ఖోఖో రాష్ట్ర చాంపియన్ ఆదిలాబాద్ జట్టు
పెద్దపల్లి: రాష్ట్రస్థాయి ఖోఖో ముగింపు పోటీలు ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగాయి. పురుషుల విభాగంలో రంగారెడ్డి జట్టు విన్నర్గా, హైదరాబాద్ జట్టు రన్నర్గా నిలిచాయి. మహిళల విభాగంలో ఆదిలాబాద్ విన్నర్గా, రంగారెడ్డి రన్నర్గా నిలిచాయి. ఖోఖో అసోసియేషన్ రాష్ట్రకార్యదర్శి కృష్ణమూర్తి, డీవైఎస్వో సురేశ్, టీఎన్జీవో పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు శంకర్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
టీజీపీఈఈవోఏ
అధ్యక్షుడిగా గురువయ్య
మంచిర్యాలక్రైం: తెలంగాణ ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా ఎకై ్సజ్ సీఐ గురువయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మంచిర్యాల ఎకై ్సజ్ సీఐ గురువయ్య, అసోసియేట్ అధ్యక్షుడిగా చెన్నూర్ సీఐ ఎం. హరి, ఉపాధ్యక్షుడిగా ఆదిలాబాద్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ నుంచి గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా వైద్య వెంకటేశ్వర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బీ. వెంకటరమణ, జాయింట్ సెక్రటరీగా జుల్ఫికర్ హై మద్, ట్రెజరర్గా కే. అభిషేక్లను ఎన్నుకున్నారు.
ఉద్యోగాల పేరిట మోసం.. నిందితుడి అరెస్ట్
ఆదిలాబాద్రూరల్ : ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మావల సీఐ కర్రె స్వామి ఆదివారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం మావల పోలీస్స్టేషన్ పరిధిలోని పిట్టలవాడలో నివాసముంటున్న పి.ఈశ్వర్కు ఉద్యోగం ఇప్పిస్తానని సిరికొండ మండలం సొన్పల్లి గ్రామానికి చెందిన గొర్ల శంకర్ నమ్మించాడు. రిమ్స్లో ల్యాబ్ టెక్నిషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని విడతల వారీగా రూ.1.90 లక్షలు తీసుకున్నాడు. అనంతరం ఉద్యోగం ఇప్పించకుండా రేపు,మాపు అంటూ ఇబ్బందులకు గురిచేశాడు. ఇచ్చిన డబ్బులు కూడా తిరిగివ్వలేదు. దీంతో బాధితుడు మావల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని సీఐ తెలిపారు. నిందితుడు పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల పేరిట కూడా డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు.
ఖోఖో రాష్ట్ర చాంపియన్ ఆదిలాబాద్ జట్టు


