామాల వారీగా పంచుకొని పత్తి దందా సాగిస్తున్నారు. ఒక రైతు వద్ద ఒక దళారీ పత్తికి నల్లగా ఉందని, తేమ ఉందిని వివిధ సాకులు చెప్పి ఒక ధర నిర్ణయిస్తే అదే ఫైనల్‌ చేస్తూ ఇతర రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ఇదేకాక అరువుపై విత్తనాలు, రసాయన మందులు ఇచ్చిన దళారీ వ్యాపారులకే పత్తి అమ్మాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదీకాక రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్మాలంటే యాఫ్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. కానీ, రైతులుకు అవగాహన లేకపొవడంతో దళారులకు తెగనమ్ముకుంటున్నారు. కానీ దళారులు, అధికారులు కుమ్మకై ్క పత్తి రైతుల పేరిట పత్తిని కొంటున్నారు. ఈ తతంగం యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో కేటాయించిన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పరిధిలోఇ ఓ జిన్నింగ్‌ మిల్లులోని సీసీఐ కొనుగోలు కేంద్రంలో కొనసాగుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో దళారులు తెచ్చే పత్తికి అధికారులు తేమ శాతం కొర్రీలు పెట్టకుండా కొనడం విశేషం. అదే రైతులు తెస్తే మాత్రం సవాలక్ష కొర్రీలు పెడుతూ కాంటాలు వేయట్లేదని బహిరంగ రహస్యం. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే రైతులు ఆరోపిస్తున్నారు.

    లైసెన్స్‌, జీఎస్టీ లేకుండానే పత్తి కొనుగోలు

    రైతుల పేరుతో జీరో దందా

    మద్దతు కంటే తక్కువ ధరకే విక్రయం

    క్వింటాకు ఐదు శాత జీఎస్టీ కూడా

    చెల్లించకుండా ఎగనామం

    డీసీఎం లోడ్‌కు చెల్లించాల్సిన

    ట్యాక్స్‌ రూ.32 వేల వరకు..

    ట్యాక్స్‌ రూపంలో ప్రభుత్వానికి

    దక్కని ఆదాయం

    పత్తి కొనుగోలు చేసే దళారులు, బ్రోకర్లుపై సంబంధిత అధికారులు దృష్టిపెట్టాలి. వారు ఉపయోగించే కాంటాలను పరిశిలించాలి. రైతులు పత్తి అమ్మకానికి వస్తే ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టకుండా పట్టాదారు పాస్‌ పుస్తకం చూసి కొనుగోలు చేయాలి. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది.

    – జక్కడి వెంకట్‌రెడ్డి, రైతు,

    సంస్థాన్‌ నారాయణపురం

    ట్యాక్స్‌ ఎగవేత ఎంతంటే..

    పత్తి కొంటున్న దళారులు డీసీఎం, లారీల్లో తరలిస్తారు. ఒక్క డీసీఎంలో సుమారు 70క్వింటాళ్ల నుంచి 80 క్వింటాళ్ల పత్తిని నింపుతారు. లారీల్లోనైతే 80క్వింటాళ్ల నుంచి 100 క్వింటాళ్లు నింపుతారు. పత్తి ధరలు తేమ శాతం ఆధారంగా క్వింటాకు రూ.7,785 నుంచి 8,110 వరకు ఉన్నాయి. అయితే ఐదు శాతం చొప్పున క్వింటాకు రూ.400 వరకు జీఎస్టీ ఉంటుంది. డీసీఎంకు రూ.28వేల నుంచి రూ.32వేలు వరకు, లారీ లోడ్‌కై తే రూ.32వేల నుంచి రూ.40వేల వరకు జీఎస్టీ పడుతుంది. ట్రేడ్‌ లైసెన్స్‌, జీఎస్టీ నంబర్‌ ఉంటేనే నింబంధనల ప్రకారం పత్తి కొనుగోలు చేయాలి. అందుకు ట్యాక్స్‌ చెల్లించాలి. కానీ, దళారులు, బ్రోకర్లు ట్యాక్స్‌ చెల్లించకుండా రైతుల పేరిట దందా సాగిస్తున్నారు.

  • ధాన్య

    సాక్షి, యాదాద్రి : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూర్పార పట్టేందుకు ప్యాడీ క్లీనర్లు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో ధాన్యం శుభ్రం చేసేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరా లేక ప్యాడీ క్లీనర్‌లు నిరుపయోగంగా మారాయి. పలుచోట్ల పది ప్యాడీ క్లీనర్లు మూలనపడ్డాయి. పైగా ప్రభుత్వ ప్యాడీ క్లీనర్లలో ధాన్యం సరిగా శుభ్రం కాకపోవడంతో మిల్లులు కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు జేసీబీ, ట్రాక్టర్‌ ఫ్యాన్లను అద్దెకు తెచ్చుకుని తమ ధాన్యాన్ని తూర్పార పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో అద్దె ఫ్యాన్లకు గంటకు రూ.వెయ్యి చొప్పున చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఇదిలా ఉంటే పలుకేంద్రాల్లో ఒకేకాంటా ఉండడంతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు వాపోతున్నారు.

    కొన్ని కేంద్రాల్లో యంత్రాలు ఉన్నా..

    రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఆటోమేటిక్‌ ప్యాడీక్లీనర్‌లు, సెమీ ప్యాడీ క్లీనర్‌లు రైతులకు ఆశించిన స్థాయిలో ఉపయోగపడంలేదు. కొన్నిచోట్ల ప్యాడీ క్లీనర్లు ఉన్నా అవి మూలనపడి మరమ్మతలకు నోచుకోవడం లేదు. అయినప్పటికీ వాటిని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు పనిచేసేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

    మరికొన్ని చోట్ల ఇలా..

    ● ఆత్మకూర్‌ (ఎం) మండలం కూరెళ్ల గ్రామంలో 20రోజుల క్రితం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తే తొలిరోజు ధాన్యం శుభ్రం చేస్తుండగా ప్యాడీక్లీనర్‌ మిషన్‌లోంచి పొగలు వచ్చాయి. మోటారు కాలిపోవడం, క్లచ్‌ప్లేట్లు పాడైపోవడంతో పనికిరాకుండా పోయింది. అప్పటినుంచి రైతులు గంటకు వెయ్యి రూపాయలు ఇచ్చి ట్రాక్టర్‌ ఫ్యాన్లపై ధాన్యం తూర్పారా పట్టుకుంటున్నారు.

    ● మోత్కూరు సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్యాడీ క్లీనర్‌ మరమ్మతులకు నోచుకోకుండా వృథాగా పడిఉంది. దీంతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోంది. సొంత ట్రాక్టర్లతో ధాన్యాన్ని తూర్పారా పడుతున్నారు.

    కొనుగోలు కేంద్రాల ఏర్పాటు : 329

    కావాల్సిన ఆటోమేటిక్‌ ప్యాడీ క్లీనర్స్‌ : 79

    అందుబాటులో ఉన్నవి : 31

    కావాల్సిన సెమీ ప్యాడీ క్లీనర్స్‌ : 325

    అందుబాటులో ఉన్నవి : 209

    ధాన్యం దిగుబడి అంచనా 7 లక్షల మెట్రిక్‌ టన్నులు

    ధాన్యం కొనుగోలు లక్ష్యం 3 లక్షల మెట్రిక్‌ టన్నులు

    కొనుగోలు చేసిన ధాన్యం 40 వేల మెట్రిక్‌ టన్నులు

    కొన్ని కేంద్రాల్లోనే వినియోగంలో

    ప్యాడీ క్లీనర్లు

    మరికొన్ని చోట్ల విద్యుత్‌ సౌకర్యం

    లేక నిరుపయోగం

    అంతంత మాత్రంగానే

    పనిచేస్తున్న ప్రభుత్వ ప్యాడీక్లీనర్లు

    అద్దె ఫ్యాన్లతో ధాన్యం శుభ్రం

    గంటకు రూ.వెయ్యి చొప్పున ఖర్చు

  • 79 పాఠశాలల్లో టీచర్ల కొరత

    భువనగిరి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రకారం ఉపాధ్యాయుల అదనంగా ఉన్నట్లు విద్యా శాఖ వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. విద్యార్థులు ఉన్నచోట ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నచోట విద్యార్థులు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు మూడుసార్లు తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. ఇంకా కొన్ని స్కూళ్లలో టీచర్ల కొరత ఉన్నట్లు లెక్కలు తేలాయి.

    అదనంగా 249 మంది

    జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 744 ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 45,626 మంది విద్యార్థులు ఉండగా వివిధ కేటగిరీల్లో మొత్తం 3,397 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులు తక్కువగా ఉండి ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలలు 244 ఉండగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేనివి 79 స్కూళ్లు ఉన్నట్లు విద్యా శాఖ గణాంకాల ప్రకారం తేలింది. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఎక్కువగా ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న చోటుకు ఇప్పటి వరకు 187 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. అయినా కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు మిగులు ఉండగా మరికొన్ని చోట్ల కొరత ఉంది.

    జీరో ఎన్‌రోల్‌మెంట్‌ పాఠశాలలు 66

    జిల్లాలో ప్రస్తుతం 744 పాఠశాలలకు గాను 3,397 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. 2024–25 విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య 44,849 మంది ఉండగా 2025–26 విద్యా సంవత్సరానికి 45,626 మంది ఉన్నారు. గత విద్యా సంవత్సరం జీరో ఎన్‌రోల్‌మెంట్‌ పాఠశాలలు 65 ఉండగా ఈ విద్యా సంవత్సరానికి 66కు చేరింది. అలాగే ఈ ఏడాదికి ఒక్కరు కూడా చేరని పాఠశాలల సంఖ్య 5 ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య 101 ఉండగా 10 మంది విద్యార్థులోపు ఉన్న పాఠశాలలు 93 ఉన్నాయి. యూడైస్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం విద్యా శాఖ ఈ గణాంకాలు తీసుకున్నట్లు సమాచారం.

    అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకేలాలేని ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి

    విద్యార్థులుంటే టీచర్లు..

    టీచర్లుంటే విద్యార్థులు తక్కువ

    244 స్కూళ్లలో అదనంగా

    ఉపాధ్యాయులు

    విద్యా శాఖ గణంకాల్లో వెల్లడి

    హేతుబద్ధీకరణకు మించి..

    కొన్ని పాఠశాలల్లో రేషనలైజేషన్‌(హేతుబద్ధీకరణ)కు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ ప్రకారం ఒక్క పాఠశాలలో 277 మంది విద్యార్థులకు 9 మంది ఉపాధ్యాయులు ఉండాలి. కానీ, కొన్ని పాఠశాలల్లో హేతుబద్ధీకరణకు మించి ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారు. దీంతో పాఠశాలల్లో ఉపాధ్యాయుల మిగులు కనిపిస్తుంది. కొన్ని చోట్లు విద్యార్థులుండి ఉపాధ్యాయుల తక్కువగా ఉన్న పాఠశాలలు ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరానికి బడిబాట నిర్వహించి బడిలో చేర్పించే విద్యార్థుల సంఖ్య గత ఏడాదితో పోల్చితే పెరిగింది. కానీ, ఐదుగురులోపు విద్యార్థులున్న పాఠశాలలు చివరికి వరకు కొనసాగుతాయలేదా అనే సందేహం నెలకొంది.

    పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న చోట విద్యార్థులకు సమస్య లేకుండా తాత్కాలిక సర్దుబాటు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నాం. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండి సెక్షన్స్‌ ఉండడంతో ఉపాధ్యాయుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉపాధ్యాయుల కొరత లేకుండా సర్దుబాటు చేస్తూ సమస్య లేకుండా చేస్తున్నాం.

    – సత్యనారాయణ, జిల్లా విద్యా శాఖ అధికారి

  • ప్రజల

    భువనగిరి: న్యాయ సేవా చట్టం అమలులోకి రావడంతో ప్రజలకు ఉచిత న్యాయ సేవలు చేరువయ్యాయని డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ బి.వెంకటేష్‌ అన్నారు. జాతీయ న్యాయ సేవల సాక్షరత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం భువనగిరి పట్టణంలోని మైనార్టీ గురుకుల కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. న్యాయ సేవ సంస్థ చట్టం ద్వారానే పోక్సో చట్టం, మాదక ద్రవ్య నిషేధం, విద్యాహక్కు చట్టం, బాల్య వివాహాలు నిర్మూలన వంటి వాటిపై అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సదస్సులో అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ ఎన్‌ రాజశేఖర్‌, సీహెచ్‌.సరిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్‌ సాయిలక్ష్మి, సిబ్బంది నర్సింహారావు, రాజు, శ్రీనివాస్‌, పాఠశాల అధ్యాపకుడు పాండు పాల్గొన్నారు.

    ప్రీ ప్రైమరీ స్కూళ్లలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు

    భువనగిరి : జిల్లాలోని నాలుగు ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో టీచర్‌, ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అడ్డగూడూరు మండలంల లక్ష్మీదేవి కాల్వ గ్రామంలో ఆయా, భువనగిరి మండలం సూరేపల్లి పాఠశాలలో టీచర్‌, ఆయా, బొమ్మలరామారం మండలం సోలిపేట పాఠశాలలో ఆయా, యాదగిరిగుట్ట మండలం ధర్మారెడ్డిగూడెం పాఠశాలలో ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. టీచర్‌గా పనిచేసేందుకు ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత, ఆయా పోస్టుకు 10వ తరతగతి లేదా 7వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని తెలిపారు. పాఠశాల ఉన్న గ్రామంలోనే నివాసం, అదే మండలం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల లోపు ఉండాలని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ధ్రువపత్రాలతో పూర్తి చేసిన దరఖాస్తులను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఈ నెల 13వ తేదీలోపు అందజేయాలని, పూర్తి వివరాలకు సెల్‌ నంబర్‌ 9948979973ను సంప్రదించాలని కోరారు.

    విలువలను రక్షించేది సాహిత్యమే

    రామగిరి (నల్లగొండ) : సమాజంలో విలువలను పరిరక్షించేది సాహిత్యమేనని ప్రముఖ సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నా రు. ఆదివారం వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని టీఎస్‌యూటీఎఫ్‌ భవన్‌లో నిర్వహించిన సాహిత్య సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సాహిత్యం అభ్యుదయ సమాజాన్ని కాంక్షించేలా ఉండాలన్నారు. పాఠశాల స్థాయి పిల్లలనుంచి యూనివర్సిటీ స్థాయి విద్యార్థుల వరకు తెలంగాణ సాహిత్య సమావేశంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కవులు, రచయితలు మునాస్‌ వెంకట్‌, బెల్లి యాదయ్య, తండు కృష్ణకౌండిన్య, కుకుడాల గోవర్ధన్‌, చొల్లేటి ప్రభాకర్‌, కృష్ణమాచార్య, మేరెడ్డి యాదగిరిరెడ్డి, బైరెడ్డి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

  • చలి పంజా విసురుతోంది

    సాక్షి, యాదాద్రి : శీతాకాలం ప్రారంభంతోనే చలిపులి పంజా విప్పింది. రెండు రోజులుగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జిల్లాలో సగటున 17 రాత్రి వేల కనిష్టస్థాయి ఉష్ణోగ్రతలు డిగ్రీలలోపు నమోదవుతున్నాయి. శనివారం సాయంత్రం నుంచే చలి ప్రారంభం కాగా ఆదివారం ఉదయం మరింత తీవ్రమైంది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో చలి ప్రభావం మొదలైంది. నవంబర్‌ 10 నుంచి చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రోజుల్లో జిల్లాలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

    వణికిస్తున్న చలి

    జిల్లా వ్యాప్తంగా చలి గజగజ వణికిస్తోంది. రెండు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. చౌటుప్పల్‌, యాదగిరిగుట్ట, రాజాపేట, ఆలేరు, ఆత్మకూర్‌ (ఎం), నారాయణపురం, పోచంపల్లి మండలాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలలోపు నమోదు అయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 8 గంటల వరకూ చలి ప్రభావం ఉంటోంది. నిజానికి ఈశాన్య రుతుపవనాలు ఈ నెల మధ్య వరకు ఉండాల్సి ఉన్నా, మోంథా తుపాను ప్రభావంతో అవి త్వరగానే వెళ్లిపోయాయి. అక్టోబర్‌ 27 నుంచి మూడ్రోజుల పాటు మోంథా తుపాను ప్రభావం ఉండగా, 30 నాటికి అది బలహీనపడింది. ఆ తర్వాత రెండు మూడు రోజులు వర్షాలు పడినా, ఆ తర్వాత మాత్రం తగ్గిపోయాయి. తుపానుతో పాటే తేమ అంతా కూడా వెళ్లిపోవడంతో జిల్లాలో పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు చలిగాలులు పెరగంతో జనం గజగజ వణికిపోతున్నారు.

    మండలం ఉష్ణోగ్రత (డిగ్రీల్లో)

    యాదగిరిగుట్ట 15.9

    రాజాపేట 16.1

    ఆలేరు 15.9

    బొమ్మలరామారం 17.5

    భువనగిరి 17.5

    గుండాల 17.3

    రామన్నపేట 16.4

    మోటకొండూరు 16.2

    చౌటుప్పుల్‌ 19.2

    ఆత్మకూర్‌(ఎం) 17.8

    నారాయణపురం 17.8

    17 డిగ్రీలకు పడిపోయిన

    రాత్రిపూట ఉష్ణోగ్రతలు

    మొదలైన చలి తీవ్రత

    గజగజ వణుకుతున్న జనం

  • బీసీ రిజర్వేషన్లతోనే  సామాజిక తెలంగాణ

    సూర్యాపేట : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన సామాజిక తెలంగాణ నిర్మాణంలో కీలక ముందడుగు అని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఆదివారం సూర్యాపేటలో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సామాజిక తెలంగాణ– బీసీ రిజర్వేషన్లు– ప్రాతినిథ్యం ప్రజాస్వామ్యం’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చి న్యాయసమీక్ష నుంచి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. శాసనసభ చట్టం చేసి పంపితే తిరస్కరించే అధికారం గవర్నర్లకు లేదన్నారు. నారబోయిన కిరణ్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్‌, నాయకులు కుంట్ల ధర్మార్జున్‌, నాగరాజుగౌడ్‌ పాల్గొన్నారు.

Hanamkonda

  • భార్య కాపురానికి రావడం లేదని..

    కురవి: భార్య కాపురానికి రావడంలేదనే కారణంతో భర్త సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం రాజోలులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. డోర్నకల్‌ మండలం పెరుమాళ్లసంకీసకు చెందిన శెట్టి వెంకటేశ్వర్‌రావుకు కొన్ని సంవత్సరాల క్రితం రాజోలుకు చెందిన పుష్పతో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. తరచూ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. వారం రోజుల క్రితం కూడా జరగడంతో పుష్ప తల్లిగారింటికి వచ్చింది. తన భార్యను కాపురానికి పంపించడం లేదని వెంకటేశ్వర్‌రావు శనివారం రాజోలుకు వచ్చి గొడవ చేసినట్లు సమాచారం. ఆదివారం గ్రామంలోని సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని టవర్‌పై నుంచి దించి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ విషయమై ఎస్సై సతీశ్‌ను వివరణ కోరగా వెంకటేశ్వర్‌రావు తన భార్యను కొట్టడంతో ఆమె తల్లిగారింటికి వచ్చిందని, భార్య కావాలని టవర్‌ ఎక్కగా కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించినట్లు తెలిపారు.

    సెల్‌టవర్‌ ఎక్కి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

    రాజోలులో ఘటన

  • పెండింగ్‌ డీఏలను చెల్లించాలి

    కాళోజీ సెంటర్‌: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ విరమణ భత్యాలను చెల్లించాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీయూటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు రామినేని వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం వరంగల్‌లో ఆ సంఘం రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్దుబాటు పారదర్శకంగా చేయాలని కోరారు. ఈ సందర్భంగా టీయూటీఎఫ్‌ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి నూతనకంటి బాబును సంఘం ముఖ్య సలహాదారుగా నియమించినట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ధార గణేశ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లచ్చిమల్ల వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు యర్రంశెట్టి స్నేహ, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు చెడుపాక కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి కందకట్ల సత్యనారాయణ, గోపాలదాస్‌ శ్రీవిద్య, వివిధ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

    టీయూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

    వెంకటేశ్వర్లు

  • హ్యాండ్‌బాల్‌ టోర్నీ విజేత వరంగల్‌, ఆదిలాబాద్‌

    కోస్గి: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 69వ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ టోర్నీ ఆదివారం ముగిసింది. అండర్‌–17 బాలబాలికలకు మూడు రోజులపాటు నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. బాలుర విభాగంలో జరిగిన ఫైనల్‌లో మహబూబ్‌నగర్‌ జట్టుపై వరంగల్‌ జట్టు 22–15 పాయింట్ల తేడాతో విజేతగా నిలిచింది. బాలికల విభాగంలో మహబూబ్‌నగర్‌ జట్టుపై ఆదిలాబాద్‌ జట్టు 16–07 పాయింట్ల తేడాతో విజేతగా నిలవగా.. మహబూబ్‌నగర్‌ బాలబాలికల జట్లు రన్నర్‌గా నిలిచాయి. కరీంనగర్‌ బాలబాలికల జట్లు తృతీయ స్థానంలో నిలిచాయి. కాంగ్రెస్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు బెజ్జు రాములు, పట్టణ అధ్యక్షుడు తుడుం శ్రీనివాస్‌ బహుమతులు ప్రదానం చేశారు.

  • ఆర్థిక సమస్యలతో యువకుడి ఆత్మహత్య

    హసన్‌పర్తి: ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన హసన్‌పర్తిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కమలాపూర్‌ మండలం వంగపల్లికి చెందిన అరుణకు హసన్‌పర్తికి చెందిన కాలె తిరుపతి(41)తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. ప్రస్తుతం తిరుపతి ఓ ప్రైవేట్‌ యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల వర్షానికి ఇల్లు కూలిపోవడంతోపాటు ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపానికి గురై శనివారం అర్ధరాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • రెజోనెట్‌కు అనూహ్య స్పందన

    హన్మకొండ: రెజోనెన్స్‌ విద్యాసంస్థ నిర్వహించిన రెజోనెట్‌ టాలెంట్‌ టెస్ట్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఆదివారం హనుమకొండలోని రెజోనెన్స్‌ జూనియర్‌ కళాశాల సెంటర్‌లో నిర్వహించిన టాలెంట్‌ టెస్ట్‌కు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఫీజులో 10 నుంచి 100 శాతం రాయితీ కల్పించనున్నట్లు యాజమాన్యం పేర్కొంది. దీంతో వరంగల్‌ మహానగరంతోపాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు తరలివచ్చారు. టాలెంట్‌ టెస్ట్‌కు హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులకు రెజోనెన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ లెక్కల రాజిరెడ్డి, డైరెక్టర్లు లెక్కల మహేందర్‌రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి, లెక్కల రమ్య రాజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

  •  ఆనంద
    ● వరంగల్‌లో అందుబాటులో అద్దె కార్లు.. ● ఆసక్తి చూపుతున్న పర్యాటకులు, నగర వాసులు

    ఖిలా వరంగల్‌ : అభిరుచి, అవసరాల మేరకు ఇప్పుడు ప్రతి ఒక్కరికీ బైక్‌తో పాటు కారు ఉంటోంది. అయితే రైళ్లు, బస్సుల ద్వారా మాత్రమే చేరుకునే పట్టణాలు, ప్రాంతాలకు తమ సొంత వాహనాలను తీసుకెళ్లడం సాధ్యం కాదు. అలాంటి సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో తిరగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఆ సమయంలో కారు ఉంటే బాగుంటుందని చాలా మంది భావిస్తుంటారు. ఇలాంటి వారికి శుభవార్త. వివిధ పనుల నిమిత్తం వరంగల్‌ నగరానికి వచ్చే వారికి అద్దె కార్లు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు, నగరవాసుల అవసరం, ఆసక్తి మేరకు ప్రస్తుతం వరంగల్‌, హనుమకొండ ట్రైసిటీలో 10 వరకు సెల్ఫ్‌ డ్రైవ్‌, అద్దె కార్ల షాపులు ఉన్నాయి.

    అద్దె కారులో సంతోషంగా

    పర్యాటక ప్రాంతాల సందర్శన..

    ఆదివారం, ప్రభుత్వ సెలవు వచ్చిందంటే మేడారం,మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి, హైదరాబాద్‌, యాదగిరి గుట్ట, పాలకుర్తి, వేములవాడ, కొ మ్మాల, పాకాల, రామప్ప, లక్నవరం సరస్సుకు సెల్ఫ్‌ డ్రైవ్‌తో కుటుంబంతో కలిసి వెళ్లాలనే ఆశ అం

    దరిలోనూ ఉంటుంది. వారి ఆశలను వరంగల్‌ నిరుద్యోగ యువత తీరుస్తోంది. సెల్ఫ్‌ డ్రైవ్‌ కార్లను అందుబాటులో ఉంచుతోంది. వీటిని పర్యాటకులు, నగర వాసులు వినియోగించుకుంటూ కారులో సంంతోషంగా ప్ర యాణిస్తూ తమ ఆశలను నెరవేర్చుకుంటున్నారు.

    అద్దెకు అన్ని రకాల కార్లు..

    నగరంలో నిరుద్యోగ యువత ఉపాధే మార్గంగా సెల్ఫ్‌ డ్రైవ్‌ కార్లు, రెంటల్‌ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్ని రకాల కార్లను అద్దెకు ఇస్తున్నారు. ఫలితంగా నగరానికి వచ్చే పర్యాటకులు, వ్యాపారులకు ఇది ఎంతో ప్రయోజన కరంగా ఉంది. హుందాగా కారులో షికారు చేస్తూ పనులు పూర్తి చేసుకుని తిరిగి కారు అప్పగించి వెళ్లిపోయే సౌలభ్యం అందుబాటులోకి వచ్చేంది. యువత, వ్యాపారులు, పర్యాటకులు ఈ సౌలభ్యాన్ని ఎక్కువ వినియోగించుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. వాహనాన్ని బుక్‌ చేసుకోవాలంటే నేరుగా కారు సెల్ఫ్‌ డ్రైవ్‌, రెంటల్స్‌ కేంద్రాలకు వెళ్లి తమ డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆధార్‌ కార్డుల జిరాక్స్‌ కాపీలు, ఒరిజనల్‌ డ్రైవింగ్‌ జతచేసి పూరించిన ఫార్మట్‌ అందజేయాల్సి ఉంటుంది.

    చాలా బాగుంది

    నేను హైకోర్టులో అడ్వకేట్‌గా విధులు నిర్వర్తిస్తున్న. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు రైలులో వస్తుంటా. ఇక్కడ సెల్ఫ్‌ డ్రైవ్‌ కారు తీసుకుని నగరంలో పనులన్నీ పూర్తి చేసుకుంటా. అనంతరం కారు అప్పగించి తిరిగి హైదరాబాద్‌ వెళ్తా.

    దేవులపల్లి మల్లికార్జున్‌రావు, అడ్వకేట్‌

    యువతే ఆసక్తి చూపుతోంది

    ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితోపాటు నగరానికి చెందిన యువ త ఎక్కువగా కార్ల ను అద్దెకు తీసుకునేందుకు ఆసక్తి చూపుతోంది. పర్యాటకుల అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఈ కేంద్రాలను ఏర్పాటు చేశాం. నిబంధనల మేరకు కార్లను అద్దెకు ఇస్తున్నాం.

    ఎస్‌. విజయ్‌కుమార్‌,అద్దెకార్ల షాపుల యజమాని, వరంగల్‌

    అద్దె రుసుము ఇలా..

    ఈకేంద్రాల్లో 12 గంటల కన్నా తక్కువ సమయానికి కారు అద్దెకివ్వరు. 24 గంటల సమయానికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కారు సీట్లను బట్టి ధర నిర్ణయిస్తారు. 24 గంటలకు ఐదు సీట్ల కారుకు రోజుకు రూ. 1,300 నుంచి రూ.1,600 వరకు వసూలు చేస్తారు. అదే ఏడు సీట్ల కారు అయితే రూ.1,900 నుంచి రూ.2,000 వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కారు కంపెనీ బట్టి రెంటల్‌ ధర నిర్ణయిస్తారు. దీనిని బుక్‌ చేసుకోవాలంటే నేరుగా ఆయా కేంద్రాలకు వెళ్లి గాని, సంస్థ ఫోన్‌ నంబర్‌కు గాని కాల్‌ చేయాలి.

  • రేపు

    వరంగల్‌ స్పోర్ట్స్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14,17 బాలబాలికల అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలను మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి వి.ప్రశాంత్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు భీమారం సమీపంలోని కిట్స్‌ కళాశాలలో ప్రారంభమయ్యే ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్‌, జనన ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకురావాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు రజినీకాంత్‌ 93910 29491, పార్థసారథి 98497 60799 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

    ముగిసిన ‘సర్జన్స్‌’

    రాష్ట్రస్థాయి సదస్సు

    ఎంజీఎం: నగరంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న సర్జన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగిసింది. కాళోజీ క్షేత్రంలో నిర్వహించిన ముగింపు సదస్సులో లాప్రోస్కోపి శస్త్రచికిత్సలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్జన్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ సదస్సు విజయవంతం కావడానికి కేఎంసీ పోస్టు గ్రాడ్యుయేట్‌ విదార్థులు, సర్జన్ల కృషి ఉందన్నారు. సదస్సులో పాల్గొన్న అతిథులతో పాటు సదస్సు విజయవంతం చేసిన వారిని అసోసియేషన్‌ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. సదస్సులో సర్జన్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డాక్టర్‌ మోహన్‌దాస్‌, కూరపాటి రమేశ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, నాగేందర్‌ పాల్గొన్నారు.

    చిట్‌ఫండ్‌ యజమానిపై కేసు

    కాజీపేట: కాజీపేట పట్టణంలో 30 మంది చిరు వ్యాపారుల నుంచి దాక్షాయణి చిట్‌ఫండ్‌ పేరుతో రూ.30 లక్షలు వసూలు చేసిన గుండ్ల శ్రావణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ సుధాకర్‌ రెడ్డి తెలిపారు. కాజీపేట పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం సాయంత్రం ఎస్సై నవీన్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. హనుమకొండకు చెందిన గుండ్ల శ్రావణ్‌కుమార్‌ ఫైనాన్స్‌ సంస్థను స్థాపించి వ్యాపారుల వద్ద డబ్బులు వసూలు చేశాడు. పది రోజులుగా శ్రావణ్‌కుమార్‌ డబ్బుల కోసం రాకపోవడంతోపాటు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తోంది. దీంతో బాధితులు ఇంటి వద్దకు వెళ్లగా ఆచూకీ లభించలేదు. బాధితులతో కలిసి వచ్చి బుడిమే రమేశ్‌ ఫిర్యాదు చేయగా శ్రావణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ వివరించారు.

    14న బహిరంగ వేలం

    పాలకుర్తి టౌన్‌ : శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈనెల 14న (శుక్రవారం) ఉదయం 10 గంటలకు కొబ్బరికాయలు, పూజా సామగ్రి అమ్ముకునే హక్కు కోసం (అభిషేకం, వాహనపూజ సామగ్రి మినహాయించి) తలనీలాలు పోగు చేసుకునే హక్కు లైసెన్స్‌ కోసం సీల్డ్‌ టెండర్‌ కం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ భాగం లక్ష్మీప్రసన్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ఈనెల 13న సాయంత్రం 5 గంటలోపు బుకింగ్‌ కార్యాలయంలో రూ. 1000 చెల్లించి టెండర్‌ షెడ్యూల్‌ పొందాలని కోరారు.

  • ప్రజలు చూపిన తోవలో నడుస్తా..

    హన్మకొండ: ‘ప్రజలే నాయకులు.. వారు చూపిన తోవలో నడుస్తా’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా ఆదివారం హనుమకొండ సుబేదారిలోని రాయల్‌ గార్డెన్స్‌లో మేధావుల సదస్సులో ఆమె మాట్లాడుతూ.. వరంగల్‌ నగరంలో స్మార్ట్‌ సిటి వంటి పథకాలు వచ్చినా అభివృద్ధి సాధించలేదన్నారు. ప్రజావేదిక చైర్మన్‌ తిరునహరి శేషు మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్సార్‌లా పేరు సంపాదించాలని కవితకు సూచించారు. ప్రజాకవి కాళోజీ నారాయణ రావు, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి కల్వకుంట్ల కవిత పూలమాల వేసి నివాళి అర్పించారు.

    జానపద అకాడమీ ఏర్పాటు చేయాలి

    వరంగల్‌: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకా రులకు పింఛన్లు అందించేందుకు తెలంగాణ జానపద అకాడమీని ఏర్పాటు చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ‘జాగృతి జనంబాట’లో భాగంగా ఆదివారం వరంగల్‌ ఎస్‌ఆర్‌ నగర్‌ను ఆమె సందర్శించారు. అనంతరం కేవీఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో కళాకారుతో సమావేశం నిర్వహించారు. జనగామ జిల్లాకు చెందిన అమరుడైన బాల్నే కొమరయ్య భార్య పూలమ్మ మాట్లాడుతూ.. తన భర్త తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసినా నేటి వరకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. స్పందించిన కవిత బాధితురాలు పూలమ్మ పిల్లల పోషణ, చదువు బాధ్యతలు తీసకుంటున్నట్లు ప్రకటించి ఆమెను సన్మానించారు.

    ఎమ్మెల్యేల కబ్జాల వల్లే నగరం మునిగింది..

    నయీంనగర్‌: ఎమ్మెల్యేల కబ్జాల వల్లే వరంగల్‌ నగరం ధ్వంసమైందని, రెండో రాజధానిగా పేరుగాంచిన వరంగల్‌ మునిగిపోయిందంటే సిగ్గుచేటని కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం హనుమకొండ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నా.. కేయూ మహిళా ఇంజనీరింగ్‌ కాలేజీలో 1,100 మంది విద్యార్థులకు హాస్టల్‌ వసతి లేకపోవడం సిగ్గుచేటన్నారు.

    ఓరుగల్లు డయాసిస్‌ సేవలు అభినందనీయం

    కాజీపేట రూరల్‌: ఓరుగల్లు మేత్రాసనం (డయాసిస్‌) సేవలు అభినందనీయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కాజీపేట ఫాతిమా కేథడ్రల్‌ చర్చి ప్రాంగణంలో ఆదివారం రాత్రి సువార్త ప్రచార వేడుకల్లో భాగంగా జరిగిన ఆనంద హేల కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు.

    తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

    కల్వకుంట్ల కవిత

  • రోడ్డ

    ఎల్కతుర్తి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన సంఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మంగళపల్లి–ముల్కనూరు రహదారిపై ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మంగళపల్లి గ్రామానికి చెందిన బసిరెడ్డి శ్రీనివాస్‌(48) తన మనవళ్లు రిషి, రక్షిత్‌ను తీసుకొని ద్విచక్రవాహనంపై మంగళపల్లి నుంచి ముల్కనూరుకు వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వైపు వస్తున్న టిప్పర్‌ అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొంది. ద్విచక్ర వాహనంపై ఉన్న బసిరెడ్డి శ్రీనివాస్‌ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకొని రహదారిపై ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి, సీఐ పులి రమేశ్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వంగర ఎస్సై దివ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    మంగళపల్లి–ముల్కనూరు రోడ్డుపై బైక్‌ను ఢీకొన్న టిప్పర్‌

    ఎల్కతుర్తి–సిద్దిపేట రహదారిపై

    మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళన

    న్యాయం చేస్తామని ఏసీపీ

    ప్రశాంత్‌రెడ్డి, సీఐ రమేశ్‌ హామీతో

    ధర్నా విరమణ

  • కోటలో

    ఖిలా వరంగల్‌: కాకతీయుల రాజధాని ఖిలావరంగల్‌ కోటలో ఆదివారం పర్యాటకులు సందడి చేశా రు. విదేశీయులు, వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తు న తరలొచ్చి అద్భుత శిల్ప సౌందర్యాన్ని తిలకించారు. కోటలోని స్వయంభు శంభులింగేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలుచేశారు. అనంతరం శిల్పాల ప్రాంగణంలోని శిల్ప సంపద, ఖుష్‌ మహల్‌, ఏకశిల గుట్ట, రాతి, మట్టికోట అందాలను తిలకించారు. పర్యాటక శాఖ గైడ్‌ రవి యాదవ్‌ విదేశీయులకు కాకతీయుల విశిష్టత గురించి వివరించారు. అనంతరం పర్యాటకులు ఏకశిల చిల్డ్రన్‌ పా ర్క్‌లో సేదదీరారు. కార్యక్రమంలో టీజీటీడీసీ కోట ఇన్‌చార్జ్‌ గట్టికొప్పుల అజయ్‌, కేంద్ర పురావస్తుశాఖ కోట ఇన్‌చార్జ్‌ శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

  • జనగామ ఫ్లైఓవర్‌పై రిటైర్డ్‌ హెచ్‌ఎం..

    జనగామ రూరల్‌: రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ మృతి చెందాడు. ఈ ఘటన జనగామలోని ఫ్లై ఓవర్‌పై చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం టంగుటూరుకు చెందిన భూపల్లి నతాని యేలు(65) జనగామ ప్రిస్టన్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్‌ అయ్యాడు. ఈక్రమంలో ఆదివారం బైక్‌పై ఫ్లై ఓవర్‌పై వస్తున్న క్రమంలో మరో బైక్‌ ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యేలును జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోమవారం పోస్టుమార్టం పూర్తయిన తర్వాత స్వగ్రామంలో యేలు అంత్యక్రియలు జరగనున్నట్లు ప్రిస్టన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ బక్క ప్రవీణ్‌ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. రిటైర్డ్‌ ప్రధాన ఉపాధ్యాయుడి మృతిపై పూర్వ విద్యార్థులతో పాటు జనగామ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

    బుర్హాన్‌పురం సమీపంలో యువకుడు..

    మరిపెడ: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బుర్హాన్‌పురం సమీపంలోని జాతీయ రహదారి –365పై ఆదివారం రాత్రి జరిగింది. స్థానికులు, ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం ఇటిక్యాలపల్లి గ్రామానికి చెందిన శివరాత్రి చందు(25), ఖమ్మం జిల్లా సిరిపురం గ్రామానికి చెందిన రాములు బుర్హాన్‌పురం గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ఠాపన వేడుకలకు బంధువు ఇంటికి వెళ్లారు. బుర్హాన్‌పురం గ్రామం నుంచి ఇద్దరు ద్విచక్రవాహనంపై మరిపెడ మండల కేంద్రానికి వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో చందు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలైన రాములును 108లో మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు.

National

  • న్యూఢిల్లీ: బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీకి శనివారం 98వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్‌ నేత శశి థరూర్‌.. సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘకాలం దేశానికి సేవలందించిన అద్వానీ వంటి నేత గుణగణాలను కేవలం ఒకే ఒక్క ఘటనతో నిర్థారించడం సరికాదంటూ అభిప్రాయపడ్డారు.

    అదేవిధంగా, చైనాతో జరిగిన యుద్ధంలో ఓటమి కారణంగా అప్పటి ప్రధాని నెహ్రూను, దేశంలో అత్యవసర పరిస్థితి విధించినందుకు ఇందిరాగాంధీ వ్యక్తిత్వాన్ని లెక్కగట్టలేమని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయం, లాల్‌ కృష్ణ అద్వానీకి వర్తిస్తుందని తెలిపారు. అదెంత ప్రాముఖ్యం కలిగినదై నప్పటికీ కేవలం ఒకే ఒక్క పరిణామాన్ని ప్రాతిపదికగా తీసుకుని, వారి సుదీర్ఘ సేవలను బేరీజు వేయడం అన్యాయమన్నారు. అద్వానీ నిరాడంబరత, యోగ్యత, ఆధునిక భారత దేశ పథాన్ని నిర్ణయించడంలో ఆయన పాత్ర ఎవరూ కాదన లేనిదన్నారు. ఇక, 1990లో రామ జన్మభూమి ఉద్యమాన్ని దేశ వ్యాప్త రథయాత్రతో ముందుండి నడిపిన అద్వానీ, బీజేపీని జాతీయ రాజకీయాల్లో ప్రబల శక్తిగా తీర్చిదిద్దిన నేతగా ఖ్యాతి గడించారు.  

    మరోవైపు.. థరూర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ స్పందించింది. ఈ క్రమంలో.. అద్వానీని ప్రశంసిస్తూ శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్‌ పేర్కొంది. అవి ఆయన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలే అని వివరణ ఇచ్చింది. ఇక, అద్వానీపై శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలపై పలు కాంగ్రెస్‌ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. శశిథరూర్‌ వ్యాఖ్యలను ‘ఎక్స్‌’లోనే ఓ న్యాయవాది విమర్శించారు. రామజన్మభూమి ఉద్యమం సందర్భంగా రథయాత్రతో దేశంలో అద్వానీ విద్వేష బీజాలు నాటారని, ఆయన చేసింది ప్రజాసేవ కాదని పోస్టు చేశారు. దీనికి థరూర్‌ సమాధానమిస్తూ, ఒక్క ఘటనతో సుదీర్ఘకాలం పాటు ఆయన చేసిన సేవలను తక్కువ చేయడం సమంజసం కాదన్నారు.

  • ఏవిటో... పెళ్ళివాళ్ళొచ్చి మనవరాలు శ్రీలేఖను చూసుకుని వెళ్లారు.. వాళ్లకు నచ్చిందీ లేనిది ఉత్తరం రాస్తామన్నారు.. వెళ్లి రెండు వారాలైంది.. ఇంకా లేఖ రానేలేదు.. అంటే ఈ సంబంధం కూడా అంతేనా.. అంటూ సుభద్రమ్మ నొచ్చుకుంటోంది.. అంతలోనే ఒసేయ్ అమ్మా... పెళ్ళివాళ్ళ నుంచి ఉత్తరం వచ్చింది.. వాళ్లకు మన శ్రీలేఖ నచ్చిందట .. త్వరలో వచ్చి తాంబూలాలు పుచ్చుకుంటారట అని కొడుకు సుధాకర్ చెబుతుంటే అబ్బా.. నా నోట్లో చక్కెర పోశావురా ... ఉండు పోస్ట్ మ్యాన్‌కు ఈ నాలుగు బొబ్బట్లు ఇచ్చి అయన నోరు తీపి చేస్తా అంటూ సుభద్రమ్మ కదిలింది..

    ఒరేయ్ వెధవా.. నేను ప్రతినెలా నీకు డబ్బులు పంపడం నువ్వు ఖర్చుపెట్టుకుని తిరగడమేనా చదువుకుని బాగుపడేది ఏమైనా ఉందా అంటూ హాష్టల్లోని  రామకృష్ణకు తండ్రి నారాయణ నుంచి వచ్చిన లెటర్ అయన రూమ్మేట్లు అందరూ చదివి రామకృష్ణ పై కామెంట్లు చేసుకునేవాళ్ళు..

    పెళ్ళై మూడురాత్రులు ముగియగానే వెళ్లిపోయారు.. కొత్తగా అద్దెకు ఇల్లు తీసుకుని ఉత్తరం రాస్తామన్నారు.. ఇంకా రూమ్ దొరికిందో లేదో.. అయన వెళ్లిన తరువాత ఒక్కో క్షణం ఒక్కో యుగంలా తోస్తోంది.. ఎప్పుడెప్పుడు ఉత్తరం వస్తుందా ఆయనతోబాటు వెళ్లి ఒళ్ళో వాలిపోదామా అని ఎదురుచూసే నవవధువు..

    ఏమండీ ... అల్లుడుగారు ఉత్తరం రాశారు.. సంక్రాంతి పండక్కి ఆయనకు ఎలాగైనా ఆల్విన్ వాచ్... కొత్త సైకిల్ కొని ఇవ్వాల్సిందేనంట.. లేకపోతె అమ్మాయిని తీసుకెళ్లేది లేదని అంటున్నాడు.. అన్నీ సిద్ధం చేసాం.. అలకమానేసి పండక్కి రమ్మని తిరుగు లెటర్ రాయండి.. అంటోంది రుక్మిణమ్మ..

    ఏమిటే ఉత్తరం అంత దీర్ఘంగా చదూతున్నావు అన్నాడు రాఘవయ్య... అవునండీ.. వైజాగ్ నుంచి అబ్బాయి ఉత్తరం రాసాడు.. పిల్లలిద్దరికీ జ్వరాలట... కోడలు ఒక్కతీ చేసుకోలేకపోతోందట.. నన్ను రమ్మన్నాడు.. ఓ నాల్రోజులు ఉండి వస్తాను.. చెబుతోంది భారతమ్మ.. ఇప్పుడే వెళ్తే ఎలా.. వరికోతలు అయ్యాక బియ్యం తీసుకుని వెల్దువులే.. ఇదే విషయం నేను ఉత్తరం రాస్తాను.. తేల్చేసాడు రాఘవయ్య..

    ఒరేయ్ నానిగా... సంక్రాంతికి అక్కను బావను పండక్కీరామ్మని ఉత్తరం రాశావా... .. మర్చిపోవద్దు సుమీ... అసలే మీ బావ తిక్కలోడు.. కనీసం వారం ముందు  లెటర్ రాకపోతే మర్యాద తగ్గిందని అలుగుతాడు.. గమ్మున లెటర్ రాసి డబ్బాలో వెసెయ్యిరా... నానమ్మ కేకేసింది..

    ఇదీ భారత సమాజంలో ఉత్తరానికున్న ప్రాధాన్యం.. కష్టం సుఖం .. సంతోషం ఆనందం.. బాధ విషాదం.. విజయం.. అపజయం ... ఏదైనా సరే  ఉత్తరం ద్వారానే చేరేది.. పాతికేళ్ల క్రితం ఏ ఆనందాన్ని పంచుకోవాలన్నా .. కష్టాన్ని చెప్పుకోవాలన్నా ఉత్తరమే మాధ్యమం..

    ఇప్పుడంటే అన్నీ ఫోన్లు వాట్సాప్ లు ... వీడియో కాల్స్ వచ్చి మొత్తం సమాజాన్ని మార్చేశాయి కానీ ఒక పాతికేళ్ళు వెనక్కి వెళ్తే ఉత్తరమే ప్రధాన సమాచార వాహిక.  అప్పట్లో ఉత్తరం రాయడం ఒక కళ. ఊళ్ళో చదువుకున్నకుర్రాళ్ళను బతిమాలి దూరంలోని తమ బంధుమిత్రులకు.. బిడ్డలకు.. ఉత్తరాలు రాయించుకోవడం గ్రామాల్లోని ప్రజలకు అలవాటైన ప్రక్రియ. ప్రియుడు.. ప్రియురాళ్లమధ్య ఉత్తరాల రాయబారం నడిచేది..  నేడు సాంకేతికత పెరిగిన కారణంగా ఉత్తరాలు రాయడం కూడా లేదు.. ఉత్తరాలు రాసేవాళ్ళు.. రాయడం వచ్చేవాళ్ళు కూడా తగ్గిపోయారు..  దీంతో ప్రజల్లో ఉత్తరాలు రాసే నైపుణ్యాన్ని గుర్తించేందుకు భారతీయ పోస్టల్ శాఖ ఏకంగా ఉత్తరాల పోటీలు నిర్వహిస్తోంది.. ఒక్కో  సర్కిల్ పరిధిలో నాలుగేసి ఉత్తమ లేఖలకు రూ. 25 వేలు చొప్పున బహుమతి అందిస్తోంది.. ఇంకా సెకెండ్  ప్రయిజ్ కూడా ఉంది..   DHAI AKHAR పేరిట నిర్వహిస్తున్న ఈ ఉత్తరాల పోటీలో యువత పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు  పోస్టల్ శాఖ వెబ్సైట్ ను సందర్శించండి..

    సిమ్మాదిరప్పన్న

  • అసలే కుర్రకారు. వారి ఆలోచనలూ ఉడుకు రక్తంలా పరుగెడుతుంటాయి. ఉద్యోగం విషయంలోనూ అంతే. ఏళ్లకేళ్లు ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తూ కూర్చోవడానికి తాము ఒకప్పటి తరం కాదని తేల్చిచెబుతోంది జనరేషన్ –జీ. మంచి వేతనం దొరికితే ఏడాదిలోపే జంప్‌ చేస్తామని నిర్మొహమాటంగా కుండబద్దలు కొడుతున్నారీ తరం. విశ్వసనీయత, ఉద్యోగ స్థిరత్వం, కెరీర్‌ వృద్ధి.. ఇదంతా గతం. జీతం, పని సౌలభ్యం, వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్ఈ అంశాలే జెన్ –జీ తరానికి ఇప్పుడు కీలకంగా మారా­యని రాండ్‌స్టాడ్‌ ఇండియా తాజా నివేదిక చెబుతోంది. 

    పనికి తగ్గ వేతనం జెన్ –జీ నిపుణులకు ఒక ప్రాథమిక డిమాండ్‌గా ఉన్నప్పటికీ.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా పని చేయాలన్న అంశా­లకూ విలువ ఇస్తున్నారని ‘ద  జెన్ –జీ వర్క్‌ప్లేస్‌ బ్లూప్రింట్‌’ పేరుతో రూపొందిన   ఈ నివేదిక తెలిపింది. 1997–2007 మధ్య జన్మించిన జెన్ –జీ బ్యాచ్‌లో 35 కోట్ల మందికిపైగా ఉన్నారు. భారత జనాభాలో వీరి వాటా దాదాపు 27%.

    వృద్ధిని కోరుకుంటున్నారు
    అదనపు సెలవు, పదవీ విరమణ ప్రయోజనాలు వంటి సంప్రదాయ ప్రోత్సాహకాలు జెన్‌ జీని పెద్దగా ఆకర్షించడం లేదు. వీటికి బదులుగా అర్థవంతమైన పని, అభ్యాస అవకాశాలను ఈ తరం కోరుకుంటోంది. చాలామంది ప్రయాణ అవకాశాలు, రిమోట్‌ గా పని చేసే సౌకర్యాలు ఉన్న కంపెనీల్లో కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. 

    తరచూ కంపెనీలు మారడం తప్పుకాదనీ, సుదీ ర్ఘ ప్రయాణంలో భాగంగా వారు వ్యక్తిగత, వృత్తిపరమైన వృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారని నివేదిక స్పష్టం చేసింది. ఎదగడానికి అవకాశాల కోసం చూ­స్తున్నందున తరచూ ఉద్యోగం మారుతున్నారని తెలిపింది. 

    మారాల్సింది కంపెనీలే!
    కంపెనీలు ఈ మార్పులకు అనుగుణంగా మారాలని నివేదిక సూచించింది. ఉద్యోగుల పనితీరు మెరుగుపరిచే అవకాశాలు కల్పించడం, మార్గదర్శకత్వం, వారితో మమేకం కావడం, సౌకర్యవంతమైన పని వాతావరణం వంటివి అమలు చేసే కంపెనీలు జెన్‌–జీ ప్రతిభను ఆకర్షించడమే కాకుండా.. దీర్ఘకాలం పాటు వీరిని తమ సంస్థల్లో ఉద్యోగులుగా నిలుపుకో­గలుగుతాయని వివరించింది. 

    అవకాశాలు బోలెడున్నాయని వారు దృఢ నిశ్చయంతో ఉన్నారని నివేదిక తెలిపింది. ఈ తరుణంలో ఉద్యోగావకాశాలు, అభివృద్ధి మార్గాలను ఈ జనరేషన్  కోసం ఎలా రూపొందించాలో కంపెనీలు పునరాలోచించుకోవాలని సూచించింది. 

    బేరీజు వేసుకుని మరీ..
    మెరుగైన అవకాశాలపై దృష్టి సారించినప్పటికీ తమ ఉద్యోగం / పాత్రలో తాము సమర్థులుగా భావిస్తున్నామని 81% మంది చెబుతున్నారు. 93% మిలీనియల్స్, 89% జెన్ –ఎక్స్‌తో పోలిస్తే 82% జెన్ –జీ తరం మాత్రమే తమ కంపెనీలో తమకు విలువ ఉందని భావిస్తున్నారు. 

    94% కంటే ఎక్కువ మంది కొత్త కంపెనీని ఎంచుకునే ముందు తమ దీర్ఘకాలిక ఆకాంక్షలకు తగ్గట్టుగా నూతన ఉద్యోగం ఉందా లేదా అని బేరీజు వేసుకుంటున్నారట. ప్రపంచవ్యాప్తంగా జెన్ –జీ తరంలో ఇలా ఆలోచించేవారి శాతం సగటు 79%.   

  • ముఖం చూసి ఆ మనిషి మూడ్‌ ఏంటో చెప్పేస్తాం. అలాగే కళ్లు కూడా మన గురించి ఎన్నో విషయాలు చెబుతాయి. కళ్లు నవ రసాలను పలికించటమే కాదు.. మన దేహంలో సూక్ష్మ స్థాయిలో దాగున్న జబ్బుల జాడల్ని కూడా సూక్ష్మంగా అందించగలవట. మన కళ్లలోకి చూసి మన గుండె ఆరోగ్యాన్ని చెప్పేయొచ్చు. అలాగే మన వయసు ఎంత వేగంగా అయిపోతోంది లేదా వృద్ధాప్యంలోకి ఎంత వేగంగా వెళ్లిపోతున్నాం అనేది కూడా కచ్చితంగా చెప్పవచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. 

    కంటిలోని చిన్న రక్తనాళాలను లోతుగా పరిశీలిస్తే.. ఆ వ్యక్తికి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఎంత మేరకు ఉందో తెలిసిపోతుంది. అంతేకాదు.. ఒకరి హృదయ నాళాల ఆరోగ్యం, జీవసంబంధమైన వృద్ధాప్య స్థితిని కూడా కళ్లు చెప్పేస్తాయని ఓ తాజా పరిశోధనలో వెల్లడైంది. 

    ఎంతమందిపై చేశారు?
    కెనడాలోని మెక్‌మాస్టర్‌ విశ్వవిద్యాలయం, పాపులేషన్‌ హెల్త్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు 74 వేల మందిపై సంయుక్త పరిశోధనలు చేశారు. వీరి రెటీనా స్కాన్లు, జన్యు డేటా, రక్త నమూనా విశ్లేషణలను నాలుగు వేర్వేరు సంస్థల నుంచి సేకరించి పరిశోధించారు. కళ్ల ద్వారా తెలుసుకోగలిగే ఆరోగ్య స్థితిగతులపై అత్యంత ఆసక్తికర విషయాలు తెలిశాయి. సైన్సెస్‌ అడ్వాన్సెస్‌ జర్నల్‌లో ఇటీవల ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. 

    ఎలా చేశారు? 
    ‘కంటిలో ముఖ్యమైన భాగం రెటీనా. రెటీనా స్కాన్‌ నివేదికల సమాచారంతో జన్యుశాస్త్రం, రక్తపు బయోమార్కర్లను అనుసంధానం చేయటం ద్వారా వృద్ధాప్యం హదృయనాళ వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తోందో కనుక్కోవటంలో విజయం సాధించాం. రెటీనా రక్తనాళాల్లో మార్పులు తరచుగా శరీరంలోని చిన్న నాళాల్లో జరిగే మార్పులకు అద్దం పడతాయి’ అన్నారు ఈ అ«ధ్యయన రచయిత ప్రొఫెసర్‌ మేరీ పిగేయ్రే.

    ఏంటి ప్రాధాన్యత? 
    గుండెకు రక్తాన్ని అందించే నాళాలకు ఎన్ని తక్కువ ఉప నాళాలు ఉంటే  గుండె జబ్బుల ముప్పు అంత ఎక్కువగా ఉందని గుర్తించారు. శరీరంలో అధిక వాపు, తక్కువ ఆయుర్దాయం వంటి జీవసంబంధమైన వృద్ధాప్య సంకేతాలను కూడా రెటీనా స్కాన్లు చూపగలుగుతున్నాయని కనుగొన్నారు. రోగ నిర్ధారణ, చికిత్సల్లో దీని ప్రాధాన్యం ఏమిటంటే.. శరీరం లోపలికి ఏ పరికరాన్నీ చొప్పించకుండానే వ్యాధులను ముందుగానే సూక్ష్మంగా గుర్తించడానికి, చికిత్స చెయ్యటానికి రెటీనా స్కాన్ల సమాచారం కీలకం కాబోతోంది. 

    ఏంటా ప్రోటీన్లు?
    ఈ అధ్యయనంలో మరో ముఖ్యమైన అంశం రక్తపు బయోమార్కర్లు, జన్యు డేటాను సమీక్షించటం. దీని ద్వారా, పరిశోధకులు కంటి రక్త నాళాల్లో మార్పుల వెనుక గల జీవసంబంధమైన కారణాలు కనుగొనగలిగారు. రక్తనాళాలలో వచ్చే మార్పులకు కారణమవుతున్న రెండు ముఖ్యమైన ప్రోటీన్లను ఈ పరిశోధనలో కనిపెట్టారు. 

    వృద్ధాప్యం వేగాన్ని నెమ్మదింపజేయటానికి, గుండె జబ్బుల భారాన్ని తగ్గించడానికి.. భవిష్యత్తులో ఔషధాల తయారీకి, చివరికి జీవితకాలం మెరుగుపరచడానికి.. ఈ ప్రొటీన్లు ఉపయోగపడతాయని ప్రొఫెసర్‌ మేరీ పిగేయ్రే వివరించారు. 

    – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

  • చదువు అంటే నేర్చుకోవడం..అది కూడా ఆసక్తితో.. కానీ కొన్నేళ్లుగా చదువు అర్థం మారిపోయింది. పోటీపడాలి.. అత్యధిక మార్కులు సాధించాలి. అంతేకాదు ఉత్తమ కళాశాలలో సీటు సంపాదించాలి. ఈ ఒత్తిడి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చదువు అంటేనే చాలామంది భారంగా భావించే స్థాయికి వచ్చారు. ఫలితాలు వారి అంచనాలను అందుకోలేనప్పుడు ఎవరూ ఊహించని ‘కఠిన నిర్ణయాలు’ తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 

    ప్రపంచంలోని ప్రతి తొమ్మిది మంది విద్యార్థుల ఆత్మహత్యల్లో ఒకటి భారత్‌లో జరుగుతోంది. 2024 ఐసీ3 స్టూడెంట్‌ సూసైడ్‌ రిపోర్ట్‌ ప్రకారం.. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రధానంగా చదువుల ఒత్తిడి తీవ్రంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలలో విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. 2013–2022 మధ్య మన దేశంలో లక్షకు పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 

    ఈ కాలంతో పోలిస్తే అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకున్న విద్యార్థుల సంఖ్య గత దశాబ్దంలో 64 శాతం పెరిగింది. ‘పరీక్షలు, మార్కులకు మాత్రమే ఈ సంక్షోభాన్ని ముడిపెట్టకూడదు. విద్యార్థుల్లో భయం,నిశ్శబ్దం అలుముకుంది. వారికి భరోసా లేకపోవడం సమస్యను పెంచుతోంది’అని నివేదిక తెలిపింది.  – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

    నమ్మకానికి బదులుగా నిశ్శబ్దం..
    చదువులు, తల్లిదండ్రుల నుంచి భారీ అంచనాలు, సామాజి కంగా ఇతరులతో పోలిక వంటి ఒత్తిడిని నేటి విద్యార్థులు ఎదు ర్కొంటున్నారు. ఈ ఒత్తిడి కారణంగా విద్యార్థులు పడుతున్న బాధ ను ఎవరూ ముందుగా గుర్తించడం లేదని నివేదిక వివరించింది. మార్గనిర్దేశనానికి బదులుగా చాలామంది తరగతి గదుల్లో భయంతో కూడిన ప్రేరణను అనుభవిస్తున్నారు. నమ్మకానికి బదులుగా నిశ్శబ్దాన్ని ఎదుర్కొంటున్నారు. విద్యలో ప్రధాన భాగంగా కాకుండా కౌన్సెలింగ్‌ను ఇప్పటికీ చివరి ప్రయత్నంగా చూస్తున్నారు’అని తెలిపింది.  

    పరిష్కారం 
    వారి చేతుల్లోనే..నేర్చుకోవడం, విద్యార్థుల శ్రేయస్సు విషయంలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన సంస్కృతిని అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది. ‘విద్యార్థులు చదువును ద్వేషించరు. పెద్దల నుంచి సరైన మార్గనిర్దేశనం లేనప్పుడు వ్యతిరేకిస్తారు. 

    పరిష్కారం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది. విద్యార్థులు ఆశ్రయించే మొదటి కౌన్సెలర్లు వారే. ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించి, మేమున్నాం అని ధైర్యం చెప్పేలా వినడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినప్పుడు విద్యార్థులు సురక్షితంగా ఉన్నట్టు భావిస్తారు’అని వివరించింది.  

    స్వేచ్ఛా వాతావరణం..
    నివేదిక ప్రకారం 40 శాతం మంది భారతీయ విద్యార్థులు ఎప్పు డూ కౌన్సెలర్‌తో మాట్లాడలేదు. అయితే ఈ సంఖ్య గత సంవత్సరం 52 శాతం నమోదైంది. ‘మానసిక ఆరోగ్యం పాఠశాల జీవితంలో రోజువారీ చర్యల్లో భాగం కావాలి. కౌన్సెలింగ్‌ నిపుణులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. 

    విద్యార్థులు స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం కల్పించాలి’అని నివేదిక తెలిపింది. చాలా పాఠశాలల్లో ఇప్పటికీ సంక్షోభం ఏర్పడిన తర్వాత మాత్రమే ‘మానసిక ఆరోగ్యం’గుర్తొస్తుందని వివరించింది. సమస్య రాకముందే నివారణ అవసరం. నమ్మకమైన పెద్దలు తరచూ సమావేశం కావడం ద్వారా విద్యార్థులకు మనోధైర్యం లభిస్తుందని తెలిపింది.

    ఉపాధ్యాయులే కౌన్సిలర్లు.. 
    విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ భారీ నిధులు అవసరం లేదని, స్థిరమైన నిర్మాణం, సానుభూతి అవసరమని నివేదిక వివరించింది. ‘ప్రతి ఉపాధ్యాయుడు కౌన్సెలర్‌ పాత్ర పోషించడం ఒక ఆచరణాత్మక విధానం. ప్రాథమిక శిక్షణతో విద్యార్థుల బాధను ఉపాధ్యాయులు ముందుగానే గుర్తించగలరు. 

    ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు.. పిల్లల బాధ యొక్క ప్రారంభ సంకేతాలను గుర్తించడంలో అవరి్టంగ్‌ స్టూడెంట్‌ సూసైడ్‌ టాస్‌్కఫోర్స్‌ అభివృద్ధి చేసిన గేట్‌ కీపర్‌ ట్రైనింగ్‌ వంటి తక్కువ ఖర్చుతో కూడిన కార్యక్రమాలు సహాయ పడతాయి. స్టూడెంట్‌ వెల్‌నెస్‌ క్లబ్స్, టీచర్‌–సూ్టడెంట్‌ అడ్వైజరీ సర్కిల్స్‌ పాఠశాలల్లో విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు చవకైన మార్గాలు’అని తెలిపింది. 

    మానవ సంబంధాలు.. 
    చాట్‌ జీపీటీ వంటి ఏఐ సాధనాలను 83 శాతం మంది విద్యార్థులు ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. కానీ ఈ సాంకేతికత మానవ సంబంధాన్ని భర్తీ చేయదని నివేదిక తెలిపింది. విద్యార్థులు త్వరిత సమాధానాల కోసం, లేదా పెద్దలను అడగడానికి సంకోచించినప్పుడు ఏఐ వైపు మొగ్గు చూపొచ్చు. కానీ మనోధైర్యం, జీవిత నిర్ణయాల విషయానికి వస్తే వారు ఇప్పటికీ నిజమైన మానవ సంబంధాన్ని కోరుకుంటారు. నమ్మకమైన పెద్దవారితో 15 నిమిషాల సంభాషణ పెద్ద ప్రభావాన్ని చూపుతుంది’అని వివరించింది.  

    విద్యకు పునాదిగా.. 
    విద్యార్థులకు నిజమైన మార్గదర్శకత్వం కావాలి. వారు చదువుతోనే కాదు.. భావోద్వేగాలు, మారుతున్న స్నేహాలు, గుర్తింపు, భవిష్యత్‌గురించి అనిశి్చతితో కూడా ఇబ్బంది పడుతున్నారు. వారు స్పష్టత, అనుబంధం, ఆత్మవిశ్వాసాన్ని కోరుకుంటున్నారు. పాఠశాల జీవితంలో మార్గదర్శకత్వం భాగం అయినప్పుడే ఇవి అందుకుంటారు. విద్యలో కౌన్సెలింగ్‌ పునాది కావాలి. 

    ప్రతి ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు పిల్లల గోడు వినడానికి, మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు.. మొత్తం అభ్యాస వాతావరణం మారుతుంది. సమస్యలను పరిష్కరించడంతోపాటు బలమైన, సంతోషకరమైన, మరింత నమ్మకమైన యువతను తీర్చిదిద్దుతుంది’అని వివరించింది.    

  • బెంగళూరు: నమోదుకాకుండానే రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో కార్యకలాపాలు కొనసాగిస్తోందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ ధీటైన జవాబిచ్చారు. ఆదివారం బెంగళూరులో ఆర్‌ఎస్‌ఎస్‌ అంతర్గతంగా నిర్వహించిన ప్రశ్నావళి కార్యక్రమంలో భాగవత్‌ పలు ప్రశ్నలకు ఘాటుగా సమాధానమిచ్చారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్‌ను 1925లో స్థాపించాం. ఆనాడు భారతీయ ప్రభుత్వం లేదు. బ్రిటిషర్ల అరాచక పాలన కొనసాగుతోంది. వాళ్ల వద్దకు వెళ్లి మా సంస్థను నమోదుచేయండి అని బతిమాలాలా?. స్వాతంత్య్రంవచ్చాక సంస్థలను తప్పనిసరిగా నమోదుచేయాలనే నిబంధనను భారత ప్రభుత్వం అమలుచేయలేదు. దీంతో మేం వ్యక్తుల సంఘంగా కొనసాగాం.

    అలాగే ప్రజల సమ్మతితో సంస్థగా సేవలందిస్తున్నాం. ఆర్‌ఎస్‌ఎస్‌ అనేది వ్యక్తుల సంస్థ అని ఇది ఆదాయ పన్ను కట్టాల్సిన పనిలేదంటూ మినహాయింపునిస్తూ గతంలోనే ఆదాయ పన్ను శాఖ, కోర్టులుసైతం పేర్కొన్నాయి. నమోదుకాని మా సంస్థపై గతంలో మూడు సార్లు నిషేధం విధించారు. అంటే మమ్మల్ని ప్రభుత్వం నమోదిత సంస్థగా గుర్తించినట్లే లెక్క. ఒకవేళ గుర్తించకపోయి ఉంటే నిషేధం విధించడం ఎలా సాధ్యం?’’అని ఆయన ఎదురు ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ప్రాంగణాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాక్రమాలు, కవాతులను అడ్డుకోవాలని, నిషేధం విధించాలని కర్ణాటక ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మంత్రి ప్రియాంక్‌ ఖర్గే లేఖ రాసిన నేపథ్యంలో భాగవత్‌ ఈ మేరకు స్పందించారు.  

    మేం ఎవరికీ మద్దతివ్వబోం 
    ‘‘దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ అనేది ఏ రాజకీయ పార్టీకి మద్దతు పలకబోదు. మేం కేవలం విధానాలకు మాత్రమే మద్దతు పలుకుతాం. సరైన ప్రజా విధానాలకు మాత్రమే మేం జైకొడతా. మేం ఏ వ్యక్తి, సంఘం, రాజకీయ పార్టీకి కొమ్ముకాయబోం. అయోధ్యలో రామమందిరం అంశంలోనూ సంఘ్‌ కార్యకర్తలు ఏ పార్టీకి మద్దతు పలకలేదు. కేవలం ఆలయ నిర్మాణానికి మాత్రమే సంపూర్ణ మద్దతు పలికారు. అక్కడ బీజేపీ కావొచ్చు కాంగ్రెస్‌ కావొచ్చు. మరేదైనా పార్టీ ఆలయ నిర్మాణానికి మద్దతిస్తే వాళ్లకే మా మద్దతు ఉంటుంది. మాకు ప్రత్యేకంగా బీజేపీ అంటే మమకారం ఏమీ లేదు. కేవలం ఒక్క పార్టీ కాదు భారతదేశంలోని పార్టీలన్నీ మాపార్టీలే’’అని భాగవత్‌ వ్యాఖ్యానించారు.  

    ‘హద్దు’మీరితే ఓటమి తప్పదు 
    ‘‘మనతో పాకిస్తాన్‌ ఏనాటికీ శాంతిని కోరుకోదు. అది కూడా మనశ్శాంతిగా ఉండదు. ఎప్పుడూ భారత్‌కు హాని తలపెట్టాలని తలపోస్తూ తలనొప్పులు తెచ్చుకుంటుంది. సరిహద్దు కట్టుబాట్లను అతిక్రమించాలని చూస్తుంది. తర్వాత భంగపాటుకు గురవుతుంది. 1971 యుద్ధం ఇందుకు నిదర్శనం. భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూసి పాకిస్తాన్‌ తన తూర్పు భూభాగాన్ని కోల్పోయింది. అది చివరకు బంగ్లాదేశ్‌లా అవతరించింది. యుద్ధం చేయడం కంటే సహకారం అందించడం ముఖ్యం. అది వాళ్లకు చేతకాకపోతే వాళ్లకు అర్థమయ్యే భాషలోనే చెప్పాల్సి ఉంటుంది’’అని అన్నారు. 

    లవ్‌ జిహాద్‌కు అంత సీన్‌ లేదు 
    ‘‘లవ్‌ జిహాద్‌ గురించి జనం మరీ అంతలా ఆలోచించాల్సిన సీరియస్‌ అంశం కాదు. లవ్‌ జిహాద్‌కు ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు ఇస్తే ఇవ్వనివ్వండి. అలాంటి దానిని తుద ముట్టించాలంటే మనం మన ఇళ్లలో హిందూ సంస్కారానికి పట్టం కట్టాలి’’ అని భాగవత్‌ పిలుపునిచ్చారు.  

    దేశంలో కులం లేదు.. గందరగోళమే ఉంది
    ‘‘దేశంలో కుల వ్యవస్థ లేదు. ఈ అంశంలో ప్రజల్లో కాస్తంత గందరగోళం ఉంది. ఎన్నికల కోసమే రాజకీయ పార్టీలు కులం కార్డ్‌ను పట్టుకొస్తున్నాయి. కులంను నిర్మూలించాల్సిన అవసరం లేదు. కులం అనే భావనను మర్చిపోతే సరిపోతుంది. ఇది చాలా సులభం. వ్యక్తిగతం దేశంలోని ప్రతి ఒక్కరూ కులం అనే భావనను పూర్తిగా తమ ఆలోచనల నుంచి తొలగిస్తే చాలు’’అని భాగవత్‌ వ్యాఖ్యానించారు.

  • లక్నో: సుమారు రూ.3,700 కోట్ల సైబర్‌ నేరానికి పాల్పడిన ఆరోపణలపై జైలులో ఉన్న ఓ వ్యక్తి..పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫోన్‌ నుంచి అలహాబాద్‌ హైకోర్టు జడ్జికి బెదిరింపు మెయిల్‌ పంపించడం సంచలనం రేపింది. అనుభవ్‌ మిట్టల్‌ అనే వ్యక్తి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో దాదాపు 7 లక్షల మందిని మోసం చేశాడు. ప్రస్తుతం లక్నో జైలులో ఉన్న ఇతడిపై ఈ మేరకు కేసు నమోదైంది. ఇతడు అజయ్‌ అనే పోలీస్‌ కానిస్టేబుల్‌ సెల్‌ ఫోన్‌ ద్వారా అలహాబాద్‌ హైకోర్టు జడ్జికి బెదిరింపు మెయిల్‌ పంపాడు. మరో ఖైదీని ఇరికించేందుకు మారుపేరుతో ఇతడు.. ‘లక్నో బెంచ్‌లోని ఓ జడ్జిని చంపేస్తాం’అంటూ మెసేజీ పంపాడు.

    దీనిపై శుక్రవారం కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కానిస్టేబుల్‌ అజయ్‌ని ప్రశ్నించారు. ఈ నెల 4వ తేదీన కోర్టు విచారణకు వచ్చిన మిట్టల్‌ వెంట కానిస్టేబుల్‌ అజయ్‌ ఉన్నాడు. తన కేస్‌ స్టేటస్‌ చూస్తానంటూ ఫోన్‌ను తీసుకున్న మిట్టల్‌ కొత్త మెయిల్‌ ఐడీ సృష్టించి బెదిరిస్తూ మెయిల్‌ పంపించాడు.  హత్య కేసులో అదే జైలులో 2023 నుంచి ఉంటున్న తన విరోధి ఆనందేశ్వర్‌ అగ్రహారీని ఈ కేసులో ఇరికించేందుకు మిట్టల్‌ కుట్ర పన్నినట్లు తెలిందని అధికారులు తెలిపారు. 

  • శ్రీనగర్‌: ఆన్‌లైన్‌ ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై ఉక్కుపాదం మోపుతూ.. కౌంటర్‌–ఇంటెలిజెన్స్‌ కాశ్మీర్‌ ఆదివారం లోయవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ఒక మహిళతో సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదాన్ని ఆన్‌లైన్‌లో కీర్తించడం, యువకులను ప్రభావితం చేయడంపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, కౌంటర్‌–ఇంటెలిజెన్స్‌ కాశ్మీర్‌ బృందాలు శ్రీనగర్, కుల్గామ్, బారాముల్లా, షోపియాన్, పుల్వామాలోని 10 ప్రత్యేక ప్రాంతాలపై దాడులు చేశాయని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

    ‘ఆన్‌లైన్‌ ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టడంలో భాగంగా కాశ్మీర్‌ లోయవ్యాప్తంగా సమన్వయంతో దాడులు నిర్వహించాం.. ఇది తీవ్రవాదం, సైబర్‌ దుర్వినియోగానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక సందేశాన్ని పంపింది’.. అని ఆ ప్రతినిధి స్పష్టం చేశారు. అదుపులోకి తీసుకున్న తొమ్మిది మంది అనుమానితుల్లో ఒక మహిళ కూడా ఉన్నారని అధికారి తెలిపారు. ఈ సందర్భంగా సిమ్‌ కార్డులు, మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లెట్‌లు, పలు రకాల డిజిటల్‌ పరికరాలు మొదలుకొని నేరారోపణకు సంబంధించిన కీలక సాక్ష్యాలను ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం స్వా«దీనం చేసుకున్నట్లు వెల్లడించారు.  

  • గౌహతి: అస్సాం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బహుభార్యత్వ నిషేధం బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ప్రకారం.. ఒక్కరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే దోషులకు ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ విషయం మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే, ఆరో షెడ్యూల్‌ ప్రాంతాల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయని చెప్పారు.

    బహుభార్యత్వం కారణంగా బాధితులుగా మారిన మహిళలకు పరిహారం ఇవ్వడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవనం కొనసాగించడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘ద అస్సాం ప్రొహిబిషన్‌ ఆఫ్‌ పాలిగామీ బిల్లు–2025’కు కేబినెట్‌ ఆదివారం ఆమోదం తెలిపినట్లు స్పష్టంచేశారు. ఈ నెల 25వ తేదీన ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు.    

    స్థానికులకు ఆయుధ లైసెన్స్‌లు 
    అస్సాంలో మారుమూల కొండ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే స్థానిక ప్రజలకు ఆయుధ లైసెన్స్‌లు ఇవ్వబోతున్నామని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. మొదటి బ్యాచ్‌ లెసెన్స్‌ల జారీ ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. అస్సాంలో వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అంతకంటే ముందే ప్రజలకు ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. ఆయుధ లైసెన్స్‌ల కోసం ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయని, అధికారులు వాటిని క్షుణ్నంగా పరిశీస్తున్నారని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలియజేశారు.

    ఆయన ఆదివారం కేబినెట్‌ భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు. స్థానికులకు మాత్రమే లైసెన్స్‌లు లభిస్తాయని తేల్చిచెప్పారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ లైసెన్స్‌ లభించే అవకాశం లేదన్నారు. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తామని వెల్లడించారు. అస్సాంలోని మొత్తంగా 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పటినుంచే సిద్ధమవుతున్నాయి. అస్సాంలో చొరబాటుదారుల నుంచి స్థానికులకు ముప్పు ఎదురవుతున్నట్లు చాలా సంవత్సరాలుగా వాదనలు వినిపిస్తున్నాయి.   

  • డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంపై ప్రధాని  మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు రాకుండా ధైర్యంగా చర్యలు చేపట్టిందని, ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తోందని, చట్టవిదరుద్ధమైన మత మార్పిడులను సమర్థంగా అడ్డుకుంటోందని చెప్పారు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు సైతం ఉత్తరాఖండ్‌ మార్గంలో నడవాలని సూచించారు. యూసీసీ అమలుపై ఉత్తరాఖండ్‌ చర్యలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. మత మార్పిడుల నియంత్రణ చట్టం, అల్లర్ల నియంత్రణ చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తోందని తెలిపారు.

    ఉత్తరాఖండ్‌ రాష్ట్రం అవతరించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం డెహ్రాడూన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రూ.8,260.72 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల భూములు కబ్జా కాకుండా, జనాభాలో అవాంఛనీయ మార్పులు రాకుండా ఇక్కడి బీజేపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. అభివృద్ధి ప్రయాణంలో అడ్డంకులను తొలగించుకుంటూ ఉత్తరాఖండ్‌ శరవేగంగా ముందుకు సాగుతోందని హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా మారనుందని అన్నారు.

    రాష్ట్ర ప్రజలే నాకు స్ఫూర్తి  
    రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించారు. ఉత్తరాఖండ్‌తో తనకు గొప్ప అనుబంధం ఉందన్నారు. కొండలపై ప్రతికూల వాతావరణంలో జీవిస్తూ కష్టపడి పనిచేసే ఇక్కడి ప్రజలు తనకు నిత్యం స్ఫూర్తినిస్తుంటారని చెప్పారు. ఈ దశాబ్దం ఉత్తరాఖండ్‌దేనని తేల్చిచెప్పారు. రాష్ట్రం బలం ఆధ్యాత్మిక శక్తిలోనే ఉందన్నారు. గత 25 ఏళ్లలో అనూహ్యమైన ప్రగతి సాధించిందని కొనియాడారు.

    విద్య, పర్యాటకం, ఆరోగ్యం, ఇంధనం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు. 25 ఏళ్ల క్రితం రాష్ట్రం బడ్జెట్‌ రూ.4,000 కోట్లు మాత్రమేనని, ఇప్పుడు రూ.లక్ష కోట్లకు చేరిందని స్పష్టంచేశారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలని, అందుకోసం ప్రజలంతా ఉమ్మడిగా కృషి చేయాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్‌లోని ఆలయాలు, ఆశ్రమాలు, ధ్యాన కేంద్రాలు, యోగా కేంద్రాలను గ్లోబల్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తామని చెప్పారు. 

  • న్యూఢిల్లీ: ప్రజలకు న్యాయ సహాయం అందించడం అనేది కేవలం దాతృత్వ చర్య మాత్రమే కాదని.. అదొక నైతిక బాధ్యత అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ స్పష్టంచేశారు. న్యాయ సహాయ ఉద్యమంలో పాల్గొనేవారు చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని, కక్షిదారుల పట్ల సేవాదృక్పథంలో మెలగాలని సూచించారు. ఆదివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ‘న్యాయ సహాయ యంత్రాంగాల బలోపేతం’అనే అంశంపై జాతీయ సదస్సు ముగింపుతోపాటు ‘లీగల్‌ సర్విసెస్‌ డే’కార్యక్రమంలో జస్టిస్‌ గవాయ్‌ మాట్లాడారు.

    తదుపరి సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌తోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టులకు చెందిన న్యాయమూర్తులు పాల్గొన్నారు. నేషనల్‌ లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ(నల్సా), స్టేట్‌ లీగల్‌ సర్విసెస్‌ అథారిటీ(ఎస్‌ఎల్‌ఎస్‌ఏ)ల్లో సలహా కమిటీని ఏర్పాటు చేయాలని జస్టిస్‌ గవాయ్‌ సూచించారు. విధానపరమైన ప్రణాళికలు సజావుగా కొనసాగేలా చూడడానికి ఈ కమిటీలు అవసరమని చెప్పారు. న్యాయ సహాయం అనేది ప్రభుత్వ పరిపాలనలో ఒక భాగమని వివరించారు. ప్రతి ఒక్కరికీ న్యాయ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు.

    న్యాయ సహాయకులు న్యాయ పాలకులుగా వ్యవహరించాలని పేర్కొన్నారు. మనం చేసే ప్రతి ప్రయత్నం ప్రజలకు మేలు చేసేదిగా ఉండాలన్నారు. తాను ‘నల్సా’లో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సేవలందించానని జస్టిస్‌ గవాయ్‌ వెల్లడించారు. అప్పట్లో జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌తో కలిసి పనిచేశానని చెప్పారు. విధి నిర్వహణలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు కలిసి వెళ్లేవాళ్లమని గుర్తుచేసుకున్నారు. మన రాజ్యాంగ ఆత్మ వ్యక్తీకరణకు న్యాయ సహాయ ఉద్యమం ఒక చక్కటి ఉదాహరణ అని అభివర్ణించారు.  

    ఉత్సాహంగా లాయర్ల వాకథాన్‌  
    ఢిల్లీలో ఆదివారం లాయర్ల వాకథాన్‌ ఉత్సాహంగా జరిగింది. సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ చీఫ్‌ వికాస్‌ సింగ్‌ జెండా ఊపి వాకథాన్‌ను ప్రారంభించారు. సుప్రీంకోర్టు ప్రాంగణం నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని ఇండియా గేట్‌ దాకా లాయర్ల నడక కొనసాగింది. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ గవాయ్‌తోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ సహా 2,000 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. అలాగే వాకథాన్‌ సందర్భంగా న్యాయమూర్తులు మొక్కలు నాటారు.

  • సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ప్రచార పర్వం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇన్నాళ్లూ రాజకీయ పారీ్టల నినాదాలు, ప్రసంగాలతో హోరెత్తిపోయిన గ్రామాలు, పట్టణాలు నిశ్శబ్దంగా మారిపోయాయి. చివరిదైన రెండో దశ పోలింగ్‌ ఈ నెల 11వ తేదీన 122 నియోజవర్గాల్లో జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నెల 6వ తేదీన 121 స్థానాల్లో జరిగిన తొలి దశ పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 65 శాతం ఓటింగ్‌ నమోదైంది. రెండో దశలో కీలక నేతలు పోటీపడుతున్నారు. బిహార్‌ ఎన్నికల చరిత్రలో 5 శాతానికి మించి ఓటింగ్‌ పెరిగిన ప్రతిసారీ.. అది అధికార మారి్పడికే దారితీసిందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు. ఈసారి భారీ ఓటింగ్‌ నమోదు కావడం తమకే అనుకూలమని ఇరుపక్షాలూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి.   

    సమీకరణాల చదరంగం  
    రెండో దశలో పోలింగ్‌ జరుగనున్న 122 నియోజకవర్గాలు అత్యంత సంక్లిష్టమైనవి. ఇక్కడ ప్రచారం మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో కుల సమీకరణాలు, ఓట్ల చీలిక వంటి అంశాలే అభ్యర్థుల గెలుపోటములను శాసించనున్నాయి. రెండో దశలో సీమాంచల్‌ అత్యంత కీలకం. కిషన్‌గంజ్, అరారియా, పూరి్ణయా, కతిహార్‌ వంటి జిల్లాలున్న ఈ ప్రాంతంలో ముస్లిం మైనారిటీల జనాభా ఎక్కువ. ఇది దశాబ్దాలుగా ఆర్జేడీ–కాంగ్రెస్‌ కూటమికి కంచుకోట. అయితే, 2020 నాటి ఎన్నికల్లో అసదుద్దీన్‌ ఓవైసీ నేతత్వంలోని ఎంఐఎం ఇక్కడ 5 స్థానాలు గెలుచుకొని మహాగఠ్‌బంధన్‌ ఓట్లను చీల్చింది.

    మైనారిటీల ఓట్లను ఆకర్శించేందుకు ఆర్జేడీ, కాంగ్రెస్‌ సర్వశక్తులూ ఒడ్డుతుండగా.. ఎంఐఎం సైతం అదే ఓటు బ్యాంకుకు గాలం వేస్తోంది. ఈ ’ఓట్ల చీలిక’అంతిమంగా ఎన్డీఏకు లాభం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. రెండో దశలోనూ కులమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ముస్లిం–యాదవ్‌ సమ్మేళనం మహాగఠ్‌బంధన్‌కు ప్రాణవాయువు లాంటిది. ఆర్జేడీ అభ్యర్థులు పూర్తిగా ఈ ఓటు బ్యాంకును నమ్ముకుంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ బలం ఈబీసీలు, మహాదళితులే. ఈ నిశ్శబ్ద ఓటు బ్యాంకు గత రెండు దశాబ్దాలుగా జేడీయూ వెంటే నడుస్తోంది.  భూమిహార్, రాజ్‌పుత్, బ్రాహ్మణ వర్గాలు ఆనవాయితీగా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నాయి.

    ఓట్ల చీలికలతో తంటాలు  
    ఈ ఎన్నికల్లో ‘ఓట్లను చీల్చే’పార్టీల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని జన సురాజ్‌ పార్టీ చాలా నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టింది. ఇది సంప్రదాయ రాజకీయాలకు అలవాటుపడని ఓటర్లను ఆకర్శిస్తోంది. ఈ పారీ్టతో జేడీ(యూ), ఆర్జేడీలకు కొంత నష్టం జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘సన్‌ ఆఫ్‌ మల్లా’గా పిలుచుకునే ముకేశ్‌ సహానీ.. బిహార్‌ నిషాద్‌ (మత్స్యకార) వర్గంలో గట్టి పట్టున్న నాయకుడు. ఈయన మహాగఠ్‌బంధన్‌లో భాగస్వామిగా ఉండటం ఆర్జేడీకి కలిసొచ్చే అంశం.  

    సమస్యాత్మక ప్రాంతాలు 
    రెండో దశలో పోలింగ్‌ జరగనున్న పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామఢీ వంటి జిల్లాలు నేపాల్‌ సరిహద్దును ఆనుకొని ఉన్నాయి. ఇక్కడ ఎన్నికల నిర్వహణ భద్రతా బలగాలకు పెద్ద సవాల్‌. ఎన్నికలకు 72 గంటల ముందే నేపాల్‌ సరిహద్దును మూసివేశారు. అసాంఘీక శక్తులు సరిహద్దులు దాటకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు సీమాంచల్‌ ప్రాంతం మతపరంగా అత్యంత సున్నితమైనది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రాంతాల్లో భారీగా సాయుధ బలగాలను మోహరించింది. ప్రజలు స్వేచ్ఛగా, శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 14న ఫలితాల కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Telangana

  • బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 నాగార్జున సర్కిల్ లోని ఎం పి ఎం టైం స్క్వేర్ మాల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రటాట ది బిగ్గెస్ట్ గేమింగ్ జోన్ ను ఆదివారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పిల్లలు శారీరక క్రీడలకు దూరమై సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారని దీనివల్ల వారు మానసికంగా కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు వస్తున్నాయని అన్నారు. ఇటువంటి గేమింగ్ జోన్లు పిల్లలకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు.

    రటాట గేమింగ్ జోన్ నిర్వాహకులు శైలజ, కోటి బాబు మాట్లాడుతూ నగరంలోని 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద గేమింగ్ జోన్ గా ఇది నిలిచిపోతుందని సుమారు 50 కి పైగా క్రీడలు ఈ జోన్ లో పిల్లలకు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. పిల్లలకు శారీరక క్రీడలతో పాటు మానసికంగా ఐక్యులేవల్స్ పెంచే ఆటలు కూడా ఇక్కడ ఉన్నాయన్నారు. 

    స్క్విడ్ గేమ్ సిరీస్ లో ఫేమస్ అయిన హైపర్ గ్రిడ్ గేమ్ కూడా ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చార్టెడ్ అకౌంటెంట్ పివిఆర్ మూర్తి, డాక్టర్ గోవర్ధన్ రెడ్డి, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ సెక్రటరీ కాజా సూర్యనారాయణ, శివ, సింధూర, అనూష తదితరులు పాల్గొన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) చేపట్టిన భారీ అంతర్రాష్ట్ర ఆపరేషన్‌ విజయవంతమైంది. మొత్తం ఐదు రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ 25 రోజులపాటు ఆయా రాష్ట్రాల్లో టీజీ సీఎస్‌బీ చేపట్టిన ఈ స్పెషల్‌ ఆపరేషన్లలో ఏడుగురు మహిళలు సహా..మొత్తం 81 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పరిధిలోని ఏడు సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్లలో నమోదైన 41 సైబర్‌ నేరాల్లో ప్రత్యక్షంగా సంబంధం ఉందని అధికారులు తెలిపారు. 

    దేశవ్యాప్తంగా 754 సైబర్‌ కేసుల్లోనూ నిందితులకు సంబంధం ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ కేసుల్లో కలిపి మొత్తం రూ.95 కోట్లు నిందితులు కొల్లగొట్టినట్టు గుర్తించారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పోలీసులతో సమన్వయంతో చేపట్టిన ఈ భారీ ఆపరేషన్‌ల వివరాలను టీజీ సీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టుబడిన నిందితుల నుంచి 84 మొబైల్‌ ఫోన్లు, 101 సిమ్‌కార్డులు, 89 బ్యాంకు పాస్‌బుక్‌లు స్వాదీనం చేసుకున్నారు. 

    పట్టుబడిన నిందితుల్లో 17 మంది ఏజెంట్లు, 11 మంది సైబర్‌ నేరాల్లో కొల్లగొట్టిన సొమ్మును చెక్కుల ద్వారా, ఏటీఎంల ద్వారా నగదు ఉప సంహరణలో పాల్గొన్నవారు, 53 మంది మ్యూల్‌ బ్యాంకు ఖాతా హోల్డర్లు ఉన్నారు. మ్యూల్‌ బ్యాంకు ఖాతాలు (ఒకరి పేరిట ఉన్న బ్యాంకు ఖాతాను వేరొకరు వినియోగించుకునేందుకు ఇచ్చేవి) ఇచ్చినందుకు వీరికి సైబర్‌ నేరగాళ్ల ముఠాలు 5 శాతం కమీషన్‌ ఇస్తున్నట్టు దర్యాప్తులో గుర్తించామన్నారు. 

    నిందితుల వృత్తుల వారీగా చూస్తే.. ఒక ఐడీఎఫ్‌సీ బ్యాంకు సేల్స్‌ ఎగ్జిక్యూటివ్, ఫెడరల్‌ బ్యాంకు ఉద్యోగి, బంధన్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్, కంప్యూటర్‌ ఆపరేషన్స్‌ డిప్లొమా హోల్డర్, చెన్నై కిల్‌పోక్‌ ఆడిట్‌ ఆఫీస్‌లో అకౌంటెంట్, బీబీఏ గ్రాడ్యుయేట్, ఒక ఎంఎన్‌సీ సహా ఇతరులు ఉన్నట్టు తెలిపారు. విదేశాల్లోని సైబర్‌ క్రైం నెట్‌వర్క్‌లతో కొందరికి సంబంధాలున్నట్టు గుర్తించామని, వారిపై లుక్‌ఔట్‌ సర్క్యులర్లు జారీ చేసినట్టు వెల్లడించారు. 

    ఈ అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో కీలకంగా పనిచేసిన అదనపుఎస్పీ బిక్షంరెడ్డి, డీఎస్పీలు కేవీ సూర్యప్రకాశ్, ఎస్‌వీ హరికృష్ణ, కేవీఎం ప్రసాద్, వై వెంకటేశ్వరరావు, కే గిరికుమార్, వేణుగోపాలరెడ్డి, బి అశోక్, ఏ సుభాశ్‌ చంద్రబోస్, నందిరామ్‌ ఇతర సిబ్బందిని టీజీసీఎస్‌బీ డైరెక్టర్‌ శిఖాగోయల్‌ అభినందించారు.   

  • సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలో మజ్లిస్‌ పార్టీ అండతో డ్రగ్స్‌ రాకెట్‌ హిందూ బాలికలను లక్ష్యంగా చేసుకొని కిడ్నాప్, అత్యా­చారాలు చేస్తూ వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాయ­ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో పాతబస్తీ పోలీసులు కనీస విచారణ జరపడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలిసినా మజ్లిస్‌ పార్టీ ఒత్తిళ్లతో చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. 

    పాతబస్తీలో హిందూ అమ్మాయిలు అత్యధికంగా చదువుకునే స్కూళ్లను టార్గెట్‌ చేస్తూ డ్రగ్స్‌ ముఠా అరా­చకాలు చేస్తోందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని యుద్ధ ప్రాతిపదికన డ్రగ్స్‌ ముఠా అంతు చూడాలని, హిందూ బాలికల జీవితాలను కాపాడాలని, లేకపోతే పాతబస్తీలో వేలాది మంది హిందూ యువకులతో రక్ష­క దళాలను రంగంలోకి దింపుతామని హెచ్చరించారు. అవసరమైతే చట్టానికి లోబడి కేంద్ర బలగాలను కూడా పాతబస్తీలో మోహరింపజేయాల్సి ఉంటుందన్నారు. 

    తానే స్వయంగా పాతబస్తీలో పాగా వేసి డ్రగ్స్‌ ముఠా అంతు చూస్తానని, అందు­కు జరగబోయే పరిణామా­లకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పా­రు. పాతబస్తీలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే కేరళ ఫైల్స్‌ సినిమాను తలపిస్తోందన్నారు. మొదట ఈ రాకెట్‌ ఓ స్కూల్‌లో ఒక అమ్మాయిని లక్ష్యంగా చేసుకొని బర్త్‌డే పేరుతో ముస్లిం అమ్మాయి ఇంటికి పిలిపించి తక్కువ డోస్‌ ఉన్న డ్రగ్స్‌ చాక్లెట్‌ తినిపించారని, ఆ తర్వాత ఆ చాక్లెట్లలో డ్రగ్స్‌ డోస్‌ పెంచి అలవాటు చేసి ఆరు రోజుల తర్వాత కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేశారన్నారు. 

    అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు విచారణ చేయరని, ఫిర్యాదు చేసిన ఒకటి రెండ్రోజులకే ఆ అమ్మాయిలను ఇంటి వద్ద వదిలి వెళతారని, విచారణ జరపాలని అడిగితే మీ అమ్మాయి ఎట్లాగూ వచ్చింది కదా, ఇక విచారణ ఎందుకని కేసును క్లోజ్‌ చేస్తారని చెప్పారు. ఇలాంటి కేసులు అక్కడ చాలా ఉన్నాయన్నారు. 

    పాతబస్తీ మజ్లిస్‌ అడ్డా కాబట్టి... ఒవైసీ చెప్పినట్టు నడుస్తోందని, మజ్లిస్‌ అండతో పోలీసులు డ్యూటీ నిర్వహించకుండా డబ్బులు దండుకుంటున్నారన్నారు. ఈ గ్యాంగ్‌ను పట్టుకునే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేదా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో బీజేఎల్పీ ఉపనేత పాయల్‌ శంకర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్, గోషామహల్‌ అధ్యక్షుడు ఉమా మహేందర్, బీజేపీ నేతలు ఎన్వీ సుభాశ్, జి.మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.

    అభివృద్ధి కావాలా.. అరాచకం కావాలా? 
    జూబ్లీహిల్స్‌ ప్రజలు నిర్ణయించుకోవాలి: బండి   
    సాక్షి, హైదరాబాద్‌: అభివృద్ధి కావాలో.. అరాచకం కావాలో జూబ్లీహిల్స్‌ ప్రజలు నిర్ణయించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం పాదయాత్ర నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘మళ్లీ చెబుతున్నా హిందువులు అంటే బీజేపీ, బీజేపీ అంటే హిందువులు.. బీజేపీ 80 శాతం మంది హిందువుల పక్షాన పోరాడుతోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు 20 శాతం ముస్లింల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి’అని సంజయ్‌ ఆరోపించారు. 

    హిందువుల ఓట్లే అవసరం లేదన్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్‌ జూన్‌ 8న మృతి చెందారు. కొడుకు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ గోపీనాథ్‌ తల్లి అదే నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలు, ఫిర్యాదు కాపీ నాదగ్గరున్నాయి’అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. 

    ఆయన కుమారుడిని విదేశాల నుంచి ఇండియాకు రానీయకుండా మాజీ మంత్రి బెదిరించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ‘గోపీనాథ్‌ ఆస్తులపై సునీతతో కలసి కేటీఆర్‌ కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రలో సీఎం రేవంత్‌కు వాటా ఉంది’అని ఆరోపించారు. దీపక్‌రెడ్డిని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చేబాధ్యతను తాను తీసుకుంటానన్నారు.  

  • పంజగుట్ట(హైదరాబాద్‌): జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతి ఒక మిస్టరీగా అనిపిస్తోందని.. కన్నతల్లినైన తనను, తోడబుట్టిన సోదరుడు వజ్రనాథ్‌ను ఆస్పత్రిలోనికి రానివ్వరాదని సునీత ఆర్డర్‌ పాస్‌ చేసిందని గోపీనాథ్‌ తల్లి మహానందకుమారి ఆరోపించారు. అసలు గోపీనా«థ్‌ జూన్‌ 6వ తేదీన చనిపోయారా...జూన్‌ 8న చనిపోయారా అన్నదీ సందేహంగానే ఉందన్నారు. కేటీఆర్‌ వస్తున్నారు అని ఎవ్వరినీ చూడకుండా ఆపేసి, కేటీఆర్‌ వచ్చాక మరణవార్తను చెప్పారని ఆమె పేర్కొన్నారు. 

    ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాగంటి గోపీనాథ్‌ మొదటి భార్య మాలిని, ఆమె కుమారుడు తారక్‌ ప్రద్యుమ్నతో కలిసి మహానందకుమారి విలేకరులతో మాట్లాడారు. మొదటి భార్య మాలినికి విడాకులు ఇవ్వకుండా, రెండో భార్యగా సునీత లీగలైజ్‌ సర్టిఫికెట్‌ ఎలా తీసుకుంటుందని, తాను గోపీనా«థ్‌కు సునీతకు పెళ్లి చేయలేదని చెప్పారు. ఆ సర్టిఫికెట్‌లో తల్లిగా తన పేరును, మొదటి భార్య మాలిని, ఆమె కుమారుడు తారక్‌ పేరు లేకపోవడంతోనే తాము అభ్యంతరాలు చెప్పామన్నారు. 

    తమకు రాజకీయాలు, ఎమ్మెల్యే టికెట్‌తో ఎలాంటి సంబంధం లేదని, భార్యగా మాలిని, కొడుకుగా తారక్‌కు గుర్తింపు ఉండాలి కదా... కేవలం ఐడెంటీ కోసమే తమ పోరాటమని స్పష్టం చేశారు. లీగలైజ్‌ సర్టి ఫికెట్‌పై తాము తహసీల్దార్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని, ఆయన అన్ని చూసిన తర్వాత ఆర్డీఓకు లేఖ రాశారని అప్పటి నుంచే ఈ వివాదం అని చెప్పారు. గోపీనా«థ్‌ డయాలసిస్‌తో బాధపడుతుంటే కనీసం ఒక సహాయకుడిని కూడా పెట్టకపోవడంపై కూడా అనుమానం కలుగుతుందని తెలిపారు. 

    ఇంట్లో జరిగే వివాదాలపై కేటీఆర్‌కు చెప్పేందుకు కారు వెనుక పరుగెత్తానని, అయినా ఒక్కసారి కూడా కేటీఆర్‌ తనను కలవలేదన్నారు. నిజంగా గోపీనాథ్‌కు మొదటి భార్య వద్దు అనుకుంటే అప్పుడే ఆమెతో విడాకులు తీసుకునేవారు కదా అని చెప్పారు. 2002లో గోపీనాథ్‌నే విడాకులకు దరఖాస్తు చేసి తిరిగి ఆయనే విత్‌డ్రా చేసుకున్నాడని గుర్తు చేశారు.

    తన డేటాఫ్‌ బర్త్, ఆధార్, పాస్‌పోర్టు అన్నింటిలో సన్నాఫ్‌ ఎం.గోపీనాథ్‌ అనే ఉంటుందని తారక్‌ ప్రద్యుమ్న తెలిపారు. అన్నీ చట్టప్రకారం ఉన్నాయని, తహసీల్దార్‌ కార్యాలయంలో కూడా చూపించానని తెలిపారు. తారక్‌ ఎవరో తెలియదు అని అంటున్న సునీత జూన్‌ 6వ తేదీ నుంచి తనకు తరచూ ఫోన్‌ చేసిందని, అప్పుడు తాను అమెరికాలో ఉండేవాడినని తెలిపారు. సెప్టెంబర్ వరకు తనతో ఫోన్‌లో మాట్లాడిందని, సునీత పెద్ద కూతురు కూడా తనకు ఫోన్‌ చేసి మాట్లాడిందని ఆధారాలతో చూపించారు. 

    సునీత ఫోన్‌లో నువ్వు అమెరికాలోనే ఉండిపో అని కేటీఆర్‌ అంకుల్‌ ఉన్నారు.. నీ రెజ్యూమ్‌ పంపించు అక్కడే ఏదో ఒక ఉద్యోగం చూస్తాడు.. అంకుల్‌వి కంపెనీలు ఉన్నాయి అని చెప్పేదన్నారు. తన తండ్రి మాగంటి గోపీనాథ్‌ కూడా తనతో తరచూ ఫోన్‌లో మాట్లాడేవారని చెప్పారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: ఉపఎన్నికలో బీఆర్‌ఎస్, బీజేపీలకు ఓటు వేస్తే.. నోటాకు వేసినట్టేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. 30 నుంచి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిచేది కాంగ్రెస్‌ పార్టీ అని స్పష్టం చేశారు. ఆదివారం యూసుఫ్‌గూడ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు మంత్రులతో కలిసి ఆయన మాట్లాడారు. పదేళ్ల పాలన చూసి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు ఓడించినా, ఉపఎన్నికలో మాత్రం ఫేక్‌ సర్వేలు చేసుకొని భ్రమ పడుతుందని ఎద్దేవా చేశారు. 

    రెండేళ్ల పాలన చూసి ఓటర్లు కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతుండటంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్‌ అభ్యర్థిపై విష ప్రచారమని దుయ్యబట్టారు. ఇతర కుటుంబాల్లో తలదూర్చే ఆలోచన కాంగ్రెస్‌కు లేదని, కానీ, మాగంటి ఇంటి వ్యవహారం బజారున పడింది కాబట్టి కేటీఆర్‌ మాగంటి తల్లికి సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు. 

    డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తుందన్నారు. బలహీన వర్గాల వ్యక్తికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇచి్చందని, పదవి లేకుండానే అనేక సామాజిక కార్యక్రమాలు చేసిన నవీన్‌యాదవ్‌ సేవకుడని, అతడిని గెలిపించాలని పిలుపునిచ్చారు. మూడేళ్ల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

    బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం అధికారంలో రాగానే రేషన్‌ కార్డులు ఇచ్చామని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టం చేసిన సందర్భంలో బలహీనవర్గాల బిడ్డకు జూబ్లీహిల్స్‌లో టికెట్‌ ఇచ్చిందని చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ను మూడు పర్యాయాలు ప్రజలు గెలిపించినా, ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఈ ఉపఎన్నికలో ఓటు అడిగే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదన్నారు. 

    మంత్రి శ్రీహరి మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆర్‌ఎస్‌ ఇక్కడ చేసింది ఏమీ లేదని, గెలిపిస్తే కూడా చేసేదేమీ ఉండదన్నారు. కాంగ్రెస్‌తోనే మూడేళ్లలో అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ కారుకు ఓటు వేస్తే కమలంకు ఓటు వేసినట్టేనన్నారు. ఫేక్‌ వీడియోలతో ప్రచారం చేస్తూ లబి్ధపొందాలని బీఆర్‌ఎస్, బీజేపీలు ప్రయతి్నస్తున్నాయని ఆరోపించారు.

  • సిరిసిల్ల: రాజన్న సిరిసిల్లలోని 131 మ్యాక్స్‌ సంఘాలకు వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇచ్చారు. సిరిసిల్లతోపాటు కరీంనగర్, హనుమకొండ జిల్లాలోనూ ఆర్డర్లు ఇచ్చారు. కానీ సిరిసిల్లలో మెజారిటీ పవర్‌లూమ్స్‌ ఉండడంతో ఇక్కడే ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయి. ఫిబ్రవరిలో మొదటిసారి 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇవ్వగా.. రెండో విడతగా ఏప్రిల్‌లోనూ మరో 2.12 కోట్ల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు. 

    ఈ బట్ట ఉత్పత్తికి వేములవాడలో ప్రభుత్వమే యారన్‌ (నూలు) డిపో ఏర్పాటు చేసింది. నూలును నేరుగా కొనుగోలు చేసి బఫర్‌ స్టాక్‌గా ఉంచడానికి రూ.50 కోట్ల కార్పస్‌ ఫండ్‌ మంజూరు చేశారు. సిరిసిల్ల వ్రస్తోత్పత్తిదారులకు 90 శాతం అరువుపై నూలు (దారం)ను సరఫరా చేశారు. దీంతో సిరిసిల్ల వ్రస్తోత్పత్తిదారులపై పెట్టుబడి భారం తగ్గింది. చీరల ఉత్పత్తి లక్ష్యం నెరవేరుతోంది. నిజానికి బతుకమ్మ పండుగ నాటికే చీరల ఉత్పత్తి పూర్తి కావాల్సి ఉండగా.. ఆర్డర్లు ఆలస్యంగా ఇవ్వడంతో ఉత్పత్తి ఆలస్యమైంది. 

    ఇందిరమ్మ జయంతి సందర్భంగా: రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు ఏకరూప చీరలను అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. గతేడాది ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఏటా మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలను ఇస్తామని ప్రకటించారు. గతంలో బతుకమ్మ చీర ఖరీదు రూ.350 ఉండగా.. ఈ ఏడాది ఇందిరా మహిళా శక్తి చీర ఖరీదు రూ.480గా నిర్ణయించారు. నవంబరు 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని స్వశక్తి సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. 

