నిర్లక్ష్యమేల..?
తాత్కాలిక మరమ్మతులకు రూ. 1.18 కోట్లు
రికార్డు స్థాయిలో వర్షాలు..
సింగితం రిజర్వాయర్ రిటైనింగ్ వాల్ కొట్టుకుపోవడంతో వృథాగా వెళ్తున్న జలాలు
జిల్లాలో ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలు, వరదధాటికి చెరువులు, కుంటలతోపాటు రిజర్వాయర్లు, ప్రధాన కాలువలకు గండ్లు పడ్డాయి. వరద తాకిడికి మట్టికట్టలు కొట్టుకుపోయి, గండ్లు పడటంతో సాగు నీరు వృథా అవుతోంది.
శాశ్వత పనుల కోసం ప్రతిపాదనలు
నీటి పారుదల శాఖ అధికారులు జిల్లాలోని పోచారం ప్రాజెక్టు రూ.5 కోట్లు, సింగితం రిజర్వాయర్ రిటైనింగ్ వాల్ సిమెంట్ లైనింగ్కు రూ. 1.85 కోట్లు, కళ్యాణి ప్రాజెక్టు రూ. కోటి, మిగితా చెరువులు, కుంటలు, పంట కాలువల శాశ్వత పనుల కోసం రూ. 42.01 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే, ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు.
తాత్కాలిక మరమ్మతులకూ
నోచుకోని సింగితం, కళ్యాణి
నిజాంసాగర్ ప్రాజెక్టు అనుసంధానంగా ఉన్న సింగి తం రిజర్వాయర్ రిటైనింగ్ వాల్ గతేడాది కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. అప్పట్లో తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.8 లక్షలు మంజూరు చేసింది. దీంతో ఇసుక బస్తాలను అడ్డుగా వేసి మొరం, మట్టితో అడ్డుకట్ట వేశారు. ఈ సంవత్సరం కురిసిన వర్షాలు, వరదకు ఇసుక బస్తాలు, మట్టికట్ట కొట్టుకుపోవడంతో సింగితం రిజర్వాయర్ నీరు వృథాగా పోతోంది. కళ్యాణి ప్రాజెక్టు మరమ్మతులకు రూ.16 లక్షలు మంజూరయ్యాయి. ఆగస్టు 28న వరద పో టెత్తడంతో ప్రాజెక్టుకు రెండు వైపులా ఉన్న మట్టికట్ట తెగిపోయింది. దీంతో కళ్యాణి ప్రాజెక్టు ఖాళీ అయ్యింది.
పాత చెరువు కింద పంట కాలువ కొట్టుకుపోవడంతో యాసంగి పంటకు నీళ్లు రాకుండా పోయాయి. పంట కాలువ కొట్టుకపోయి గండిపడటంతో అలుగు, తూము నీళ్లు వాగులోకి పోతున్నాయి. పంట కాలువకు సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టాలి. ఆయకట్టు కింద పంటల సాగుకు సార్లు సహకరించాలి.
– శిరిగిరి గంగారాం, గ్రామస్తుడు, నర్వ
సింగితం రిజర్వాయర్ గోడ కొట్టుకుపోవడంతో నీళ్లు ఎళ్లిపోతున్నాయ్. ఇసుక బస్తాలు, మట్టి, మొరం పోసినా వరద పాలయ్యాయి. గోడ కూలడంతో నీళ్లు వాగు పాలవుతున్నాయి. యాసంగి పంటల సాగుకు నీళ్లు లేకుండా పోతున్నాయి. తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత పనులు చేపట్టాలి.
– మల్లేశ్ యాదవ్, ఆయకట్టు రైతు, నర్వ
వర్షాలు, వరదలతో దెబ్బతిన్న 184 చెరువులు, కుంటల తాత్కాలిక మరమ్మతుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపగా, 88 చెరువులు, కుంటలు, పంట కాలువలకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రూ. 1.18 కోట్లు మంజూరు చేశారు. దీంతో నీటి పారుదలశాఖ అధికారులు ఇటీవల తాత్కాలిక పనులకు అనుమతించారు. ఇప్పటి వరకు 28 చెరువులు, కుంటలు, పంట కాలువలకు తాత్కాలిక మరమ్మతులు పూర్తయ్యాయి. 6 చోట్ల పనులు పురోగతిలో ఉండగా, 54 చెరువులు, కుంట కట్టల మరమ్మతు పనులు ఇంకా మొదలుకాలేదు.
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రికార్డుల స్థాయిలో కురిసిన వర్షాలకు జిల్లాలోని 241 చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, పంట కాలువలకు గండ్లుపడ్డాయి. సింగితం రిజర్వాయర్ రిటైనింగ్ వాల్ కొట్టుకుపోవడంతోపాటు కళ్యాణి ప్రాజెక్టుకు రెండువైపులా మట్టి కట్టలు తెగిపోయాయి. వరద ప్రవాహానికి పోచారం ప్రాజెక్టు అలుగు వద్ద మట్టికొట్టుకుపోయి గోతిపడింది. పోచారం ప్రధాన కాలువకూ అక్కడక్కడ గండ్లుపడ్డాయి. అంతేకాకుండా సాగు నీరందించే పంట కాలువలు కొట్టుకుపోవడం, తూములు దెబ్బతినడంతో ఆయకట్టుకు నీరందని పరిస్థితులు నెలకొన్నాయి.
కొట్టుకుపోయిన చెరువు కట్టలు, గండ్లు పడిన కాలువలు ఆయకట్టు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లాలో ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు 241 చెరువులు, కాలువలు, రిజర్వాయర్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరద ప్రవాహానికి దెబ్బతిన్న చెరువులు, రిజర్వాయర్లు ఇప్పటికీ మరమ్మతుకు నోచుకోలేదు. – నిజాంసాగర్(జుక్కల్)
వర్షాలకు దెబ్బతిన్న
241 చెరువులు, రిజర్వాయర్లు
సాగునీటి వనరులపై
ప్రభుత్వం చిన్నచూపు
తాత్కాలిక మరమ్మతులకు
నోచుకోని వైనం
ఆందోళన చెందుతున్న
ఆయకట్టు రైతులు
నిర్లక్ష్యమేల..?
నిర్లక్ష్యమేల..?
నిర్లక్ష్యమేల..?


