బాధ్యతల స్వీకరణ
నిజామాబాద్అర్బన్: నగరంలోని నాలుగోటౌన్ ఎస్హెచ్వోగా సతీష్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఈ పోలీస్ స్టేషన్కు ఎస్సైస్థాయి అధికారి కొనసాగారు. స్టేషన్ పరిధి ఎక్కువగా ఉండడం, కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో ఇటీవల దీని పరిధిని ఎస్హెచ్వోగా విస్తరించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్టేషన్కు ఎస్హెచ్వో స్థాయి అధికారిని నియమించగా, సతీష్ బాధ్యతలు స్వీకరించారు.
బాన్సువాడ రూరల్: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా హరితహారం కార్యక్రమంలో భా గంగా నాటిన మొక్కలు ఎదిగి చెట్లుగా మారా యి. కాగా రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగి బాటసారులకు నీడనిస్తున్న చెట్లను కొందరు నిరక్షరాస్యులైన రైతులు నరికి వేస్తున్నారు. పోచారం తండా శివారులో కొన్నేళ్లుగా ఉపాధి హామీలో భాగంగా పెంచిన సుమారు 10 చెట్లను నరికివేశారు. నరికివేతకు గురైన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటడంతో పాటు చెట్లను నరికి వేసిన వారిని గుర్తించి చట్టప్రకారం శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కాలభైరవం భజే..
● వైభవంగా సంతతధారాభిషేకం
● ప్రారంభమైన కాలభైరవ స్వామి
జన్మదినోత్సవాలు
రామారెడ్డి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి (రామారెడ్డి) కాలభైరవుడి జన్మదినోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజ అనంతరం72 గంటలపాటు నిరంతరంగా కొనసాగే సంతతధారాభిషేకాన్ని ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ, వంశీకృష్ణ శర్మ, మనీష్ శర్మ, ఆలయ ఈవో ప్రభు గుప్తా ఉదయం 6 గంటలకు ప్రారంభించారు. మధ్యాహ్నం బద్దిపోచమ్మకు బోనాలు ఊరేగింపు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, నాగరాజ్, సిబ్బందితోపాటు భక్తులు భారీగా పాల్గొన్నారు.
నేడు లక్ష దీపార్చన
ఉత్సవాలలో ముఖ్యమైన ఘట్టం లక్షదీపార్చనను సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
బాధ్యతల స్వీకరణ
బాధ్యతల స్వీకరణ