    సిరిసిల్లలోని బీవైనగర్‌లో పవర్‌లూమ్స్‌ (మరమగ్గాల)పై ఇందిరా మహిళా శక్తి చీరల బట్టను నేస్తున్న ఇతని పేరు ఐతం రాజు. 60 ఏళ్లు దాటిన మహిళలు కట్టుకునేందుకు వీలుగా గోచీ చీరలు (తొమ్మిది మీటర్ల పొడువు) ఉత్పత్తి చేస్తున్నాడు. ఈ చీరలను జౌళిశాఖ అధికారులు డిజైన్‌ చేసి ఇవ్వడంతో సాంచాలపై ఉత్పత్తి అవుతున్నాయి. ఆరునెలలుగా చీరల ఉత్పత్తితో నేత కార్మికులకు చేతి నిండా పని ఉండగా..ఇప్పుడు చీరల ఉత్పత్తి చివరి దశకు చేరింది. 

    ఇతను బీవైనగర్‌కు చెందిన వేముల భూమయ్య. నెలాంతా పని చేస్తే రూ.20వేల వరకు కూలి వస్తుంది. అదే ప్రభుత్వ ఆర్డర్‌ కాకుండా సాధారణ పాలిస్టర్‌ బట్ట ఉత్పత్తి చేస్తే నెలకు రూ.10 వేలు వస్తాయి. ఇందిరా మహిళా శక్తి చీరల బట్టను ప్రభుత్వం ఆర్డర్‌ చేయడంతో నేతన్నలకు మెరుగైన కూలి లభిస్తుంది.  

    వారం రోజుల్లో ఉత్పత్తి పూర్తి
    సిరిసిల్లలో చీరల బట్ట ఉత్పత్తి, సేకరణ చివరిదశకు చేరింది. నేత కార్మికులు రేయింబవళ్లు శ్రమించి బట్టను ఉత్పత్తి చేశారు. ఇంకా కొన్ని సాంచాలపై ఉత్పత్తి అవుతున్నాయి. వారం రోజుల్లో ఉత్పత్తి పూర్తవుతుంది. 
    – రాఘవరావు, చేనేత, జౌళిశాఖ ఏడీ, సిరిసిల్ల 

  • సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్, జేఈఈ పరీక్షల తేదీలు ప్రకటించడంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. చాలా మందిలో పరీక్షల భయం కనిపిస్తోంది. ‘మమ్మీ.. భయమేస్తోందే..’అంటూ ఇంటర్‌ హాస్టల్‌ విద్యార్థులు తల్లులకు ఫోన్లు చేసి వాపోతున్నారు. జిల్లా ఇంటర్‌ అధికారులు ఈ విషయాన్ని ఇటీవల బోర్డు ఉన్నతాధికారులకు తెలియజేశారు. కాలేజీల్లో ఒక్కసారిగా బోధన సమయం పెరగడం.. అంతర్గత పరీక్షలు ఎక్కువ నిర్వహించాలనే ఆలోచన విద్యార్థుల భయానికి కారణంగా పేర్కొంటున్నారు.

    దీనికితోడు ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీలు ర్యాంకులే లక్ష్యంగా విద్యార్థులపై ఒత్తిడి పెంచాయి. బోధన సమయాన్ని ఎక్కువ చేశాయి. ఇంటర్‌ సిలబస్‌తోపాటు జేఈఈ, ఈఏపీసెట్, నీట్‌ వంటి పరీక్షల శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. రోజువారీ, వారాంతపు, నెలవారీ అంతర్గత పరీక్షలు నిర్వహిస్తున్నాయి. వాటిల్లో వచ్చే మార్కుల ఆధారంగా విద్యార్థులను సెక్షన్ల వారీగా విడగొడుతున్నాయి. ఇవన్నీ విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అధికారులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5.8 లక్షల మంది ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు. వారిలో సుమారు 90 వేల మందే ప్రభుత్వ ఇంటర్‌ కాలేజీల్లో చదువుతున్నారు. మిగతా వారంతా ప్రైవేటు కాలేజీల్లోనే చదువుతున్నారు.  

    ఇక ఇంటికి పంపలేం 
    పరీక్షలయ్యే వరకు విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఇంటికి పంపలేమని ప్రైవేటు కాలేజీలు తల్లిదండ్రులకు తేల్చిచెబుతున్నాయి. ‘మీ వాడు మేథ్స్‌లో వీక్‌గా ఉన్నాడు. సెక్షన్‌ మారుస్తున్నాం’అని చెప్పే కాలేజీలూ ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు విద్యార్థులను ప్రశ్నిస్తున్నారు. ‘చదవడం లేదా?.. ఇలా అయితే ఎలా’అంటూ నిలదీస్తున్నారు. ఒక్కసారిగా కట్టడి చేయడం, కఠిన నిబంధనలు పెట్టడంతో విద్యార్థులు భయపడుతున్నారు.

    ప్రైవేటు హాస్టళ్లలో సమయ పాలన మార్చారు. ఉదయం 4 గంటలకే లేపడం, రాత్రి 11 గంటల వరకూ స్టడీ అవర్స్‌ పేరుతో కూర్చోబెట్టడం విద్యార్థులకు కొత్తగా ఉంది. ఇప్పటివరకు క్లాస్‌ రూంలో చెప్పిన పాఠాలకు భిన్నంగా షార్ట్‌కట్‌ పేరుతో బోధన చేయడం కూడా కొత్తగా ఉందని ఓ కార్పొరేట్‌ కాలేజీ విద్యార్థి శశాంక్‌ పేర్కొన్నాడు. చాలాచోట్ల భోజనం చేసేందుకు తగిన సమయం కూడా ఇవ్వడం లేదు. ఆటలు పూర్తిగా రద్దు చేశారు. పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్‌కే పరిమితం చేశారు. ఇంటికి ఫోన్‌ చేసేందుకూ అవకాశం ఇవ్వడం లేదు. కొన్ని కాలేజీలు ఆదివారం మాత్రమే తల్లిదండ్రులతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాయి. 

    ఆ చాప్టర్లంటే వణికి పోతున్నారు 
    కొన్ని చాప్టర్లు ఎంత చదివినా విద్యార్థులకు బోధపడటం లేదు. ఇంటర్‌ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని అకడమిక్‌గానే ఇప్పటివరకు చదివినట్టు విద్యార్థులు చెబుతున్నారు. జాతీయ పోటీపరీక్షల కోసం భిన్నంగా చెబుతున్నారని వారు అంటున్నారు. గతంలో చదివింది ఇప్పుడు చదివే దానికి పొంతనే ఉండటం లేదంటున్నారు. మేథ్స్‌లో మ్యాట్రిక్స్‌ అండ్‌ డిటరి్మనేట్స్‌లో ఎడ్‌జాయింట్, ఇన్‌వర్స్, ప్రాపర్టీస్, సిస్టమ్‌ ఆఫ్‌ ఈక్వేషన్స్‌లో కొత్త విధానం ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాల్సి వస్తోందని ఇంటర్‌ విద్యార్థి సందీప్‌ చెప్పాడు. ప్రాబబులిటీ డిస్ట్రిబ్యూషన్స్‌లో నార్మల్‌ చాప్టర్స్‌ను ఇప్పుడు సుదీర్ఘంగా చేయాల్సి వస్తోందంటున్నారు.

    సర్కిల్స్, పారా»ొలా, ఎల్లిప్స్, హైపర్‌బోలా, వెక్టర్‌ ఆల్జీబ్రాలో స్కాలర్‌ ప్రొడక్ట్, వెక్టర్‌ ప్రొడక్ట్‌ వంటివి సాధారణ సెక్షన్‌లో ఉండే విద్యార్థులకు అంతుబట్టడం లేదు. ఒక్కసారిగా వాటిని భిన్నమైన రీతిలో బోధించడమే అందుకు కారణమని విద్యార్థులు చెబుతున్నారు. ఫిజిక్స్‌లో ఎలక్రి్టక్‌ చార్జెస్‌ అండ్‌ ఫీల్డ్స్, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, ఆల్టర్‌నేటింగ్‌ కరెంట్‌ వంటి చాప్టర్లలో కొత్త అంశాలను జాతీయ పరీక్షల కోసం అధ్యాపకులు చెబుతున్నారు. వాటి నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయంటున్నారు. కెమెస్ట్రీలోనూ సెల్‌ పొటెన్షియల్స్, ఆర్డర్‌ ఆఫ్‌ రియాక్షన్, మెకానిజం బేస్డ్‌ రియాక్షన్స్‌ను పాఠ్యపుస్తకంలో లేని కొత్త అంశాలతో పరీక్షల కోణంలో చెప్పడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. 

    ఒత్తిడికి తాళలేక ఆత్మహత్యలు.. 
    కొన్నేళ్లుగా ఇంటర్‌ విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా అనేక మంది బలవన్మరణాలకు పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. బోధన సమయంలో ఒత్తిడి, ఫలితాలు తారుమారు కావడం, జాతీయ స్థాయిలో ర్యాంకులు వారిని కుంగదీస్తున్నాయి. 2019లో 22 మంది, 2022లో 543 మంది, 2024లో ఏడుగురు, 2025లో ముగ్గురు విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కాగా, ఈ పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెడతామని.. ఒత్తిడి పెంచుతున్న కాలేజీల వివరాలు సేకరించాలని జిల్లా ఇంటర్‌ అధికారులను ఆదేశించినట్లు బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

    యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. 
    విద్యార్థులు టాప్‌ ర్యాంకులు సాధించేలా బోధించాలని కాలేజీల యాజమాన్యాలు మాకు తేల్చిచెబుతున్నాయి. దీంతో విద్యార్థులపై మేం ఒత్తిడి పెంచక తప్పడం లేదు. కానీ దీనివల్ల దుష్ఫలితాలు ఎదురుకావచ్చు. – రణదీప్‌ పల్లవ్, ఇంటర్‌ అధ్యాపకుడు 

    ర్యాంకుల ఆందోళనలో విద్యార్థులు 
    నెల రోజుల వ్యవధిలో 10 మంది ఇంటర్‌ విద్యార్థులకు కౌన్సిలింగ్‌ ఇచ్చా. మాకు ర్యాంకులు వస్తాయా? మేం ఏం చదవాలనే ఆందోళన వారిలో కనిపించింది.  – సరితా వినీత్, మానసిక వైద్యురాలు  

  • కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని జేఎన్‌టీయూలో పాలన గాడి తప్పింది. సెక్యూరిటీ సిబ్బందితో విద్యార్థులు ఘర్షణ పడిన విషయం మరవకముందే, సీనియర్‌ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్‌ చేసిన అంశం తెరపైకి వచి్చంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.  

    పరిచయాల పేరుతో పరేషాన్‌.. ఆపై ర్యాగింగ్‌ 
    రెండురోజుల క్రితం కళాశాలలో ఫ్రెషర్స్‌ డే నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ అశోక్‌ కుమార్‌ ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ర్యాగింగ్, ఇతరత్రా అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అయితే వేడుకలకు సరిగ్గా రెండు రోజుల ముందు బాయ్స్‌ హాస్టల్లో కొందరు జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడినట్టు వీడియో లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఫస్టియర్‌ చదు వుతున్న ఇద్దరు అబ్బాయిలతో హాస్టల్‌లో ఒకరినొకరు పెళ్లి చేసుకున్నట్టు తంతు నిర్వహించారు. అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు ఈ తతంగాన్ని వీడియో తీశారు.  

    సెక్యూరిటీ ఇన్‌చార్జితో ఘర్షణ...సస్పెన్షన్‌  
    రెండురోజుల క్రితం సెక్యూరిటీ ఇన్‌చార్జ్‌ రాజిరెడ్డికి, విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ పరిస్థితిని మరింత వేడెక్కించింది. మద్యం సేవించి హాస్టల్లోకి వస్తున్న రాజిరెడ్డి.. తమను బూతులు తిడుతూ అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు.ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు సెక్యూరిటీ ఇన్‌చార్జి రాజిరెడ్డిని సస్పెండ్‌ చేశారు.

    ర్యాగింగ్‌ జరగలేదు
    జేఎన్‌టీయూ క్యాంపస్‌లో ర్యాగింగ్‌ జరిగిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇంటరాక్షన్‌లో భాగంగా సీనియర్లు, జూనియర్ల మధ్య ఒక ఫన్నీ గేమ్‌ ఘటనను గుర్తించాం. సంబంధిత విద్యార్థులను పిలిపించి విచారించాం. సీనియర్ల నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, సరదా కోసం మాత్రమే వివాహ సన్నివేశంలో పాల్గొన్నామని విద్యార్థులు చెప్పారు.  – నరసింహ, జేఎన్‌టీయూ కళాశాల ప్రిన్సిపాల్‌ 

  • సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌ అడుగు జాడల్లో నడుస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర చేసి వివిధ కాలనీల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘కేసీఆర్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తామని చెబితే, రేవంత్‌ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు అంటున్నారు. ఇద్దరూ మోసం చేస్తున్నారు. ఇండ్లు ఆశ చూపి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక మరచిపోవడం అలవాటైంది.

    ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎందుకు జరగలేదు? ఈ వెనకబాటుకు కారణం ఎవరు? గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు దీనికి బాధ్యులు కావా? ఆ పార్టీల నిర్లక్ష్యం వల్లే ప్రజలకు ఈ దుస్థితి పట్టింది’అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘మజ్లిస్‌ కార్పొరేటర్లు, నాయకులు దాదాగిరి చేస్తున్నారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. భవిష్యత్తులో వీరి ఆగడాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

    మన బిడ్డలను మనం రక్షించుకోవాలన్నా, మనకు రక్షణ కావాలన్నా, నియోజకవర్గం బాగుపడాలన్నా బీజేపీని గెలిపించాలి’అని అన్నారు. రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2,500, విద్యార్థినులకు స్కూటీలు, రూ.5 లక్షల విద్యాభరోసా కార్డులు, రూ.4వేల నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు వంటి హామీలు ఎందుకు అమలు చేయడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

    కేంద్ర సాయంపై బహిరంగ చర్చకు సిద్ధం 
    రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారంపై బహిరంగ చర్చకు సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి ఏమీ చేయలేదంటూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు బీజేపీ, కేంద్రంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తోందంటూ ఈ పార్టీలు కేంద్రంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయని, కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయని తెలిపారు. 2014లో కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేసిందని, 2023 జూన్‌ 7న తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర పేరిట బాగ్‌ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో తాను ప్రజెంటేషన్‌ ఇచ్చానని వివరించారు.

    మరోసారి తెలంగాణ అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చ జరిగేవిధంగా సహకరించాలని హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌కు కిషన్‌రెడ్డి ఆదివారం లేఖ రాశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

    ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుతో బహిరంగ చర్చ జరిపేందుకు రెడీగా ఉన్నామన్నారు. బహిరంగ చర్చకు తేదీ, సమయం నిర్ణయించి వారిద్దరినీ ఆహ్వానించాలని ప్రెస్‌ క్లబ్‌ను కోరారు. ప్రస్తుత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే భాష పార్లమెంటరీ పద్ధతిలో ఉండేలా, సానుకూల చర్చ జరిగే విధంగా చూడాలని సూచించారు.   

  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ ఉత్కంఠను రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కీలక ఘట్టం ముగిసింది. ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి ప్రచార గడువు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల మైకులు బందయ్యాయి. నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన నాటి నుంచి బహిరంగంగా, అంతకుముందు అంతర్గతంగా ప్రచార పర్వంలో నిమగ్నమై కాళ్లకు బలపాలు కట్టుకొని నియోజకవర్గమంతా చుట్టివచి్చన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ప్రచారం ముగియడంతో సేద దీరారు.

    అయితే, ప్రచారం ముగిసిన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రలోభాలకు తెరలేచాయనే చర్చ జరుగుతోంది. ఈ ఉపఎన్నికలో గెలుపే ధ్యేయంగా పనిచేస్తోన్న మూడు ప్రధాన రాజకీయ పక్షాలతోపాటు ఇతర అభ్యర్థులు కూడా ఓటర్లను ప్రలోభపర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే నేరుగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడంతోపాటు పలు రకాల తాయిలాలు ఇస్తున్నారని, గల్లీలు, బస్తీలు, అపార్ట్‌మెంట్లు, కులాలు, వర్గాల వారీగా విందులు, వినోదాలు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది.

    ముఖ్యంగా ఈసారి ఓటుకు రూ. 1,500 నుంచి రూ.5,000 వరకు ఇస్తున్నారని, ఇందులో అధికార కాంగ్రెస్‌ పార్టీ అగ్రభాగాన ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అపార్ట్‌మెంట్‌ ఓటర్లకు రూ.3 వేలు, బస్తీల్లో రూ.5 వేల వరకు పంచేందుకు రాజకీయ పక్షాలు వెనుకాడడం లేదని, చివరి క్షణాల్లో గెలుపునకు అవసరమైన అన్ని కార్యక్రమాలను బహిరంగంగానే నిర్వహిస్తున్నారన్నది ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో బహిరంగ రహస్యంగానే మారిందనడంలో అతిశయోక్తి లేదు. మొత్తంమీద ప్రచార పర్వం ముగియడంతో సోమవారం ప్రలోభాలు మరింత తీవ్రమవుతాయని రాజకీయ పరిశీలకులంటున్నారు. ఇప్పటివరకు రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లు, పాదయాత్రలు, సభలు, సమావేశాలు, గడప గడపకూ ప్రచారాలతో హోరెత్తిన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఇప్పుడు ప్రలోభాలతో సందడిగా మారింది.  

    పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్న ఈసీ 
    మంగళవారం జరగనున్న పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. నియోజకవర్గంలో 407 పోలింగ్‌ బూత్‌లలో దాదాపు రెండువేలకు పైగా సిబ్బందిని పోలింగ్‌ నిర్వహణకు నియమించారు. 2,494 బ్యాలెట్‌ యూనిట్లు ఉపయోగించి ఈ పోలింగ్‌ నిర్వహించేందకు అన్ని ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. పోలీసు బందోబస్తు కోసం వేల సంఖ్యలో సిబ్బందిని నియమించారు. సోమవారం రాత్రికి పోలింగ్‌స్టేషన్ల వారీగా అటు ఎన్నికల నిర్వహణ, ఇటు బందోబస్తు సిబ్బందిని పంపడం ద్వారా పోలింగ్‌ సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికార వర్గాలంటున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 

  • సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి. మోంథా తుపాను ప్రభావం పూర్తిగా తగ్గడంతో వర్షాలు ఆగిపోయాయి. ఆ తర్వాత వాతావరణంలో నెలకొన్న మార్పులు.. పొడి వాతావరణ ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అక్టోబర్‌ నెలాఖరుకల్లా ఉష్ణోగ్రతల తగ్గుదల నమోదు కావాల్సి ఉండగా, ఈసారి కాస్త ఆలస్యంగానే ఉష్ణోగ్రతల పతనం నమోదైంది. దీంతో చలి ప్రభావం కనిపిస్తోంది. రానున్న మూడు రోజులపాటు ఇదే తరహా వాతావరణం ఉంటుంది. మరోవారం తర్వాత ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని, చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

    నెలాఖరుకల్లా చలి తీవ్రం  
    నైరుతి రుతుపవనాలు పూర్తిగా ఉపసంహరణ కావడంతో వాతావరణంలో నెలకొనే మార్పులు శీతాకాలానికి సూచికగా కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను రాష్ట్రంలోనూ తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రస్తుతం ఆకాశం మేఘాలు లేకుండా స్పష్టంగా ఉంది. దీంతో వాతావరణం పొడిగా మారుతోంది. దీంతో రాత్రి సమయంలో భూ ఉపరితలంపైనున్న వేడి త్వరగా తగ్గుతుండడంతో ఉష్ణోగ్రతలు సైతం వేగంగా తగ్గుతున్నాయి. 

    ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీ సెల్సియస్‌ తక్కువగా నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4డిగ్రీ సెల్సియస్‌ వరకు తగ్గుతున్నాయి. వేగంగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడాన్ని పరిశీలిస్తే.. నెలాఖరు నాటికి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గి చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. 

    ప్రస్తుతానికి ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని అధికారులు అంటున్నారు. వాతావరణంలో నెలకొనే మార్పులతో అక్కడక్కడా తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతల పతనం క్రమంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వివరిస్తున్నారు. 

    ఆదివారం రాష్ట్రంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే... మెదక్‌లో 14.1 డిగ్రీల సెల్సియస్‌ నమోదు కాగా, ఆదిలాబాద్‌లో 14.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. భద్రాచలం, నల్లగొండ మినహాయిస్తే... మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా నమోదైనట్టు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.   

Andhra Pradesh

  • సాక్షి, అమరావతి: రాజకీయ కుట్ర కోసం ఎంతకైనా దిగజారుతామని టీడీపీ కూటమి ప్రభుత్వం పదేపదే నిస్సిగ్గుగా ప్రకటిస్తోంది. అందుకోసం ఏకంగా శ్రీవారి దివ్య క్షేత్రమైన తిరుమల పవిత్రత, లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యంపై దుష్ప్రచారం చేసేందుకు కూడా తెగిస్తామని నిరూపిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్‌ రాజకీయాలతో లడ్డూ ప్రసాదం పవిత్రతకు కళంకం తెచ్చేందుకు తెగబడుతోంది. ఆ పక్కా కుట్రలో భాగంగానే సిట్‌ నివేదిక పేరుతో ఎల్లో మీడియా ద్వారా మరోసారి విషం చిమ్ముతోంది. 

    వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిపై అవాస్తవ ఆరోపణలతో అసత్య కథనాలు వండి వారుస్తోంది. రాజకీయాలకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని దూరంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు సూచనను కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తూ దుష్ప్రచారానికి బరితెగిస్తోంది. శతబ్దాలుగా కొనసాగుతున్న లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగిస్తూ తమ మనోభావాలను దెబ్బ తీస్తున్న ఎల్లో మీడియాపై ప్రపంచ వ్యాప్తంగా తిరుమల శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. అందుకే ఈ వ్యవహారంలో ఎల్లో మీడియా కుతంత్రాలను తిప్పికొడుతూ అసలు వాస్తవాలను “సాక్షి’ ప్రజల ముందు ఉంచుతోంది.

    చిన్న అప్పన్న ఏపీ భవన్‌ ఉద్యోగి
    తిరుమల లడ్డూ ప్రసాదం ముసుగులో రాజకీయ కుట్ర కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్నను టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ అంటూ దుష్ప్రచారం చేస్తోంది. తద్వారా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లాలన్నదే కూటమి ప్రభుత్వ కుట్ర. ఏపీ భవన్‌లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పీఏగా పని చేశారు. 

    ఆ వాస్తవాన్ని మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు యత్నిస్తుండటం గమనార్హం. చిరుద్యోగి అయిన ఆయన ఏకంగా టీటీడీ జీఎం స్థాయి ఉన్నతాధికారుల్ని ప్రభావితం చేశారని కట్టుకథలు అల్లుతోంది. ఆయన వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన ఆస్తుల ఉదంతాన్ని వక్రీకరిస్తోంది. వాటి ఆధారంగా చిన్న అప్పన్నను బెదిరించి, వేధించి తమకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇప్పించాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రమన్నది స్పష్టమవుతోంది. 

    ఫిర్యాదుపై విచారణకు ఆదేశించడం కూడా తప్పేనా!? 
    నెయ్యి నాణ్యతపై ఫిర్యాదు రావడంతో టీటీడీ చైర్మన్‌ హోదాలో వైవీ సుబ్బారెడ్డి విచారణకు ఆదేశించడం తప్పన్నట్టుగా పోలీసులు వక్రీకరిస్తుండటం గమనార్హం. ఓ అనాకమ ఫిర్యాదు వస్తే బోలే బాబా డెయిరీ సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను మైసూర్‌లోని సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు నిర్వహించాలని ఆయన ఆదేశించినట్టు పోలీసులు తమ నివేదికలో పేర్కొనడం గమనార్హం. మామూలుగా ఫిర్యాదు వస్తే విచారణకు ఆదేశించకపోతే పట్టించుకోలేదని విమర్శిస్తారు.. విచారణకు ఆదేశిస్తే ఎందుకు ఆదేశించారని ఈనాడు, ఇతర టీడీపీ ఎల్లో మీడియా తిరిగి ప్రశ్నిస్తుండటం విస్మయ పరుస్తోంది. టీడీపీ రాజకీయ కుట్రలో భాగంగా కేవలం విష ప్రచారం చేయాలన్న కుట్రే తప్ప, వాస్తవాలతో తమకు నిమిత్తం లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది.


    చైర్మనే సర్వస్వం కాదు.. టీటీడీ బోర్డు ఉంటుంది 
    ఇక రాజకీయ కుతంత్రంతో కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా టీటీడీ వ్యవస్థాగత నిర్మాణాన్ని పట్టించుకోవడం లేదు. తిరుమల–తిరుపతి వ్యవహారాలకు టీటీడీ చైర్మనే సర్వస్వం, సర్వాధికారి కాదు. టీటీడీ బోర్డుదే అత్యున్నత అధికారం. ఆ బోర్డులో సభ్యులు చర్చించి తీసుకున్న నిర్ణయాలనే టీటీడీ అమలు చేస్తుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు నిర్ణయాన్ని కూడా అదే రీతిలో బోర్డు తీసుకుంది. 

    ఎల్లో మీడియా ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్న మరో విషయం ఏమిటంటే.. నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆమోదించిన ఆనాటి టీటీడీ బోర్డులో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా సభ్యులుగా ఉన్నారు. టీటీడీ పర్చేజ్‌ కమిటీలో కూడా సభ్యులుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టుపై నిర్ణయాన్ని బోర్డుకు సిఫార్సు చేసింది కూడా వారే కావడం గమనార్హం. 

    భోలే బాబా డెయిరీ పాల సేకరణపై భిన్న కథనాలు
    పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ కూటమి ప్రభుత్వం కనికట్టు చేసేందుకు యత్నిస్తోంది. ఈ కేసుకు సంబంధించి భోలే బాబా డెయిరీ గురించి ప్రభుత్వం, ఎల్లో మీడియా పరస్పర విరుద్ధ వాదనలు వినిపిస్తుండటమే అందుకు తార్కాణం. భోలే బాబా డెయిరీ రైతుల నుంచి ఒక్క పాల చుక్క కూడా సేకరించకుండా టీటీడీ నుంచి రూ.240 కోట్ల నెయ్యి కాంట్రాక్టు పొందిందని సిట్‌ దర్యాప్తులో వెల్లడైనట్టు ఎల్లో మీడియా తన కథనంలో పేర్కొంది. మళ్లీ భోలే బాబా డెయిరీ ఉత్తర్‌ప్రదేశ్‌లో 60 వేల మంది పాడి రైతుల నుంచి పాలు సేకరించి, పాల ఉత్పత్తులు తయారు చేస్తోందని అదే కథనంలో పేర్కొనడం గమనార్హం. మరి ఆ డెయిరీ పాలు సేకరిస్తున్నట్టా.. సేకరించనట్టా? రెండూ ఎల్లో మీడియానే 
    చెబుతుంటే అందులో ఏది వాస్తవం!?

    నందిని డెయిరీని తప్పించింది చంద్రబాబు ప్రభుత్వమే
    కర్ణాటక సహకార రంగంలోని నందిని డెయిరీ దశాబ్ద కాలం పాటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. ఆ పరంపరను 2015లో చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుంది. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు కోసం నందిని డెయిరీతోపాటు పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం నందిని డెయిరీని కాదని మహారాష్ట్రకు చెందిన ప్రైవేటు రంగంలోని గోవింద్‌ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చింది. దీనిపై అప్పట్లోనే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తినా, చంద్రబాబు ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. 

    అంటే నందిని డెయిరీని తొలిసారిగా పక్కన పెట్టేసి మరో ప్రైవేటు డెయిరీకి కాంట్రాక్టు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనన్నది సుస్పష్టం. ఇక వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కోసం టీటీడీ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నందిని డెయిరీ అసలు పాల్గొన లేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తాము కోట్‌ చేసిన ధరకు కాంట్రాక్టు ఇవ్వ లేదు కాబట్టి.. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులో పాల్గొనమని చెప్పింది. 

    వాస్తవాలు అలా ఉంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నందిని డెయిరీకి ఎందుకు కాంట్రాక్టు ఇవ్వలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. అసలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియలో పాల్గొనని నందిని డెయిరీకి ఎలా కాంట్రాక్టు ఇస్తారు? ఇస్తే అసలు టెండరు వేయని డెయిరీకి ఎలా కాంట్రాక్టు ఇచ్చారని అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ప్రశ్నించేది కాదా? టెండరులో పాల్గొన్న ఇతర డెయిరీలు కూడా అభ్యంతరం తెలుపుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించేవి కదా! 

    టీడీపీ వీరవిధేయ సిట్‌తో కుతంత్రం
    నెయ్యి వివాదాన్ని టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని కూటమి ప్రభుత్వం యత్నించింది. అందుకే ఈ ఆరోపణలపై దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో గత ఏడాది హడావిడిగా సిట్‌ను ఏర్పాటు చేసింది. 2024 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పని చేసిన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్‌ ఇన్‌చార్జ్‌గా నియమించింది. అప్పటి విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ, కడప ఎస్పీ హర్షవర్దన్‌ రాజులను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్‌ జెట్టి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కృష్ణయ్య అల్లుడు. 



    రిటైరైన తర్వాత కొన్నేళ్లు హెరిటేజ్‌ ఫుడ్స్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన కృష్ణయ్యను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్‌గా నియమించారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ పదవి కట్టబెట్టడం గమనార్హం. సిట్‌ను ఏర్పాటు చేసిన తర్వాత.. నెయ్యిలో కల్తీపై టీటీడీ ద్వారా తిరుపతిలోని ఈస్ట్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయించడం గమనార్హం. ఆ ఫిర్యాదు చేసే ముందు రోజు రాత్రే తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐని బదిలీ చేసి, ఆ స్థానంలో టీడీపీకి అనుకూల పోలీసు అధికారిని నియమించడం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. 

    సుప్రీం కొరడా.. సిట్‌ క్లోజ్‌
    ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సీఎం హోదాలో ఉండి లడ్డూ ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటని చంద్రబాబును ప్రశ్నించింది. కనీసం దేవుడిని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచండని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లడ్డూ ప్రసాదం అంశంపై సిట్‌ దర్యాప్తు సరిపోతుందా.. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా.. అన్నది ఆలోచిస్తామని తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు ప్రభుత్వం తిరుపతిలో దర్యాప్తు నిర్వహిస్తున్న సిట్‌ కార్యకలాపాలను తక్షణం నిలిపి వేసింది. అనంతరం సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర బృందం దర్యాప్తు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశం చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని పరిశీలకులు స్పష్టం చేశారు.

    డైవర్షన్‌ డ్రామా కోసం తిరుమల పవిత్రతపై దుష్ప్రచారం
    ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్‌ డ్రామాలో భాగంగానే కల్తీ నెయ్యి అంటూ రాద్ధాంతం చేస్తోంది. అందుకోసం ఏకంగా తిరుమల ఆలయ పవిత్రతకు భంగం కలిగించేందుకు బరితెగిస్తోంది. గత ఏడాది బుడమేరుకు భారీ వరద వస్తుందని నిపుణులు ముందే హెచ్చరించినా, కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర వీడ లేదు. దాంతో భారీ వరద విజయవాడను ముంచెత్తి అతలాకుతలం చేసింది. 

    తమ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిపై దుష్ప్రచారానికి తెగబడింది. కూటమి నేతలు, ఎల్లో మీడియా పక్కా పన్నాగంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీసేందుకు ఏమాత్రం వెనుకాడ లేదు. కానీ టీడీపీ కూటమి నేతల కుట్రను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు అధికారిక ప్రకటనే తిప్పికొట్టింది. ఆ వ్యవహారం ఇలా సాగింది.

    2024 జులై 23
    వనస్పతి కలిసింది.. ట్యాంకర్లు వెనక్కి పంపాం 
    నెయ్యిలో కల్తీ జరిగిందని శాంపిల్స్‌ పరీక్షల్లో తేలింది. వెజిటబుల్‌ ఫ్యాట్‌ అంటే వనస్పతి కలిసిందని వెల్లడైంది. దాంతో కాంట్రాక్టరును బ్లాక్‌ లిస్ట్‌ పెట్టి షోకాజ్‌ నోటీసు ఇచ్చాం. ఆ సంస్థ సరఫరా చేసిన ట్యాంకర్లను వెనక్కి పంపాం. ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదం కోసం వినియోగించనే లేదు.     – టీటీడీ ఈవో శ్యామలరావు

    2024 సెప్టెంబర్‌ 18 
    నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారు : చంద్రబాబు
    టీటీడీ ఈవో అధికారిక ప్రకటనలకు విరుద్ధంగా లడ్డూ ప్రసాదం తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారు. 

    సెప్టెంబర్‌ 22
    నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపాం : టీటీడీ ఈవో
    అయినా సరే చంద్రబాబు ఆరోపణలను టీటీడీ ఈవో శ్యామలరావు తిప్పికొట్టారు. నమూనాలను పరీక్షించాక అది కల్తీ నెయ్యి అని తేలడంతో ఆ డెయిరీ పంపిన నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపాం. ఆ డెయిరీ నుంచి నెయ్యి సరఫరాను నిలిపి వేశామని తెలిపారు.

    సెప్టెంబరు 22 
    ఆ నెయ్యి వాడారు : చంద్రబాబు
    అయినా సరే చంద్రబాబు తన దుష్ప్రచారాన్ని కొనసాగించారు. నాలుగు ట్యాంకర్లు అప్పటికే వచ్చేశాయి. అందులోని కల్తీ నెయ్యిని వాడారని మళ్లీ దుష్ప్రచారం చేయడం గమనార్హం. అంటే వాస్తవాలతో తనకు నిమిత్తం లేదని, రాజకీయ ప్రయోజనం కోసం తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని దెబ్బ తీసేందుకు వెనుకాడనని నిరూపించారు.

        ఇంతటితో ఆగకుండా, టీడీపీ కూటమి ప్రభుత్వం తన డర్టీ పాలిటిక్స్‌కు మరింత పదును పెట్టింది. 2024 సెప్టెంబర్‌ 18న తిరుమల లడ్డూపై ఆరోపణలు చేస్తే.. ఆ మర్నాడే అంటే సెప్టెంబర్‌ 19న ఎన్‌డీడీబీ నివేదికను టీడీపీ ప్రధాన కార్యాలయం విడుదల చేసింది. వాస్తవానికి ఎన్‌డీడీబీ నివేదికను గోప్యంగా ఉంచాలి. 
    కానీ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘిస్తూ టీడీపీ కార్యాలయం ఆ నివేదికను విడుదల చేయడం గమనార్హం.

    సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు కోరిన వైవీ సుబ్బారెడ్డి
    తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ కూటమి ప్రభుత్వ దుష్ప్రచారంపై వైవీ సుబ్బారెడ్డి సత్వరం స్పందించారు. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్‌ ఏర్పాటు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

    సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని అభ్యర్థించారు. బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోరినందునే వైవీ సుబ్బారెడ్డిపై కూటమి ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. అందుకే ఆయనకు వ్యతిరేకంగా ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తోంది.

    టీటీడీలో నెయ్యి కొనుగోలుకు పటిష్ట వ్యవస్థ
    రాజకీయ ప్రయోజనాల కోసం లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ ఏకైక లక్ష్యంగా మారింది. కానీ నెయ్యి, ఇతర సరుకులు కొనుగోలు చేసేందుకు టీటీడీలో దశాబ్దాలుగా పటిష్ట వ్యవస్థ ఉందనే వాస్తవాన్ని ఉద్దేశ పూర్వకంగా 
    విస్మరిస్తోంది. నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేసేందుకు టీటీడీ పటిష్ట విధానం అనుసరిస్తోంది.

    ⇒ లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం టీటీడీ ప్రతి ఆరు నెలలకోసారి టెండర్లు పిలుస్తుంది. టెండర్లు కోట్‌ చేసిన వాటిలో ఎల్‌1గా వచ్చిన డెయిరీని టీటీడీ బోర్డు ఆమోదిస్తుంది. దశాబ్దాలుగా అమలులో ఉన్న ఈ నియమ నిబంధనలను ఎవరూ మార్చేందుకు ఏమాత్రం అవకాశమే లేదు.

    ⇒ లడ్డూ తయారీకి నెయ్యి ఎవరు సరఫరా చేసినా.. వారు పంపించిన నెయ్యి ట్యాంకర్‌తో పాటు, నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ ల్యాబరేటరీస్‌ (ఎన్‌ఏబీఎల్‌) గుర్తించిన ల్యాబ్‌ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్‌ను కూడా సమర్పించాలి.

    ⇒ అలా ట్యాంకర్‌ నుంచి తిరుపతిలోనే మూడు శాంపిల్స్‌ తీసి మూడు టెస్టులు చేస్తారు. అవన్నీ పాస్‌ అయితేనే ఆ నెయ్యిని టీటీడీ లడ్డూ ప్రసాదం, ఇతర అవసరాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తారు. శాంపిల్స్‌ పరీక్షల్లో నాణ్యత లేదని తేలితే వెంటనే ఆ ట్యాంకర్లను తిరుపతిలోని అలిపిరి నుంచే వెనక్కు పంపుతారు. తిరుమల కొండ కూడా ఎక్కనివ్వరు.

    ⇒ తగిన నాణ్యతతో లేని నెయ్యిని చాలాసార్లు వెనక్కి పంపారు. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో 15 సార్లు, 2019­–24లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హాయంలో 18 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపారని టీటీడీ రికార్డులే వెల్లడిస్తున్న వాస్తవం.

    ప్రస్తుత నెయ్యి వివాదం టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనిదే 
    ప్రస్తుతం కల్తీ అంటూ చేçస్తున్న రాద్ధాంతానికి కేంద్ర బిందువుగా ఉన్న నెయ్యి శాంపిల్స్‌ ఎప్పుడు తీసుకున్నవో తెలుసా..? 2024 జూన్‌ 12న తీసిన శాంపిల్స్‌ అవి. 2024 జూన్‌ 4నే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టీడీపీ కూటమి గెలిచిందన్నది తేలి పోయింది. జూన్‌ 12నే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మూడు టెస్టుల నివేదికల్లో నెయ్యి తగిన నాణ్యతతో లేదని తేలడంతో ఆ శాంపిల్స్‌ను జూలై 17న ఎన్డీడీబీ బోర్డుకు పంపారు. ఎన్డీడీబీ బోర్డు 2024 జూలై 23న నివేదిక ఇచ్చింది. అంటే మొత్తం వ్యవహారం అంతా టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనే సాగిందన్నది సుస్పష్టం.

    జంతువుల కొవ్వు కలిసిందని ఎన్‌డీడీబీ చెప్పనే లేదు 
    నెయ్యి కల్తీ జరిగిందని మాత్రమే ఎన్‌డీడీబీ నివేదిక వెల్లడించగలదు. కానీ, ఆ కల్తీ జంతువుల కొవ్వు కలపడంతో జరిగిందని నిరూపించే అవకాశమే లేదని ఆహార శాస్త్రవేత్త నేహా దీపక్‌ షా స్పష్టం చేశారు. సోయాబీన్, పొద్దు తిరుగుడు పువ్వు, రేపీడ్స్, గోధుమ జెర్మ్, మొక్కజొన్న జెర్మ్, పత్తి విత్తనాలు, కొబ్బరి, పామ్‌ ఆయిల్‌ ద్వారా కూడా కల్తీ చేసే అవకాశాలున్నాయి. 

    సాధారణంగా నెయ్యిలో కల్తీ చేయాలంటే వ్యాపారులు పామాయిల్, హైడ్రోజనేటెడ్‌ కూరగాయల కొవ్వును కలుపుతూ ఉంటారని ఆహార శాస్త్రవేత్తలు చెప్పారు. ఎందుకంటే అవి అయితేనే తక్కువ వ్యయంతో కల్తీ చేయవచ్చన్నారు. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎటువంటి కల్తీ చేశారన్నది ఎన్‌డీడీబీ నివేదికలో స్పష్టం చేయనే లేదు. కానీ చంద్రబాబు, ఆయన ముఠా సభ్యులు మాత్రం టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతవుల కొవ్వు కలిపారని రాద్ధాంతం చేయడం కేవలం రాజకీయ కుట్రేనన్నది సుస్పష్టం. 

  • సాక్షి, అమరావతి: రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్, లెక్చ­రర్‌ పోస్టులు, పీహెచ్‌డీ ప్రవేశాలకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలి­జిబి­లిటీ టెస్టు (ఏపీసెట్‌) నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. చివరి­సా­రిగా గత ప్రభుత్వం 2024 ఏప్రిల్‌లో ఏపీసెట్‌ను నిర్వహించింది. మళ్లీ తిరిగి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏపీ సెట్‌ను నిర్వహించాల్సి ఉంది. అయితే కొత్త నోటిఫికేషన్‌పై కూటమి సర్కార్‌ ఇప్పటివరకు నోరుమెదపట్లేదు. 

    ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాలకు సంబంధించి 2025–26 విద్యా సంవత్సరంలో మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర జాప్యం చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన కూటమి ప్రభుత్వం ఏపీసెట్‌ నిర్వహణ విషయంలోనూ ఇదేతీరును అవలంబిస్తుండటంపై విద్యార్థులు, విద్యావేత్తల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నోటిఫికేషన్‌ను తాత్సారం చేయడంతో అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. 

    ఎవరు అర్హులు..
    ఏపీ సెట్‌కు పీజీ, తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు, పీజీ చివరి ఏడాది చదువుతున్నవారు అర్హులు. ఏటా వేలాది మంది రాసే ఈ పరీక్షల్లో అప్పుడే ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల నుంచి వివిధ వృత్తుల్లో ఉద్యోగాలు చేస్తూ ఏపీ సెట్‌కు పోటీపడే అభ్యర్థులు కూడా ఉంటున్నారు. 

    పరీక్ష కఠినం.. అర్హుల సంఖ్యా తక్కువే..
    ఏపీ సెట్‌ను ప్రభుత్వం ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏడాదికి ఒకసారి మాత్రమే నిర్వహిస్తుంది. ఈ పరీక్షకు దాదాపు 30 వేల మంది దరఖాస్తు చేసుకుంటారు. యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్‌ నెట్‌ తరహాలో అత్యంత కఠినంగా పరీక్ష ఉంటుండటంతో ఏపీసెట్‌లో అర్హత పొందేవారి శాతం తక్కువగానే ఉంటోంది. గతేడాది ఏప్రిల్‌లో ఏపీ సెట్‌కు 30,448 మంది హాజరుకాగా కేవలం 8.03 శాతం అంటే  2,444 మంది మాత్రమే అర్హత సాధించారు. 

    గత కొన్నేళ్లుగా ఏపీసెట్‌లో అర్హత సాధించేవారిని పరిశీలిస్తే అర్హత శాతం సగటున 6–7 శాతం మధ్య ఉంటోంది. అయితే ఏపీసెట్‌లో అర్హత సాధిస్తేనే యూనివర్సిటీల్లో, కళాశాలల్లో అధ్యాపక పోస్టుల నియామక పరీక్షలకు అర్హత లభిస్తుంది. అలాగే పీహెచ్‌డీ ప్రవేశాలకు సైతం ఏపీసెట్‌లో క్వాలిఫై కావాల్సిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఏపీసెట్‌లో విజయం సాధించడానికి తమ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. 

    డిసెంబర్‌లో యూజీసీ నెట్‌!
    కాగా, రాష్ట్రంలో స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్టు తరహాలోనే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్టు (యూజీసీ నెట్‌)ను నిర్వహిస్తుంది. యూజీసీ ఏడాదిలో రెండు సార్లు.. జూన్, డిసెంబర్‌లలో క్రమం తప్పకుండా పరీక్షలు చేపడుతుంది. ఈ ఏడాది డిసెంబర్‌కు రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. యూజీసీ నెట్‌ను దేశవ్యాప్తంగా ఏటా 5 నుంచి 7 లక్షల మంది అభ్యర్థులు రాస్తున్నారు. 

    గత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే, అర్హత పొందేవారి శాతం కేవలం 7 నుంచి 14 శాతం మధ్యలోనే ఉంటుంది. మొత్తం 85 సబ్జెక్టుల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంలో యూజీసీ నెట్‌ను నిర్వహిస్తారు. దీని ద్వారా జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌)తో పాటు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకాలు జరుగుతాయి. పీహెచ్‌డీ ప్రవేశానికి కూడా యూజీసీ నెట్‌ ఫలితం దోహదపడుతుంది.

    యూజీసీ నెట్‌ డిసెంబర్‌ నోటిఫికేషన్‌ ఇలా..
    దరఖాస్తులో సవరణలు: నవంబర్‌ 10 నుంచి 12 వరకు
    పరీక్ష కేంద్రాలు, అడ్మిట్‌కార్డు, పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నారు

  • సాక్షి, అమరావతి: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖలో లెక్చరర్లు, ఇతర అధికారుల డిప్యుటేషన్‌ పేరుతో అక్రమ బదిలీలకు బ్రేకులు పడ్డాయి. గత నెలలో 30 మందికి, నవంబర్‌లో 90 మందికి డిప్యుటేషన్లు వేసి బదిలీ చేసేందుకు ఆర్డర్లు సిద్ధంచేశారు. కానీ,  టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగంలో జరుగుతున్న బదిలీల బాగోతంపై ఇటీవల ‘సాక్షి’ పత్రిక ‘బదిలీ మంత్రం.. వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ తంత్రం’ పేరుతో అక్కడ జరుగుతున్న వ్యవహారాలను వెలుగులోకి తెచ్చింది. దీంతో.. అప్పటికే పూర్తిచేసిన బదిలీలను అధికారులు నిలిపివేసి తాము తప్పుచేయలేదని తప్పించుకునేందుకు ప్రయత్నించారు. 

    అలాగే, అక్టోబరులో కొందరు లెక్చరర్లను బదిలీ చేసినా వారి ఆర్డర్లను సైతం నిలిపివేశారు. ఈ క్రమంలో.. డబ్బులిచ్చిన అధికారులు, లెక్చరర్లు తమ సంగతి తేల్చాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. డెప్యుటేషన్‌ బదిలీ కోసం ఒక్కో లెక్చరర్‌ నుంచి రూ.2 లక్షలు వసూలుచేసినట్లు సమాచారం. ఇప్పుడీ అక్రమ బదిలీలు నిలిచిపోవడంతో తాము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలని లేదా చెప్పిన ప్రకారం ‘సర్వీస్‌’ బదిలీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది. అయితే, ఈ బాగోతం ఇప్పటికే మీడియాకెక్కడంతో కొన్నాళ్లు ఆగాలని అధికారులు వారిని బుజ్జగిస్తున్నట్లు తెలిసింది.  

    సాంకేతిక విద్యాశాఖలో ఇష్టారాజ్యం.. 
    నిజానికి.. 2014–19 మధ్య పాలిటెక్నిక్‌ విద్యను నాటి టీడీపీ ప్రభుత్వం అస్తవ్యస్థంగా మార్చేయడంతో విద్యార్థుల చేరికలు తగ్గిపోవడంతో పాటు ఉన్నవారికి సైతం సరైన ప్లేస్‌మెంట్లు లేవు. అయితే, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఈ విభాగానికి సమర్థులైన అధికారులను నియమించింది. పాలిటెక్నిక్‌ కోర్సులు చదివే విద్యార్థులకు ఉద్యోగాల కల్పనకు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ విధానం అమలుచేసింది. ఈ కమ్రంలో దేశంలోనే ప్రముఖ సంస్థలను ఆయా కాలేజీలకు ఆహ్వానించింది. ఫలితంగా.. విద్యార్థులకు 98 శాతం ఉద్యోగావకాశాలు దక్కాయి. అయితే, 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యారంగాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. 

    సాంకేతిక విద్యాశాఖలో అయితే కొందరు అధికారులు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతోంది. డెప్యుటేషన్లపై వచ్చి ఇక్కడే తిష్టవేసి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా.. కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీలు జోన్‌ పరిధిలోనే చేయాల్సి ఉండగా, ఏకంగా రీజియన్‌ పరిధి మార్చి వారిని 600 కి.మీ.కు పైగా దూరంలో పోస్టింగ్‌లు ఇచ్చి పంపించారు. వారు ఉద్యోగాన్ని వదులుకుంటే తమకు కావాల్సిన వారికి ఇచ్చుకునేందుకు కుట్రచేసినట్లు విమర్శలు వచ్చాయి.  

    కాసులిస్తే బదిలీలు, డిప్యుటేషన్లు.. 
    ఇక జూన్‌లో సాధారణ బదిలీలు చేపట్టి ఖాళీలను చూపలేదు. అనంతరం ఆగస్టు, సెపె్టంబరు, అక్టోబరు నెలల్లో డబ్బులిచ్చిన వారికోసం డెప్యుటేషన్లు, బదిలీలు చేపట్టారు. దీనికి వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ అని పేరు పెట్టారు. అయితే, వాస్తవాలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో ఆక్టోబరులో చేపట్టిన డెప్యుటేషన్లు నిలిపివేశారు. దీంతో.. డబ్బులిచ్చిన వారు ఒత్తిడి చేస్తుండడంతో బదిలీ ఆర్డర్‌ ఇవ్వలేక.. సమాధానం చెప్పలేక కీలక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది.    

  • తమకు నచ్చిన వ్యక్తులకు పర్యాటక ఆస్తులను దోచిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ముందుగానే ఆరు క్లస్టర్లకు సంబంధించి ప్రైవేట్‌ ఏజెన్సీలను నిర్ణయించిన తర్వాత నామమాత్రంగా రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ)లను పిలిచినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకున్న వ్యాపారులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చెందిన కంపెనీలకు హరిత హోటళ్లను ధారాదత్తం చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే హార్సిలీహిల్స్‌ హోటల్‌ను ఓ ఆధ్యాత్మిక గురువుకు అప్పగించేందుకే ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌పీలో చేర్చలేదని సమాచారం. 

    మరోవైపు బయటి వ్యక్తులు వ్యాపారాలు సాగించేందుకు అనుమతి లేని గిరిజన ప్రాంతంలోని హోటళ్లను సైతం ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతాల భూ బదిలీ నియంత్రణ చట్టం 1/70 ప్రకారం గిరిజనుల నుంచి గిరిజనేతరులకు భూమి బదిలీ చేయడం నిషిద్ధం. తద్వారా గిరిజనుల భూమికి భద్రత లభిస్తుంది. అయితే ఇప్పుడు అరకులోని ఐదు హోటళ్లను ప్రైవేట్‌కు అప్పగించేందుకు సన్నా­హాలు జరుగుతున్నాయి. గిరిజన చట్టాలను సైతం కూటమి సర్కారు కాలరాస్తుండటం తీవ్ర విస్మయం కలిగిస్తోంది.  

    సాక్షి, అమరావతి/భవానీపురం(విజయవాడ పశ్చి­మ): నిన్న ప్రభుత్వ కొత్త మెడికల్‌ కాలేజీలు.. నేడు టూరిజం శాఖ హోటళ్లు..! కొత్తగా సంపద సృష్టించకపోగా.. భావి తరాలకు దక్కాల్సిన విలువైన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రైవేటుపరం చేస్తోంది! ప్రభుత్వ ఆస్తులను భద్రంగా పరిరక్షించాల్సింది పోయి.. ప్రైవేట్‌కు ఏది కట్టబెట్టాలి? ఎలా కట్టబెట్టాలి? రాబట్టుకోవడం ఎలా? అనే ధ్యాసలోనే టీడీపీ పెద్దలు ఉండటం విభ్రాంతి కలిగిస్తోంది. 

    ఒకపక్క ఇసుక నుంచి మద్యం సిండికేట్ల దాకా పచ్చ ముఠాల దోపిడీని ప్రోత్సహిస్తూ మరోవైపు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెడుతూ నీకింత.. నాకింత...! అనే రీతిలో దోపిడీ వ్యవహారాలకు తెర తీశారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అగ్గిపుల్ల.. కుక్కపిల్ల.. సబ్బుబిళ్ల కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్లుగా.. ప్రతిదీ ప్రైవేట్‌పరం చేస్తూ కాసులు పిండుకుంటున్నారు! ఇప్పటికే 108, 104 సేవలను నీరుగార్చేశారు. 

    రాజధాని నిర్మాణం పేరుతో దోపిడీని కొనసాగిస్తూ తాజాగా పర్యాటకశాఖ హోటళ్లపై కన్నేశారు! మంచి లాభాల్లో నడుస్తున్న హరిత హోటళ్లను తాము నిర్వహించలేమంటూ ప్రైవేట్‌ వ్యక్తులకు కూటమి ప్రభుత్వం కారుచౌకగా దోచి పెడుతోంది! ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు చెందిన హరిత హోటళ్లు, అనుబంధ ఆస్తులు ఒక్కటి కూడా లేకుండా చేయడంలో భాగంగా ఈ కుట్రకు తెర తీసింది. 

    సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో గిరిజన ప్రాంతం అరకులోని హరిత హోటళ్లను సైతం ప్రైవేట్‌కే ఇచ్చేందుకు రంగం సిద్ధం కావడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రూ.వేల కోట్ల విలువ చేసే 22 హరిత హోటళ్లను ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనలు (ఆర్‌ఎఫ్‌పీ) ఇప్పటికే ఆహా్వనించారు. బిడ్ల దాఖలు గడువు ఈ నెల (నవంబర్‌) 7తో ముగియగా, వాటిని ఓపెన్‌ చేసి టెక్నికల్‌ వ్యాల్యూయేషన్‌ చేయాల్సి ఉంది. టెండర్లలో అర్హత సాధిస్తే కేబినెట్‌లో పెట్టి ఆమోదించుకోవటమే మిగిలింది!   
    రూ.10 వేల కోట్ల ఆస్తి ప్రైవేటు పరం! 
    ఏపీటీడీసీ హోటళ్లను ఆరు క్లస్టర్లుగా విభజించి ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కింద ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించాలని టీడీపీ కూటమి సర్కారు నిర్ణయించింది. సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ హోటళ్లు ఉండగా మార్కెట్‌ రేటు ప్రకారం వీటి విలువ దాదాపు రూ.10 వేల కోట్లు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత విలువైన ఆస్తులను దశాబ్దాల పాటు నామమాత్రపు లీజుకు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

    వార్షిక స్థూల ఆదాయం/ఏపీటీడీసీ నిర్ణయించిన సగటు వార్షిక లీజు రేటు ఆధారంగా రెండింటిలో ఏది ఎక్కువైతే అది ప్రైవేటు ఏజెన్సీలు చెల్లించాలని ఆర్‌ఎఫ్‌పీలో పేర్కొన్నారు. ఓ ప్రైవేట్‌ సంస్థ తన ఆదాయాన్ని ఎంత వరకు కచ్చితత్వంతో వెల్లడిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ప్రస్తుతం హోటళ్లు ఉన్న ప్రాంతంలో ఖాళీ స్థలంలో నిర్మాణాలు చేపట్టాలంటే మార్కెట్‌ విలువ ప్రకారం కాకుండా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం రేటు ప్రకారం ఒక్క శాతాన్ని లీజుగా నిర్ణయించడం చూస్తుంటే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 
     

    ఉద్యోగుల కుటుంబాలు బలి.. 
    ఏపీటీడీసీలో హోటళ్లు, వాటర్‌ ఫ్లీట్, ట్రాన్స్‌పోర్టు.. ఇలా వివిధ విభాగాల్లో సుమారు 1,300 మంది రెగ్యులర్, కాంట్రాక్టు, ఆప్కాస్, కన్సల్టెంట్లు, డైలీ వేజ్‌ ఉద్యోగులు పని చేస్తున్నారు. ముఖ్యంగా హోటళ్లలో రెగ్యులర్‌ ఉద్యోగులు డీవీఎంలు, మేనేజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయా హోటళ్లలో పని చేస్తున్న అన్ని రకాల ఉద్యోగులను ప్రైవేట్‌ ఏజెన్సీలే తీసుకోవాలంటూ జీతభత్యాలు, ఉద్యోగ భద్రతను ప్రభుత్వం గాలిలో దీపంలా మార్చింది. 

    ప్రైవేట్‌ ఏజెన్సీలు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగులను కొనసాగించుకోవాలని, రెండు నెలలకు ఒకసారి వారి పనితీరును అంచనా వేయాలని, అప్పటికీ సంతృప్తికరంగా లేకుంటే ఏపీటీడీసీ, ప్రైవేటు ఏజెన్సీ కలిసి నిర్ణయం తీసుకుంటాయని పేర్కొంది. అంటే వారికి ఉద్యోగ భద్రత లేదని తేలిపోతోంది. ప్రైవేట్‌ ఏజెన్సీలు ఉద్యోగులను తీసుకుంటే డీవీఎంలుగా సేవలందిస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగులు అక్కడే పనిచేస్తారా? వారికి జీతాలు ఎక్కడి నుంచి చెల్లిస్తారు? అనే దానిపై స్పష్టత లేదు. 

    ప్రైవేట్‌ ఏజెన్సీల కింద పని చేయాల్సి వస్తే డీవీఎం కార్యాలయాలు, వాటికి అనుబంధంగా ఉండే సీఆర్‌వో కార్యాలయాలు మూతపడే అవకాశం లేకపోలేదు. తద్వారా అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. హోటళ్లు ప్రైవేట్‌కు వెళ్లిపోవడం వల్ల ఇన్నాళ్లూ ప్రజలకు సేవలందిస్తున్న చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలోని డీవీఎం కార్యాలయాలను మూసివేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానుంది.

    భారీగా రాబడి కోల్పోతున్న టూరిజం..
    ఏపీటీడీసీ హోటళ్ల అభివృద్ధికి గతంలోనే ప్రణాళికలు  రూపొందించారు. ఇందులో భాగంగా రూ.100 కోట్లతో హోటళ్లను ఆధునికీకరించారు. దీనికోసం విజయవాడలోని బెరంపార్కు హోటల్‌తో పాటు ఇతర హోటళ్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి జీజీహెచ్‌కు సమీపంలోని ఓ స్టేట్‌బ్యాంక్‌ నుంచి రూ.150 కోట్ల రుణానికి అనుమతులు పొందారు. ఇందులో రూ.100 కోట్లతో హోటళ్ల ఆధునికీకరణ పనులు కూడా పూర్తి చేశారు. 

    తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లాభాల్లో నడుస్తున్న అభివృద్ధి చేసిన హోటళ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే టీటీడీ దర్శన టికెట్ల కోటాను రద్దు చేయడంతో ఏపీటీడీసీ ఏడాదికి రూ.72 కోట్ల నుంచి రూ.84 కోట్ల రాబడిని కోల్పోయింది. 

    ఇప్పుడు 22 హరిత హోటళ్లను ప్రైవేట్‌కు అప్పగించడం వల్ల ఏటా మరో రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల మేర రెవెన్యూకి గ్యారంటీ లేకుండా పోతుంది. ఇంత అభద్రత మధ్య ఉద్యోగులు, ఏపీటీడీసీ భవిష్యత్తును పణంగా పెట్టి ప్రైవేటు వ్యక్తులతో కూటమి సర్కారు వ్యాపారం చేస్తోంది.    

  • ప్రకృతి అందాలకు నెలవైన పొల్లూరు జలపాతం అభివృద్ధిపై అటవీశాఖ దృష్టి సారించింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకున్న అటవీశాఖ మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. అప్పటి ప్రభుత్వ ఆధ్వర్యంలోఏపీ జెన్‌కో కేటాయించిన రూ.50 లక్షల సీఎస్సార్‌ నిధులతో పనులు చేపట్టింది.  

    మోతుగూడెం: అల్లూరి జిల్లా పొల్లూరు జలపాతానికి మంచి రోజులు వచ్చాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మౌలిక వసతుల కల్పనకు బీజం పడటంతో పర్యాటకులకు సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ జలపాతం వర్షాకాలంలో, ముఖ్యంగా జూన్‌ నుంచి సెపె్టంబర్‌ వరకు ఉప్పొంగి ప్రవహిస్తూ చూసేందుకు అందంగా కనిపిస్తుంది. కొండల మధ్య సుమారు 50 అడుగుల ఎత్తునుంచి జాలువారుతూ ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తుంది. 

    » పొల్లూరు నుంచి డొంకరాయి వెళ్లే మార్గంలో రోడ్డుకు అరకిలోమీటరు దూరంలో ఉంది. ఫోర్‌బే, డొంకరాయి అటవీప్రాంతంలోని కొండలమధ్య నుంచి జాలువారుతూ పొల్లూరు వద్ద సీలేరు నదిలో కలుస్తుంది.  

    »  పర్యాటకంగా ప్రాచుర్యం పొందిన ఈ జల సోయగం అభివృద్ధికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అంకురార్పణ జరిగింది. దీనిలో భాగంగానే ఈ ప్రాంతాన్ని అటవీశాఖ స్వా«దీనం చేసుకుంది. పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలోని 5,6 యూనిట్ల నిర్మాణ నేపథ్యంలో వీటికి సంబంధించి సుమారు రూ.కోటి మేర సీఎస్సార్‌ నిధులను ఏపీ జెన్‌కో కేటాయించింది. వీటిలో రూ.50 లక్షలు గత ప్రభుత్వంలో విడుదల అయ్యాయి.  

    » ఏపీ జెన్‌కో విడుదల చేసిన సీఎస్సార్‌ నిధులతో జలపాతం ప్రవేశద్వారాన్ని పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాటుచేశారు. సుమారు 50 కార్లు పార్కింగ్‌కు అనుకూలంగా స్థలాన్ని చదును చేశారు. పర్యాటకులు సేదతీరేందుకు రెల్లిగడ్డితో పగోడాలు నిర్మించారు. కూర్చునేందుకు వీలుగా సుమారు 8 సిమెంటు బెంచీలు ఏర్పాటుచేశారు. ప్రవేశద్వారం నుంచి జలపాతం వరకు అరకిలోమీటరు పొడవునా గ్రావెల్‌తో మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటుచేశారు. 

    » జలపాతం వద్ద ప్రమాదకర ప్రాంతంలో పర్యాటకుల రక్షణ నిమిత్తం సేఫ్టీ గ్రిల్స్‌ ఏర్పాటుచేశారు. ఇక్కడ స్థానిక గిరియువత ఐదుగురితో సొసైటీ ఏర్పాటుచేసి ఉపాధి కల్పించారు. కారు పార్కింగ్‌కు రూ.50, బస్సుకు రూ.100 వసూలు చేస్తున్నారు. జలపాతం సందర్శించే వారికి ఒకొక్కరికి రూ.20 ప్రవేశ రుసుం చెల్లించాలి. వీటికి మరికొంత మొత్తాన్ని జోడించి అటవీశాఖ వీరికి చెల్లిస్తోంది. మంజూరైన సీఎస్సార్‌ నిధులు రూ.50 లక్షల్లో ఇప్పటివరకు సుమారు రూ.20 లక్షలు ఖర్చుచేసినట్టు అటవీశాఖ అధికారవర్గాలు తెలిపాయి.  

    » జలపాతాన్ని ఇటీవల ప్రిన్సిపల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ చిరంజీవి సందర్శించారు. లక్కవరం అటవీరేంజి పరిధిలో సుకుమామిడి గ్రామం నుంచి అటవీప్రాంతం గుండా గుడిసె వరకు సుమారు 12 కిలోమీటర్ల పొడవునా ట్రెక్కింగ్‌ నిర్వహణకు సాధ్యాసాధ్యాలపై సర్వేకు ఆదేశించారు. మోతుగూడెం అటవీశాఖ కార్యాలయం ఎదురుగా గుట్టపై ఉన్న గెస్ట్‌ హౌస్‌ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.  

    » పర్యాటకులకు సౌకర్యంగా ఉండేందుకు ప్రధానరోడ్డు నుంచి ప్రవేశద్వారం వరకు సిమెంట్‌ ఫ్లోరింగ్‌ చేపట్టేందుకు రూ.5లక్షలతో అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. త్వరలో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవికాకుండా పర్యాటకులు దుస్తులు మార్చుకునేందుకు పురుషులు, మహిళలకు ఆరు గదులు పూర్తిస్థాయిలో నిర్మాణానికి చర్యలు చేపట్టారు. తిను బండారాల స్టాళ్లు ఏర్పాటుకు పక్కా భవనం నిర్మించి స్థానిక గిరి యువతకు అప్పగించే ఆలోచనలో అటవీశాఖ ఉంది.  
    మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం
    గత ప్రభుత్వంలో మంజూరైన రూ.50 లక్షల్లో ఇప్పటివరకు సుమారు రూ.20 లక్షలు మౌలిక వసతుల కల్పనకు కేటాయించాం. మిగిలిన రూ.30 లక్షలతోపాటు మరో రూ.45 లక్షలు విడుదల అయ్యాయి. వీటిని పొల్లూరు జలపాతంతో పాటు పరిసర పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు సౌకర్యవంతంగా మౌలిక వసతులకు కల్పనకు వెచ్చిస్తాం.   – జి.నానాజి, రేంజ్‌ అధికారి, లక్కవరం 

    బస చేయాలంటే..
    పొల్లూరు జలపాత సందర్శనకు వచ్చే పర్యాటకులు బస చేసేందుకు మోతుగూడెంలో ఏపీ జెన్‌కో అతిథి గృహం ఉంది. ఆరు సూట్లు ఉన్నాయి. ఇవి ఖాళీగా ఉంటే అద్దెకు ఇచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా ప్రైవేట్‌ రిసార్టులు పొల్లూరులో ఒకటి, మోతుగూడెంలో 7 ఉన్నాయి. రూమ్‌కు రోజుకు (24 గంటలు) రూ.2500 వరకు అద్దె ఉంటుంది. నలుగురు నుంచి ఆరుగురు ఉండేందుకు అనువుగా ఉంటుంది. రిసార్ట్‌ల్లో భోజన సదుపాయం ఉంది.  

    ఇలా వెళ్లాలి..
    పొల్లూరు జలపాతం సందర్శనకు భద్రాచలం, నర్సీపట్నం, రాజమండ్రి నుంచి రావొచ్చు. ఈరోడ్డు మార్గాల్లో బస్సు సౌకర్యం ఉంది. ప్రధాన రోడ్డు నుంచి కాలినడకన జలపాతం వద్దకు వెళ్లొచ్చు. భద్రాచలం, రాజమండ్రి నుంచి వచ్చే రోడ్డు సౌకర్యం మెరుగ్గానే ఉంది. నర్సీపట్నం నుంచి వచ్చే వారు గూడెంకొత్తవీధి నుంచి వై.రామవరం మండలం పాలగెడ్డ వరకు సుమారు 60 కిలోమీటర్ల మేర రోడ్డు బాగులేనందున ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

  • కర్నూలు(హాస్పిటల్‌): పేదరికం, నిరక్షరాస్యత, బాలికల ఎదుగుదలపై ఆందోళన, అభద్రతాభావం వంటి కారణాలతో  కర్నూలు జిల్లాలో బాల్యవివాహాలు అధికమవుతున్నాయి. ఇందులో అధికారులు కొన్ని మాత్రమే అడ్డుకుంటుండగా అధిక శాతం గుట్టుచప్పుడు కాకుండా, ఆధార్‌కార్డులో వయస్సు మార్చి వివాహ తంతు జరిపించేస్తున్నారు. వీటిలో అధికశాతం గ్రామ పెద్దల సహకారంతోనే జరుగుతున్నా అడిగే నాథుడు కరువయ్యారు. 

    బిడ్డకు మూడుముళ్లు పడితే భారం తగ్గిపోతుందన్న భావనతో గ్రామాల్లో కూతురు పుష్పవతి అయితే చాలు ఏ అయ్యకు కట్టబెడదామా అని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఈ కారణంగా బాలికల చదువు మధ్యలోనే ఆగిపోతూ వారి భవిష్యత్‌ నాశనమవుతోంది. మరోవైపు చిన్నవయస్సులో గర్భవతి కావడంతో ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 

    4,754 మంది బాలికలు తల్లులు 
    జిల్లాలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు 38,779 మంది గర్భం దాల్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. అందులో 19 ఏళ్లలోపు బాలికలు 4,754 మంది ఉన్నారు. వీరిలో కర్నూలు డివిజన్‌లో 10.27శాతం, ఆదోని డివిజన్‌లో 12.75శాతం, పత్తికొండ డివిజన్‌లో అధికంగా 15.04శాతం మంది  గర్భం దాల్చారు. జిల్లాలో 10 నెలల కాలంలో జరిగిన మొత్తం వివాహాల్లో 16 ఏళ్లకు 814 (21.5శాతం), 17 ఏళ్లకు 888(23.6శాతం), 18 ఏళ్లకు 1,237(32.8శాతం), 19 ఏళ్లకు 595(15.8శాతం) వివాహం చేసుకున్నారు. 

    19 ఏళ్లకు పైగా కేవలం 236 మంది అమ్మాయిలు మాత్రమే వివాహం చేసుకున్నారు. అది కూడా కర్నూలు నగరంలాంటి చోట్ల మాత్రమే వివాహ వయస్సు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తున్నారు. గ్రామాల్లో వివాహ వయస్సు చూపించేందుకు అధిక శాతం ఆధార్‌కార్డులో 63.4 శాతం మంది వయస్సును తప్పుగా నమోదు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 

    చదువుకూ అమ్మాయి దూరం 
    ఆదోని, పత్తికొండ డివిజన్‌లలో ఆడపిల్లలు ఎక్కువగా చదువుకునేందుకు ఇష్టపడటం లేదు. అమ్మాయిని చదువుకోసం దూరంగా పంపించేందుకు భయపడటం, అభద్రతభావం, సామాజిక పరిస్థితులతో మధ్యలోనే చదువు మాన్పించేస్తున్నారు. 

    కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లేక 1,614(44.4శాతం) మంది, ఆర్థిక కారణాలతో  1,473(36.6శాతం) మంది, మిగిలిన వారు కుటుంబసమస్యలతో ఏడుగురు, సామాజిక రుగ్మతలతో 105 మంది, తల్లిదండ్రుల ఒత్తిడితో 388 మంది, మరికొందరు ప్రేమవివాహాల కారణంగా బా లికలు మధ్యలోనే చదువు మానేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా జరిగిన వివాహాల్లో అధికంగా 89.1శాతం పెద్దలు కుదుర్చిన వివాహాలు కాగా దాని తర్వాతి స్థానంలో 8.4శాతం మంది తమకు నిచ్చిన వారిని ప్రేమవివాహాలు చేసుకున్నారు. 

