సర్కారు వైద్యం సామాన్యులకు దూరం
నూతిబందలో పోస్టర్ను ఆవిష్కరిస్తున్న నాయకులు, గ్రామస్తులు
రూడకోటలో సంతకాలు సేకరిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు
గలగండలో పోస్టర్ను ఆవిష్కరిస్తున్న వైఎస్సార్సీపీ నేతలు, గ్రామస్తులు
ముంచంగిపుట్టు: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మండలంలోని పెదగూడ పంచాయతీ గలగండ, సారధి గ్రామాల్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలోని ఎంపీటీసీ సభ్యుడు టి.గణపతి సారథ్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యుడు గణపతి మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో సామాన్యులకు సర్కారు వైద్యం, విద్య దూరమవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ యోచనను విరమించుకోవాలన్నారు. వైఎస్సార్సీపీ పంచాయతీ అధ్యక్షుడు కూడా దాసు, నాయకులు కృష్ణారావు, రవి, చిరంజీవి, అప్పలరాజు, రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పెదబయలు: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మజ్జి చంద్రుబాబు ఆధ్వర్యంలో మండలంలోని రూడకోట పంచాయతీలో పలు గ్రామాల్లో ఆదివారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వివరించి, సంతకాలు చేయించారు. ఈ సందర్భంగా మజ్జి చంద్రుబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి పేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణ చేయడం వలన వైద్యం పేదలకు దూరం చేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరకు అసెంబ్లీ గ్రీవెన్స్ అధ్యక్షుడు సందడి కొండబాబు, మాజీ సర్పంచులు సుబ్రహ్మణ్యం, బొంజుబాబు, నాయకులు కొండపడాల్, కన్నయ్య, నాగరాజు, సూర్యారావు, గణేష్, రామ్మూర్తి, మోహనరావు, భూప్పన్న, భీమన్న, జగ్గరావు, హరిబాబు, సత్యనారాయణ, సుబ్బరావు, వెంకటరావు పాల్గొన్నారు.
జి.మాడుగుల: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మండలంలో లువ్వాసింగి పంచాయతీ బొండపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ గబ్బాడి పండుదొర సారథ్యంలో ఆదివారం కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం జరిగింది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన జరగనున్న నష్టాలను గ్రామస్తులకు వివరించారు.ఈ సందర్భంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రంలో మంజూరైన వైద్య కళాశాల చిత్రాలతో రూపొందించి కరపత్రాలను ఆవిష్కరించారు. నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
చింతపల్లి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ లంబసింగి మాజీ సర్పంచ్, జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షుడు కొర్రా రఘురాం ఆధ్వర్యంలో లంబసింగి పంచాయతీ పరిధి నూతిబంద గ్రామంలో కోటి సంతకాలు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకు అన్ని విధాలుగా వైద్య సౌకర్యం అందుబాటులలో ఉంచడంతో పాటు నిరుపేద విద్యార్థులకు వైద్య విద్యను అందించే విధంగా ప్రభుత్వ వైద్య కళాశాలలను మంజూరు చేశారన్నారు. జగన్కు మంచి పేరును తుడిచి పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలతో ఆయా కళాశాలలను ప్రైవేట్ పరంగా చేయాలని ఆలోచన చేయడం దారుణం అన్నారు. ఈ ప్రయివేటీకరణ ఉత్తర్వులు రద్దు చేసే వరకూ పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ కొర్రా శాంతి కుమారి, ఎంపీటీసీ సభ్యులు రావులు నాగమణి, నాయకులు నూకరాజు, లోవరాజు పాల్గొన్నారు.
గంగవరం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీసీ మండల అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మండలంలోని ఆర్.డి.పురం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ విభాగ అధ్యక్షుడు తాతపూడి ప్రకాశ్ , మండల పార్టీ అధ్యక్షుడు యెజ్జు వెంకటేశ్వరరావు, మొల్లేరు గ్రామ సర్పంచ్ కుంజం లక్ష్మి తదితరులు ప్రసంగించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ అనంతబాబు, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ఆదేశాల మేరకు మండలంలో ప్రతీ గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు.ప్రజలంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. నాయకులు జగదీష్, ఆకుల అప్పారావు, మేడిశెట్టి శ్రీను, చంటి, ఎం.శ్రీను, వీరబాబు, సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ, రచ్చబండ
గిరిజనుల అనూహ్య స్పందన
తరలివచ్చిన పార్టీ శ్రేణులు
సర్కారు వైద్యం సామాన్యులకు దూరం
సర్కారు వైద్యం సామాన్యులకు దూరం
సర్కారు వైద్యం సామాన్యులకు దూరం
సర్కారు వైద్యం సామాన్యులకు దూరం
సర్కారు వైద్యం సామాన్యులకు దూరం


