ముగిసిన రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీలు
● నెల్లూరువాసుల ప్రతిభ
సాక్షి,పాడేరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న 79వ రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన అండర్ 14, 17, 19 విభాగాల బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చూపారు. వీరిలో కొందరిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
విజేతలు వీరే..
ఇండియన్ రౌండ్కు సంబంధించి అండర్ 14 బాలికల విభాగంలో నెల్లూరుకు చెందిన మోక్షాయరెడ్డి, అండర్ 19 బాలుర విభాగం రికర్వ్లో నెల్లూరుకు చెందిన తరుణేష్ జత్యా పతకాలు సాధించారు. అన్ని విభాగాలకు సంబంధించి నెల్లూరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల బాలబాలికలు ప్రతిభ చూపారు. డిప్యూటీ డీఈఓ చెల్లయ్య, ఎంఈఓలు జాన్, సువర్ణరాజు, జిల్లా క్రీడల అధికారి జగన్మోహనరావు పతకాలు అందజేశారు.


