వజ్రయోగి, శ్రేయ భర్తీ జంటగా నటించిన చిత్రం ‘సీమంతం’. సుధాకర్ పాణి దర్శకత్వంలో ప్రశాంత్ టాటా నిర్మించారు. గాయత్రి సౌమ్య గుడిసేవ సహనిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలవుతోంది.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో వజ్రయోగి మాట్లాడుతూ– ‘‘గర్భిణులపై దాడుల నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రూపొందిన చిత్రమిది’’ అన్నారు. ‘‘మా సినిమాను థియేటర్స్లో చూసి ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అని చె΄్పారు సుధాకర్. ‘‘మా సినిమాకు అందరి సపోర్ట్ కావాలి’’ అని మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్, కెమెరామేన్ శ్రీనివాస్ కోరారు.


