పెండింగ్ డీఏలను చెల్లించాలి
కాళోజీ సెంటర్: రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగ విరమణ భత్యాలను చెల్లించాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు రామినేని వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్లో ఆ సంఘం రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సర్దుబాటు పారదర్శకంగా చేయాలని కోరారు. ఈ సందర్భంగా టీయూటీఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి నూతనకంటి బాబును సంఘం ముఖ్య సలహాదారుగా నియమించినట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ధార గణేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లచ్చిమల్ల వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు యర్రంశెట్టి స్నేహ, వరంగల్ జిల్లా అధ్యక్షుడు చెడుపాక కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి కందకట్ల సత్యనారాయణ, గోపాలదాస్ శ్రీవిద్య, వివిధ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
వెంకటేశ్వర్లు


