Archive Page | Sakshi
Sakshi News home page

Andhra Pradesh

  • సాక్షి, తాడేపల్లి: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధించిన సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు మొత్తం టీమ్ ఇండియాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.  
     

    అద్భుతమైన ఆటతీరు కనబరిచిన అభి, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లకు ప్రత్యేక అభినందనలు. దేశం అంతా గర్వపడే లాంటి విజయం సాధించారు. ఈ గెలుపు ప్రతి భారతీయుడి హృదయాన్ని ఆనందంతో నింపింది అని పేర్కొన్నారు. భారత్ జట్టు కృషి, పట్టుదల, జట్టు స్పూర్తి వల్లే ఈ విజయాన్ని సాధించగలిగిందని జగన్ అన్నారు. ఈ విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.  

     

  • రాజమహేంద్రవరం:  కల్తీ పాల ఘటనలో మరొకరు మృత్యువాత పడ్డారు. రాజమండ్రి శివారు లాలాచెరువు ప్రాంతానికి చెందిన శానాపతుల రామలక్ష్మి(73) మృతి చెందారు. ఈరోజు(ఆదివారం, మార్చి 8వ తేదీ) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణం కోల్పోయారు. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి డెల్టా హాస్పిటల్‌లో రామలక్ష్మి చికిత్స పొందుతున్న ఆమె.. ఈరోజు తుది శ్వాస విడిచారు. 

    దాంతో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరింది. అయితే అనధికారికంగా మృతుల సంఖ్య 12గా ఉంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఐదుగురు రోగులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి ఆందోళనగా ఉన్నట్లు తెలుస్తోంది.  వీరిలో ముగ్గురు చిన్నారులున్నారు. 

    కాగా, రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి 21 మంది ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే.  కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురై, నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో రోజుకొకరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.  రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూండటం.. బాధిత కుటుంబాలను తీరని విషాదంలో ముంచుతోంది. 

    మరోవైపు చికిత్స పొందుతున్న వారి పరిస్థితి సైతం విషమంగానే ఉంది. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. అయితే, వారి విషయంలో విశాఖపట్నం, హైదరాబాద్‌ నుంచి వచ్చిన నిపుణులు సైతం ఇప్పటికే చేతులెత్తేశారు. ప్రస్తుతం జరుగుతున్న చికిత్సే కొనసాగించాలంటూ ఉచిత సలహా ఇచ్చి వెనుదిరిగారు. తాజాగా మరొకరు మృతి చెందడంతో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 

  • సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి రూరల్ బొమ్మూరు విద్యుత్ శాఖ స్టోర్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. స్క్రాప్ ఉంచిన గదిలో మంటలు చెలరేగాయి. స్క్రాప్, సామాగ్రీ దహనమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్‌ కారణంగానే మంటలు వ్యాపించాయని ప్రాథమికంగా భావిస్తున్నారు.

    ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఫైర్ ఇంజిన్లతో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు వ్యాపించకుండా అదుపుచేశారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.ప్రమాదం కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యగా బొమ్మూరు విద్యుత్ కేంద్రం నుండి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు బొమ్మూరు నుంచే విద్యుత్ సరఫరా జరుగుతుంది.

  • కంకిపాడు: కృష్ణా జిల్లాలోని కంకిపాడులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇరు వర్గాల వార్‌ రచ్చకెక్కింది. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటే తమకు ఇవ్వడం లేదంటూ జనసేనలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. 

    చింతకింద సునీల్‌, మేక స్వాతి తేజ్‌ల మధ్య వివాదం రాజుకుంది. ఫ్లెక్సీ ఏర్పాటు విషయమై రగడ చోటు చేసుకుంది. బ్యానర్లు కట్టుకోవడాని తనకు అనుమతి ఇవ్వకపోవడం జనసేనకు చెందిన స్వాతీ తేజ్‌ మండిపడ్డారు.  పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

     


     

  • సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా మహిళా నేతలు ఆర్కే రోజా, వరుదు కల్యాణి, కల్పలతారెడ్డి, మేయర్ భాగ్యలక్ష్మి సహా పార్టీ మహిళా ముఖ్య నేతలు కేట్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్,  అన్ని జిల్లాల మహిళా అధ్యక్షులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. 

Movies

  • ఒకప్పుడు రీమేక్ హక్కులు దక్కించుకోవడం అంటే నిర్మాతలు గర్వంగా చెప్పుకునేవారు.అది వారకి ఎంతో గర్వకారణం. మినిమం గ్యారెంటీ అనే భరోసా కూడా ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఒక సినిమా రీమేక్ చేస్తున్నారని తెలిసిన వెంటనే ప్రేక్షకులు ఒరిజినల్ వెర్షన్‌ను చూసి పోల్చడం అలవాటుగా మారింది. దాంతో ఈ పోలికల్లో సినిమాలోని లోపాలు ఎక్కువగా బయటపడటంతో రీమేక్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమవుతున్నాయి.  

    ఇటీవల సూర్య హీరోగా నటిస్తున్న ‘విశ్వనాధ్ అండ్ సన్స్’ చిత్ర యూనిట్ తమ సినిమా మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ నటించిన కంగారూ రీమేక్ అని వచ్చిన ప్రచారంతో తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆ సినిమా పోస్టర్లు ఒకేలా కనిపించడంతో ఈ పుకారు మొదలైంది. దాంతో వెంటనే యూనిట్ మీడియా ముందుకు వచ్చింది. తమ సినిమా ఒరిజినల్ కథతో వస్తోందని స్పష్టం చేశారు.  

    అలాగే పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రాజెక్ట్ కూడా మొదటి నుంచి ‘తేరి’ రీమేక్ అని ప్రచారం నడిచింది. ఇప్పుడు విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ దర్శకుడు ప్రతి ఇంటర్వ్యూలోనూ ఇది రీమేక్ కాదని సుదీర్ఘంగా వివరణలు ఇస్తున్నాడు. ప్రేక్షకులు ఇప్పుడు పొరుగు రాష్ట్రంలో హిట్ అయితే ఏంటి గొప్ప? అని ప్రశ్నిస్తున్నారు.సోషల్ మీడియా విజృంభనతో రీమేక్ విషయాలు దాచిపెట్టడం అసాధ్యం అయ్యింది.రీమేక్ అని తెలిసిన వెంటనే ట్రోలింగ్ మరింత పెరిగింది.ఫలితంగా నిర్మాతలు రీమేక్‌లకు పూర్తిగా దూరమవుతున్నారు.  

    ఇప్పుడు ఎక్కడైనా తమ సినిమా రీమేక్ అని ప్రచారం జరిగితే చిత్ర యూనిట్లు వెంటనే మీడియా ముందుకొచ్చి ఖండించడం మొదలుపెట్టాయి. రీమేక్ అనే ముద్ర పడకుండా కిందామీద పడుతున్నారు. మొత్తానికి రీమేక్‌ల కాలం ముగిసింది. ఒరిజినల్ కథలే ఇప్పుడు ప్రేక్షకులను ఆకర్షించే ప్రధాన ఆయుధం.

