అటవీ ఉత్పత్తుల విక్రయానికి స్టాళ్ల ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

అటవీ ఉత్పత్తుల విక్రయానికి స్టాళ్ల ఏర్పాటు

Nov 10 2025 7:38 AM | Updated on Nov 10 2025 7:38 AM

అటవీ ఉత్పత్తుల విక్రయానికి స్టాళ్ల ఏర్పాటు

అటవీ ఉత్పత్తుల విక్రయానికి స్టాళ్ల ఏర్పాటు

రంపచోడవరం: ఐసీడీఎస్‌ ద్వారా తయారుచేసి ఆహార పదార్థాలపై ప్రజల్లో కల్పించేందుకు స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్‌ అన్నారు. రంపచోడవరంలో ఆదివారం శిశు సంక్షేమ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన వివిధ రకాలైన ఆహార పదార్థాల స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఎంతో పోషక విలువలు ఉన్న రాగులు, సజ్జలతో పాటు వివిధ ఆహార పదార్దాలు తయారు చేసుకొని తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు. వందన్‌ వికాస కేంద్రాల ద్వారా ప్రొసెసింగ్‌ చేసిన జీడిపప్పును విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ కేంద్రాలను ప్రోత్సహించాలన్నారు. జీసీసీ విక్రయించే అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా జీసీసీ అభివృద్ది సహకారాన్ని అందించాలన్నారు. జీసీసీ డీఎం జయశ్రీ, ఏపీడీ డేగలయ్య, తహసీల్దార్‌ బాలాజీ, ఎంపీడీవో రాజు, సీడీపీవో ఉమా, క్రాంతి, సుచరిత, ఝూన్సీ, సుజాత, రవళి తదితరులు పాల్గొన్నారు.

రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్‌రాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement