కూందులో ఇసుక దొంగలు
నంద్యాల అర్బన్: పగలు, రాత్రి తేడా లేకుండా నంద్యాల పట్టణంలో ఇసుక దందా యథేచ్చగా కొనసాగుతోంది. ఇసుక దోపిడీ కోసమే కూటమి ప్రభు త్వం ఏర్పడిందన్న చందంగా అధికార పార్టీకి చెందిన నాయకులు కుందూలో ఇసుకను కొల్లగొడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో సహజ సంపదైన ఇసుక అక్రమంగా తరులుతోంది. పట్టణంలో నందమూరినగర్ వైపు వెళ్లే పాత వంతెన సమీపం నుంచి ప్రథమనంది ఆలయం వరకు అక్కడక్కడ ప్రొక్లెయిన్ల ఏర్పాటు చేసి ఇసుకను తోడేస్తు న్నారు. కుందూలో ఇసుక పెద్ద ఎత్తున ఉండటంతో కూటమి నేతల కన్ను పడింది. రాత్రి వేళ నదిలో తవ్వి సమీపంలో డంప్ చేసి పగలు దర్జాగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ ట్రిప్పు రూ.1000 నుంచి రూ.1,200 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుకను యథేచ్చగా విక్రయిస్తున్నారని స్థానికులు అధికారుల కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి అనుచరులే పట్టణంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని స్థానికు లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
కూందులో ఇసుక దొంగలు


