పీఆర్ ఇంజినీర్ నూతన కార్యవర్గం ఎన్నిక
● అధ్యక్షులుగా నాగిరెడ్డి,
ప్రధాన కార్యదర్శిగా సతీష్ కుమార్
కర్నూలు (అర్బన్): ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఇంజినీర్స్ అసోసియేషన్కు నూతన కార్యవర్గాన్ని ఎనుకున్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగంణంలోని విశ్వేశ్వరయ్య భవనంలో అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మురళి కృష్ణనాయుడు ఆధ్వర్యంలో ఈ ఎన్నికలను నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులుగా పాణ్యం పీఆర్ఐ డీఈఈ ఇ. నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కర్నూలు పీఐయూ ఎఈఈ ఆర్. సతీష్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎమ్మిగనూరు పీఆర్ఐ డీఈఈ ఎస్. చంద్రశేఖర్, కోశాధికారిగా ఆదోని పీఆర్ఐ ఏఈఈ ఎం. మహదేవప్ప, అర్గనైజింగ్ సెక్రటరీగా కర్నూలు పీఆర్ఐ ఏఈఈ జ్యోత్స్నను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రవీంద్రరెడ్డి, పీఆర్ ఎస్ఈ వేణుగోపాల్, ఈఈ మహేశ్వరెడ్డితో పాటు జిల్లాలోని డివిజన్లు, సబ్ డివిజన్లకు చెందిన డీఈఈ, ఏఈఈలు పాల్గొన్నారు.


