ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన
పీఎం పాలెం : వారాంతపు వినోద కార్యక్రమాల్లో భాగంగా శిల్పారామం (జాతర)లో ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను ఆద్యంతం అలరించింది. నగరంలోని నృత్య కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వినాయక స్తుతి గీతానికి కూచిపూడి నృత్యంతో ప్రారంభించి... శ్లోకాంజలి, నటరాజ స్తోత్రం, కృష్ణా పాట, అర్ధ నారీశ్వర, కనక దుర్గమ్మ నృత్యాంశాలను అద్భుతంగా ప్రదర్శించారు. కళాకారులు దేవిజ్ఞ, బాశివకా, రాధ, రాధిక, శిరీష, ధ్రుతి, సహస్ర, శిరీష సౌమ్య తదితర కళాకారులు పాల్గొనగా పి.రమ్య నృత్య దర్శకత్వ వహించారు. స్థానిక పరిపాలన అధికారి రమేష్ రెడ్డి పర్యవేక్షించారు.


