ఏపీలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి | Four Dead and Several Injured After Container Truck Rams Into Pedestrians In Nellore District | Sakshi
Sakshi News home page

ఏపీలో ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

Nov 11 2025 1:31 PM | Updated on Nov 11 2025 3:53 PM

Lorry Container Run Over Into Traders In Nellore District

సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లాలో కంటైనర్‌ లారీ బీభత్సం సృష్టించింది. చింతారెడ్డిపాలెం సర్కిల్‌ వద్ద ఘటన జరిగింది. వ్యాపారులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

రహదారిపై ఉన్న చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన కంటైనర్‌.. టాటా ఏస్ వాహనంతో పాటుగా మూడు బైకులను ఢీకొట్టింది. ప్రమాదానికి కారణం లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా పోలీసులు భావిస్తున్నారు.

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement