కంపుకొడుతున్న డ్రెయినేజీలు
ములుగు రూరల్: మున్సిపాలిటీ పరిధిలోని కూరగాయల మార్కెట్ రోడ్డులోని డ్రెయినేజీలు కంపుకొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా డ్రెయినేజీలు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. డ్రెయినేజీల నుంచి మురుగు బయటకు వెళ్లకపోవడంతో జ్వరాల బారిన పడుతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు. మున్సిపాలిటీ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా మున్సిపాలిటీ అధికారులు స్పందించి డ్రెయినేజీలను శుభ్రం చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
కేజీకేఎస్ జిల్లా కమిటీ ఎన్నిక
ములుగు రూరల్: కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవన్లో నిర్వహించిన సంఘం 2వ మహాసభలో నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గుండబోయిన రవిగౌడ్, కార్యదర్శిగా బుర్ర శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ, రమేష్, ఈశ్వర్, గౌరవ అధ్యక్షుడిగా పులి నర్సయ్య, సహాయ కార్యదర్శులు గా అశోక్, మల్లేశ్, మధూకర్, సంపత్, కమిటీ సభ్యులుగా సురేశ్, లచ్చులు, రాజమొగిలి, రత్నాకర్, గణేశ్, యాకయ్యను ఎన్నుకున్నారు.
ఒకే కాన్పులో
ముగ్గురు పిల్లలు
ములుగు రూరల్: ఒకే కాన్పులో ఓ మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన సంఘటన జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏటూరునాగారం మండలంలోని గుండెవాయి చెందిన కుంజ రాధ పురిటి నొప్పులతో బాధపడుతూ ములుగు జనరల్ ఆస్పత్రిలో చేరింది. డాక్టర్ రజిత వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం కాన్పు చేయగా రాధ ముగ్గురు పండంటి మగ శిశువులకు జన్మినిచ్చింది. వారు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యురాలు రజిత తెలిపారు.
బుస్సాపూర్లో చోరీ!
గోవిందరావుపేట: మండలంలోని బుస్సాపూర్లో ఆదివారం చోరీ కలకలం రేపింది. 12 తులాల బంగారం, రూ.2.10లక్షల నగదు దోచుకున్నట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పస్రా ఎస్సై కమలాకర్ నేతృత్వంలో పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాల్లోని ఫుటేజీల ఆధారంగా నాలుగు గంటల్లో దొంగలను పట్టుకుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు సోమవారం విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం.
కంపుకొడుతున్న డ్రెయినేజీలు
కంపుకొడుతున్న డ్రెయినేజీలు