    కమిటీలు ఉన్నా చర్యలు నామమాత్రమే! 
    జిల్లాలో బాల్యవివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీని అరికట్టేందుకు జిల్లా స్థాయి, డివిజన్‌ స్థాయిలో కమిటీలు ఉన్నాయి. జిల్లా›స్థాయిలో జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌/చైర్‌పర్సన్‌ కాగా, కన్వినర్‌గా జిల్లా ఎస్పీ, డీఎంహెచ్‌ఓ, సభ్యులుగా గైనకాలజీ హెచ్‌ఓడీ, ఐసీడీఎస్‌ అధికారి, డీఈఓ, ఆర్‌ఐఓ, డివిజన్‌ స్థాయిలో చైర్మన్‌/చైర్‌పర్సన్‌గా ఆర్‌డీఓ, కన్వినర్‌గా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, సభ్యులుగా స్థానిక డీఎస్పీ ఉంటారు. ఈ కమిటిలు బాల్యవివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

     పాఠశాలలకు కౌమారదశ బాలికలకు పునరుత్పత్తి ఆరోగ్యం, న్యాయపరమైన హక్కులు, లైఫ్‌ స్కిల్స్‌ గురించి వివరించారు. బాల్యవివాహాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. కౌమార దశ బాలికలకు వచ్చే సమస్యలపై ఆరోగ్యశిబిరాలు నిర్వహించాలి. కానీ అధికారులు మొక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించి మమ అనిపిస్తున్నారు. గ్రామాల్లో బాల్యవివాహాలు జరుగుతున్నా చర్యలు కరువయ్యాయి. 

    ఆదోని, పత్తికొండ డివిజన్‌లలో అధికం
    గర్భం దాల్చే వారిలో నిరక్షరాస్యులైన బాలికలే అధికంగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. 10 నెలల్లో నమోదైన గర్భిణుల్లో ఐదవ తరగతి వరకు చదివిన వారు 23.5శాతం, పది ఫెయిలైన వారు 18.8శాతం, 6 లేదా 7వ తరగతి చదివిన వారు 14.7శాతం, 8 లేదా 9వ తరగతి చదివిన వారు 13.8శాతం మంది ఉన్నారు. 

    ఆదోని, పత్తికొండ డివిజన్‌లలో అధికంగా అక్షరాస్యత తక్కువగా ఉంటోంది. దీనికి తోడు పేదరికం, వర్షపాతం తక్కువగా ఉండటం, ఫలితంగా పంటలు సరిగ్గా పండకపోవడం, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం, అమ్మాయిల భద్రత గురించి ఆందోళన, సామాజికపరమైన అంశాలు వంటి కారణాలతో బాల్యవివాహాలు అధికంగా జరుగుతున్నాయి. 

    పుష్పవతి అయిన బాలికలను ఒకరికిచ్చి పెళ్లి జరిపిస్తే తమ బాధ్యత తీరిపోతుందని నమ్మే వారు అధికంగా ఉన్నారు. చెడు వ్యసనాల కారణంగా భార్య లేదా భర్త మరణించడంతో ఒంటరివారైన పిల్లల వివాహాలు కూడా త్వరగా జరిపించేస్తున్నారు. ఇందులో అమ్మాయిల అవ్వాతాతలు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. 

    సెప్టెంబర్‌ 15వ తేదీ... 
    ఆదోని పట్టణంలోని పట్టణంలోని ఇందిరానగర్‌లో బాల్య వివాహాన్ని టూటౌన్‌ పోలీసులు అడ్డగించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి వెళ్లి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. బాల్యవివాహాలతో జరిగే నష్టాలను వివరించారు. కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

    ఏం చేయాలి..
    అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండే వరకు ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేయరాదు. బాల్య వివాహాలు చేసే వారి గురించి చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098, పోలీసు హెల్ప్‌లైన్‌ 100, ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ 181 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వవచ్చు. 

    తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం 
    చిన్న వయస్సులో గర్భం దాలిస్తే బాలికకు రక్తహీనత ఏర్పడటం, కడుపులో బిడ్డ సరిగ్గా ఎదగకపోవడం, అబార్షన్లు జరుగుతాయి. అమ్మాయికి పెల్విన్‌బోరాన్‌ వృద్ధి చెందక ముందే వివాహం చేయడం వల్ల వారికి ప్రసవం కష్టమై సిజేరియన్‌ చేయాల్సి వస్తుంది. బీపీ, ఫిట్స్, నెలలు నిండకముందే బిడ్డ జన్మించడం వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు అబార్షన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. మరికొన్నిసార్లు అవిటితనం ఉన్న పిల్లలు జన్మించే అవకాశం ఉంది.  –డాక్టర్‌ ఎస్‌.సావిత్రి, గైనకాలజీ హెచ్‌వోడీ, కర్నూలు పెద్దాసుపత్రి 

    అనారోగ్య సమస్యలు 
    బాల్య వివాహాలతో  చాలా మంది కౌమార దశ పూర్తి గాకుండానే గర్భం దాలుస్తున్నారు. ఈ కారణంగా వారికి నెలలు నిండకుండా శిశువు జన్మించడం, సరైన సమయంలో జన్మించినా బరువు తక్కువగా ఉండటం  జరుగుతుంది. ఇలాంటి పిల్లలకు బుద్ధిమాంద్యం, చురుకుగా లేకపోవడం, గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. తల్లులకు ప్రసవం తర్వాత తల్లిపాలు సరిగ్గా పడవు. దీంతో శిశువులు పలుమార్లు ఇన్‌ఫెక్షన్లకు గురై అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.   – డాక్టర్‌ అమరనాథరెడ్డి, చిన్నపిల్లల వైద్యుడు, కర్నూలు

    టీనేజీ ప్రెగ్నెన్సీపై అవగాహన కార్యక్రమాలు 
    జిల్లాలో బాల్యవివాహాలు జరగకుండా ఐసీడీఎస్‌ శాఖతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఒకవేళ ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నాయని తెలిస్తే స్థానిక పోలీసులు, ఐసీడీఎస్‌ సిబ్బందితో కలిసి వెళ్లి పెళ్లి జరగకుండా చూస్తున్నాం. అప్పటికే వివాహం జరిగి ఉంటే ఆమె టీనేజీలో గర్భం దాల్చకుండా ఆరోగ్య సిబ్బందిచే అవగాహన కల్పిస్తున్నాం. టీనేజీలో గర్భం దాల్చడం వల్ల వచ్చే దుష్పరిణాల గురించి బాలికలకు, వారి తల్లిదండ్రులకు వివరిస్తున్నాం.  –డాక్టర్‌ ఎల్‌.భాస్కర్, ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌ఓ  

  • సాక్షి, అమరావతి: 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా మూడో విడత సీట్లను ఆదివారం హెల్త్‌ వర్సిటీ కేటాయించింది. సీట్లు దక్కించుకున్న విద్యార్థులు ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటల్లోపు కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో 4,255 ఎంబీబీఎస్‌ సీట్లను కన్వీనర్‌ కోటాలో కేటాయించగా..మూడో విడత కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలిపోయిన సీట్లను స్ట్రే వెకెన్సీ రౌండ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా వర్సిటీ భర్తీ చేయనుంది. 

    గందరగోళంగా ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపు
    విద్యార్థులు, తల్లిదండ్రుల ఆరోపణ
    సాక్షి, అమరావతి : 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ గందరగోళంగా మారిందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మూడో దశ కన్వీనర్‌ కోటా సీట్ల కేటాయింపులో మెరిట్‌ విద్యార్థులకు అన్యాయం జరిగిందని విమర్శిస్తున్నారు. ఆదివారం మూడో విడత కన్వీనర్‌ కోటా సీట్లను హెల్త్‌ వర్సిటీ విద్యార్థులకు కేటాయించింది. 

    అంతకుముందు ప్రకటించిన సీట్‌ మ్యాట్రిక్స్‌లో ఎస్వీయూ రీజియన్‌ బీసీ–డీ కేటగిరీలో మూడు సీట్లు జనరల్, ఒక సీటు ఉమెన్‌కు రిజర్వ్‌ చేసినట్టు స్పష్టం చేసింది. అయితే కేటాయింపులో మాత్రం రెండు సీట్లు జనరల్, రెండు సీట్లు అమ్మాయిలకు కేటాయించింది. బీసీ–డీలో ఒక సీటే అమ్మాయిలకు రిజర్వ్‌ చేసినట్టు ప్రకటించి, ఇద్దరికి కేటాయించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

    బీసీ–డీ జనరల్‌లో చూపించిన సీట్‌ను ఉమెన్‌కు కేటాయించడంతో అదే బీసీ–డీ రిజర్వేషన్‌లోనే ముందున్న తాను సీట్‌ కోల్పోతున్నట్టు ఎ.శ్రీహర్ష అనే విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై వర్సిటీ అధికారులను వివరణ కోరగా.. సోమవారం సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. పరిశీలించాకే అలాట్‌మెంట్‌ లెటర్‌లు జారీ చేస్తామన్నారు.  

    ఎంబీబీఎస్‌ మెడికల్‌ పీజీ తాత్కాలిక ఫీజుల ఖరారు
    సాక్షి, అమరావతి: 2025–26 విద్యా సంవత్సరానికి ప్రైవేట్‌ మెడికల్, డెంటల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సులకు తాత్కాలిక ఫీజులను ఖరారు చేస్తూ ఆదివారం వైద్య శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్‌ ఉత్తర్వులిచ్చా­రు.20­20–23 బ్లాక్‌ పీరియడ్‌ ఫీజులపై ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో 10%, పీజీ కోర్సుల్లో 15% చొప్పున పెంపుతో తాత్కాలిక ఫీజులను నిర్ణయించారు. 

    కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తీర్పులకు అనుగుణంగా తుది ఫీజులను నిర్ణయిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా, సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో 2020–23 బ్లాక్‌ పిరియడ్‌ ఫీజుల మీద 15% వృద్ధితో పలు వైద్య కళాశాలల్లో సూపర్‌ స్పెషాలిటీ కోర్సులకు ఫీజులపైనా వేరుగా జీవో ఇచ్చారు.  

  • నరసరావుపేట రూరల్‌: పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్‌లో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగుల­కొట్టి బీరువాలో­ని 100 సవర్ల బంగారం, కిలో వెండి, రూ.45వేల నగదు దోచుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... గాడిపర్తి సుబ్బారావు, భారతీదేవి దంపతులు ప్రకాష్‌నగర్‌లో నివసిస్తున్నారు. నాదెండ్ల మండలం గణపవరంలోని కుమార్తె వద్దకు ఈనెల 4న వెళ్లారు. 

    ఆదివారం మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఇంటి తాళాలు పగులకొట్టి ఉన్నాయి. లోనికి వెళ్లి పరిశీలించగా బీరువా తెరిచి ఉంది. బీరువాలోని బంగారం, వెండి వస్తువులు, నగదు కనిపించలేదు. వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఫిరోజ్‌ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. క్లూస్‌ టీమ్‌ నమూనాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

  • సాక్షి, అమరావతి: తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీ పీఎస్‌హెచ్‌ఎంలు గళమెత్తారు. పీఎస్‌హెచ్‌ఎంలకు ప్రత్యేక జాబ్‌ చార్ట్‌ ప్రకటించాలని, వారివారి సబ్జెక్టులో మాత్రమే విద్యా బోధనకు వీలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం విజయవాడలో ఏపీపీఎస్‌హెచ్‌ఎం ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి తమ సమస్యలను ప్రభుత్వం ముందుంచారు. 

    ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. కొత్తగా రూపొందించిన ఈ పోస్టులకు ఎలాంటి జాబ్‌చార్ట్‌ లేదని, తమ పరిధి ఏంటో తమకే తెలియడం లేదని వాపోయారు. హైసూ్కళ్లలో నడుస్తున్న ప్రాథమిక తరగతులకు ప్రత్యేక డైస్‌ కోడ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎంపీఎస్‌లలో ఉన్న ఖాళీలు అన్నింటినీ భర్తీ చేయాలని, తమను గ్రేడ్‌–3 హెచ్‌ఎంలుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. 

    ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ టీచర్‌ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు.  అసెస్‌మెంట్‌ పుస్తకాలపై ప్రభుత్వం, విద్యాశాఖ పునఃసమీక్ష చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉపాధ్యాయులకు యాప్‌ల భారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేశారు. 

    ఈ సందర్భంగా పీఎస్‌ హెచ్‌ఎంల సమస్యలను విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. సమావేశంలో భాగంగా పీఎస్‌ హెచ్‌ఎంల ఫోరం 27 సమస్యలతో కూడిన డిమాండ్ల కరపత్రాన్ని విడుదల చేశారు. సమస్యలపై ఈనెల 12 నుంచి 18 వరకు రాష్ట్ర స్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించాలని ఫోరం నిర్ణయించినట్టు అధ్యక్షుడు తెలిపారు. పరిష్కారం కాకపోతే ఉద్యమానికి సంసిద్ధంగా ఉండాలని తీర్మానించినట్టు వివరించారు. కార్యక్రమంలో 13 ఉమ్మడి జిల్లాల ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు.  

  • సాక్షి, అమరావతి: ‘నిజమే.. మోంథా తుపానువల్ల అనుకున్నంత నష్టం జరగలేదు. తుపాను ప్రభావం అధికంగా ఉండవచ్చన్న ముందస్తు సమాచారంతో, తుపాను తీరాన్ని దాటబోయే ముందురోజు అప్ప­టి వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని, మరింత వర్షపా­తం ఉంటే పంట నష్టం అధికంగా ఉండవచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాథమిక పంట నష్టం అంచనాలను కాస్త ఎక్కువ­గా చూపించాం. 

    అయితే, తుపాను ప్రభావం ఓ మోస్తరుగానే ఉంది. ముంపునకు గురైన  పొలాల్లో­నిలిచిన నీరు త్వరగానే బయటకుపోవడంతో పంటలకు అనుకున్నంత నష్టం జరగలేదు. అందుకే.. తొలుత రూ.875 కోట్లకు పైగా ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించా­ల్సి వస్తుందని ప్రాథమికంగా అంచనా వేశాం. 

    కానీ, తుది అంచనాల ప్రకారం ఈ మొత్తా­న్ని రూ.390.03 కోట్లకు కుదించాల్సి వచ్చింది’.. అంటూ వ్యవసాయ శాఖ స్పష్టంచేసింది. ‘అంత నష్టంలేదట’ శీర్షికతో ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఆదివారం ఈ మేరకు వివరణ ఇచ్చింది. 

    15.60 లక్షల ఎకరాల్లో పంటలపై ప్రభావమని చెప్పి..
    నిజానికి.. మోంథా తుపాను 24 జిల్లాల్లో 403 మండలాల్లో తీవ్ర ప్రభావం చూపింది. దీని తీవ్రతను దృష్టిలో పెట్టుకుని 15,59,925 ఎకరాల్లో పంటలపై ప్రభావం ఉంటుందని అధికారులు తొలుత అంచనా వేశారు. రైతులు కూడా 24 జిల్లాల పరిధిలో 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అంచనా వేశారు. అయితే, తుపాను బాధిత రైతులను ప్రభుత్వం గాలికొదిలేయడంతో  మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణాజిల్లాల్లో ఈనెల 4న పర్యటించి బాధిత రైతులకు బాసటగా నిలిచారు. 

    ఎన్యుమరేషన్‌ కోసం తమ పంట పొలాల వైపు ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేదని రైతులు జగన్‌ ఎదుట ఎకరవు పెట్టారు. సుంకు విరిగిన వరికంకులను చూపించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అక్టోబరు 31లోగా ఎన్యుమ­రేషన్‌ పూర్తిచేయాలని ఒకరోజు గడువుతో ప్రొసీడింగ్స్‌ ఇవ్వడంపై జగన్‌ ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో.. అప్పటివరకు నిర్దేశించిన గడువులోగా 3.45 లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగినట్లు ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత గడువును వారం రోజులపాటు పొడిగించినట్లు వ్యవసాయ శాఖ తన ప్రకటనలో తెలిపింది. 

    వాస్తవానికి.. ఎన్యుమరేషన్‌ గడువు పెంచినట్లు ఎక్కడా వెల్లడించలేదు. ఇక ఈనెల 8 వరకు ఎన్యుమరేషన్‌ కొనసాగించడంతో మరో 58 వేల ఎకరాల్లో పంట నష్టం అధికంగా జరిగినట్లు గుర్తించామని ప్రభుత్వం ప్రకటించింది. చివరికి.. 3.23 లక్షల మంది రైతులకు చెందిన 4.03 లక్షల ఎకరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల మేరకు 33 శాతానికి పైగా పంట నష్టం జరిగినట్లు నిర్ధారించామని పేర్కొంది.  

  • సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలు దోపిడీకి సర్కారు పెద్దలు బరితెగించారు. ఇష్టారాజ్యంగా అంచనా వ్యయం పెంచేసి ‘నీకింత–నాకింత’ అంటూ పంచుకుంటున్నారు. తుదకు పరిపాలనా అనుమతులు లేకుండానే పనులు కట్టబెట్టారంటే ఏ రీతిన అవినీతికి పాల్పడుతున్నారో ఇట్టే స్పష్టమవుతోంది. రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌ అధికారుల క్వార్టర్స్‌ కోసం ఎస్‌+12 పద్ధతిలో 18 టవర్లలో 432 ఫ్లాట్ల (యూనిట్లు) నిర్మాణ పనులు 2019 నాటికే 72 శాతం పూర్తయ్యాయి. ఆ పనులకు రూ.363.68 కోట్లు బిల్లులు చెల్లించారు. మిగిలిన 28 శాతం పనుల వ్యయం రూ.272.22 కోట్లు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.524.70 కోట్లకు పెంచేసి, 2017లో వాటిని అప్పగించిన ఎన్‌సీసీ సంస్థకే మళ్లీ ఇప్పుడు కట్టబెట్టారు.

    అంటే.. అంచనా వ్యయాన్ని రూ.252.48 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. 2018–19 నాటితో పోల్చితే ఇప్పుడు స్టీలు, సిమెంటు, పెట్రోల్, డీజిల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యతాస్యం లేదు. పైగా ఇసుక ఉచితం. అయినా సరే మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 92.75 శాతం పెంచేయడంపై ఇంజినీర్లు నివ్వెరపోతున్నారు. పెంచేసిన అంచనా వ్యయం మొత్తం బిగ్‌బాస్‌ జేబులోకి చేరుతుందంటున్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలు దోపిడీకి ఇది మరో నిదర్శనమని ఇంజినీర్లు చెబుతున్నారు. రూ.608 కోట్ల అంచనా వ్యయంతో 432 ఫ్లాట్ల నిర్మాణానికి 2017లో సీఆర్‌డీఏ టెండరు పిలిచింది.

    4.59 శాతం అధిక ధరలకు కోట్‌ చేసి రూ.635.90 కోట్లకు ఆ పనులను ఎన్‌సీసీ సంస్థ దక్కించుకుంది. ఈ పనులను ఎన్‌సీసీకి అప్పగిస్తూ 2017 నవంబర్‌ 13న సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం 2019 ఫిబ్రవరి 12 నాటికి ఈ పనులు పూర్తి కావాలి. అయితే 2019 నాటికి 72 శాతం పూర్తయినట్లు.. అందుకు రూ.363.68 కోట్లను వ్యయం చేసినట్లు 2023లో కాంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తేలి్చంది. అంటే.. మిగిలిన 28 శాతం పనుల అంచనా వ్యయం రూ.272.22 కోట్లు మాత్రమే.   

    రద్దు చేసి.. అంచనా వ్యయం పెంపు  
    టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పనుల కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేశారు. మిగిలిన 28 శాతం పనుల అంచనా వ్యయాన్ని రూ.272.22 కోట్ల నుంచి రూ.524.70 కోట్లకు పెంచేసి మళ్లీ టెండర్లు పిలిచి.. అదే ఎన్‌సీసీ సంస్థకు మళ్లీ అప్పగించారు. అంటే.. నాడూ, నేడూ వాటిని టెండర్‌ ద్వారా ఒకే కాంట్రాక్టు సంస్థకు అప్పగించారన్నది స్పష్టమవుతోంది. సాంకేతికంగా చూస్తే.. 2017లో ఆ పనులను దక్కించుకున్న సంస్థే 2025లో వాటిని మళ్లీ దక్కించుకోవడం సాధ్యం కాదు. టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయక ముందే సిండికేట్‌ కాంట్రాక్టర్లకు బిగ్‌బాస్‌ దిశా నిర్దేశం చేసి.. సీఆర్‌డీఏ అధికారులకు కనుసైగ చేయడం వల్లే పెంచిన అంచనా వ్యయంతో చేపట్టిన పనులను మళ్లీ ఎన్‌సీసీకే కట్టబెట్టారని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు.  

    పరిపాలన అనుమతి లేకుండానే ఒప్పందం 
    అంచనా వ్యయాన్ని రూ.524.70 కోట్లకు పెంచేస్తూ చేపట్టిన పనులను పరిపాలన అనుమతి లేకుండానే సీఆర్‌డీఏ అధికారులు ఏప్రిల్‌ 28న ఎన్‌సీసీ సంస్థకు కట్టబెట్టేస్తూ ఒప్పందం చేసుకున్నారు. కాంట్రాక్టు అగ్రిమెంట్‌ విలువలో పది శాతం (ఐదు శాతం మెషినరీ, ఐదు శాతం లేబర్‌) మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ను కాంట్రాక్టర్‌కు ప్రభుత్వం చెల్లించాలి. ఆ మేరకు ఎన్‌సీసీ సంస్థకు మెషినరీ విభాగం కింద 5 శాతం... అంటే రూ.26.68 కోట్లు చెల్లించాలని సీఎఫ్‌ఎంఎస్‌ (కాంప్రహెన్షివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) ద్వారా పీఏవో (పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌)కు సీఆర్‌డీఏ అధికారులు ప్రతిపాదన పంపారు. పరిపాలన అనుమతి లేకుండా ఆ పనిని చేపట్టిన నేపథ్యంలో మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ చెల్లించలేమంటూ పీఏవో దానిని సీఆర్‌డీఏ అధికారులకు తిప్పి పంపారు. దాంతో సీఆర్‌డీఏ అధికారులు చేసుకున్న ఒప్పందాన్ని కేబినెట్‌లో ఆమోదింపజేసి.. జూలై 13న ఆ పనులకు పరిపాలన అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయించడం గమనార్హం.  

     

    రూ.457.92 కోట్లకు పైగా దోపిడీ! 
    రాజధానిలో ప్రభుత్వం సీఆర్‌డీఏ ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌ అధికారులకు నిర్మీస్తున్న తరహాలోనే హైదరాబాద్‌ మహా నగరంలో అత్యంత ప్రాధాన్యమైన ప్రాంతంలో, ఇటాలియన్‌ మార్బుల్స్, అత్యాధునిక హంగులతో నిర్మీంచిన ఫ్లాట్ల ధర ఒక్కొక్కటి రూ.కోటికి మించదని ఇంజినీర్లు, రియల్టర్లు, బిల్డర్లు గుర్తుచేస్తున్నారు. అది కూడా భూమి విలువతో కలిపి. కానీ.. సీఆర్‌డీఏ పరిధిలో భూమి ఉచితం.. ఇసుక ఉచితం.. అయినా సరే 432 ఫ్లాట్ల అంచనా వ్యయం రూ.888.38 కోట్లు. (2019 నాటికి చేసిన వ్యయం రూ.363.68 కోట్లు+తాజా వ్యయం రూ.524.70 కోట్లుకు చేరుకుంది.) అంటే.. ఒక్కో ఫ్లాట్‌ నిర్మాణ వ్యయం రూ.2.06 కోట్లు. ఈ లెక్కన ఒక్కో ఫ్లాట్‌పై రూ.1.06 కోట్లు చొప్పున అధికంగా వ్యయం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీనిని బట్టి ఈ ఫ్లాట్ల నిర్మాణంలో మొత్తంగా రూ.457.92 కోట్లకుపైగా దోపిడీ చేస్తున్నారని ఇంజినీర్లు చెబుతున్నారు.  

Cartoon

Sports

  • ఏథెన్స్‌ (గ్రీస్‌): ఈ ఏడాది రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకోవడంలో సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ విఫలమైనా... సీజన్‌ను మాత్రం సింగిల్స్‌ టైటిల్‌తో ముగించాడు. ఏథెన్స్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నీలో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ జొకోవిచ్‌ చాంపియన్‌గా అవతరించాడు. 2 గంటల 59 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్‌ 4–6, 6–3, 7–5తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై చిరస్మరణీయ విజయం సాధించాడు. 

    తద్వారా తన కెరీర్‌లో 101వ సింగిల్స్‌ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ముసెట్టిపై జొకోవిచ్‌కిది తొమ్మిదో విజయం కావడం విశేషం. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌  ఆరు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. 

    తొలి సర్వీస్‌లో 61 పాయింట్లకుగాను 43 పాయింట్లు... రెండో సర్వీస్‌లో 36 పాయింట్లకుగాను 21 పాయింట్లు గెలిచాడు. టైటిల్‌ ఖాయమైన వెంటనే ఈ సెర్బియా స్టార్‌ తన జెర్సీని చించేసి విజయగర్జన చేశాడు. విజేత జొకోవిచ్‌కు 1,16,690 యూరోల (రూ. 1 కోటీ 19 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

    ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీకి దూరం 
    వరుసగా రెండో ఏడాది సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌కు జొకోవిచ్‌ దూరమయ్యాడు. ఏథెన్స్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత జొకోవిచ్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘భుజం గాయంతో బాధపడుతున్నాను. అందుకే ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నా’ అని గతంలో ఏడుసార్లు ఏటీపీ ఫైనల్స్‌ టైటిల్‌ను గెలిచి జొకోవిచ్‌ తెలిపాడు. జొకోవిచ్‌ స్థానంలో లొరెంజో ముసెట్టి ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో ఆడనున్నాడు.  

    72 హార్డ్‌ కోర్టులపై జొకోవిచ్‌ సాధించిన టైటిల్స్‌. 71 టైటిల్స్‌తో రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్‌ బద్దలు కొట్టాడు.

    2 పురుషుల టెన్నిస్‌ చరిత్రలో సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గిన రెండో అతిపెద్ద వయస్కుడిగా జొకోవిచ్‌ (38 ఏళ్ల 5 నెలలు) నిలిచాడు. ఈ రికార్డు కెన్‌ రోజ్‌వెల్‌ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న ఉంది. 1977లో కెన్‌ రోజ్‌వెల్‌ 43 ఏళ్ల వయసులో హాంకాంగ్‌ ఓపెన్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు.

  • సాక్షి, విశాఖపట్నం: తొలి రోజు తమిళనాడును తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేసిన ఆంధ్ర జట్టు రెండో రోజు బ్యాటింగ్‌లో తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని నెలకొల్పాల్సిన చోట అనూహ్యంగా వెనుకబడింది. రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘ఎ’లో తమిళనాడుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓవర్‌నైట్‌ స్కోరు 20/1తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర 49 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. 

    ఫలితంగా తమిళనాడుకు 5 పరుగుల అతి స్వల్ప ఆధిక్యం లభించింది. ఆట మొదటి బంతికే అభిషేక్‌ (3)ను అవుట్‌ చేసిన సందీప్‌ వారియర్‌ ఆ తర్వాత కూడా ఆంధ్రను వణికించాడు. స్వల్ప వ్యవధిలో మరో ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ త్రిపురణ విజయ్‌ (3)ని త్రిలోక్‌ నాగ్‌ క్లీన్‌»ౌల్డ్‌ చేశాడు. అలా జట్టు స్కోరు 30 పరుగులకు ముందే టాపార్డర్‌ వికెట్లను కోల్పోయింది. సందీప్‌ వారియర్‌ ధాటికి కెప్టెన్ రికీ భుయ్‌ (4), సోను యాదవ్‌ పేస్‌కు కరణ్‌ షిండే (9) నిలువలేకపోయారు. 

    ఇలాంటి తరుణంలో 63 పరుగులకే సగం (5) వికెట్లను కోల్పోయిన ఆంధ్రను షేక్‌ రషీద్‌ (150 బంతుల్లో 87 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. కానీ అవతలి వైపు అశ్విన్‌ (13), రాజు (1), పృథ్వీరాజ్‌ (0), సాయితేజ (2)ల నుంచి సహకారం లభించలేదు. ఒక్క సౌరభ్‌ కుమార్‌ (30; 3 ఫోర్లు) అండతోనే రషీద్‌ ఆమాత్రం స్కోరును చేసి పెట్టాడు. సందీప్‌ 4, త్రిలోక్‌ నాగ్, సోను యాదవ్, సాయికిషోర్‌ తలా 2 వికెట్లు తీశారు. 

    తర్వాత రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన తమిళనాడు ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ఓపెనర్లు విమల్‌ (20), జగదీశన్‌ (0)లను ఆంధ్ర»ౌలర్లు కట్టడి చేయగా... బాలసుబ్రహ్మణ్యం సచిన్‌ (51; 8 ఫోర్లు) రాణించాడు. ప్రదోశ్‌ రంజన్‌ (26 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), సాయి కిషోర్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. పృథీ్వరాజ్, రాజు చెరో వికెట్‌ తీశారు. ప్రస్తుతం తమిళనాడు 107 పరుగుల ఆధిక్యంలో ఉంది.  

  • రియాద్‌ (సౌదీ అరేబియా): ఆద్యంతం నిలకడగా రాణించిన కజకిస్తాన్‌ టెన్నిస్‌ స్టార్‌ ఎలీనా రిబాకినా కెరీర్‌లో తొలిసారి సీజన్‌ ముగింపు టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) ఫైనల్స్‌ టోర్నీలో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ రిబాకినాకు టైటిల్‌ దక్కింది. ప్రపంచ నంబర్‌వన్‌ సబలెంకా (బెలారస్‌)తో జరిగిన ఫైనల్లో రిబాకినా 6–3, 7–6 (7/0)తో గెలుపొందింది. ‘ఈ వారం ఎంతో గొప్పగా గడిచింది. టైటిల్‌ సాధిస్తానని అనుకోలేదు. అంతిమ ఫలితం ఎంతో ఆనందాన్నిస్తోంది’ అని ఈ మెగా టోర్నీలో ఫైనల్‌ చేరిన తొలిసారే టైటిల్‌ నెగ్గిన రిబాకినా వ్యాఖ్యానించింది. 

    టోర్నీ మొత్తంలో అజేయంగా నిలిచిన రిబాకినాకు 52 లక్షల 35 వేల డాలర్ల (రూ. 46  కోట్ల 40 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. మహిళల క్రీడా చరిత్రలో ఒక ప్లేయర్‌కు దక్కిన అత్యధిక ప్రైజ్‌మనీ ఇదేనని డబ్ల్యూటీఏ తెలిపింది. రన్నరప్‌గా నిలిచిన సబలెంకా ఖాతాలో 27 లక్షల డాలర్లు (రూ. 23 కోట్ల 93 లక్షలు) చేరాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో రన్నరప్‌గా నిలవడం సబలెంకాకిది రెండోసారి. 

    2022 డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టోర్నీ తుది పోరులో కరోలినా గార్సియా (ఫ్రాన్స్‌) చేతిలో సబలెంకా ఓడిపోయింది. ఈసారి డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ ఓడిపోయినప్పటికీ సబలెంకా వరుసగా రెండోసారి సీజన్‌ను నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించనుంది. ఈ ఏడాది సబలెంకా యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో కలిపి మొత్తం నాలుగు టైటిల్స్‌ సాధించింది. 

    ఫ్రెంచ్‌ ఓపెన్, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. 2022 వింబుల్డన్‌ టోర్నీ విజేత అయిన రిబాకినా ఈ సీజన్‌ను ఐదో ర్యాంక్‌తో ముగించనుంది. ఈ సంవత్సరం రిబాకినా 58 మ్యాచ్‌ల్లో గెలిచి, 19 మ్యాచ్‌ల్లో ఓడి మూడు టైటిల్స్‌ను సాధించింది.   

  • ట్యూరిన్‌ (ఇటలీ): పురుషుల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ ఏటీపీ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) శుభారంభం చేశాడు. టాప్‌–8 ర్యాంకర్ల మధ్య ఆదివారం ఈ మెగా టోర్నీ మొదలైంది. ‘జిమీకానర్స్‌ గ్రూప్‌’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో అల్‌కరాజ్‌ 7–6 (7/5), 6–2తో ఏడో సీడ్‌ అలెక్స్‌ డిమినార్‌ (ఆ్రస్టేలియా)పై గెలుపొందాడు. 

    1 గంట 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్‌ ఐదు ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. ‘జిమ్మీ కానర్స్‌ గ్రూప్‌’లోనే టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా), ముసెట్టి (ఇటలీ) కూడా ఉన్నారు. ‘జాన్‌ బోర్గ్‌ గ్రూప్‌’లో ప్రపంచరెండో ర్యాంకర్‌ సినెర్‌ (ఇటలీ), జ్వెరెవ్‌ (జర్మనీ), బెన్‌ షెల్టన్‌ (అమెరికా), ఫెలిక్స్‌ (కెనడా) ఉన్నారు.  

     

Business

  • దేశీ ప్రైమరీ క్యాపిటల్‌ మార్కెట్లలో ఐపీవోల సందడి నెలకొంది. 2025 తొలి తొమ్మిది నెలల్లో కంపెనీలు 75 మెయిన్‌బోర్డ్‌ ఐపీవోల ద్వారా సుమారు రూ. 1 లక్ష కోట్లు సమీకరించాయి. ఆఖరు త్రైమాసికంలో మరో రూ. 1 లక్ష కోట్లు సమీకరించనున్నాయి. ఇప్పటికే ఎన్‌ఎస్‌డీఎల్, హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్, ఎల్‌జీ ఎల్రక్టానిక్స్‌ మొదలైనవి రాగా, గ్రో, ఫోన్‌పే, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యుచువల్‌ ఫండ్‌లాంటి రాబోయే ఇష్యూలపై భారీగా ఆసక్తి నెలకొంది. ఇది ఇన్వెస్టర్లకు మంచి వార్తే ఆయినప్పటికీ, ఐపీవోల మీద ఆసక్తి పెంచుకుంటున్న రిటైల్‌ ఇన్వెస్టర్లలో మరింత క్రమశిక్షణ, అవగాహన పెరగాల్సిన ఆవశ్యకతను కూడా తెలియజేస్తోంది.  

    చాలాకాలంగా ఐపీవోలంటే తక్షణ లాభాలందించే లాటరీ టికెట్లనే అభిప్రాయం నెలకొంది. ఇలాంటి మైండ్‌సెట్‌ చాలా ప్రమాదకరమైనది. వీటిని లాటరీ టికెట్లుగా భావించి, లిస్టింగ్‌ లాభాల కోసమే అప్లై చేయడం మంచిది కాదు. ఫండమెంటల్, వాస్తవిక విలువనే పరిగణనలోకి తీసుకోవాలే తప్ప ఆఫర్‌ సమయంలో నిర్ణయించిన మార్కెట్‌ ధరను కాదు. కంపెనీ దీర్ఘకాలిక వృద్ధి గాథలో పాలుపంచుకునే అవకాశాన్ని కల్పించడంలోనే ఐపీవోకి సంబంధించిన సిసలైన విలువ ఉంటుంది. కాబట్టి తక్షణ లాభాల కోసం ఐపీవోలను లాటరీ టికెట్లుగా భావించకుండా ఉండటం ముఖ్యం.  

    గ్రే మార్కెట్‌ ప్రీమియంలతో జాగ్రత్త.. 
    గ్రే మార్కెట్లో ప్రీమియంలపై (జీఎంపీ) అతిగా ఆధారపడటం కూడా మంచిది కాదు. జీఎంపీ అనేది స్వల్పకాలిక స్పెక్యులేషనే తప్ప సిసలైన విలువను ప్రతిబింబించదు. ఈ ప్రీమియం తక్కువగా ఉన్నప్పటికీ లిస్టింగ్‌లో అదరగొట్టిన ఐపీవోలు ఇటీవల ఎన్నో చూశాం. ఉదాహరణకు స్విగ్గీ లిస్టింగ్‌కి ముందు జీఎంపీ ఒక మోస్తరుగా కనిపించింది. కానీ లిస్టింగ్‌ వేళ బిజినెస్‌ ఫండమెంటల్స్‌కి తగ్గట్లుగా రాణించింది.

