ప్రమాదవశాత్తు పూరిల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు పూరిల్లు దగ్ధం

Nov 10 2025 7:40 AM | Updated on Nov 10 2025 7:40 AM

ప్రమా

ప్రమాదవశాత్తు పూరిల్లు దగ్ధం

గుండాల: ప్రమాదవశాత్తు ఓ పూరిల్లు పూర్తిగా దగ్ధమైన సంఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. బాఽధితుడి కథనంప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నాగేల్లి వెంకన్న తండా సమీ పాన ఓ పూరింట్లో నివాసం ఉంటూ కార్పెంటర్‌ పనిచేస్తున్నాడు. అయితే ఆదివారం ఎప్పటిలాగే చర్చికి వెళ్లగా.. మధ్యాహ్నం 4గంటల సమయాన ఇంట్లో నుంచి మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు ఆయనకు సమాచారం అందించారు. వెంటనే అతడు అక్కడికి చేరుకుని స్థానికుల సా యంతో మంటలు ఆర్పివేయగా.. అప్పటికే పూరిల్లు పూర్తిగా కాలిపోయింది. కాగా, ఇందులో మూడు కర్ర మిషన్లు, సుమారు రూ.లక్షన్నర విలువ చేసే మంచాలు, ఇంటి సామగ్రితో పాటు రూ.50వేలు నగదు కాలిపోయాయని సుమారు రూ.5లక్షల నష్టం వాటిల్లినట్లు బాధిత కుటుంబం పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతుండగా.. బాధితుడు ఇటీవలే ఓ నూతన ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ప్రభుత్వం తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

కారును ఢీకొట్టిన

ఆర్టీసీ బస్సు..

టేకులపల్లి: కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం ఫారెస్టు శాఖ డీఆర్‌ఓ వెంకటేశ్వర్లు ఆదివారం తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో పాకాల వద్ద గల గుంజేడు ముసలమ్మ ఆలయంలో దర్శనం కోసం ఇల్లెందు వైపు బయలుదేరారు. ఈక్రమంలో వెంకట్యాతండా వద్దకు రాగానే కొత్తగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు వెనుక భాగం ధ్వంసం కాగా కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలిసిన ఎస్‌ఐ అలకుంట రాజేందర్‌, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా తగిన చర్యలు చేపట్టారు.

ప్రమాదవశాత్తు  పూరిల్లు దగ్ధం1
1/1

ప్రమాదవశాత్తు పూరిల్లు దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement