క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలి
జక్రాన్పల్లి: క్రీడాపోటీల్లో క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకులాల జాయింట్ సెక్రెటరీ తిరుపతి అన్నారు. మండలంలోని మునిపల్లిలో గల మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలో ఆదివారం అండర్ 14, 19 జిల్లా స్థాయి క్రీడాపోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీల్లో క్రీడాకారులు తమ సత్తా చాటాలన్నారు. డీసీవో శ్రీకర్, ఆర్సీవో సత్యనాథ్, ప్రిన్సిపాల్ అనూష, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.


