సెంటర్‌లో ఒక లెక్క.. మిల్లులో మరోలెక్క..! | - | Sakshi
Sakshi News home page

సెంటర్‌లో ఒక లెక్క.. మిల్లులో మరోలెక్క..!

Nov 10 2025 7:30 AM | Updated on Nov 10 2025 7:30 AM

సెంటర

సెంటర్‌లో ఒక లెక్క.. మిల్లులో మరోలెక్క..!

సెంటర్‌లో ఒక లెక్క.. మిల్లులో మరోలెక్క..!

దోపిడీని అరికట్టాలి

బస్తాకు 600 గ్రాముల తరుగు

తరుగు పేరిట దోచుకుంటున్న రైస్‌మిల్లర్లు

నష్టపోతున్న అన్నదాతలు

బాన్సువాడ రూరల్‌: అన్నదాతకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. పంట చేతికొచ్చిన దశలో అకాల వర్షాలు ఆగం చేశాయి. చైన్‌మిషన్లతో వరి కోయడంతో ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ధాన్యం కాంటా పూర్తయ్యిందని ఊపిరిపీల్చుకునేలోపే తరుగు పేరిట కోతలు పెడుతూ రైస్‌మిల్లర్లు రైతులకు పిడుగులాంటి వర్తమానాలు పంపుతున్నారు. అఽధికారులు, ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో రైతులు మనోవేదనకు గురువుతున్నారు.

అదనంగా కోత!

కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కాంటా సమయంలో 40 కేజీల బస్తాకు బదులు కేజీన్నర అధికంగా 41.500 కి.గ్రా తూకం వేస్తున్నారు. ధాన్యం మిల్లుకు చేరిన తర్వాత తేమ అధికంగా ఉందని, సంచి బరువు తక్కువ వచ్చిందని, రంగు మారిందని తదితర సాకులు చెబుతూ కొర్రీలు పెడుతున్నారు. ఇలా ఒక్కో బస్తాకు 500 గ్రాముల నుంచి 1 కేజీ వరకు తరుగు తీస్తున్నారు.

ఇటీవల నాగారం గ్రామంలో జరిగిన అధికారిక బహిరంగ సభలో ఓ రైతు బాన్సువాడ పట్టణంలోని ఓ ప్రముఖ రైస్‌మిల్లు యజమాని తరుగు పేరిట దగా చేశాడని అధికారులు, ప్రజాప్రతినిధుల ముందే వాపోయాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

తరుగు పేరిట జరుగుతు న్న దోపిడీని అరికట్టాలి. అధికారుల పర్యవేక్షణ లేకనష్టపో వాల్సి వస్తోంది. సెంటర్‌ నిర్వాహకులు తేమ శాతం చూశాకే కాంటా చేస్తున్నారు. మిల్లుకు వెళ్లిన తర్వాత తేమ పెరగటం ఆశ్చర్యం కలిగిస్తోంది. – చాకలి శ్రీనివాస్‌, ఇబ్రాహింపేట్‌

మా గ్రామంలోని ముగ్గు రు రైతులకు చెందిన 700 బ స్తాల ధాన్యాన్ని మిల్లుకు పంపించాం. మాకు సమాచారం ఇవ్వకుండానే బస్తాకు 600 గ్రాముల చొప్పున తరుగు కట్‌ చేశారు. తీవ్రంగా నష్టపోయాం.

– ఖాదర్‌, రైతు, ఇబ్రాహింపేట్‌

సెంటర్‌లో ఒక లెక్క.. మిల్లులో మరోలెక్క..!1
1/2

సెంటర్‌లో ఒక లెక్క.. మిల్లులో మరోలెక్క..!

సెంటర్‌లో ఒక లెక్క.. మిల్లులో మరోలెక్క..!2
2/2

సెంటర్‌లో ఒక లెక్క.. మిల్లులో మరోలెక్క..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement