న్యాయ సేవలపై అవగాహన
రాయగడ: జాతీయ న్యాయసేవ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవా సంస్థ ఆద్వర్యంలో న్యాయ సేవా సలహాపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా జడ్జి సత్యనారాయణ షడంగి ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.
పులి కాదు పిల్లి
కొరాపుట్: కొరాపుట్ జిల్లా వాసులను వణికించినది పులి కాదని పిల్లి అని అటవీ శాఖ అధికారులు ప్రకటించారు. గత రెండు రోజులుగా కొరాపుట్ జిల్లా సునాబెడా ప్రాంతంలో పులి తిరుగుతున్న వీడియో వైరల్ అయింది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదే విషయం టీవీలలో ప్రసారం కావడంతో ప్రజలు హడలెత్తిపోయారు. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పలుచోట్ల సీసీ కెమెరాలు పెట్టి, అడుగులు పరిశీలించారు. చివరకు అది అడవి పిల్లిగా ధ్రువీకరించారు. ఆదివారం అటవీశాఖ ఉన్నతాధికారులు స్పందిస్తూ.. ప్రజలు భయపడవద్దన్నారు. ఆ జంతువు పులి కాదని అడవి పిల్లి అని తెలిపారు.
న్యాయ సేవలపై అవగాహన