  • హీరోయిన్ త్రిష రీసెంట్ టైంలో పెద్దగా సినిమాలు చేయలేదు. అయినా సరే సోషల్ మీడియా అంతా ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. విజయ్‌తో ఈమె రిలేషన్‌లో ఉందనే రూమర్సే దీనికి కారణం. ఎక్కడా ఈ విషయాన్ని అధికారికం చేయనప్పటికీ.. దాదాపు అందరూ వీళ్లిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. తమిళ నటుడు పార్తిబన్ కూడా వీళ్ల బంధం గురించి పరోక్షంగా అర్థం వచ్చేలా చిల్లర కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.

    శనివారం రాత్రి చెన్నైలో జరిగిన ఓ అవార్డ్ వేడుకలో నటుడు దర్శకుడు పార్తిబన్, త్రిష గురించి మాట్లాడుతూ.. ఆమె ఇంట్లో ఉంటేనే మంచిది. బయటకు వస్తే ఎక్కడలేని సమస్యలన్నీ వస్తున్నాయి అని అన్నాడు. ఈ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలోనూ గట్టిగానే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడీ విషయం కాస్త త్రిష వరకు చేరడంతో ఆమె కుడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్తిబన్‌కి అసలు బుర్ర లేదనేలా రాసుకొచ్చింది.

    'ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నా పేరు, ఫొటో చేర్చుతున్నామని చివరి నిమిషంలో నిర్వాహకులు సమాచారం ఇచ్చారు. ఓ వ్యక్తి తన సహాయుకుడిని పంపించి నన్ను అడిగారు. అయితే మైక్రోఫోన్‌లో మాట్లాడినంత మాత్రాన అది తెలివైన వ్యాఖ్య లేదా కామెడీనో అవదు. అది కేవలం మూర్ఖత్వాన్ని ఎక్కువ వినిపించేలా చేస్తుంది. జ్ఞానం లేకుండా మాట్లాడే అసభ్య పదాలు, అవి ఎవరిని లక్ష‍్యంగా చేసుకున్నాయో అనేదాని కంటే మాట్లాడిన వ్యక్తి తత్వాన్ని బయటపెడతాయి' అని త్రిష ట్వీట్ చేసింది. పార్తిబన్‌కి అసలు బుర్ర లేదు అని అర్థం వచ్చేలా త్రిష రాసుకొచ్చింది.

  • మహేశ్ బాబు ప్రస్తుతం 'వారణాసి' సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఈ హీరో కొడుకు కూడా యాక్టర్ అయిపోయాడు. షార్ట్ ఫిల్మ్‌లో నటించేశాడు. పెద్దగా హడావుడి లేకుండానే దీన్ని యూట్యూబ్‌లో రిలీజ్ చేసేశారు. సోషల్ మీడియాలో దీని గురించి ఇంకా ఎవరికీ తెలియకపోవడంతో వైరల్ కాలేదు. ఇంతకీ గౌతమ్ ఎలా నటించాడు? షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ ఏంటంటే?

    (ఇదీ చదవండి: పెళ్లి వద్దన్నాడు, ఆరోజు బోరున ఏడ్చాడు: విజయ్‌ మేనమామ)

    ఇక్కడ చదువు పూర్తి చేసిన గౌతమ్.. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు తన స్నేహితులతో కలిసి సోషల్ మీడియాలో కనిపిస్తుంటాడు. ఇప్పుడు తన ఫ్రెండ్ అలెక్స్ లక్ష‍్మి తీసిన '14 డేస్' షార్ట్ ఫిల్మ్‌లో లీడ్ రోల్ చేశాడు. అనూశే ధనేని హీరోయిన్‌గా చేసింది. ఇందులో గౌతమ్‌తో పాటు మరో నాలుగు పాత్రలే కనిపించాయి.

    కాన్సెప్ట్ విషయానికొస్తే.. కిడ్నాప్ అయిన తన ప్రియురాలి కోసం ఆలోచిస్తూ గౌతమ్ ఎలా బాధపడ్డాడు? కిడ్నాపర్‌ని ఎలా పట్టుకున్నాడనేది మూడు నిమిషాల 20 సెకన్ల షార్ట్ ఫిల్మ్‌లో చూపించారు. గౌతమ్ వరకు యాక్టింగ్ పర్లేదు. టెన్షన్ లాంటివి బాగానే చూపించాడు. అయితే ఈ షార్ట్ ఫిల్మ్‌లో స్టోరీని పూర్తి చేయలేదు. మధ్యలోనే వదిలేసినట్లు అనిపించింది. దీనికి కొనసాగింపుగా ఉందా? లేదా ఇంతేనా అనేది తెలియాల్సి ఉంది.

    (ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!)

  • చీరలో అందంగా హీరోయిన్ రాశీఖన్నా

    రెడ్ డ్రస్‌లో మరింత గ్లామర్‌తో నేహాశెట్టి

    అందంతో మాయ చేస్తున్న రిద్ధి కుమార్

    మట్టి కుండలు చేస్తూ బిజీగా యుక్తి తరేజా

    చీరలో నందితా శ్వేత అందాల ఆరబోత

    ఉమెన్స్ డే స్పెషల్ వీడియోతో అనన్య
     

  • టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్‌ ఓ నెటిజన్‌కు ఇచ్చిపడేసింది. తన క్యారెక్టర్‌ను టార్గెట్‌ చేస్తూ పోస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందు నీ వద్ద ప్రూఫ్స్ ఉంటే బయటపెట్టాలని అతనికి గడ్డిపెట్టింది. నాకు రిలేషన్స్‌ ఉన్నా.. లేకపోయినా.. నన్ను వేధించే హక్కు ఎవరికీ లేదని మండిపడింది. ఒక వేళ నేను  పెళ్లి చేసుకునే వరకు ఎంతమందితో తిరిగినా అది మీ సమస్య కాదంటూ హితవు పలికింది. మహిళ దినోత్సవం రోజే యాంకర్‌ రష్మి వేధింపులకు గురికావడం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

    రష్మీ గౌతమ్ తన ట్వీట్‌లో రాస్తూ..'ముందు రుజువులు చూపించు. రెండోది.. నాకు ఎన్ని సంబంధాలు ఉన్నా లేకపోయినా.. నాపై వేధింపులు పాల్పడే  హక్కు ఎవరికీ లేదు. నేను నిన్ను లేదా మీ తండ్రిని లేదా మీ కొడుకును వివాహం చేసుకునే వరకు ఎంతమందితో తీరిగినా అది మీ సమస్య కాదు. అలాగే నాకు ఎవరితో లింక్ ఉందో దయచేసి వాలా పేర్లు ప్రూఫ్‌తో సహా చెప్పండి. నా ఒక్క పేరు ఎందుకు. మీరు ఎవరి క్యారెక్టర్‌నైనా కించపరచాలనుకుంటే ఇద్దరి పేర్లు బయట పెట్టండి. అది న్యాయం' నెటిజన్‌కు ఫుల్‌గా గడ్డిపెట్టేసింది.

     

  • తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులుగా వీఎన్ ఆదిత్య ఎన్నికయ్యారు. ఇవాళ హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్‌గా సముద్ర ఎంపిక కాగా.. ప్రధాన కార్యదర్శిగా రామారావు.. ట్రెజరర్‌గా దర్శకుడు సాయి రాజేశ్ గెలిచారు.

    ఈ సందర్భంగా డైరెక్టర్స్ అసోసియేషన్ అభివృద్ధి కోసం కృషి చేస్తామని నూతన అధ్యక్షులు వి ఎన్ ఆదిత్య తెలిపారు. మేము చేసిన వాగ్దానాలు అన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అసోసియేషన్ సభ్యులకు ఆరోగ్య భద్రత, సినిమా నిర్మాణంలో సహాయం చేస్తామని వెల్లడించారు. మా ప్యానెల్‌లో 18మంది పోటి చేస్తే 16 మంది గెలిచారని అన్నారు. నన్ను డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
     

  • తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 'గద్దర్ అవార్డులు-2025'లో 'దండోరా' సినిమా సత్తా చాటింది. మూడు విభాగాల్లో అవార్డుల్ని దక్కించుకుంది. ర‌వీంద్ర బెన‌ర్జీ నిర్మాణంలో మురళీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి తదితరులు ప్రధాన పాత్రలు చేశారు. తమ సినిమాకు ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు, ఇచ్చిన గుర్తింపు సందర్భంగా ఆదివారం నాడు థాంక్స్ చెబుతూ మీడియా సమావేశం నిర్వహించారు.

    (ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!)

    మా 'దండోరా' సినిమాని గుర్తించి అవార్డుల్ని ఇచ్చిన జ్యూరీకి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈ మూవీ ఇంకా చాలా దూరం వెళ్తుందని నమ్ముతున్నాను. ఇక్కడితో ఆగే సినిమా అయితే కాదు. మున్ముందు చాలా అవార్డులు వస్తాయని ఆశిస్తున్నానని నటుడు శివాజీ అన్నారు.

    ముందు నుంచీ మా సినిమాని సపోర్ట్ చేసిన మీడియాకి థాంక్స్. మాకు ఈ గుర్తింపు, అవార్డుల్ని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి థాంక్స్. గద్దర్ అన్న పాటలు చిన్నప్పటి నుంచి వింటూ ఉండేవాడ్ని. ఈ రోజు గద్దర్ అవార్డుల్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డ్ రావడం నాకు పెద్ద గౌరవం లాంటిది అని సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ చెప్పుకొచ్చాడు.

    (ఇదీ చదవండి: త్రిషపై చిల్లర కామెంట్స్.. నోరు జారిన సీనియర్ నటుడు)

  • చాలామంది పెళ్లంటేనే జంకుతారు. మ్యారేజ్‌ అనేది మాకు సెట్టవదు, దాని జోలికి వెళ్లమని బీరాలు పలుకుతారు. కానీ అందరికంటే ముందు వారే పెళ్లిపీటలెక్కుతారు. హీరో విజయ్‌ దేవరకొండ విషయంలోనూ ఇదే జరిగింది. వివాహం అంటే నాలుగడుగులు వెనక్కు వేసే విజయ్‌ ఫిబ్రవరి 26న రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు. అయితే గతంలో మాత్రం తనకు పెళ్లి సెట్‌ అవదని అంటుంటేవాడని విజయ్‌ మేనమామ, నటుడు, నిర్మాత యశ్‌ రంగినేని చెప్తున్నాడు.

    పెళ్లి వద్దని..
    తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన విజయ్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. యశ్‌ రంగినేని మాట్లాడుతూ.. విజయ్‌ పెళ్లి గురించి పాజిటివ్‌గా ఉండేవాడు కాదు. కెరీర్‌ చూసుకోకుండా పెళ్లి అవసరమా? అనేవాడు. కానీ, రష్మిక పరిచయమయ్యాక అతడి ఆలోచన విధానమే మారిపోయింది. డియర్‌ కామ్రేడ్‌ నుంచి విరోష్‌ (విజయ్‌- రష్మిక) మధ్య ప్రేమ మొదలైంది. 

    ఇంట్లో చెప్పగానే..
    ఇప్పుడు వాళ్లిద్దరినీ జంటగా చూస్తుంటే చూడముచ్చటగా అనిపిస్తుంది. విరోష్‌ పెళ్లి పట్ల మేమంతా సంతోషంగా ఉన్నాం. విజయ్‌.. రష్మికతో ప్రేమలో ఉన్నానని చెప్పినప్పుడు ఇంట్లో కొంత కంగారుపడ్డారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక గొడవ(విడాకులు) జరుగుతూనే ఉంది. ఆ భయమైతే మా అందరిలో ఉంది. విజయ్‌ అమ్మానాన్న ఈ విషయం గురించి మాట్లాడారు. కానీ రష్మిక చాలా మంచి అమ్మాయి. 

    తలరాత చెప్పలేం
    ఈ జంటను చూస్తే తర్వాతెలా ఉంటారో? ఏంటో? అన్న అనుమానమే రాదు. వాళ్లిద్దరి మధ్య అంత మంచి అనుబంధం ఉంది. జంటగా సంతోషంగా ఉన్నారు. కానీ, తలరాత ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అయితే ఇద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలన్నదే మా అందరి కోరిక. విజయ్‌ను రౌడీ బాయ్‌లా చూస్తారు. కానీ తను చాలా ఎమోషనల్‌. టాక్సీవాలా రిలీజ్‌కు రెండురోజుల ముందే సినిమా మొత్తం లీకైంది. 

    దుఃఖం ఆపుకోలేక..
    ఆ విషయం తెలిసి విజయ్‌ బోరున ఏడ్చాడు. ఇక రిలీజ్‌ చేయడం వృథా అనుకుంటున్న సమయంలో విజయ్‌ పోరాడి సినిమాను విడుదల చేయించాడు. తీరా అది పెద్ద హిట్టయింది. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇంత ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకున్నాడు. ఎవరైనా ఏదైనా సాధించొచ్చు అని ఈ జనరేషన్‌కు ఒక నమ్మకాన్ని తీసుకొచ్చాడు అని యశ్‌ చెప్పుకొచ్చాడు.

    చదవండి: ఆ ఫోన్‌ రాకపోయుంటే చనిపోయేవాడిని: నాగమణికంఠ

  • పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్! ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. లెక్క ప్రకారం ఈ నెల 26న థియేటర్లలోకి రావాలి. కానీ ఓ వారం ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా 19నే రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్‌గానే ప్రకటించారు. కానీ ప్రీమియర్ల విషయంలో మాత్రం మూవీ టీమ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?

    'గబ్బర్ సింగ్' తర్వాత పవన్-హరీశ్ శంకర్ కలిసి చేసిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. చాన్నాళ్ల క్రితం ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. గతేడాది చివరలో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. 18వ తేదీన రాత్రి ప్రీమియర్లు వేయాలని తొలుత అనుకున్నారు కానీ డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన మేరకు నిర్మాణ సంస్థ.. ప్రీమియర్ల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 19న ఉదయం 7 గంటల నుంచి మాత్రమే రెగ్యులర్ షోలు వేయాలని నిర్ణయించుకున్నారట.

    (ఇదీ చదవండి: త్రిషపై చిల్లర కామెంట్స్.. నోరు జారిన సీనియర్ నటుడు)

    ప్రీమియర్ల విషయంలో 'ఉస్తాద్' వెనక్కి తగ్గటానికి బజ్ ఏమైనా కారణమా అనిపిస్తుంది. ఎందుకంటే దీనిపై ప్రస్తుతానికి ఓ మాదిరి హైప్ మాత్రమే ఉంది. రెండు పాటలు రిలీజైనప్పటికీ అవేం పెద్దగా మ్యాజిక్ చేయలేదు. ట్రైలర్ వచ్చిన తర్వాతే మూవీ చూడాలా వద్దా అని చాలామంది ఆడియెన్స్ ఓ అంచనాకు రావొచ్చు. దీనితో పాటే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్న డబ్బింగ్ సినిమా 'ధురంధర్ 2'పై హైప్ బాగానే ఉంది.

    'ధురంధర్ 2' ప్రీమియర్ షోలు.. 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ కానున్నాయి. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేశారు. మిగతా నగరాల కంటే హైదరాబాద్‌లోనే టికెట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. దీని రన్ టైమ్ దాదాపు 4 గంటలు. పోలిక అని చెప్పలేం కానీ 'ధురంధర్ 2' ప్రీమియర్ చూసిన తర్వాత ప్రేక్షకుడు.. 'ఉస్తాద్' ప్రీమియర్ అంటే ఆసక్తి చూపిస్తాడా అంటే సందేహమే. బహుశా ఈ కారణాల వల్లే 'ఉస్తాద్'.. ప్రీమియర్ల రిస్క్ తీసుకోవట్లేదా అనిపిస్తోంది.

    (ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్)

  • యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ తన అభిమానుల గురించి మాట్లాడారు. బెంగళూరులో ఓ ఆ‍స్పత్రి కార్యక్రమానికి హాజరైన ఎన్టీఆర్‌ తన ఫ్యాన్స్‌కు జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని సూచించారు. నా కుటుంబంలో జరిగినట్లుగా ఎవరికీ జరగకూడదని అన్నారు. ఇంతలా నాకు ప్రేమ అందించిన మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని తెలిపారు.

    ఎన్టీఆర్ మాట్లాడుతూ..' నా కోసం వచ్చిన అభిమాన సోదరులందరికీ నా ధన్యవాదాలు. మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. మా ఇంట్లో జరిగిన దుర్ఘటన మీకెవరికీ జరగకూడదని కోరుకుంటున్నా. ఈ ప్రేమని నాకు అందించినందుకు ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటా. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా' అని అన్నారు.

    ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో పనిచేస్తున్నారు. ఈ మూవీకి డ్రాగన్‌ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే జోర్డాన్‌లో పూర్తి చేశారు. ఈ షూట్‌లో ఎన్టీఆర్‌పై యాక్షన్ సీక్వెన్స్‌ తెరకెక్కించారు. అమెరికా- ఇరాన్‌ యుద్ధానికి ముందే డ్రాగన్‌ టీమ్ ఇండియాకు చేరుకుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ డ్రాగన్‌ లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

  • ఉలిశెట్టి శ్రీనివాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'రాయుడు గారి తాలూకా’. మార్చి 6న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ లభించింది. ఈ నేపథ్యంలో  ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకుంది. ఈ చిత్రానికి ఉలిశెట్టి శ్రీనివాస్ హీరోగా నటించడమే కాకుండా, స్వయంగా కథ, కథనం, మాటలను అందించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. 

    సినిమాకు వస్తున్న ఆదరణ చూసి చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. సక్సెస్ మీట్‌లో పాల్గొన్న టీం సభ్యులు మాట్లాడుతూ.. "మంచి కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించింది. మార్చి 6 నుంచి అన్ని సెంటర్లలో వస్తున్న పాజిటివ్ టాక్ మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది" అని తెలిపారు.

  • ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌ అంటూ ఎదురుచూసేవాళ్లు చాలామంది! ఆ ఛాన్స్‌ దొరక్క ఇక జీవితంపై ఆశలు వదిలేసుకుని తనువు చాలించాలనుకున్నాడు నాగమణికంఠ. అలాంటి సమయంలో బిగ్‌బాస్‌ షో నుంచి పిలుపు వచ్చింది. మళ్లీ గుండె నిండా ఆత్మవిశ్వాసం నింపుకుని షోలో అడుగుపెట్టాడు. ఒక్క పాటతో ఫుల్‌ ట్రోల్‌ అయ్యాడు. కానీ, తర్వాత నెమ్మదిగా ప్రేక్షకుల ఆదరణ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బీబీ జోడీ డ్యాన్స్‌ షోలో పార్టిసిపేట్‌ చేస్తున్నాడు.

    రెండేళ్లపాటు..
    ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ.. మనలో వచ్చే నెగెటివ్‌ ఆలోచనలను అక్కడే చంపేయాలి. రెండేళ్లపాటు నేనేం సంపాదించలేదు, ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు. ఇక అయిపోయిందిరా భయ్‌ అనుకున్నాను. ఆ 10 నిమిషాల్లో నాకు ఫోన్‌కాల్‌ రాకపోయుంటే నా జీవితం ముగిసిపోయేది. సరిగ్గా అదే సమయంలో బిగ్‌బాస్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. 

    ఏడ్చేసిన సదా
    అప్పుడు కన్నీళ్లు తుడుచుకుని ఇంటర్వ్యూకి వెళ్లాను అని పేర్కొన్నాడు. నీ వెనక ఇలాంటి గతం ఉందని తెలీదు, నాకు చాలా బాధగా అనిపిస్తోందంటూ నటి సదా కన్నీళ్లు పెట్టుకుంది. కాగా నాగమణికంఠ సీరియల్‌ నటుడు. చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో తల్లి రెండో పెళ్లి చేసుకుంది. కానీ, అతడిని తండ్రిగా స్వీకరించలేకపోయాడు. 

    బిగ్‌బాస్‌ షోతో గుర్తింపు
    ఇంతలో తల్లి క్యాన్సర్‌తో 2019లో మరణించింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేసిన అతడు మంచి ఉద్యోగం సంపాదించాడు. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు. కూతురు పుట్టడంతో తల్లే తిరిగి వచ్చిందని సంతోషించాడు. కానీ, భార్యాభర్తల మధ్య కలహాలు మొదలవడంతో ఇండియాకు ఒంటరిగా తిరిగొచ్చేశాడు. తెలుగు బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌తో గుర్తింపు పొందాడు.

  • తమిళనాడులో ఓవైపు ఎన్నికల హడావుడి ఉంది. మరోవైపు స్టార్ హీరో విజయ్ వైవాహిక బంధం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. రీసెంట్‌గానే ఇతడి భార్య సంగీత, కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. ఓ నటితో తన భర్తకు అక్రమ సంబంధం ఉందనే కారణాన్ని పిటిషన్‌లో పేర్కొంది. ఇదలా ఉండగానే త్రిషతో కలిసి విజయ్ ఏకంగా ఓ పెళ్లికి వెళ్లడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయింది. వీళ్లిద్దరి మధ్య ఏముందనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇంతలోనే తమిళ నటుడు, దర్శకుడు పార్తిబన్.. త్రిషపై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు.

    (ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్)

    తాజాగా ఓ మూవీ ఈవెంట్‌లో యాంకర్ మాట్లాడుతూ.. త్రిష గురించి అభిప్రాయం చెప్పాలని పార్తిబన్‌ని అడిగింది. 'పొన్నియిన్ సెల్వన్'లోని త్రిష చేసిన కుందవై పాత్రని ప్రస్తావిస్తూ.. 'ఈ కుందవై కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండాలి. బయటకు రావొద్దు. అలా చేస్తే ఇలాంటి సమస్యలు రావు' అని అన్నాడు. అయితే పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు.. త్రిషని అవమానించేలా ఉన్నాయని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆయన సరదాగానే అన్నాడని, మిగతా వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అంటున్నారు.

    ఏదేమైనా పార్తిబన్ లాంటి ఓ సీనియర్ నటుడు, దర్శకుడు.. త్రిష లాంటి హీరోయిన్ గురించి పబ్లిక్‌గా ఇలా మాట్లాడటం సరికాదనే అభిప్రాయం పలువురు నెటిజన్ల నుంచి వ్యక్తమవుతోంది. గతంలోనూ ఈ నటుడు హీరోయిన్ల గురించి నోరు జారిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలో కథ ఉందా? లేదా అనేది ప్రేక్షకులు చూడటం లేదు. హీరోయిన్‌ డ్యాన్స్‌ కోసమే సినిమాలు చూస్తున్నారు. తమన్నా ఉంటే చాలు.. కథ లేకపోయినా ఫర్వాలేదు.. సినిమా హిట్టవుతుంది అని అన్నారు. తర్వాత తన మాటలపై విమర్శలు రావడంతో క్షమాపణ చెప్పుకొచ్చాడు.

    పార్తిబన్ విషయానికొస్తే.. యుగానికి ఒక్కడు, నేనూ రౌడీనే, పొన్నియన్‌ సెల్వన్‌, పొన్నియన్‌ సెల్వన్‌ 2 తదితర సినిమాల్లో నటించాడు. తెలుగులోనూ 'రచ్చ'లో చరణ్ తండ్రిగా చేశాడు. ఇతడు నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే తెలుగు మూవీ త్వరలోనే థియేటర్లలోకి రానుంది. నటి సీతని 1990లో పెళ్లి చేసుకున్న పార్తిబన్.. 2001లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు.

    (ఇదీ చదవండి: విడాకుల గురించి తొలిసారి స్పందించిన విజయ్)

  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గౌరవంపై స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఎలా గౌరవించాలో పదేపదే చెప్పడం తనకు నచ్చదని, ప్రతి పురుషుడు పుట్టుకతోనే ఆ సంస్కారంతో ఉండాలని అన్నారు. ఆదివారం ఆయన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి ప్రారంభోత్సవం కోసం బెంగళూరు వెళ్లారు. ప్రారంభోత్సవం అనంతరం అక్కడి సిబ్బందితో ముచ్చటించారు. ఈ సందర్భంగా మహిళల గౌరవంపై ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది.

     దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే మహిళలను గౌరవించే సంస్కారం ఉండాలని అన్నారు. ‘నా ఇద్దరు కొడుకులను (అభయ్ రామ్, భార్గవ్ రామ్) మహిళలను గౌరవిస్తూ పెరిగేలా నేను కచ్చితంగా చూసుకుంటాను’ అని ఆయన పేర్కొన్నాడు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎంతో హుందాగా వ్యవహరించే ఎన్టీఆర్, మహిళా భద్రత, గౌరవం గురించి ఇంత గొప్ప వ్యాఖ్యలు చేయడం పట్ల నందమూరి అభిమానులతో పాటు సామాన్యులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

    ‘డ్రాగన్‌’ లుక్‌ వైరల్‌
    కాగా, ఎన్టీఆర్‌ బెంగళూరుకు వస్తున్నాడని తెలిసి.. స్థానిక అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.వారిని అభివాదం చేయడానికి ఎన్టీఆర్‌ కారులోంచి బయటికి వచ్చాడు. కారు మీదికి ఎక్కి అభిమానులకు అభివాదం చేశాడు. గాగుల్స్ పెట్టుకుని.. గుబురు గడ్డంతో కనిపించిన తారక్‌ సూపర్ స్టైలిష్‌గా కనిపించాడు.ప్రశాంత్‌ నీల్‌తో చేయబోతున్న డ్రాగాన్‌(వర్కింగ్‌ టైటిల్‌) సినిమా కోసమే ఎన్టీఆర్‌ ఈ లుక్‌లోకి మారాడు. ఇన్నాళ్లు తన లుక్‌ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్న తారక్‌..ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించడంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారింది. 

  • రెండేళ్ల క్రితం వచ్చిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్‌ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ కళాఖండంలో ప్రభాస్‌ హీరోగా అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, కమల్‌ హాసన్‌ ప్రముఖ పాత్రలు పోషించారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రెట్టింపు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1200 కోట్లు వసూలు చేసింది.

    రెమ్యునరేషన్‌కే అంత బడ్జెట్‌
    అయితే ఈ బడ్జెట్‌లో ఎక్కువ భాగం తారల రెమ్యునరేషన్‌కే సరిపోయిందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రభాస్‌ రూ.150 కోట్లు తీసుకోగా అమితాబ్‌, బిగ్‌బీ, దీపికా పదుకొణె చెరో రూ.20 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అంతలోనే సౌత్‌ ఇండియా స్టార్‌ కమల్‌ హాసన్‌ ఏకంగా రూ.100 కోట్ల మేర పుచ్చుకున్నట్లు సోషల్‌ మీడియాలో కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇవేవీ కాదు, అంతకుమించి పారితోషికం తీసుకున్నాడని తమిళ నటుడు యుగి సేతు వెల్లడించాడు.

    10 రోజులకే అన్ని కోట్లా?
    తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కమల్‌ సర్‌ కల్కి సినిమాలో 20 రోజుల కాల్షీట్లకు గానూ రూ.150 కోట్లు తీసుకున్నాడు. ఆయన దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు అని కమల్‌ బర్త్‌డేరోజే చెప్పాను. ఓసారి కల్కి నిర్మాత అశ్వినీదత్‌ను కలిశాను. నా స్నేహితుడిని అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న వ్యక్తిగా మార్చినందుకు థాంక్యూ సర్‌..

    20 రోజులు ఎక్కడ?
    20 రోజులకు రూ.150 కోట్లు ఇచ్చారంటే మామూలు విషయం కాదన్నాను. వెంటనే ఆయన కలగజేసుకుని నాకు 20 రోజులు ఎక్కడిచ్చారు, 10 రోజుల డేట్సే ఇచ్చారు అని చెప్పాడు. అప్పటిదాకా కమల్‌ రోజుకు సుమారు రూ.8 కోట్లు సంపాదించాడనుకున్నాను, కానీ రోజుకు రూ.15 కోట్లు ఇచ్చారని తర్వాతే తెలిసింది అని యుగి పేర్కొన్నాడు.

    సినిమా
    బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన కల్కి 2898 ఏడీకి ప్రస్తుతం సీక్వెల్‌ తెరకెక్కుతోంది. ఫస్ట్‌ పార్ట్‌లో ఉన్న స్టార్‌ నటీనటులందరూ సెకండ్‌ పార్ట్‌లోనూ కనిపించనున్నారు. దీపికా పదుకొణెను మాత్రం సీక్వెల్‌ నుంచి తప్పించారు. ఈ రెండో భాగంలో కమల్‌ హాసన్‌ పోషించిన సుప్రీం యాస్కిన్‌ క్యారెక్టర్‌కు ఎక్కువ నిడివి దక్కనుంది.

    చదవండి: అదృష్టవంతురాలిని.. కన్నీళ్లు ఆగడం లేదు: తనూజ

  • టాలీవుడ్ మోస్ట్ ఫేవరేట్‌ జంట విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. గతనెల ఫిబ్రవరి 26న వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి తర్వాత ఫ్యాన్స్‌కు స్వీట్స్ పంచిన ఈ జంట ప్రత్యేకంగా అన్నదానాలు నిర్వహించారు. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం మార్చి 4న గ్రాండ్ రిసెప్షన్‌ నిర్వహించారు.

