108 అంబులెన్స్లో ప్రసవం
జ్యోతినగర్(రామగుండం): పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి 108 అంబులెన్స్ సిబ్బంది పురుడుపోశారు. బస్సు ప్రయాణంలో ఉండగానే సమాచారం అందించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇరాని జాస్ని అనే గర్భిణి తన భర్త రాజు, బంధువులతో కలిసి హైదరాబాద్ నుంచి బిలాస్పూర్ ప్రాంతానికి ఓ ప్రైవేటు బస్సులో బయలు దేరారు. బస్సు పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ప్రాంతానికి చేరుకోగానే పురిటినొప్పులు అధికమయ్యాయి. దీంతో బంధువులు 108 వాహన సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బస్సులోనే పురుడపోశారు. ఇరాని జాస్నిని మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. అయితే, భర్త, బంధువుల విజ్ఞప్తి మేరకు బస్సును గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్సతికి 108 సిబ్బంది షబ్బీర్, అభిరామ్ తరలించారు. వైద్యులు మేథన, రాణి, నర్సింగ్ అధికారి రజిత కలిసి తల్లిబిడ్డలకు వైద్యం అందిస్తున్నారు.
పురుడుపోసిన సిబ్బంది
తల్లీబిడ్డలు క్షేమం


