మరో ఐదు రోజుల్లో భాగస్వామ్య సదస్సు ఇవీ జీవీఎంసీ రహదారుల
మరో ఐదు రోజుల్లో భాగస్వామ్య సదస్సు జరగనున్న నేపథ్యంలో, ఏర్పాట్లు ‘ఆహా.. ఓహో’ అన్నట్టు ప్రచారం పీక్స్కి చేరుకుంది. అయితే జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వద్దే రోడ్ల దుస్థితి అధికారులను వెక్కిరిస్తున్నట్లుగా ఉంది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతంలోనే రోడ్లు అత్యంత ప్రమాదకరంగా మారినా, ఉన్నతాధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు. రామ్నగర్ ప్రాంతంలో యూజీడీ పనుల కోసం రెండు నెలల క్రితం రోడ్లను తవ్విన కాంట్రాక్టర్, పనులు పూర్తయినా రోడ్లను మాత్రం తిరిగి మరమ్మతులు చేయలేదు. కేవలం పిక్క వేసి వదిలేశారు. దీని ఫలితంగా నెల రోజులుగా రామ్నగర్ రోడ్లపై ప్రయాణిస్తున్న వాహన చోదకులకు ఇది ప్రమాదకరంగా మారింది. పిక్క వేసి వదిలివేయడం వలన, రోడ్డుపై వాహనాలు జారిపడిపోతున్నాయి. దీని వలన ద్విచక్ర వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. నగరంలో అతి ముఖ్యమైన భాగస్వామ్య సదస్సుకు అతిథులు వస్తున్న తరుణంలో జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి సమీపంలోనే ఈ పరిస్థితి ఉండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రామ్నగర్ ప్రాంతంలోని రహదారులను మెరుగుపరచాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. - బీచ్రోడ్డు
మరో ఐదు రోజుల్లో భాగస్వామ్య సదస్సు ఇవీ జీవీఎంసీ రహదారుల


