తండ్రిపై తనయుడి దాడి
మెట్పల్లి: పట్టణంలోని బోయవాడకు చెందిన ఎల్ల గంగనర్సయ్య (75)పై అతని కుమారుడు అన్వేష్ దాడికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. గంగనర్సయ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు అన్వేష్ ఉన్నారు. కుమారుడు కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. గత ఫిబ్రవరిలో తల్లిపై దాడికి పాల్పడడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి అతడిని రిమాండ్కు తరలించారు. కొన్నిరోజులకు బెయిల్పై బయటకు వచ్చాడు. అప్పటినుంచి ఇంటి వద్దనే ఉంటున్న అతను.. ఆదివారం తండ్రిపై ఒక్కసారిగా కర్రతో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనలో గంగనర్సయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలించారు.
డివైడర్ను ఢీకొట్టిన కారు
సిరిసిల్ల అర్బన్: పట్టణ పరిధిలోని చంద్రంపేట చౌరస్తా వద్ద శనివారం అర్ధరాత్రి కారు డివైడర్ను ఢీకొట్టింది. అతివేగంగా వచ్చిన కారు డివైడర్ను డీకొట్టడంతో డివైడర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికై నా గాయాలయ్యాయా అనేది తెలియరాలేదు. చంద్రపేంట చౌరస్తా వద్ద తారురోడ్డుపై భారీ గుంతలు ఉండటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.
యువకుడి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): అనారోగ్య సమస్యలు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లెలో ఆదివారం జరిగింది.. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఎడ్ల వెంకటేశ్ (23) కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడతున్నాడు. మనస్తాపానికి గురై ఆదివారం గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి తల్లి వసంత, సోదరుడు అనిల్ ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
తండ్రిపై తనయుడి దాడి
తండ్రిపై తనయుడి దాడి


