వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు
రాజవొమ్మంగి: మండలంలోని గొబ్బిలమడుగు వెళ్లే ఘాట్ రోడ్డులో ఆదివారం సాయంకాలం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు గాయాలపాలయ్యారు. అడ్డతీగల మండలం సోమన్నపాలెంలో జరిగిన ఓ శుభకార్యాయానికి వెళ్లి తిరిగి మండలంలోని అమీనాబాద్ పంచాయతీ వణకరాయి వస్తున్న క్రమంలో ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో గ్లోరీ, రామలక్ష్మి, విజయకుమారి, కుమారస్వామిలకు గాయాలయ్యాయి. ఈ మార్గంలోని దొరమామిడి నుంచి ఆటోలో గొర్రెలను తీసుకొని వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు గాయాలపాలయ్యాడు. వీరిని జడ్డంగి పీహెచ్సీకు తరలించగా చికిత్స పొందుతున్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు


