నేడు విధుల్లో చేరనున్న కలెక్టర్‌ సంగ్వాన్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు విధుల్లో చేరనున్న కలెక్టర్‌ సంగ్వాన్‌

Nov 10 2025 7:30 AM | Updated on Nov 10 2025 7:30 AM

నేడు

నేడు విధుల్లో చేరనున్న కలెక్టర్‌ సంగ్వాన్‌

నేడు విధుల్లో చేరనున్న కలెక్టర్‌ సంగ్వాన్‌ పౌరులందరికీ సమాన న్యాయం మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు బ్రేక్‌ క్రీడలతో మానసికోల్లాసం

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సోమవారం తిరిగి విధుల్లో చేరనున్నారు. ఆయన వారం రోజుల పాటు లండన్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జి కలెక్టర్‌గా నిజామాబాద్‌ కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి బాధ్యతలు నిర్వహించారు. లండన్‌ పర్యటనను ముగించుకుని వచ్చిన సంగ్వాన్‌.. సోమవారం తిరిగి విధుల్లో చేరనున్నారు. ఆయన ప్రజావాణిలో పాల్గొంటారని అధికార వర్గాల ద్వారా తెలిసింది.

జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి నాగరాణి

మాచారెడ్డి: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి పేర్కొన్నారు. మాచారెడ్డి మండలంలోని గజ్యనాయక్‌ తండా రైతు వేదికలో ఆదివారం ఏర్పాటు చేసిన న్యాయసలహా సదస్సుకు ఆమె హాజరై ప్రసంగించారు. పౌరులందరికీ సమాన న్యా యం అందించేందుకు లీగల్‌ ఎయిడ్‌ క్యాంపులు, లోకల్‌ అదాలత్‌లు చట్టాలపై అవగాహన కల్పిస్తాయన్నారు. కార్యక్రమంలో కా మారెడ్డి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నంద రమేశ్‌, ఐసీఎఫ్‌ఏఐ న్యాయ కళాశాల ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.

రెండ్రోజులపాటు నిలిపివేత

నిజాంసాగర్‌(జుక్కల్‌): సింగూరు ప్రాజెక్టు వాటర్‌ గ్రిడ్‌ పంపుహౌస్‌ల మరమ్మతు నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటర్‌గ్రిడ్‌ పంపుల మరమ్మతుల కారణంగా 740 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. జుక్కల్‌, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్‌ నియోజకవర్గాల పరిధిలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, పంచాయతీ అధికారులు బోరుమోటార్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని మిషన్‌ భగీరథ ఏఈఈ రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు.

మోపాల్‌: క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని బీసీ గురుకులాల డిప్యూటీ సెక్రెటరీ తిరుపతి తెలిపారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలంలోని కంజర్‌ శివారులో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో అండర్‌–14, 19 ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ క్రీడలతో శారీరక దారుఢ్యం మెరుగుపడుతోందన్నారు. ప్రతి విద్యార్థి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌సీవో సత్యనాథ్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ మురళి, శంకర్‌ పాల్గొన్నారు.

నేడు విధుల్లో చేరనున్న కలెక్టర్‌ సంగ్వాన్‌
1
1/2

నేడు విధుల్లో చేరనున్న కలెక్టర్‌ సంగ్వాన్‌

నేడు విధుల్లో చేరనున్న కలెక్టర్‌ సంగ్వాన్‌
2
2/2

నేడు విధుల్లో చేరనున్న కలెక్టర్‌ సంగ్వాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement