బాన్సువాడలో గంజాయి స్వాధీనం
బాన్సువాడ: బాన్సువాడ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని దుర్కి శివారులో గంజాయి అమ్ముతున్న ముగ్గురి అదుపులోకి తీసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ దిలీప్ తెలిపారు. దుర్కి శివారులో శంభుకుమార్, కార్తీక్గౌడ్, నందు, ఫరూఖ్ అనే వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా, పోలీసులకు విశ్వసనీయ సమాచారం రావడంతో దాడులు చేశారు. గంజాయిని విక్రయిస్తున్న నలుగురిని పట్టుకునే ప్రయత్నం చేయగా, ముగ్గురు పోలీసులకు పట్టుబడగా, ఫరూఖ్ పరారీ అయ్యారు. వారి నుంచి 225 గ్రాముల ఎండు గంజాయిని, మూడు సెల్పోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రావణ్, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, షరుబోద్దీన్, రూపేష్, స్నేహా, సుదీప్, నాగరాజు ఉన్నారని ఆయన అన్నారు.


