హ్యాండ్బాల్ టోర్నీ విజేత వరంగల్, ఆదిలాబాద్
కోస్గి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 69వ రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ టోర్నీ ఆదివారం ముగిసింది. అండర్–17 బాలబాలికలకు మూడు రోజులపాటు నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. బాలుర విభాగంలో జరిగిన ఫైనల్లో మహబూబ్నగర్ జట్టుపై వరంగల్ జట్టు 22–15 పాయింట్ల తేడాతో విజేతగా నిలిచింది. బాలికల విభాగంలో మహబూబ్నగర్ జట్టుపై ఆదిలాబాద్ జట్టు 16–07 పాయింట్ల తేడాతో విజేతగా నిలవగా.. మహబూబ్నగర్ బాలబాలికల జట్లు రన్నర్గా నిలిచాయి. కరీంనగర్ బాలబాలికల జట్లు తృతీయ స్థానంలో నిలిచాయి. కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు బెజ్జు రాములు, పట్టణ అధ్యక్షుడు తుడుం శ్రీనివాస్ బహుమతులు ప్రదానం చేశారు.


