● 12న భారీ ర్యాలీలు
● మాజీ మంత్రి కారుమూరి
తణుకు అర్బన్: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలలు తీసుకువచ్చి 5 కళాశాలలు పూర్తి చేస్తే నేడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని, దీనిని అడ్డుకుంటామని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. పులివెందులలో 150 మెడికల్ సీట్లు వచ్చి నా వెనక్కి పంపారని, నేడు అదే వైద్య కళాశాల నుంచి వైద్య సామగ్రి, పరికరాలను గుంటూరు ప్రభు త్వాస్పత్రికి తరలించారని విమర్శించారు. మెడికల్ కాలేజీలను పెత్తందారులకు దారాదత్తం చేస్తున్నారని, దీనిని అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పేరుతో ఈనెల 12న భారీ ర్యా లీలు నిర్వహించి తహసీల్దార్కు వినితపత్రం అందించనున్నామన్నారు. అసలు వైద్య కళాశాలలే లేవ ని నమ్మించాలని చూసిన కూటమి నేతలను నేడు మెడికల్ సీట్లు ఎందుకు వచ్చాయని నిలదీశారు. పాలకొల్లులో మెడికల్ కళాశాల అందుబాటులోకి వస్తే గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి వ్యాధులకు ఖరీదైన వైద్యం ఉచితంగా అందుతుందన్నారు. 12న జరిగే ర్యాలీలో సీపీఐ, సీపీఎం పార్టీలు, ప్రజలు పాల్గొంటున్నారన్నారు.
చోద్యం చూస్తున్న ఎమ్మెల్యేలు
తుపాను కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతే ప్ర భుత్వం చోద్యం చూస్తోందని, ఎమ్మెల్యేలు దోచు కున్న డబ్బును దాచుకునేందుకు విదేశాలకు వెళుతున్నారని కారుమూరి విమర్శించారు. తణుకు ఎమ్మెల్యే ఇంతవరకూ వరిచేల గట్టు తొక్కలేదని, రైతులు ఎలా ఉన్నారని అడిగిన పాపానపోలేదని మండిపడ్డారు.
పోస్టర్ ఆవిష్కరణ
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆవిష్కరించారు. పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, జి ల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ పెన్మెత్స సుబ్బరాజు, తణుకు మండల మహిళాధ్యక్షురాలు ఉండవల్లి జానకి, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, ముళ్లపూడి బాబూరావు పాల్గొన్నారు.


