పర్లాకిమిడి: జాతీయన్యాయ సేవా దినోత్సవం సందర్భంగా గుసాని సమితి బాగుసల గ్రామంలో జిల్లా న్యాయ సేవాప్రాధికరణ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని జిల్లా లీగల్ సర్వీసెస్ కార్యదర్శి బిమల్ రవుళో ప్రారంభించగా.. ఆర్సీడీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు, అసిస్టెంటు బ్లాక్ విద్యాశాఖ అధికారి సోమేశ్వర్ర్రావు, బీఎస్ఎస్వో సుభ్రత్ దాస్, అంగన్వాడీ వర్కర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం బాగుసల బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో బిమల్ రవుళో పాల్గొని దివ్యాంగులకు వైట్ కేన్స్ అందజేశారు. ప్రజలకు లీగల్ ఎయిడ్ ద్వారా ఎటువంటి సహాకారం అందించగలమో బిమల్ రవులో వివరించారు.
బాగుసలలో జాతీయ న్యాయ సేవా దినోత్సవం


