రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక
మణుగూరు రూరల్: ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి యోగా పోటీలకు మణుగూరు ఎంజేపీటీబీసీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రజిని తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో జరిగిన జిల్లాస్థాయి యోగా పోటీల్లో అండర్–14 విభాగంలో ఆత్మకూరి సాత్విక్, కొత్తపల్లి కౌశిక్, పయలి శివకుమార్, జి.తరుణ్, ఎ.భరత్, వల్లెపు వంశీ, అండర్–17విభాగంలో ఎ.సాకేత్, ఎ.భవన్, జి.శ్రీరామ్, బి.రాంచరణ్లు అత్యుత్తమ ప్రతి భ కనబర్చి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని తెలి పారు. అనంతరం విద్యార్థులకు ప్రిన్సిపాల్తో పాటు ఉమ్మడి ఖమ్మంజిల్లా ఆర్సీఓ సీహెచ్. రాంబాబు, వ్యాయామ ఉపాధ్యాయుడు ముంజాల సురేష్, పీ.డీ. వెంకట్రావు, ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
కిన్నెరసానిలో
పర్యాటక సందడి
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసానికి జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు జిల్లాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహల నడుమ గడిపారు. 474 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖకు రూ.25,270 ఆదాయం లభించింది. 200 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.10,050 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
సైక్లింగ్ పోటీల్లో కొత్తగూడెం ఎఫ్డీఓకు ద్వితీయస్థానం
పాల్వంచరూరల్:అంతర్జాతీయస్థాయిలో హైద రాబాద్లో నిర్వహించిన హెచ్సీఎల్ సైక్లింగ్–2025 పోటీల్లో కొత్తగూడెం ఎఫ్డీఓకు ద్వితీ యస్థానం లభించింది. కాగా, ఈ పోటీల్లో దేశ నలుమూలలనుంచి సుమారు 14వేల మంది పోటీదారులు పాల్గొనగా.. ఖమ్మం సైక్లింగ్ క్లబ్(కేసీసీ) నుంచి 8 మందిలో ఒకడైన కొత్తగూడెం డివిజన్ ఎఫ్డీఓ యు.కోటేశ్వరరావు 48 కిలోమీటర్ల సైక్లింగ్ పందెంలో ద్వితీయస్థానం(40 ఏళ్ల విభాగం)లో నిలిచి రూ.15వేల నగదు బహుమతి అందుకున్నారు. ఈమేరకు ఖమ్మం సైక్లింగ్ క్లబ్ ఏర్పడిన మొదటి ఏడాదిలోనే ప్రతిభ కనబర్చడంతో కోటేశ్వరరావును క్లబ్ మెంబర్స్ అధ్యక్షుడు మహేంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి శ్రీనివాస్లు అభినంధించారు.
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక


