వసతులపై ఆరా
ఏలూరు టౌన్: స్థానిక ఎంసీహెచ్ భవనంపై అంతస్తులోని హాస్టల్ను మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సావిత్రి ఆదివారం పరిశీలించారు. సౌకర్యాలపై విద్యార్థినులు ఆరా తీశా రు. ఎలుకలు కరిచిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో ఎలుకల కోసం సిబ్బందితో బోనులు ఏర్పాటు చేయించారు. కొన్నిచోట్ల కిటికీలు, తలుపులకు రంధ్రాలు ఉండటంతో వాటిని మూయించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామనీ, ఆందోళనకు గురికావద్దని భరోసా కల్పించారు. కాంట్రాక్టర్తో గతంలో ర్యాట్మ్యాట్లు పెట్టించటంతోపాటు, స్ప్రే చేయించామనీ, ఎలుకల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టేలా కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చే శారు. హాస్టల్లో పరిస్థితులపై వైద్య విద్యా ర్థు లు, వార్డెన్స్తోనూ మాట్లాడతామనీ, విచార ణ అనంతరం చర్యలు చేపడతామని చెప్పారు.


