రాజన్న సన్నిధిలో రద్దీ
వేములవాడ: రాజన్న క్షేత్రంలోని ఆలయాలు ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. కార్తీకమాసం కొనసాగుతుండటంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివచ్చారు. చలిని సైతం లెక్కచేయకుండా ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో కార్తీకదీపాలు వెలిగించారు. అనంతరం భీమన్న గుడిలో అభిషేకాలు, అన్నపూజలు, కోడె మొక్కులు, కుంకుమపూజ తదితర మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
రాజన్న సన్నిధిలో రద్దీ
రాజన్న సన్నిధిలో రద్దీ