    ఇక భారీ జీఎంపీ పలికిన ఐపీవోల వెంట పరుగులు తీసి, తీరా ఆ ప్రీమియంలన్నీ మాయమైపోయి, ఇన్వెస్టర్లు చేతులు కాల్చుకున్న ఉదంతాలూ ఉన్నాయి. కాబట్టి జీఎంపీ తక్కువగా ఉన్నంత మాత్రాన ఐపీవో బలహీనమైనదని గానీ, జీఎంపీ ఎక్కువగా ఉంటే కచ్చితంగా లాభాలు వస్తాయని గానీ అనుకోవడానికి ఉండదు.  
    సముచిత వేల్యుయేషన్స్‌.. 

    రిటైల్‌ ఇన్వెస్టర్లకు వరం 
    ప్రస్తుతం చాలా మటుకు ఐపీవోలు, అన్‌లిస్టెడ్‌ వేల్యుయేషన్లతో పోలిస్తే చాలా ఆకర్షణీయమైన ధరతో ముందుకొస్తున్నాయి. దీనితో అన్‌లిస్టెడ్‌ మార్కెట్లో బడా హెచ్‌ఎన్‌ఐలు చెల్లించిన దానికంటే తక్కువ రేటుకే షేర్లను సొంతం చేసుకునే అవకాశం రిటైల్‌ ఇన్వెస్టర్లకు లభిస్తోంది. అన్‌లిస్టెడ్‌ మార్కెట్లో ఎలా ఉన్నా ఐపీవో విషయంలో సముచిత ధరే నిర్ణయించేలా ఇష్యూయర్లు, మర్చంట్‌ బ్యాంకర్లు కసరత్తు చేస్తుండటం ఆరోగ్యకరమైన పరిణామం. దేశీ క్యాపిటల్‌ మార్కెట్లు మెచ్యూర్‌ అవుతోండటాన్ని ఇది సూచిస్తోంది.  

    ఆలోచించి ఇన్వెస్ట్‌ చేయాలి.. 
    ఇన్వెస్టర్లు ఐపీవోలను కూడా దీర్ఘకాలిక ఈక్విటీ పెట్టుబడుల కోణంలోనే చూడాలి. దరఖాస్తు చేయడానికి ముందే కంపెనీ మేనేజ్‌మెంట్, వ్యాపార మోడల్, ప్రమోటర్ల బ్యాగ్రౌండ్, ఆర్థిక పనితీరు మొదలైనవన్నీ అధ్యయనం చేయాలి. కంపెనీలు ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉంటే ఐపీవో దశలో పాక్షికంగా కొంత ఇన్వెస్ట్‌ చేసి, లిస్టింగ్‌ తర్వాత రేటు గానీ తగ్గితే మరికాస్త ఇన్వెస్ట్‌ చేయడమనేది ఒక వ్యూహం. ఇలా చేయడం వల్ల ఎక్కువ రిస్కు తీసుకోకుండా నాణ్యమైన వ్యాపారాల్లో సగటున మంచి

    వేల్యుయేషన్‌తో ఇన్వెస్ట్‌ చేసినట్లవుతుంది.  
    అత్యంత నాణ్యమైన ఐపీవోలు పెద్ద సంఖ్యలో రాబోతుండటంతో భారత్‌ వృద్ధి గాధలో పాలుపంచుకునేందుకు ఇన్వెస్టర్లకి బోలెడన్ని అవకాశాలు లభించబోతున్నాయి. కొత్త తరం టెక్నాలజీ, రిటై ల్, ఈ–కామర్స్, క్విక్‌ కామర్స్‌ నుంచి ఇన్‌ఫ్రా, హె ల్త్‌–టెక్, ఫిన్‌టెక్‌ వరకు వివిధ రంగాలకు చెందిన ఇష్యూలు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా విస్తరణ దశలోనో లేక లాభదాయకతను వేగవంతం చేసు కునే దశలోనో ఉంటున్నాయి. కాబట్టి దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇవి ఆసక్తికరంగా ఉండవచ్చు. అయితే, ఐపీవోలను స్పెక్యులేషన్‌ సందర్భాల్లాగా కాకుండా పూర్తి సమాచారం తెలుసుకుని, హేతుబద్ధంగా ఆలోచించి, ఇన్వెస్ట్‌ చేయడం కీలకంగా ఉంటుంది.  

    స్మార్ట్‌ వ్యూహం..
    సంస్థాగత ఇన్వెస్టర్లను అనుసరించడం మరో ప్రాక్టికల్‌ టిప్‌. బడా దేశీ, గ్లోబల్‌ ఇన్వెస్టర్లకు అధునాతన రీసెర్చ్, వేల్యుయేషన్‌ సాధనాలు అందుబాటులో ఉంటాయి. ఐపీవో ముగియడానికి ముందు ఇలాంటి ఇన్వెస్టర్లు ఎంత మేర సబ్ర్‌స్కయిబ్‌ చేశారనే విషయం బహిరంగంగానే తెలుస్తుంది. ఈ సబ్‌్రస్కిప్షన్‌ని బట్టి వారు సదరు ఇష్యూపై ఎంత ధీమాగా ఉన్నారనేది తెలుసుకోవచ్చు. యాంకర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కేటగిరీలో పెద్ద సంస్థలు భారీగా ఇన్వెస్ట్‌ చేస్తే కాస్త భరోసా లభించడానికి ఆస్కారం ఉంటుంది. 

    • శ్రీపాల్‌ షా ఎండీ, కోటక్‌ సెక్యూరిటీస్‌   

  • ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లకు ప్రధానంగా ఆర్థిక గణాంకాలు, జూలై–సెప్టెంబర్ (క్యూ2) ఫలితాలు దిశా నిర్దేశం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీటికితోడు యూఎస్‌తో చైనా, ఇండియా వాణిజ్య చర్చలకూ ప్రాధన్యమున్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

    దేశీయంగా ఈ వారం పలు ఆర్థిక గణాంకాలు విడుదలకానున్నాయి. అక్టోబర్‌ నెలకు బుధవారం(12న) వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ), శుక్రవారం(14న) టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. అంతకుముందు నెల(సెప్టెంబర్‌)లో సీపీఐ 2.07 శాతం నుంచి 1.54 శాతానికి దిగివచి్చంది. ఇది 2017 జూన్‌ తదుపరి కనిష్టంకాగా.. ఆర్‌బీఐ 2 శాతం లక్ష్యానికంటే తక్కువకావడం గమనార్హం! ఇక సెప్టెంబర్ లో డబ్ల్యూపీఐ 0.52 శాతం నుంచి 0.13 శాతానికి బలహీనపడింది. ద్రవ్యోల్బణ గణాంకాలు ఆర్‌బీఐ పరపతి విధానాలపై ప్రభావం చూపనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 

    క్యూ2 పనితీరు.. 
    ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసిక(క్యూ2) ఫలితాల సీజన్‌ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లు మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు. ఈ బాటలో ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజాలు ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్, హిందుస్తాన్‌ కాపర్‌తోపాటు టాటా స్టీల్, ఏషియన్‌ పెయింట్స్, బజాజ్‌ ఫైనాన్స్, భారత్‌ ఫోర్జ్, బయోకాన్, కంకార్, ఫినొలెక్స్‌ కేబుల్స్, టాటా పవర్, థెర్మాక్స్, ఇమామీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్, గ్రాఫైట్, హడ్కో, కల్పతరు, కేఈసీ ఇంటర్నేషనల్, కేపీఐటీ టెక్, అశోక్‌ లేలాండ్‌ తదితరాలు క్యూ2 పనితీరు ప్రకటించనున్నాయి. ద్రవ్యోల్బణ గణాంకాలుసహా క్యూ2 ఫలితాలు మార్కెట్లలో కీలకంగా నిలవనున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా తెలియజేశారు.  

    విదేశీ అంశాలు 
    కొద్ది రోజులుగా కొనసాగుతున్న యూఎస్‌ ప్రభుత్వ షట్‌డౌన్‌ ఆ దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు.. ఇతర దేశాలపైనా ప్రభావం చూపనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరోపక్క యూఎస్‌తో చైనా, భారత్‌ నిర్వహిస్తున్న వాణిజ్య చర్చలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. ఈ వారం అక్టోబర్‌ నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), రిటైల్‌ విక్రయ గణాంకాలు వెలువడనున్నాయి. అక్టోబర్‌ నెలకు యూఎస్‌ వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వెల్లడికానుంది. ఈ అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు ఆన్‌లైన్‌ ట్రేడింగ్, వెల్త్‌ టెక్‌ సంస్థ ఎన్‌రిచ్‌ మనీ సీఈవో ఆర్‌.పొన్మూడి పేర్కొన్నారు. 

    ఇతర అంశాలకూ ప్రాధాన్యం 
    ఇటీవల ముడిచమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్లు జియోజిత్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ పేర్కొన్నారు. వీటితోపాటు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, స్టాక్స్‌లోదేశ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు లేదా అమ్మకాల తీరు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేíÙంచారు. యూఎస్‌ ప్రభుత్వ షట్‌డౌన్‌ ప్రభావంసహా.. చైనా, భారత్‌తో ట్రంప్‌ వాణిజ్య చర్చలు మార్కెట్లలో ట్రెండ్‌కు కీలకంకానున్నట్లు తెలియజేశారు.  

    గత వారమిలా 
    గురునానక్‌ జయంతి సందర్భంగా బుధవారం(5న) సెలవుకావడంతో గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు నాలుగు రోజులే పనిచేశాయి. పలు ఆటోపోట్ల మధ్య బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 722 పాయింట్లు(0.9 శాతం) నీరసించి 83,216 వద్ద నిలిచింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 230 పాయింట్లు(0.9 శాతం) క్షీణించి 25,492 వద్ద స్థిరపడింది. 
    అయితే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 0.25 శాతం పుంజుకోగా.. స్మాల్‌ క్యాప్‌ దాదాపు యథాతథంగా ముగిసింది. 

    సాంకేతికంగా 
    గత వారం సాంకేతికంగా మార్కెట్లు దిద్దుబాటు బాటలో సాగాయి. అయితే ఈ వారం క్షీణతకు కొంతమేర అడ్డుకట్టపడే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. దీంతో నష్టాలు పరిమితంకావచ్చని పేర్కొన్నారు. నిఫ్టీకి తొలుత 25,350 పాయింట్ల వద్ద, తదుపరి 25,230 వద్ద మద్దతు లభించవచ్చని అంచనా వేశారు. ఈ స్థాయిల నుంచి బలాన్ని పుంజుకుంటే తొలుత 25,700, తదుపరి 25,800 వరకూ బలపడవచ్చని తెలియజేశారు. సెన్సెక్స్‌ బలహీనపడితే తొలుత 82,500 పాయింట్లవద్ద, ఆపై 82,000 స్థాయిలో సపోర్ట్‌ కనిపించవచ్చని పేర్కొన్నారు. ఈ స్థాయిలో బలపడితే 84,500– 85,000 పాయింట్ల వరకూ పుంజుకోవచ్చని అంచనా వేశారు.

    మళ్లీ ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ. 12,569 కోట్లు వెనక్కి 
    గత నెల చివరిలో దేశీ స్టాక్స్‌పట్ల ఆసక్తి ప్రదర్శించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) తిరిగి ఇటీవల అమ్మకాల బాట పట్టారు. వెరసి ఈ నెల(నవంబర్‌)లో ఇప్పటివరకూ రూ. 12,569 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నిజానికి అక్టోబర్‌లో నికరంగా రూ. 14,610 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు. అయితే అంతకుముందు మూడు నెలలపాటు వరుసగా అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చారు.

    ఫలితంగా సెప్టెంబర్ లో రూ. 23,885 కోట్లు, ఆగస్ట్‌లో రూ. 34,900 కోట్లు, జూలైలో రూ. 17,700 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఈ నెలలో ప్రతీ ట్రేడింగ్‌ రోజున నికరంగా అమ్మకాలకే మొగ్గు చూపడం గమనార్హం! దీంతో ఇతర మార్కెట్లతో పోలిస్తే దేశీ స్టాక్స్‌ వెనకడుగులో ఉన్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌కుమార్‌ తెలియజేశారు.  

  • ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు (ఐటీఆర్‌) గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది. ఏదైనా కారణాలతో గడువు లోపు రిటర్నులు సమర్పించలేకపోతే.. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. కొంత పెనాల్టీ చెల్లించడం ద్వారా ఆదాయపన్ను చట్టం నిబంధనల కింద రిటర్నులు దాఖలు చేయొచ్చు. ఇందుకు డిసెంబర్‌ 31 వరకూ గడువు ఉంది. ఇక గడువు ముగియడానికి చివరి గడియల్లో హడావుడిగా రిటర్నులు దాఖలు చేసిన వారు సైతం, అందులో ఏవైనా తప్పులు దొర్లి ఉంటే వాటిని సరిచేసుకునేందుకు వెసులుబాటు ఉంది. ఈ విషయంలో పన్ను చెల్లింపుదారులు ఏం చేయాలన్నది చూద్దాం. – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

    ఈ ఏడాది రిటర్నుల దాఖలుకు ఆదాయపన్ను శాఖ అదనపు సమయం ఇచ్చిది. జూలై 31గా ఉన్న గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. చివరి రోజుల్లో ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌పై సాంకేతిక సమస్యలు రావడంతో సెప్టెంబర్ 16 వరకు రిటర్నులు సమర్పించేందుకు అవకాశం ఇచ్చిది. అయినా సరే సకాలంలో రిటర్నులు సమర్పించని వారు ఇప్పుడు బిలేటెడ్‌ (ఆలస్యంగా) ఐటీఆర్‌ను సెక్షన్‌ 139(1) కింద సమర్పించొచ్చు. ఇందుకు డిసెంబర్‌ 31 వరకు అవకాశం ఉంటుంది. కాకపోతే పెనాల్టీ కట్టాలి. అంతేకాదు, ఒకవేళ పన్ను చెల్లించాల్సి ఉంటే, వడ్డీతోపాటు కట్టేయాలి.

    సెక్షన్‌ 234ఎఫ్‌ కింద.. ఆదాయం రూ.5 లక్షలకు మించని వారు రూ.1,000 బిలేటెడ్‌ రిటర్నుల ఫీజు కింద చెల్లించాలి. ఆదాయం రూ.5 లక్షలు మించితే రూ.5,000 చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు.. సెక్షన్‌ 234ఏ కింద నికరంగా చెల్లించాల్సిన పన్నుపై, గడువు ముగిసిన నాటి నుంచి నెలవారీ ఒక శాతం చొప్పున వడ్డీని చెల్లించాలి. అప్పటికే సంబంధిత పన్ను చెల్లింపుదారు పాన్‌పై నమోదైన టీడీఎస్, ముందస్తు పన్ను చెల్లింపులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నికరంగా చెల్లించాల్సిన మొత్తంపైనే వడ్డీ పడుతుందని బీడీవో ఇండియా ఎల్‌ఎల్‌పీ ట్యాక్స్‌ పార్ట్‌నర్‌ ప్రీతి శర్మ తెలిపారు.  

    అసలు చెల్లించాల్సిన తేదీ నుంచి, రిటర్నులు సమర్పించే తేదీ వరకు ఈ వడ్డీని పరిగణనలోకి తీసుకుంటారు. ఒక ఆర్థిక సంవత్సరం మొత్తం మీద పన్ను బాధ్యత రూ.10,000కు మించి ఉంటే అందులో 90 శాతాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం ముగియక ముందే చెల్లించాలని (ముందస్తు పన్ను) నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రకారం.. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నికర పన్ను మొత్తంలో 90 శాతాన్ని ముందుగా చెల్లించడంలో విఫలమైతే అప్పుడు సెక్షన్‌ 234బీ కింద నిబంధనలు అమలవుతాయి. వీటి కింద ఆర్థిక సంవత్సరం ముగిసిన మర్నాటి నుంచి (ఏప్రిల్‌ 1) పన్ను మొత్తంపై వడ్డీ రేటు అమల్లోకి వస్తుంది. ఇక సెక్షన్‌ 234సీ కింద సంబంధిత త్రైమాసికం చివరి తేదీ నాటికి ముందస్తు పన్ను చెల్లించడంలో విఫలమైనా, లేదా తక్కువ చెల్లించినా.. అప్పుడు క్వార్టర్‌ వారీ పరిశీలన తర్వాత వడ్డీ రేటు అమలు చేస్తారు. 

    ఒకవేళ త్రైమాసికం వారీ ముందస్తు పన్ను చెల్లింపుల్లో విఫలమై, ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కూడా గడువులోపు రిటర్నులు సమర్పించి, పన్ను బకాయిని వడ్డీ సహా చెల్లించలేకపోతే.. అలాంటి సందర్భాల్లో ఈ మూడు సెక్షన్ల (234ఏ, బీ, సీ) కింద మూడు రెట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ప్రీతి శర్మ వివరించారు. దీంతో చెల్లించాల్సిన మొత్తం గణనీయంగా పెరిగిపోతుంది. ఈ భారం వద్దనుకుంటే నిబంధనల ప్రకారం సకాలంలో చెల్లించడమే చక్కని మార్గం. 

    జాప్యం చేస్తే నష్టమే.. 
    గడువులోపు రిటర్నులు దాఖలు చేసినట్టయితే పాత, కొత్త పన్ను విధానాల్లో తమకు అనుకూలమైన దాన్ని (తక్కువ పన్ను భారం పడే) ఎంపిక చేసుకోవచ్చు. కానీ, గడువు దాటితే విధిగా కొత్త పన్ను విధానం కిందే సమర్పించగలరు. అంతేకాదు సెక్షన్‌ 10ఏ, 10బీ, 80–1ఏ, 80–ఐబీ, 80–ఐసీ, 80–ఐడీ, 80–ఐఈ కింద వ్యాపార, మూలధన నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకోవడం కుదరదు. గడువులోపు రిటర్నులు సమర్పించిన వారికే ఈ నష్టాలను తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది.

    ‘‘గడువు తర్వాత కొత్త పన్ను విధానం కింద రిటర్నులు వేసేట్టు అయితే స్వీయ నివాసానికి సంబంధించి నష్టాలను లాభాలతో సర్దుబాటు చేసుకునేందుకు లేదా తదుపరి ఆర్థిక సంవత్సరాలకు బదిలీ చేసుకునేందుకు అనుమతి ఉండదు. అద్దెకు ఇచ్చిన నివాసం రూపంలో నష్టం ఏర్పడితే, కేవలం క్యారీ ఫార్వార్డ్‌ (తదుపరి ఆర్థిక సంవత్సరాలకు ) చేసుకునేందుకే అవకాశం ఉంటుంది’’ అని ప్రీతి శర్మ తెలిపారు.

    అలస్యంగా డిసెంబర్‌ 31లోపు దాఖలు చేసినప్పటికీ, సాధారణ ఐటీఆర్‌ మాదిరే మదింపు చేస్తారు. నికరంగా పన్ను చెల్లించాల్సిన వారే రిటర్నులు వేయాలని లేదు. పన్ను చెల్లించేంత ఆదాయం లేని వారు సైతం బిలేటెడ్‌ రిటర్నుల పత్రాన్ని సమర్పించడం ద్వారా నిబంధనలను పాటించొచ్చు. దీనివల్ల టీడీఎస్‌ లేదా టీసీఎస్‌లు ఉంటే నిబంధనల కింద పెనాల్టీ చెల్లించి, వాటి రిఫండ్‌ కోసం క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

    ఇలా సమర్పించొచ్చు.. 
    ఈ–ఫైలింగ్‌ పోర్టల్‌లోకి లాగిన్‌ అవ్వాలి. ‘ఈ–ఫైల్‌’ విభాగంలో ‘ఫైల్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌’ అన్న దగ్గర క్లిక్‌ చేయాలి. అక్కడ అసెస్‌మెంట్‌ సంవత్సరాన్ని ఎంపిక చేసుకుని, ‘రివైజ్డ్‌ రిటర్న్‌ అండ్‌ సెక్షన్‌ 139(5)’పై క్లిక్‌ చేయాలి. తొలుత సమర్పించిన ఐటీఆర్‌ అక్నాలెడ్జ్‌మెంట్‌ నంబర్‌ను పేర్కొనడం మర్చిపోవద్దు. ఆఫ్‌లైన్‌లో పేపర్‌ రూపంలో (80 ఏళ్లకు పైబడిన వారు) రిటర్నులు దాఖలు చేసిన వారు ఆన్‌లైన్‌లో సవరణ రిటర్నులకు అవకాశం ఉండదు.

    తిరిగి భౌతిక రూపంలోనే సమర్పించాల్సి ఉంటుంది. సవరణ రిటర్నులను డిసెంబర్‌ 31 (2024–25 సంవత్సరానికి సంబంధించి) వరకు ఎన్ని పర్యాయాలు అయినా సమర్పించొచ్చు. ఇందుకు ఎలాంటి పెనాల్టీ చెల్లించక్కర్లేదు. రిఫండ్‌ ప్రాసెస్‌ అయిన తర్వాత కూడా సవరణ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. సాధారణ రిటర్నుల మాదిరే సవరణ రిటర్నులు వేసిన తర్వాత 30 రోజుల్లోపు ధ్రువీకరించడం తప్పనిసరి. అప్పుడే అది మదింపునకు వెళుతుంది.

    డిసెంబర్‌ 31 తర్వాత కూడా..  
    గడిచిన ఆర్థిక సంవత్సరానికి తర్వాతి ఆర్థిక సంవత్సరం అసెస్‌మెంట్‌ ఇయర్‌ అవుతుంది. 2024–25కు 2025–26 అసెస్‌మెంట్‌ సంవత్సరం అవుతుంది. అసెస్‌మెంట్‌ సంవత్సరం డిసెంబర్‌ 31 వరకు బిలేటెడ్‌ రిటర్నులు లేదా సవరణ రిటర్నులు సమర్పించుకోవచ్చు. అప్పటికీ అది చేయలేకపోతే, ఆ తర్వాత ఉన్న ఏకైక మార్గం అప్‌డేటెడ్‌ రిటర్నులు (ఐటీఆర్‌–యూ) సమర్పించడం.

    అసెస్‌మెంట్‌ సంవత్సరం ముగిసిన నాటి నుంచి 48 నెలల వరకు (నాలుగేళ్లు) ఇందుకు అవకాశం ఉంటుంది. అసలు టర్నులు దాఖలు చేయకపోయినా లేక సమర్పించిన రిటర్నుల్లో తప్పులను గుర్తించినా లేదా ఏవైనా ఆదాయ, ఆస్తుల వివరాలు వెల్లడించడం మర్చిపోయినా లేదా సవరణ రిటర్నుల్లోనూ తప్పులను గుర్తించిన సందర్భాల్లో.. ఐటీఆర్‌–యూ దాఖలు చేసుకోవచ్చు.

    ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 139(8ఏ) ఇందుకు అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా ఆదాయపన్ను చెల్లించాల్సిన బాధ్యత కలిగి, రిటర్నులు సమర్పించని వారు లేదా సమర్పించినా సమగ్ర వివరాలు వెల్లడించని వారు తప్పకుండా ఐటీఆర్‌–యూ దాఖలు చేసి, పెనాల్టీ, వడ్డీ సహా పన్నును చెల్లించడం మంచి నిర్ణయం అవుతుంది. రిటర్నులను ఎంత ఆలస్యంగా దాఖలు చేశారు, చెల్లించాల్సిన పన్ను ఎంతన్నదాని ఆధారంగా.. అసలుకి 25 శాతం, 50 శాతం, 60 శాతం లేదా 70 శాతం వరకు అదనపు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా అంతకాలానికి వడ్డీ, పెనాలీ్టలను కూడా సమర్పించుకోవాలి. 

    రిటర్నుల్లో సవరణలు..
    ఆదాయపన్ను రిటర్నుల దాఖలు ఇటీవలి కాలంలో కొంత సులభంగా మారినప్పటికీ, ఇంకా కొంత సంక్లిష్టమనే చెప్పుకోవాలి. అన్ని ఆర్థిక లావాదేవీలు, ఆదాయం, పెట్టుబడులు, మూలధన లాభాలు/నష్టాలు, డిపాజిట్లపై వడ్డీ ఆదాయం, అద్దె ఆదాయం, విదేశీ పెట్టుబడులు ఇలా ఎన్నో వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది. టీడీఎస్, టీసీఎస్‌ ఏవైనా ఉంటే సరిచూసుకోవాలి. వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)ను చూసుకున్న తర్వాత అందులో ఏవైనా తప్పులుంటే ఆదాయపన్ను శాఖకు రెక్టిఫికేషన్‌ (దిద్దుబాటు) అభ్యర్థన నమోదు చేయాలి. ఇంత సుదీర్ఘ ప్రక్రియలో కొన్ని తప్పులు దొర్లే అవకాశం లేకపోలేదు.

    లేదా ఫలానా ఆదాయం లేదా ఆర్థిక లావాదేవీల వివరాలను వెల్లడించడం మర్చిపోవచ్చు. అలాంటి సందర్భాల్లో సవరణ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు.  కనుక రిటర్నులు సమర్పించిన అనంతరం ప్రతి ఒక్కరూ ఒక్కసారి సమగ్రంగా పరిశీలించుకోవడం మంచిది. ఏవైనా తప్పులుంటే, వాటిని సవరించుకునేందుకు అవకాశం ఉంటుంది. డిసెంబర్‌ 31లోపు ఈ పనిచేయొచ్చు. ఐటీఆర్‌ పత్రం సరైనది ఎంపిక చేసుకోకపోవడం, వ్యక్తిగత వివరాల్లో తప్పులు, బ్యాంక్‌ ఖాతా వివరాల్లో తప్పులు, కొన్ని ఆదాయాలను వెల్లడించకపోవడం, మినహాయింపులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోకుండా పన్ను రిటర్నులు వేసి, అధిక పన్ను చెల్లించడం.. విదేశీ పెట్టుబడులు, ఆదాయాలు, ఇ–సాప్‌లు.. ఎలాంటి ఆధారాల్లేకుండా మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకున్న సందర్భాల్లో సవరణ రిటర్నులు సమర్పించొచ్చు.

    ముఖ్యంగా విదేశీ ఆస్తులు, ఆదాయాలను వెల్లడించకపోతే ‘బ్లాక్‌మనీ అండ్‌ ఇంపోజిషన్‌ ఆఫ్‌ ట్యాక్స్‌ యాక్ట్, 2015’ కింద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అప్పటికే సమర్పించిన రిటర్నులను ఆదాయపన్ను శాఖ మదింపు చేయడం ముగిసిపోతే సవరణ రిటర్నులకు అవకాశం ఉండదు.   

    సెక్షన్‌ 143 (1) కింద ఐటీఆర్‌ ప్రాసెస్‌ (ఇనీíÙయల్‌/ప్రాథమిక) అయినప్పుడే సవరణ రిటర్నులను డిసెంబర్‌ 31లోపు లేదా తుది ప్రాసెసింగ్‌కు ముందు సమర్పించుకునేందుకు అనుమతి ఉంటుంది. 
     ఒకవేళ డిసెంబర్‌ 31 కంటే ముందుగానే సెక్షన్‌ 143 (3) కింద ఐటీఆర్‌ తుది మదింపు ముగిసినట్టయితే సవరణ రిటర్నులకు అవకాశం ఉండదు. ఇటువంటి సందర్భంలో సెక్షన్‌ 139(8ఏ) కింద ఐటీఆర్‌–అప్‌డేటెడ్‌ సమర్పించుకోవచ్చు.

    డిసెంబర్‌ 31నాటికి దాఖలు చేయకపోతే..? 
    డిసెంబర్‌ 31లోపు ఆలస్యపు రిటర్నులు సమర్పించడంలోనూ విఫలమైతే ఏమవుతుంది? అన్న సందేహం ఏర్పడొచ్చు. అలాంటి కేసుల్లో ఆదాయపన్ను శాఖ నుంచి నోటీసు జారీ కావొచ్చు. సకాలంలో రిటర్నులు వేయడం ద్వారానే చట్టపరిధిలో ఎన్నో మినహాయింపులు, ప్రయోజనాలకు అర్హత ఉంటుంది. లేదంటే వీటిని కోల్పోయినట్టే. రుణాలకు, ఆదాయ ధ్రువీకరణకు, వీసా ప్రాసెసింగ్‌కు ఐటీ రిటర్నులు రుజువుగా పనికొస్తాయన్నది గుర్తు పెట్టుకోవాలి.  

    వివిధ వర్గాల వారికి రిటర్నుల గడువు  
    వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌), ఆడిటింగ్‌ అవసరం లేని అసోసియేషన్‌ ఆఫ్‌ పర్సన్స్‌ (ఏవోపీ), బాడీ ఆఫ్‌ ఇండివిడ్యువల్స్‌ (బీవోఐ) 
    రిటర్నులు దాఖలు చేయాల్సిన గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది.  
      ఆడిట్‌ అవసరమైన వ్యాపార సంస్థలు రిటర్నుల సమర్పణ గడువు అక్టోబర్‌ 31. 
     సవరణ, బిలేటెడ్‌ రిటర్నుల సమర్పణ గడువు డిసెంబర్‌ 31. 
      2024–25 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి సంబంధించి అప్‌డేటెడ్‌ రిటర్నుల దాఖలు గడువు 2030 మార్చి 31.   

International

  • వాషింగ్టన్‌: రెండు దశాబ్దాల క్రితం అమెరికా దళాలకు వ్యతిరేకంగా పోరాడిన అల్‌ ఖైదా మిలిటెంట్‌ అహ్మద్‌ అల్‌–షరా(Ahmed al-Sharaa) వైట్‌హౌస్‌లో సోమవారం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమవబోతున్నారు. 1946లో స్వాతంత్య్రం పొందాక ఆధునిక సిరియా అధ్యక్షుడొకరు వాషింగ్టన్‌ రావడం ఇదే మొదటిసారి. ఈ కీలక భేటీ కోసం ఆయన శనివారమే అమెరికా చేరుకున్నారు. సిరియాపై ఉన్న ఆంక్షల పూర్తిగా తొలగింపు, ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న అమెరికా నాయకత్వంలోని అంతర్జాతీయ కూటమిలో అధికారికంగా చేరడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. 

    తిరుగుబాటు నేత నుంచి అధ్యక్షుడి దాకా 
    అల్‌ షరా నాయకత్వంలోని తిరుగుబాటు దళాలు గత డిసెంబర్‌లో బషర్‌ అసద్‌ను గద్దెదించాయి. అంతకుమునుపు, అల్‌ ఖైదా నేతగా ఉన్న అల్‌ షరా సిరియాలోని అమెరికా బలగాలతో తలపడ్డారు. ఆయన్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా ప్రకటించింది. ఆయన తలపై రివార్డును కూడా ఉంది. కొంతకాలం అమెరికా బలగాల నిర్బంధంలోనూ ఆయన ఉన్నారు. ఇంతలోనే చకచకా అనూహ్య పరిణామాలు సంభవించాయి. అల్‌ ఖైదాతో సంబంధాలు తెంచుకున్న అల్‌ షరా, తాజాగా అంతర్యుద్ధం కారణంగా సిరియాను దూరం పెట్టిన ప్రపంచ దేశాలతో సంబంధాలను తిరిగి నెలకొల్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

    ఈ క్రమంలో, మేలో సౌదీ అరేబియాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశమయ్యారు. దీని తర్వాతే ట్రంప్‌ దశాబ్దాలుగా సిరియాపై కొనసాగుతున్న ఆంక్షలను ఎత్తివేస్తామని ప్రకటించారు. సోమవారం వాషింగ్టన్‌లో ఆయన ట్రంప్‌తో మళ్లీ భేటీ కానున్నారు. ట్రంప్‌తో జరిగే చర్చల్లో అల్‌–షరా ప్రధానంగా సీజర్‌ చట్టం రద్దు కోసం ఒత్తిడి చేయనున్నారు. గత అసద్‌ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ అమెరికా ఈ చట్టం కింద తీవ్ర ఆంక్షలను విధించింది. 

  • ఇస్లామాబాద్‌: ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌కు విశేషాధికారాలు కట్టబెట్టడంతోపాటు సమూల మార్పులకు ఉద్దేశించిన 27వ రాజ్యాంగ సవరణకు షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేయగా, ప్రతిపక్ష పార్టీలు ఆదివారం దేశవ్యాప్త ఆందోళనలకు దిగాయి. రాజ్యాంగ పునాదులనే కదిలించే సవరణలను ఆపివేయాలని డిమాండ్‌ చేశాయి. 27వ రాజ్యాంగ సవరణతో మిలటరీ అధికారం మరింత బలపడనుంది.

    ఆర్మీ చీఫ్, ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌కు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల చీఫ్‌గా రాజ్యాంగ గుర్తింపు లభించనుంది. ఫీల్డ్‌ మార్షల్‌గా ఆయన జీవిత కాలం కొనసాగుతారు. దీనివల్ల జీవించి ఉన్నంతకాలం ఆయనపై కేసులు పెట్టకూడదు. సుప్రీంకోర్టు అధికారాలకు సైతం కోత పడనుంది. ఈ బిల్లుపై సోమవారం సెనేట్‌లో ఓటింగ్‌ జరగనుంది. అవసరమైన మూడింట రెండొంతుల మంది సభ్యుల ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం ధీమాతో ఉంది. దీనిపై ఇమ్రాన్‌ సారథ్యంలోని పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఇ–ఇన్సాఫ్‌ సహా ఐదు పార్టీల కూటమి నిరసనలను కొనసాగించాలని నిర్ణయించింది.  

  • వాషింగ్టన్‌: విదేశాలపై సుంకాల భారం మోపడం వల్లే దేశాదాయం విపరీతంగా పెరిగిందని, తద్వారా సమకూరిన ఆదాయం నుంచి అర్హులైన అమెరికన్లకు సుంకాల డివిడెండ్‌గా 2,000 డాలర్లు పంపిణీ చేస్తానని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ ఆదివారం ప్రకటించారు. విదేశాలపై సుంకాలను ఇష్టారీతిగా పెంచే విచక్షణాధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుందా? అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాలు అధ్యక్షుడికి వర్తిస్తాయా? అనే అంశాలపై సుప్రీంకోర్టు లోతైన సమీక్ష జరపనున్న నేపథ్యంలో ట్రంప్‌ ఆదివారం ఈ మేరకు తనదైన రీతిలో స్పందించారు.

    సొంత సామాజిక మాధ్యమ ‘ట్రూత్‌ సోషల్‌’ ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘సుంకాలను వ్యతిరేకించే వాళ్లంతా మూర్ఖులు. అధిక సుంకాలతో రెవిన్యూ వసూళ్ల వరద మొదలయ్యాక మనం అత్యంత ధనిక, గౌరవప్రద దేశంగా మారాం. మన దగ్గర ద్రవ్యోల్బణం దాదాపు లేదు. స్టాక్‌మార్కెట్‌ దూసుకుపోతోంది. ట్రిలియన్ల డాలర్లు వచ్చిపడుతున్నాయి. త్వరలోనే 37 ట్రిలియన్‌ డాలర్ల అప్పులను తీర్చే ప్రక్రియ మొదలెడతా. అమెరికాలోకి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. దాదాపు మిగతా వాళ్లందరికీ సుంకాల డివిడెండ్‌గా 2,000 డాలర్లు నేరుగా బదిలీచేస్తా’’ అనిట్రంప్‌ అన్నారు.

  • వాషింగ్టన్: సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా (Ahmed al-Sharaa) అంతర్జాతీయంగా అందరినీ ఆశ్చర్యపరిచారు. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ (Brad Cooper)తో పాటు పలువురు అమెరికా అధికారులతో కలిసి అల్-షరా బాస్కెట్‌ బాల్ ఆడారు.

    ఈ స్నేహపూర్వక ఆట వాషింగ్టన్‌లో నిర్వహించబడిందని సమాచారం. సిరియా అధ్యక్షుడు అల్-షరా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన సిరియా అధ్యక్షుడిగా అల్-షరా చేసిన తొలి అధికారిక అమెరికా పర్యటనగా గుర్తించబడింది.

Politics

  • సాక్షి, హైదరాబాద్‌: ‘నేను చెబుతున్నది గుర్తుపెట్టుకోండి. అసెంబ్లీ ఎన్నికలు 2028 డిసెంబర్‌లో రావు. 2029 జూన్‌లో జమిలి ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత ఐదేళ్లకు ఎన్నికలు జరుగుతాయి. 2034 జూన్‌ వరకు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటుంది. పదేళ్లు టీడీపీ, పదేళ్లు కాంగ్రెస్, పదేళ్లు కేసీఆర్‌కు ప్రజలు అవకాశమిచ్చారు. మాకు కూడా పదేళ్లు అధికారమిస్తారు. ఈ పదేళ్లలో 100 ఏళ్లకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలను రచించి ముందుకు తీసుకెళ్తాం. 2004–14 వరకు జరిగి ఆ తర్వాత ఆగిపోయిన అభివృద్ధిని 2024–34 మధ్య కొనసాగిస్తాం. ఇప్పటికి రెండేళ్లయింది. 

    ఇంకో ఎనిమిదేళ్లలో అన్నీ పూర్తి చేస్తాం’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఓ హోటల్‌లో నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’కార్యక్రమంలో సీఎం రేవంత్‌ మాట్లాడారు. రెండేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తెలంగాణ రైజింగ్‌ డాక్యుమెంట్‌–2047ను వచ్చే నెలలో ఆవిష్కరిస్తామన్నారు. ఆ తర్వాత విలేకరుల ప్రశ్నలకు సీఎం బదులిచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...  

    ‘కాళేశ్వరం’పై సీబీఐ దర్యాప్తులో ముందడుగేదీ?
    కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలకు బాధ్యులెవరో నిగ్గుతేల్చేందుకు ఘోష్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తే బీఆర్‌ఎస్‌ నేతలు మాపై ఆరోపణలు చేశారు. అందుకే దీనిపై అసెంబ్లీలో చర్చించి ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాం. కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లోనే నిందితులను జైల్లో పెడతామని కిషన్‌రెడ్డి అన్నారు. కానీ ఇప్పటికి 3 నెలలైనా విచారణ ఇంకా మొదలుకాలేదు. సీబీఐ కాళ్లకు బంధం వేస్తున్నదెవరో మీరే (మీడియా) తేల్చాలి. 

    కాలేజీల బంద్‌తో ‘ఫీజు’సమస్య పరిష్కారం కాదు... 
    నేను ఇవ్వాల్సింది ప్రతి విద్యార్థికి రూ. 35 వేలే. కానీ కాలేజీలు రూ. లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. యాజమాన్యాల కోరికలు తీర్చలేదనే పగతో కళాశాలలు బంద్‌ చేస్తామంటున్నారు. బంద్‌ చేస్తే పిల్లలు నష్టపోయే విద్యాసంవత్సరాన్ని ఎవరు తెచ్చిస్తారు? బంద్‌ బందూకుల వల్ల సమస్య పరిష్కారం కాదు. రూల్‌ బుక్‌ ప్రకారం ఏం చేస్తున్నారో చూద్దాం. మీడియా, విజిలెన్స్, కళాశాలల యాజమాన్యాలతో నిజనిర్ధారణ చేద్దాం. 100 శాతం కరెక్టుగా ఉందని ఈ కమిటీ నిర్ధారిస్తే ఆ కళాశాల కోసం తల తాకట్టు పెట్టయినా ఆ రోజే 100 శాతం రీయింబర్స్‌మెంట్‌ ఇస్తా. 

    బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కేసీఆర్‌ కోరలేదేం? 
    బీఆర్‌ఎస్‌ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల మద్దతు అడిగితే బాగుండేది. కానీ ఆ పార్టీ నాయకుడే శాసనసభకు రాడు. టీఆర్‌ఎస్‌ పుట్టుక నుంచి మరణశయ్యపైకి చేరుకొనే సమయంలో ఆ పార్టీకి ఎప్పుడైనా సున్నా సీట్లు వచ్చాయా? కేసీఆర్‌ బతికి ఉన్నప్పుడే, కేటీఆర్‌ నాయకత్వంలో గుండుసున్నా వచ్చాక ఎవరి కోసం ఈ బుకాయింపులు? వాళ్ల పనైపోయింది. 

    బీఆర్‌ఎస్‌ కాలగర్భంలో కలవబోతోంది. ఆ బాధతోనే కేసీఆర్‌ బయటకు రావట్లేదు. ఇప్పటివరకు ఆయన బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరలేదు. ఇది దేనికి సంకేతం? కేసీఆర్‌ను సానుభూతితో చూడాల్సిన పరిస్థితులే వచ్చాయి తప్ప ప్రత్యర్థిగా చూడాల్సిన పరిస్థితుల్లేవు. ఫార్ములా–ఈ రేసులో అవకతవకలపై నమోదైన కేసులో కేటీఆర్‌ను అరెస్ట్‌ చేసేందుకు అనుమతి కోరుతూ 3 నెలల క్రితమే గవర్నర్‌కు లేఖ రాసినా ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. 

    నేను కాంగ్రెస్‌ కార్యకర్తను.. 
    నాది కార్యకర్త మనస్తత్వం. పార్టీ ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా నేను ఇంట్లో కూర్చోను. నా మనసు ఒప్పుకోదు. హుజూరాబాద్, హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, మునుగోడు ఎన్నికల్లోనూ ఇలాగే తిరిగా. నేను కాంగ్రెస్‌ కార్యకర్తను.. ఆ తర్వాత ఎమ్మెల్యేను.. ఆ తర్వాతే ముఖ్యమంత్రిని. సెక్యూరిటీ వాళ్లు అనుమతిస్తే గడపగడపకూ ప్రచారం చేసేవాడిని.  

    పంచాయతీ ఎన్నికలపై... 
    బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసమే పంచాయతీ ఎన్నికలు కొంత ఆలస్యమయ్యాయి. ఆ మేరకు రిజర్వేషన్లు కలి్పంచి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. మాకు ఆర్థికంగా సమస్యలున్నాయి కానీ మా ఆలోచనలు, ప్రణాళికల్లో లోపం లేదు.  

    కేంద్ర సాయానికి కిషన్‌రెడ్డే అడ్డంకి.. 
    కేంద్రంతో విభేదాలు, తగాదాలు మేం పెట్టుకోదల్చుకోలేదు. గతంతో పోలిస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరిగాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చామో ప్రజలకు వివరిస్తా. బీజేపీలోనూ కిషన్‌రెడ్డితో తప్ప మిగిలిన వారితో ఇబ్బంది లేదు. హైదరాబాద్‌ సమస్యల పరిష్కారంలో కేంద్ర సాయానికి కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నాడు. కేటీఆర్, కిషన్‌రెడ్డి ఇద్దరూ బ్యాడ్‌ బ్రదర్స్‌. బ్యాడ్‌ మైండ్‌సెట్‌లో ఉన్నారు. 

    వైఎస్, కేసీఆర్‌ పాలనను ప్రజలు పోల్చి చూడాలి.. 
    ఎవరిది అగ్రికల్చర్‌.. ఎవరిది డ్రగ్స్‌ కల్చర్‌ ప్రజలే నిర్ణయించుకోవాలి. కంటోన్మెంట్‌లో కాంగ్రెస్‌ గెలిస్తే అక్కడి సమస్యలను పరిష్కరించగలిగాం. ఈ నిబద్ధత మీద తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా. వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో 2004–09 మధ్య, ఆ తర్వాత 2009–14 మధ్య రెండుసార్లు ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వంతో 2014–23 మధ్య కేసీఆర్‌ ఆధ్వర్యంలో రెండుసార్లు ఏర్పాటైన ప్రభుత్వాన్ని ప్రజలు పోల్చి చూడాలి. నాడు కాంగ్రెస్‌ రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్, రూ. 69 వేల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే ఆ తర్వాత పదేళ్లు పాలించిన కేసీఆర్‌ మాకు రూ. 8.11 లక్షల కోట్ల అప్పుతో అప్పగించాడు. రెండు పార్టీల పాలనలను పోల్చుకొని ప్రజలు ఓటేయాలని అడుగుతున్నా. 

    మైనారిటీలంతా మావైపే...  
    మైనారిటీల మద్దతుతోనే మేం అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోనూ ముస్లింలు సహా మైనారిటీలంతా మా వైపే ఉంటారు’అని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ రవికాంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా వ్యవహరించగా, మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్‌ వరికుప్పల తదితరులు పాల్గొన్నారు.  

    ‘జూబ్లీహిల్స్‌’లో గెలుపు కాంగ్రెస్‌దే.. 
    ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుంది. బీఆర్‌ఎస్‌ ఓడిపోతుంది. కిషన్‌రెడ్డికి చెబుతున్నా... మీకు డిపాజిట్‌ రాదు. మీ దోస్తు ఈ ఎన్నికల్లో ఓడిపోతాడు. మీరు ఎన్ని గూడుపుఠాణీలు చేసినా 14న సాయంత్రం ఇదే ఫలితం వస్తుంది. పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు,పన్నెండో సంవత్సరం అధికారంలో కొనసాగుతున్న వారు ఇద్దరూ ఏకమై మాపై ముప్పేట దాడి చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఒకవేళ గెలిస్తే దేశంలోనే కాదు.. బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లోనూ ఆ పార్టీ గెలిచినట్టే.  

Movies

  • వజ్రయోగి, శ్రేయ భర్తీ జంటగా నటించిన చిత్రం ‘సీమంతం’. సుధాకర్‌ పాణి దర్శకత్వంలో ప్రశాంత్‌ టాటా నిర్మించారు. గాయత్రి సౌమ్య గుడిసేవ సహనిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది. 

    ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో వజ్రయోగి మాట్లాడుతూ– ‘‘గర్భిణులపై దాడుల నేపథ్యంలో క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మా సినిమాను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్‌ చేస్తారని నమ్ముతున్నాను’’ అని చె΄్పారు సుధాకర్‌. ‘‘మా సినిమాకు అందరి సపోర్ట్‌ కావాలి’’ అని మ్యూజిక్‌ డైరెక్టర్‌ సుహాస్, కెమెరామేన్‌ శ్రీనివాస్‌ కోరారు.

  • తిరువీర్, ఐశ్వర్యా రాజేశ్‌ జంటగా కొత్త సినిమా షురూ అయింది. ఈ చిత్రం ద్వారా భరత్‌ దర్శన్‌ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. తొలి సినిమా ‘శివమ్‌ భజే’తో ప్రేక్షకులని అలరించిన గంగా ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ద్వితీయ చిత్రం ఇది.

    ‘‘హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది.  తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ భాషల్లో ఈ సినిమాని ఒకేసారి రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా:  సీహెచ్‌ కుషేందర్, సంగీతం: భరత్‌ మంచిరాజు.  

Family

  • ప్రపంచంలోని అత్యంత విలువైన ఆస్తి ఏదంటే, అది అపారమైన ధనరాశులు కాదు, తిరుగులేని అధికార పీఠం కాదు; అది మన ముఖంలో నిరంతరం వెలిగే ప్రసన్నత. ‘ముఖంలో ప్రసన్నతతో కీర్తి లభిస్తుంది. కీర్తి వృద్ధి చెందడం వల్ల సుఖాలు అనుభవిస్తారు. ప్రసన్నత లేని వారిని సజ్జనులు ఇష్టపడరు. కాబట్టి, ముఖ ప్రసన్నతే గొప్ప సంపద’.

    నేటి ఆధునిక, ఒత్తిడితో కూడిన జీవనశైలిలో, అంతరంగిక ఆనందం కొరవడుతున్న ఈ తరుణంలో, ఈ ప్రసన్న వదనం ఒక దివ్యౌషధంగా పనిచేస్తూ, అంతరాత్మ  అపురూపమైన ప్రతిబింబంగా ప్రకాశిస్తుంది. ఇది కేవలం పెదవుల వంపు మాత్రమే కాదు, మన అంతర్గత శాంతికి, ఎదుటివారి పట్ల మనకున్న నిష్కల్మషమైన ఆదరణకు, మన అజేయమైన స్థితప్రజ్ఞతకు దేదీప్యమానమైన ప్రతీక.

    మానవ సంబంధాలలో అత్యంత శక్తిమంతమైన, అత్యంత సులభమైన సామరస్య సాధనం ఏదైనా ఉందంటే అది చిరునవ్వే. మాటలు లేకున్నా, భాష తెలియకున్నా, ఒక నిర్మలమైన చిరునవ్వు వేల భావాలను పలకగలదు. ఇది మౌనంగా వినిపించే మధుర గీతం లాంటిది. ఈ చిరునవ్వు మనస్సులోని మంచితనాన్ని, స్వచ్ఛమైన అంగీకారాన్ని నిస్సందేహంగా వ్యక్తీకరిస్తుంది. అది హృదయాలను అద్భుతంగా కలుపుతుంది, అపరిచితులను ఆత్మీయులుగా మారుస్తుంది, బంధాలను పటిష్టంగా దృఢపరుస్తుంది. చిరునవ్వు అనేది సార్వత్రిక భాషకు తిరుగులేని తాళం చెవి.

    దానికి సంస్కృతి, భౌగోళిక, ఆర్థిక భేదాలు ఏవీ అడ్డుకావు. చరిత్రను పరిశీలిస్తే, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప నాయకులు తమ ప్రశాంతమైన ప్రసన్న వదనంతోనే కోట్లాదిమందిలో నమ్మకాన్ని, భరోసాను నింపారు. ఉదాహరణకు, మహాత్మా గాంధీ తన మౌనంలో సైతం చిరునవ్వుతో పలికే స్థితప్రజ్ఞత, లక్షలాది మందికి స్వాతంత్య్రపోరాటంలో అపారమైన ధైర్యాన్నిచ్చింది. అలాగే, మదర్‌ థెరిసా అందించిన నిస్వార్థ, నిర్మలమైన చిరునవ్వు, నిరాశ్రయులలో సైతం ఆశావాదాన్ని, జీవితేచ్ఛను ఉత్తేజపరిచింది. ఈ ఉదాహరణలు చిరునవ్వుకు ఉండే అంతర్గత శక్తిని, అది సంక్షోభ సమయాల్లోనూ ఎలా స్థైర్యాన్ని, భరోసాను ఇస్తుందో విశదీకరిస్తాయి.
    చిరునవ్వు మన శారీరక, మానసిక ఆరోగ్యంపై సానుకూల విప్లవాన్ని సృష్టిస్తుంది.

    ఇది మెదడులో ఎండార్ఫిన్ల విడుదలను ప్రేరేపించడం ద్వారా సహజమైన నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. అలాగే, ఒత్తిడిని కలిగించే కార్టిసాల్‌ స్థాయులను నియంత్రించి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. వత్తి జీవితంలోనూ, వ్యక్తిగత సంబంధాలలోనూ చిరునవ్వు ఒక అద్భుతమైన మానసిక ఆయుధం. ఆధునిక కార్పొరేట్‌ ప్రపంచంలో, అత్యంత క్లిష్టమైన చర్చల్లో చిరునవ్వుతో పలకరించే నాయకుడు కేవలం నమ్మకాన్ని పొందడమే కాక, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను, విజయవంతమైన సహకారాలను నిర్మించగలరు. మనస్పర్ధలు వచ్చినప్పుడు, కోపానికి బదులు చిరునవ్వుతో కూడిన సున్నిత సంభాషణ, బంధాలను తెగిపోకుండా అత్యంత సమర్థంగా నిలుపుతుంది.

    ఆనందంలో చిరునవ్వు సహజం, కానీ కష్టాల్లోనూ, సవాళ్లలోనూ చిరునవ్వును దాల్చడం మన అజేయమైన అంతర్గత స్థైర్యానికి పరాకాష్ఠ. చిరునవ్వు కేవలం పెదవుల యాంత్రిక కదలిక కాదు, అది హదయం నుండి వచ్చే ఒక సుమధుర స్పర్శ. అది అహంకారాన్ని తగ్గిస్తుంది, సహానుభూతిని పరిపూర్ణం చేస్తుంది. చిరునవ్వు లేని జీవితం, రంగులు లేని నిస్తేజమైన చిత్రం లాంటిది. ప్రతి మనిషిలో దాగి ఉన్న దైవిక సంపద ఈ చిరునవ్వు.

    ప్రతిరోజూ మన ఈ చిరునవ్వును ఇతరులతో దాతత్వంతో పంచుకోవడం ద్వారా మనం కేవలం మన బంధాలనే కాదు, సమాజాన్ని కూడా ప్రేమ, సామరస్యపు వారధిగా రూపుదిద్దగలం. చిరునవ్వును మీ ఆదర్శ జీవన శైలికి మార్గదర్శక దీపంగా మార్చుకుందాం. ఇది ద్వేషాన్ని, అపనమ్మకాన్ని సమర్థంగా దూరం చేసి, స్నేహాన్ని, విశ్వాసాన్ని సుస్థిరం చేస్తుంది. చిరునవ్వుతో కూడిన సజీవనం, ప్రతి మనిషిని ఈ లోకంలో ఒక తేజోవంతమైన ఆశా కిరణంగా మారుస్తుంది. ప్రసన్న వదనం ఈ జగత్తుపై చెరగని సంతకం, తరాలు దాటి పలికే దివ్య సందేశం. – కె. భాస్కర్‌ గుప్తా (వ్యక్తిత్వ వికాస నిపుణులు)

Astrology

  • గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తిక మాసం, తిథి: బ.పంచమి ఉ.7.59 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: పునర్వసు రా.1.17 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ప.1.50 నుండి 3.22 వరకు, దుర్ముహూర్తం: ప.12.06 నుండి 12.51 వరకు, తదుపరి ప.2.21 నుండి 3.06 వరకు,అమృత ఘడియలు: రా.11.06 నుండి 12.38 వరకు.

    సూర్యోదయం : 6.06
    సూర్యాస్తమయం :  5.23
    రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
    యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

    మేషం.. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థికాభివృద్ధి. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో  సంతృప్తికరంగా సాగుతాయి.

    వృషభం....కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఇంటాబయటా నిరుత్సాహం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

    మిథునం..... ఉద్యోగయత్నాలు కొంత అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి. దైవదర్శనాలు.

    కర్కాటకం.... ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో చికాకులు. ఆస్తి వివాదాలు.

    సింహం.... పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో మీపై  గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

    కన్య.... పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనలాభం.

    తుల.... పనులు కొన్ని వాయిదా పడతాయి. మిత్రులతో విభేదాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు. ఆధ్యాత్మిక చింతన.

    వృశ్చికం.... రుణాలు చేస్తారు. పనులు నత్తనడకన సాగుతాయి. నిర్ణయాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

    ధనుస్సు... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

    మకరం... నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారవృద్ధి. కళాకారులకు సన్మానాలు.

    కుంభం.... పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ తప్పదు.  వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

    మీనం.. చేపట్టిన పనులు మందగిస్తాయి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో కొద్దిపాటి వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

Editorial

  • కథ పుట్టడమూ, పిల్లల కథ పుట్టడమూ వేరుగా జరిగివుండదు. పిల్లల కంటే బాగా ‘ఊ’కొట్టగలిగేవారెవరు! పిల్లలను మైమరిపించడానికే పెద్దలు కథలు అల్లివుంటారు. ఆ వంకతో తమ చిన్నతనంలోకీ జారుకునివుంటారు! చిన్నతనానికీ పెద్దరికానికీ ఉన్న స్పష్టమైన తేడా: బాల్యంలో ఊహలకు సంకెళ్లుండవు. తార్కిక పరిమితి కలలను అణిచి వేయదు. ఎంత సాగితే అంత, ఎంత చూస్తే అంత, ఎంత కావాలనుకుంటే అంత. అక్కడ ఆశలు అనంతం. రెక్కలు అమాంతం. కప్పలు పకపకా నవ్వొచ్చు. కుందేళ్లు చకచకా మాట్లాడొచ్చు. కాకులు నీతులు చెప్పొచ్చు. జింకలు కోతలు కోయొచ్చు.

    పిల్లల కథ అనేది మబ్బుల్లోకి గెంతించే మాయా కిటికీ. సముద్రం అడుగుకు ఈదనిచ్చే గాలి పడవ. ప్రతి తరమూ తర్వాతి తరానికి అవసరమయ్యే వివేకపు రాశిని కథల రూపంలోనే బదిలీ చేస్తుంది. లోకాన్ని ఎదుర్కోవడానికి అవసరమయ్యే కాఠిన్యాన్ని అందులోనే కూరి ఉంచుతుంది. 

    ఈసప్‌ కథలు, పంచతంత్రం కథలు, వెయ్యొన్నొక్క రాత్రుల అరేబియన్‌ కథలు, జంగిల్‌ బుక్, కాంచన ద్వీపం, గలివర్‌ సాహసయాత్రలు, ‘చందమామ’ కథల నుంచి; టామ్‌ శాయర్, నొప్పి డాక్టర్, లిటిల్‌ ప్రిన్స్, హాబిట్, హారీ పాటర్‌ దాకా పిల్లల మనో ప్రపంచపు ఎల్లలను విశాలపరిచినవే! కథల వల్ల పిల్లలకు ఊహాశక్తి పెరుగుతుంది, సమస్యా పరిష్కారం తెలుస్తుంది, భాష అబ్బుతుంది, వ్యక్తీకరణ అలవడుతుంది, లోకరీతి అర్థమవుతుంది, ప్రపంచపు భిన్నత్వం పట్ల అవగాహన కలుగుతుంది, సాటి జీవుల పట్ల సానుభూతి కలుగుతుంది, తమ సాంస్కృతిక వారసత్వపు గొప్పతనం అనుభవంలోకి వస్తుంది, అన్నింటికీ మించి అమితమైన ఆనందం దొరుకుతుంది. జీవితపు సంరంభంలోంచి వచ్చే ఆనందానికి అదనంగా, మనిషికి ఉన్న మరో ఆనందపు వనరు కథలు కాక మరేమిటి?

    అసలు పిల్లల కథలు పిల్లలకు కలిగించే ప్రయోజనాలన్నీ పెద్దలకు కూడా కలిగిస్తాయి. ఏం పెద్దల్లో మాత్రం పిల్లలు బజ్జునిలేరా? అంతెందుకు, ఆరిస్టాటిల్‌ లాంటి తత్వవేత్త కూడా నిజమైన మంచి జీవితం గడపడం కోసం కాల్పనికత అవసరాన్ని సమర్థించాడు. అసలు సాధ్యం కానిది కూడా ఊహించగలగడం అవసరమని ఆయన వాదించాడు. టాల్‌స్టాయ్‌ లాంటి మహారచయిత కూడా పిల్లల కోసం కథలు రాశాడు. 

    కాకపోతే ఇదీ నీతి అంటూ ప్రత్యేకంగా చెప్పకూడదనీ, కథ ద్వారా పిల్లలు తమకు కావాల్సింది తాము తీసుకుంటారనీ అన్నాడు. మీరు ఎంతపెద్దవాళ్లయినా బాలసాహిత్యాన్ని చదవాలంటుంది కాథెరీన్‌ రండెల్‌ అనే బాలసాహిత్య రచయిత్రి. పిల్లల పుస్తకాలు మనం మర్చిపోయిన విషయాలనే కాదు, మనం మర్చిపోయామని మర్చిపోయిన విషయాలను కూడా గుర్తుచేస్తాయంటుందామె.

    లండన్‌లోని థేమ్స్‌ నదిలో పడవ షికారుకు పోయినప్పుడు తన వెంటున్న స్నేహితుడి ముగ్గురు కూతుళ్లకు ఓ కథ చెప్పాడట లూయిస్‌ కరోల్‌. అందులో అలీస్‌ లిడ్డెల్‌ అనే పదేళ్ల పాప కూడా ఉంది. ఒక రోజు నది ఒడ్డున విసుగ్గా కూర్చున్న ‘అలీస్‌’కు కోటు తొడుక్కుని, గడియారం పెట్టుకున్న ఒక తెల్ల కుందేలు కనబడటమూ, దానివెంట ఆమె ఆ కుందేలు బొరియలోకి పోవడమూ, అక్కడ్నుంచి వింతలూ విచిత్రాలూ... వాహ్‌! విన్నవెంటనే దాన్ని తనకోసం రాసిపెట్టమందట అలీస్‌. అట్లా ‘అలీస్‌(స్‌) అడ్వెంచర్స్‌ ఇన్‌ వండర్‌లాండ్‌’ పుస్తకంగా రూపుదాల్చింది. 

    1865 నవంబర్‌లో తొలిసారి ప్రచురితమైన దీనికి ఈ నెలలోనే 160 ఏళ్లు వచ్చాయి. జంతువులు జంతువుల్లా ఉండకుండా, మనుషులు మనుషుల్లా కాకుండా ప్రవర్తించే సాహిత్యాన్ని ‘నాన్సెన్స్‌ లిటరేచర్‌’ అని వర్గీకరించడం ఉంది. దాన్ని నిరర్థకమైనదని కాకుండా, హేతువుకు అందని అర్థవంతమైన సాహిత్యం అన్న అర్థంలో చూడాలి. 

    అందుకేనేమో, ఇకనుంచీ బాల సాహిత్యానికీ తమ అవార్డు ఇవ్వనున్నట్టు బుకర్‌ ఫౌండేషన్‌ ఇటీవలే ప్రకటించింది. 8–12 ఏళ్ల చిన్నారులను ఉద్దేశించి రాసే ఉత్తమ రచనకు ‘చిల్డ్రెన్స్‌ బుకర్‌ ప్రైజ్‌’ పేరుతో యాభై వేల పౌండ్లు ఇవ్వనున్నారు. బాలసాహిత్యం అనేది తీసేయదగినది కాదనీ, బాలసాహితీ వేత్తలు తక్కువ రచయితలేమీ కారనీ చెప్పే ఘనమైన వార్త ఇది. కాదామరి... నేటి బాలలే రేపటి ప్రపంచ నిర్మాతలు. 

Guest Columns

  • బ్రెజిల్‌లోని బెలేమ్‌ నగరంలో ఈ రోజు (నవంబర్‌ 10) నుంచి ‘సీఓపీ30’ శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దీనిలో 100కు పైగా దేశాల ప్రతి నిధులు పాల్గొననున్నారు. వాతావరణ మార్పును ఎదుర్కొనే కార్యాచరణ ప్రణాళికలను అప్‌డేట్‌ చేసుకునేందుకూ, పుడమి తాపాన్ని నిరోధించే చర్యల అమలును ముందుకు తీసుకెళ్ళేందుకూ ఈ సమావేశాలు నిర్ణయాత్మక మైలురాయి కానున్నాయని ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. ఆతిథ్యమిస్తున్న దేశంగా బ్రెజిల్‌ దీన్ని ఫలితమిచ్చిన శిఖరాగ్ర సమావేశంగా మలచాలని కోరుకుంటోంది. నడుం బిగించేందుకు ఇదే సమయమని సమావేశాల అధ్యక్షుడు ఆంద్రే కొర్రియా దొ లాగో అన్నారు. 

    అయినా పెరిగిన భూతాపం
    వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు కుదుర్చుకున్న ప్యారిస్‌ ఒప్పందం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భం కూడా దీనికి కలసి వస్తోంది. అది కర్బన ఉద్గారాలను తగ్గించుకునే ఆర్థిక వ్యవస్థలను నిర్మించుకునే లక్ష్యంగా కుదిరిన గొప్ప ఒప్పందం. కానీ, దాని లక్ష్యసాధన దిశగా తీసుకుంటున్న చర్యలు ఇప్పటికీ అరకొరగానే ఉంటున్నాయి. పుడమి సగటు ఉష్ణో గ్రత పారిశ్రామిక విప్లవం ముందు రోజుల కన్నా, 1.5 సెంటిగ్రేడ్‌ దాటకుండా చూసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, 2024లో అది మొదటిసారి దాన్ని దాటేసింది. 

    తీవ్ర వాతావరణ ఉపద్రవాలు పెరుగుతూ పోతున్నాయి. సముద్ర జలాలు వేడెక్కడంతో 80కి పైగా దేశాలలో సముద్రపు దిబ్బలు నిర్జీవంగా మారాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మార్పును ఆపడం కష్టమైన ‘నిర్ణయాత్మక దశ’కు పుడమి చేరుకుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వాతావరణ సమ తూకానికి ఎంతో ముఖ్యమైన అమెజాన్‌ సతత హరితారణ్యాలు కుప్పకూలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత సీఓపీ30 సమావేశాలు అమెజాన్‌కు సమీపంలోని నగరంలోనే జరుగుతున్నాయి. 

    ప్యారిస్‌ ఒప్పందానికి పరీక్ష
    ప్యారిస్‌ ఒప్పందాన్ని కాపాడుకునేందుకు ప్రపంచ దేశాలు సుముఖంగా ఉన్నాయో లేదో సీఓపీ30 సమావేశాలలో తేలిపోనుంది. దుబాయ్‌లో 2023లో జరిగిన సీఓపీ28 సమావేశాల్లో ప్రపంచవ్యాప్త పరిస్థితిని మొదటిసారిగా సమీక్షించుకున్నారు. శిలాజ ఇంధనాల నుంచి మారడాన్ని ఆ సమావేశాల తుది ప్రకటనలో మొదటిసారిగా ప్రస్తావించారు. అజర్‌బైజాన్‌లో జరిగిన సీఓపీ29 సమావేశాల్లో నూతన వాతావరణ ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వార్షిక వాతావరణ ఫైనాన్స్‌ 2035కల్లా 1.3 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు చేరేటట్లు చూసుకోవాలని అంగీకారానికి వచ్చారు. జాతీయ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను అమలుపరచడం, ఇంతవరకూ తీసుకున్న చర్యలను సమీక్షించడం బెలేమ్‌ సమా వేశాల్లో జరగనుంది. 

    వివిధ దేశాలు ఏ మేరకు ఉద్గారాలను తగ్గించాలని నిర్ణయించుకున్నాయో వాటిని జాతీయ నిశ్చయ వాటాలు (ఎన్డీసీలు)గా పిలుస్తున్నారు. వీటిని ప్రతి ఐదేళ్ళ కొకసారి అప్డేట్‌ చేసుకుంటున్నారు. ప్యారిస్‌ ఒప్పందంపై సంతకాలు చేసిన 190కి పైగా దేశాలలో దాదాపు 70 ఇప్పటికే తమ లక్ష్యాలను అప్డేట్‌ చేశాయి. ప్రపంచ ఉద్గారాలలో మూడో వంతు పైగా వాటాకు మాత్రమే లెక్క తేలే విధంగా అవి ప్రణాళికలు సమర్పించాయి. పుడమి తాపాన్ని 1.5 సెంటిగ్రేడ్‌ పరిమితికి లోపల ఉంచేందుకు 2030 నాటికల్లా గ్రీన్‌హౌస్‌ వాయువు (కార్బన్‌ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్‌ ఆక్సైడ్‌ వంటివి)లను సుమారు 31 గిగా టన్నులకు తగ్గించవలసి ఉంది. అయితే, అప్డేట్‌ చేసిన ఎన్డీసీలను లెక్కలోకి తీసుకున్నా అది 2 గిగా టన్నులకు మించడం లేదు. 

    అమెరికా తడబాటు – చైనా ఎడబాటు
    భౌగోళిక రాజకీయాలు బహు సున్నితంగా ఉన్న సందర్భంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. వివిధ దేశాల మధ్య నమ్మకం కొరవడటం ప్రధాన సమస్యలలో ఒకటిగా పరిణమించింది. ఇది వాతావరణంపై చర్చలకు అవరోధం కానుంది. అంతర్జాతీయ వాతావరణ మార్పు నిరోధక సహాయ కార్యక్రమాలకు అమెరికా నుంచి అందే విరాళాలకు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే కోత పెట్టారు. ప్రభుత్వ వనరులను సైనిక, భద్రతాపరమైన అంశాలకు మళ్ళిస్తున్నారు. 

    తలో చేయి వేస్తామని చెప్పిన దేశాలు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు. వాగ్దానం చేసిన మొత్తాలను తగ్గించి ఇస్తున్నాయి. ఉక్రెయిన్, గాజా యుద్ధాలు క్లైమేట్‌ ఫైనాన్సింగ్‌ ఇబ్బందులను తీవ్రతరం చేస్తున్నాయి. దాంతో సామాజిక ఉద్యమాల, పేద దేశాల ప్రతినిధుల హాజరు అంతంతమాత్రంగానే ఉండవచ్చుననిపిస్తోంది. చాలా దేశాలు తమ ప్రతినిధి బృందాల సంఖ్యను కుదించుకున్నాయి.

    కర్బన ఉద్గారాలు తక్కువగా ఉండగల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చైనా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ వంటి మధ్యాదాయ దేశాల నాయకత్వాలు ముఖ్య పాత్ర వహించవలసి ఉంది. ప్రపంచ ఉద్గారాలలో సుమారు సగ భాగం ఈ దేశాల నుంచే ఉన్నాయి. ఇవి తమ దేశాల్లో పరిస్థితులను చక్కదిద్దుకోకపోతే, మొత్తం ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ పైన కూడా పెద్ద బాధ్యతే ఉంది. వాతావరణ మార్పు ఇంత పెను సమస్యగా పరిణమించడంలో చారిత్రకంగా వాటి బాధ్యత చాలానే ఉంది. 

    గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలలో ప్రపంచంలో రెండవ పెద్ద పాత్ర అమెరికాదే! ప్యారిస్‌ ఒప్పందం నుంచి ఉపసంహరించుకునే ప్రక్రియ ట్రంప్‌ 2025 జనవరిలో తిరిగి అధికారానికి వచ్చాక ఊపందుకుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉద్గారాలను తగ్గించే లక్ష్యాన్ని చేరుకోగల గతిని నీరుగార్చనుంది. నిధుల మంజూరులో ఇచ్చిన మాటను అమెరికా ఎన్నడూ పూర్తిగా నిలబెట్టుకోలేదు. 

    ఆ లోటును ఫెడరల్‌ ప్రభుత్వం బదులు, రాష్ట్రాలు, స్థానిక పాలనా సంస్థలు తీరుస్తాయని భావిస్తున్నారు. ఇక తమ గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను 2035కల్లా 7 నుంచి 10 శాతం మధ్యకు తగ్గించుకుంటామని చైనా నాయకుడు షీ జిన్‌పింగ్‌ గత సెప్టెంబరులో ఐరాస సర్వ ప్రతినిధి సభలో చెప్పారు. ప్రపంచ ఉద్గారాలలో చైనా వాటా సుమారు మూడో వంతుగా ఉంది. దానితో పోలిస్తే, ఆయన చెబు తున్న మాటలు పెద్దగా లెక్కలోకి రావు. 

    వాతావరణ మార్పును అరికట్టే నాయకత్వం నుంచి అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ ఉపసంహరించుకోవడంతో చైనాయే నేతృత్వం వహించాలనే ఒత్తిడి పెరుగుతోంది. కానీ ‘ఏకైక నాయక’ పాత్రను చేపట్టడంలోని బరువు బాధ్యతలు చైనాకు బాగా తెలుసు. అందుకే నాయకత్వ బాధ్యత లను పంపిణీ చేయాలనీ, గ్లోబల్‌ సౌత్‌ దేశాల మధ్య సహకారాన్ని పటిష్ఠపరచాలనీ చైనా భావిస్తోంది.

    అమందా మగ్నాని
    వ్యాసకర్త బ్రెజిల్‌ పర్యావరణ పాత్రికేయురాలు