వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు

Nov 10 2025 7:38 AM | Updated on Nov 10 2025 7:38 AM

వేర్వ

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు

రాజవొమ్మంగి: మండలంలోని గొబ్బిలమడుగు వెళ్లే ఘాట్‌ రోడ్డులో ఆదివారం సాయంకాలం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు గాయాలపాలయ్యారు. అడ్డతీగల మండలం సోమన్నపాలెంలో జరిగిన ఓ శుభకార్యాయానికి వెళ్లి తిరిగి మండలంలోని అమీనాబాద్‌ పంచాయతీ వణకరాయి వస్తున్న క్రమంలో ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గ్లోరీ, రామలక్ష్మి, విజయకుమారి, కుమారస్వామిలకు గాయాలయ్యాయి. ఈ మార్గంలోని దొరమామిడి నుంచి ఆటోలో గొర్రెలను తీసుకొని వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు గాయాలపాలయ్యాడు. వీరిని జడ్డంగి పీహెచ్‌సీకు తరలించగా చికిత్స పొందుతున్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు1
1/1

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement