వేంకటేశుని ఆదాయం రూ 11.47 లక్షలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం అత్యధికంగా తరలివచ్చిన భక్తులతో కిటకిటలాడింది. కార్తికమాసం ఆదివారం కావడంలో భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. వారిలో ఏడు వారాల భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వేంకటేశ్వరస్వామి వారితో పాటు ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి వారిని ప్రత్యేకంగా దర్శించుకుని పూజలు చేశారు.
తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. నిత్య కార్యక్రమాల్లో భాగంగా అష్టోత్తర పూజలు, నిత్య కళ్యాణం తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి వేలాదిగా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డూ విక్రయం తదితర రూపాల్లో ఈ ఒక్కరోజు దేవస్థానానికి రూ.11,46,533 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఽ


