జాతీయ రహదారికి మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారికి మరమ్మతులు

Nov 10 2025 7:30 AM | Updated on Nov 10 2025 7:30 AM

జాతీయ

జాతీయ రహదారికి మరమ్మతులు

కొణిజర్ల: ఖమ్మం నుంచి సత్తుపల్లి వరకు ఉన్న జాతీయ రహదారిలో కొణిజర్ల మండలం తనికెళ్ల నుంచి శాంతినగర్‌ మీదుగా వైరా మండ లం తల్లాడ మండల కేంద్రం వరకు రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ కావడంతో అధికారులు రోడ్డు మరమ్మతులపై దృష్టి సారించారు. కొణిజర్ల, తనికెళ్ల, పల్లిపాడులో భారీ గుంతలను ఆదివారం తారు మిక్సర్‌తో పూడ్చారు.

కిన్నెరసానిలో

పర్యాటక సందడి

పాల్వంచరూరల్‌: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం సందడి నెలకొంది. మండల పరిధిలోని కిన్నెరసానికి జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు జిల్లాల నుంచి కూడా పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్‌, జలాశయం, డీర్‌ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహల నడుమ గడిపారు. 474 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్‌ శాఖకు రూ.25,270 ఆదాయం లభించింది. 200 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్‌ సంస్థకు రూ.10,050 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

సైక్లింగ్‌ పోటీల్లో కొత్తగూడెం ఎఫ్‌డీఓకు ద్వితీయస్థానం

పాల్వంచరూరల్‌:అంతర్జాతీయస్థాయిలో హైద రాబాద్‌లో నిర్వహించిన హెచ్‌సీఎల్‌ సైక్లింగ్‌–2025 పోటీల్లో కొత్తగూడెం ఎఫ్‌డీఓకు ద్వితీ యస్థానం లభించింది. కాగా, ఈ పోటీల్లో దేశ నలుమూలలనుంచి సుమారు 14వేల మంది పోటీదారులు పాల్గొనగా.. ఖమ్మం సైక్లింగ్‌ క్లబ్‌(కేసీసీ) నుంచి 8 మందిలో ఒకడైన కొత్తగూడెం డివిజన్‌ ఎఫ్‌డీఓ యు.కోటేశ్వరరావు 48 కిలోమీటర్ల సైక్లింగ్‌ పందెంలో ద్వితీయస్థానం(40 ఏళ్ల విభాగం)లో నిలిచి రూ.15వేల నగదు బహుమతి అందుకున్నారు. ఈమేరకు ఖమ్మం సైక్లింగ్‌ క్లబ్‌ ఏర్పడిన మొదటి ఏడాదిలోనే ప్రతిభ కనబర్చడంతో కోటేశ్వరరావును క్లబ్‌ మెంబర్స్‌ అధ్యక్షుడు మహేంద్రకుమార్‌, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి శ్రీనివాస్‌లు అభినంధించారు.

జాతీయ రహదారికి మరమ్మతులు1
1/2

జాతీయ రహదారికి మరమ్మతులు

జాతీయ రహదారికి మరమ్మతులు2
2/2

జాతీయ రహదారికి మరమ్మతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement