ఉత్తమ అవార్డులతో పూర్వవిద్యార్థుల సమ్మేళనం
సాక్షి, చైన్నె : ఉత్తమ సేవా అవార్డులతో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఆదివారం వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్లో జరిగింది. వీఎంసీసీ హాల్లో జరిగిన సిల్వర్ జూబ్లీ వేడుకలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2025 అవార్డుల ప్రదానోత్సం జరిగింది. తమ విద్యా సంస్థతో ఉన్న అనుబంధాలను ఈసందర్భంగా పూర్వ విద్యార్థులు పంచుకున్నారు. 400 మందిపూర్వ విద్యార్థులు తరలి వచ్చి నాటి జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు. ఆ విద్యా సంస్థ ఛాన్సలర్ డాక్టర్ ఎఎస్ గణేషన్, ఉపాధ్యక్షురాలు అనురాధాలు పూర్వ విద్యార్థులను ఆహ్వానించడమే కాకుండా వారిని ఉత్తమ అవార్డులో సత్కరించారు. విభిన్న వృత్తులు,రంగాలలో ఉన్న పూర్వ విద్యార్థులు తమ విజయ గాథలను, అనుభవాలను, ప్రోత్సాహకర అంశాలను ఈసమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు, ఆహుతులను ఆకట్టుకున్నాయి.