    అయితే ఓ చిన్నారి విజయ్ దేవరకొండకు అభిమానినని.. తనను ఎందుకు పెళ్లికి పిలవలేదని ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన హీరో విజయ్.. బుజ్జి తల్లికి రిప్లై ఇచ్చాడు. మా ఇంటికి లంచ్‌కి వచ్చేయ్.. నీకిష్టమైన స్వీట్స్, ఫుడ్‌ ఇంట్లోనే చేయించి వడ్డిస్తానని చిన్నారికి బదులిచ్చాడు. ఇది చూసిన చిన్నారి నన్ను మీ ఇంటికి పిలిచినందుకు థ్యాంక్స్ అంటూ మరో వీడియోను రిలీజ్ చేసింది. హాయ్ విజయ్ దేవరకొండ మామ.. రష్మిక ‍అక్కా.. మీరు నాకు రిప్లై ఇచ్చి.. నన్ను ఇంటికి రమ్మని పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్‌ యూ.. బై బై అంటూ క్యూట్‌గా మాట్లాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 
     

     

  • తెలుగు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థం చేసుకున్నాడు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కావ్యరెడ్డితో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో ఈ శుభకార్యం జరగ్గా.. టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త, దర్శకుడు బోయపాటి శీను తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    (ఇదీ చదవండి: ఓటీటీలో ఫంకీ సినిమా.. స్ట్రీమింగ్‌ తేదీ వచ్చేసింది)

    ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు అయిన సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి చిత్రంలోనే సమంత లాంటి హీరోయిన్‌తో నటించాడు. సక్సెస్ కూడా అందుకున్నాడు. తర్వాత అడపాదడపా మూవీస్ చేశాడు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. 'రాక్షసుడు' అనే రీమేక్ మూవీ హిట్ అయింది. రీసెంట్ టైంలో అయితే భైరవం, కిష్కింధపురి చిత్రాలతో పలకరించాడు. ఇవి బాక్సాఫీస్ దగ్గర ఆడలేదు.

    హీరో బెల్లకొండ శ్రీనివాస్.. ప్రేమలో ఉన్నాడని, నిశ్చితార్థం చేసుకోబోతున్నాడనే విషయం రెండు మూడు రోజుల క్రితం బయటకు వచ్చింది. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఎంగేజ్‌మెంట్ జరిగింది. శ్రీనివాస్‌కి కాబోయే భార్య కావ్యకు ఇండస్ట్రీతో సంబంధం లేదు. ఈమె తాత జడ్జి కాగా తండ్రి లాయర్. వీళ్లది హైదరాబాదే. శ్రీనివాస్, కావ్య కుటుంబాలకు ముందు నుంచే పరిచయం ఉందని అంటున్నారు. మరి కావ్యతో పరిచయం, ప్రేమ ఎలా అనే విషయాల్ని శ్రీనివాసే బయటపెట్టాలి. వీళ్ల పెళ్లి బహుశా ఈ ఏడాదిలోనే ఉండొచ్చు.

    (ఇదీ చదవండి: ప్రేమలో పడ్డ కోర్ట్‌ జంట? రోషన్‌, శ్రీదేవి రియాక్షన్‌ ఇదే!)

  • అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మెగా కోడలు ఉపాసన ప్రత్యేక పోస్ట్ చేసింది. ఈ రోజు నా లైఫ్‌ భిన్నదశల్లో నన్ను నేను అంగీకరించడం కోసమేనని తెలిపింది. ఇలా ఉండడం ఎల్లప్పుడూ సులభం కాదు.. కానీ నా  శ్రేయస్సు, నా కుటుంబం కోసం నా ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా చేసుకోవడంతోనే ప్రేరణ పొందానని ట్వీట్ చేసింది. ఇవాళ మహిళ దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక ఫోటోలను షేర్ చేసింది ఉపాసన.

    కాగా.. ఈ ఏడాది ఉపాసన కొణిదెల కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఉపాసనకు ఇప్పటికే ఓ కూతురు ఉండగా.. ఇటీవల ఓ పాప, బాబుకు జన్మనిచ్చారు. ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి డబుల్ ఆనందాన్ని తీసుకొచ్చారు. రామ్ చరణ్‌కు వారసుడు పుట్టడంతో మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. అపోలో ఆస్పత్రి వద్ద పెద్దఎత్తున సంబురాలు చేసుకున్నారు. 
     

     

  • సెలబ్రిటీలు జనాల అభిమానాన్ని, కోపాన్ని అస్సలు తట్టుకోలేరు. వారి ప్రేమాభిమానాలు చూసి ఆనందభాష్పాలు రాలుస్తారు. కోపంతో దారుణంగా విమర్శించినప్పుడు ఎందుకిలా చేస్తున్నారని బాధతో కన్నీళ్లు పెట్టుకుంటారు. నటి, తెలుగు బిగ్‌బాస్‌ 9వ సీజన్‌ రన్నరప్‌ తనూజ పుట్టస్వామి కూడా ఇప్పుడు సంతోషంతో ఏడ్చేసింది.

    నేనెంత అదృష్టవంతురాలినో..
    ఆ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది. తనను ఎంతగానో ఇష్టపడే ఓ మహిళా అభిమాని తనకోసం డైరీ రాసిందని, దాన్ని చదువుతున్నానని పేర్కంది. నేనెంత అదృష్టవంతురాలినో కదా.. నాకు పుస్తకాలు చదవడమంటే ఇష్టం. ఈసారి ఎంతో ప్రత్యేకమైన పుస్తకాన్ని చదువుతున్నాను. నా యోగక్షేమాలు కోరుకునే వ్యక్తి నాకోసం స్పెషల్‌గా రాసిన డైరీ చదువుతున్నాను. నాకు మాటలు రావడం లేదు. 

    నన్ను అర్థం చేసుకున్నారు
    నమ్ముతారో, లేదో.. ఇది చదువుతూ ఉంటే కన్నీళ్లు ఆగడం లేదు. మనల్ని లోతుగా అర్థం చేసుకునేది మన కుటుంబసభ్యులు మాత్రమే.. కానీ, నా విషయంలో.. ఎంతోమంది జనం నన్ను అర్థం చేసుకున్నారు, అక్కున చేర్చుకున్నారు.. నా మంచి కోసం ప్రార్థిస్తున్నారు. నా జీవితానికి ఇది చాలు అని తనూజ ఆనందం వ్యక్తం చేసింది. తనకోసం డైరీ రాసిన వందన అనే అమ్మాయికి ఐ లవ్యూ చెప్పింది.

    చదవండి: ప్రేమలో కోర్ట్‌ హీరోహీరోయిన్‌.. వాళ్ల స్పందన ఇదే!

  • అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ నటి అనసూయ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ఈ రోజు మీరు ఏం చేయబోతున్నారని చాలామంది అడుగుతున్నారని తెలిపింది. ఈ ఒక్క రోజు కాదు మాత్రమే కాదు..  ప్రతి రోజు మహిళలదే అని అన్నారు. అయితే ఈ రోజు మాత్రం కొంచెం డిఫరెంట్‌గా మాట్లాడతారని తెలిపారు. పురుషులు కూడా మహిళలను ఇబ్బంది పెట్టకుండా.. వారికి అండగా నిలిచి వారితో పాటు మీరు ఎదగాలని అనసూయ హితవు పలికారు.

    స్ట్రాంగ్‌ ఉమెన్ ఇప్పటికే చాలామంది ఉన్నారని అనసూయ అన్నారు. ఈ ఒక్క రోజు ఉమెన్ స్ట్రాంగ్‌ కావాలని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. కాగా.. మహిళల విషయంలో అనసూయ ఎప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. గతంలో శివాజీ మహిళల దుస్తులపై కామెంట్స్ చేయడంతో అనసూయ గట్టిగానే ఇచ్చిపడేసింది. ఆ తర్వాత శివాజీ సైతం తన మాటలపై క్షమాపణలు చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే అనసూయ గతేడాది అరి మూవీతో ప్రేక్షకులను అలరించారు. 
     

     

  • కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన జన నాయగన్‌ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. దర్శకుడు హెచ్‌.వినోద్‌ తెరకెక్కించిన ఈ చిత్రం సెన్సార్‌ వివాదంలో చిక్కుకుంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడుతూనే వస్తుంది.  మద్రాసు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు, సింగిల్ బెంచ్‌, డివిజన్‌ బెంచ్‌ అంటూ ఈ కేసు తిరుగుతూనే ఉంది. ఫైనల్‌గా కోర్టు ఆదేశాల మేరకు చిత్ర యూనిట్‌ ‘జన నాయగన్‌’ను సెన్సార్‌ బోర్డు రివ్యూ కమిటీకి పంపింది. నేడు మార్చి 8న మద్యాహ్నం తర్వాత ఈ చిత్రాన్ని ఈ కమిటీ మరోసారి చూడనుంది.

    జన నాయగన్‌ సినిమా చూసిన తర్వాత రివ్యూ కమిటీ ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే.. ఆ సీన్స్‌ను కట్‌ చేయాల్సి ఉంటుంది.  ఆ తర్వాతనే సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. దీంతో జన నాయగన్‌ విడుదలకు లైన్‌ క్లియర్‌ అవుతుంది. అన్నీ అనకున్నట్లు జరిగితే ఉగాది కానుకగా మార్చి 19న ఈ చిత్రాన్ని విడుదల చేసే ఛాన్స్‌ ఎక్కువగా కనిపిస్తుంది. రంజాన్‌ కూడా కలిసి రావడంతో ఈ సెలవులు జన నాయగన్‌ కలెక్షన్స్‌కు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది.

  • మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్ మోస్ట్ అడ్వెంచరస్‌ మూవీ వారణాసి.  ఈ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న తొలి చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రంపై రోజు రోజుకు హైప్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వారణాసికి సంబంధించి క్రేజీ టాక్ వినిపిస్తోంది.

    ఈ మూవీ ఓవర్‌సీస్‌ రైట్స్‌పై టాలీవుడ్‌లో ఓ టాక్ వైరల్‌గా మారింది. ఈ సినిమా ఓవర్‌సీస్‌ రైట్స్‌ భారీ ధరకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఓ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఈ మూవీ కోసం ఏకంగా రూ.160 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో మేకర్స్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే అత్యధిక ధర దక్కించుకున్న చిత్రంగా వారణాసి నిలవనుంది. ఇప్పటి వరకు ఓ ఇండియన్ సినిమాకు ఇంతపెద్ద స్థాయిలో ఓవర్‌సీస్‌ రైట్స్‌ డీల్‌ కుదరలేదు. సినీ ఇండస్ట్రీలో ఈ అరుదైన రికార్డ్ సాధించిన చిత్రంగా వారణాసి నిలవనుంది.

    కాగా.. ఈ భారీ బడ్జెట్‌ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ ఫాంటసీ మైథలాజికల్‌ మూవీలో  పృథ్వీరాజ్‌ సుకుమార్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. 
     

  • కోర్ట్‌ జంట హర్ష్‌ రోషన్‌- శ్రీదేవి మరోసారి జంటగా నటించిన చిత్రం బ్యాండ్‌మేళం. సతీశ్‌ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ మూవీ మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ జంట సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ సందర్భంగా వారికి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆన్‌స్క్రీన్‌లో ప్రేమపాటలు పాడుకుంటున్న ఈ జంట ఆఫ్‌స్క్రీన్‌లోనూ లవ్‌లో ఉందని ప్రచారం జరుగుతోంది. 

    లవ్‌ రూమర్స్‌
    ఇదెంతవరకు నిజం? అని యాంకర్‌ ప్రశ్నించాడు. అందుకు రోషన్‌, శ్రీదేవి స్పందిస్తూ.. కోర్ట్‌ మూవీ కంటే ముందే మా ఇద్దరి మధ్య పరిచయం ఉంది. ఇద్దరం చైల్డ్‌ ఆర్టిస్టులం.. ఎలా పరిచయమయ్యామో గుర్తు లేదు కానీ ఫ్రెండ్స్‌ అయ్యాం. అందుకే ఇంత క్లోజ్‌గా ఉంటాం. ఒరేయ్‌, పోరా అని పిల్చుకుంటాం.

    అది చూసి నవ్వుకుంటాం
    కోర్ట్‌ సినిమా సమయం నుంచి బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా మారాం. తెరపై మమ్మల్ని చూసి ప్రేమికులు అనుకుంటారు. ఆ కామెంట్స్‌ చూసి మేము నవ్వుకుంటాం. కానీ, మేము మంచి మిత్రులం మాత్రమే.. మా మధ్య ఏమీ లేదు అని క్లారిటీ ఇచ్చారు. తాము కేవలం మిత్రులమే అని నొక్కి చెప్పారు. బ్యాండ్‌మేళం విషయానికి వస్తే..​ దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బాక్సాఫీస్‌ వద్ద ఎంత గట్టి సౌండ్‌ చేస్తుందో చూడాలి!

    చదవండి: ఆస్తి చూసి పెళ్లి? బిగ్‌బాస్‌ బ్యూటీ ఆన్సరిదే!

  • 'ధురంధర్‌-2' తెలుగు ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. మొదట హిందీ వర్షన్‌ మాత్రమే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన విషయం తెలిసిందే. గతేడాదిలో విడుదలైన ధురంధర్‌కు సీక్వెల్‌గా  ‘ధురంధర్‌: ది రెవెంజ్‌’ మూవీని దర్శకుడు ఆదిత్య ధర్‌ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌, సారా అర్జున్, సంజయ్‌ దత్, ఆర్‌.మాధవన్‌ తదితరులు నటిస్తున్నారు. అయితే, ఈ సీక్వెల్‌లో యంగ్‌ రణ్‌వీర్‌ సింగ్‌ని జస్కిరాత్‌ సింగ్‌ రాంగీ అనే పాత్రను ట్రైలర్‌లో పరిచయం చేశారు. రెహమాన్‌  మరణం తర్వాత అక్కడి వీధుల్లో ఏర్పడిన వాతావరణాన్ని చూపించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ నెల 19న విడుదల చేస్తున్నారు.
     

Sports

  • అహ్మదాబాద్‌లో భారత పురుషల క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. రెండున్నరేళ్ల కిందట ఎక్కడైతే అభిమానులకు గుండె కోత మిగిల్చిందో.. ఇప్పుడు అదే వేదికలో చరిత్రను తిరగరాసింది. టీ20 వరల్డ్‌కప్‌-2026 విజేతగా టీమిండియా అవతరించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత జట్టు.. ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ముద్దాడింది.

    తద్వారా అత్యధిక సార్లు టీ20 ప్రపంచకప్ టైటిల్‌ గెలిచిన జట్టుగా మెన్ బ్లూ నిలిచింది. అంతేకాకుండా వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ గెలిచిన జట్టు కూడా టీమిండియానే కావడం విశేషం. భారత్‌ 2007,2024లో విశ్వవిజేతలగా నిలవగా.. ఇప్పుడు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలో మరోసారి కప్‌ కొట్టి సత్తాచాటింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.

    దంచి కొట్టిన భారత బ్యాటర్లు
    ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తొలుత భారత్‌ను బ్యాటింగ్‌కు అహ్హనించాడు. అయితే శాంట్నర్ తీసుకున్న నిర్ణయం మిస్ ఫైర్ అయింది. భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. సంజూ శాంసన్‌(46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89), అభిషేక్‌ శర్మ(52), ఇషాన్‌ కిషన్‌(54) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. ఆఖరిలో శివమ్‌ దూబే(8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) మెరుపులు మెరిపించాడు.

    సంజూ, అభిషేక్ తొలి వికెట్‌కు 98 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించారు. ఓ దశలో భారత్ 300 పరుగుల మార్క్ అందుకునేలా కన్పించింది. కానీ మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.

    బుమ్ బుమ్ బుమ్రా..
    అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక కివీస్ చతికల పడింది. 19 ఓవర్లలో 159 పరుగులకు న్యూజిలాండ్ కుప్పకూలింది. భారత బౌలర్లలో పేస్ గుర్రం జస్ప్రీత్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బుమ్రా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు అక్షర్ పటేల్ మూడు, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ తలా వికెట్ సాధించారు. కివీస్ బ్యాటర్లలో సీఫర్ట్ (52) టాప్ స్కోరర్ నిలిచాడు. బుమ్రా ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిల‌వ‌గా.. సంజూ శాంస‌న్‌కు ప్లేయ‌ర్ ఆఫ్‌ది టోర్నీ అవార్డు ల‌భించింది.
     



     

     

  • క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న ఐపీఎల్‌-2026 సీజన్ ప్రారంభ తేదీ మారింది. గతంలో ఈ మెగా టోర్నీని మార్చి 26న ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు ​ఈ టీ20 క్రికెట్ టోర్నీ మార్చి 28 నుంచి షురూ కానుంది. ఈ విషయాన్ని భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది.

    ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నట్లు సమాచారం. కాగా గత ఏడాది జూన్‌లో ఆర్సీబీ టైటిల్ సెలబ్రేషన్స్ సమయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌లను నిలిపివేశారు. ఇప్పుడు కర్ణాటక సర్కార్ నుంచి అనుమతి లభించడంతో చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ సందడి మళ్లీ మొదలు కానుంది. 

    ఆర్సీబీ తన హోమ్ మ్యాచ్‌లలో 5 మ్యాచ్‌లను బెంగళూరులో, మిగిలిన 2 మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో ఆడనుంది. కాగా ఫైనల్ లేదా ఓ ప్లే ఆఫ్ మ్యాచ్‌కు చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యమివ్వనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. త్వరలోనే పూర్తి షెడ్యూల్‌ విడుదల కానుంది.

  • టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో టీమిండియా రికార్డు స్కోరు సాధించింది. న్యూజిలాండ్‌ బౌలింగ్‌ను చితక్కొడుతూ భారత టాపార్డర్‌ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్‌ ఓడిన టీమిండియా.. కివీస్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది.

    అభిషేక్‌. సంజూ ధనాధన్‌
    గత మ్యాచ్‌లలో విఫలమై విమర్శలు మూటగట్టుకున్న ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ.. టైటిల్‌ పోరులో బ్యాట్‌ ఝులిపించాడు. కేవలం 18 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 52 పరుగులు సాధించాడు.

    ఇక మరో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తూ మరోసారి విజృంభించాడు. కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 89 పరుగులు సాధించాడు. అయితే, దురదృష్టవశాత్తూ సెమీస్‌ మాదిరే సెంచరీకి మరోసారి పదకొండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

    ఇషాన్‌ సైతం
    వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌.. 23 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. మొత్తంగా 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 54 పరుగులు చేశాడు.  మిగిలిన వారిలో సూర్యకుమార్‌ యాదవ్‌ డకౌట్‌ కాగా.. హార్దిక్‌ పాండ్యా (13 బంతుల్లో 18) నిరాశపరిచాడు. తిలక్‌ వర్మ 6 బంతుల్లో 8 పరుగులతో అజేయంగా నిలవగా.. శివం దూబే 8 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

    ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి టీమిండియా 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో జేమ్స్‌ నీషమ్‌ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి సత్తా చాటగా.. మ్యాట్‌ హెన్రీ, రచిన్‌ రవీంద్ర తలా ఒక వికెట్‌ పడగొట్టారు.

    చరిత్ర సృష్టించిన టీమిండియా
    టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్‌ చరిత్ర సృష్టించింది. న్యూజిలాండ్‌తో టైటిల్‌ పోరులో 255/5 స్కోరు నమోదు చేసిన టీమిండియా.. గత ఎడిషన్‌లో తాను సృష్టించిన రికార్డును.. తాజాగా బద్దలు కొట్టింది. కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో సౌతాఫ్రికాతో ఫైనల్లో టీమిండియా 176/7 నమోదు చేసింది.

    టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో అత్యధిక స్కోర్లు నమోదు చేసిన జట్లు
    👉టీమిండియా- 2026లో న్యూజిలాండ్‌పై 255/5
    👉టీమిండియా- 2024లో సౌతాఫ్రికాపై 176/7
    👉ఆస్ట్రేలియా- 2021లో న్యూజిలాండ్‌పై 173/2
    👉న్యూజిలాండ్‌- 2021లో ఆస్ట్రేలియాపై 172/4
    👉వెస్టిండీస్‌- 2016లో ఇంగ్లండ్‌పై 161/6
    👉టీమిండియా- 2007లో పాకిస్తాన్‌ 157/5.

    చదవండి: టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డు

  • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026ను టీమిండియా స్టార్‌ ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ ఘనంగా ముగించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న ఫైన‌ల్లో శాంసన్‌ విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ నుంచే కివీస్‌ బౌలర్లను ఉతికారేశాడు.

    మాట్‌ హెన్రీ, లాకీ ఫెర్గూసన్‌ వంటి వరల్డ్‌క్లాస్‌ బౌలర్లను సైతం సంజూ విడిచిపెట్టలేదు. అతడి మెరుపు బ్యాటింగ్‌కు బౌండరీలు చిన్నబోయాయి. శాంసన్  కేవలం 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన శాంసన్.. 80.25 సగటుతో 321 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన సంజూ శాంసన్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

    సంజూ సాధించిన రికార్డులు ఇవే
    👉టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా సంజూ రికార్డులెక్కాడు. సంజూ తొలి ఓవర్‌లో ఇప్పటివరకు 4 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు మహ్మద్ రిజ్వాన్‌, ‍క్వింటన్ డికాక్‌, గుర్బాన్‌, సాల్ట్ పేరిట ఉండేది. వీరిందరూ తొలి ఓవర్‌లో మూడు సిక్స్‌లు బాదారు.

    👉ఒక టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది ప్రపంచకప్‌లో సంజూ 21 సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో ఫిన్ అలెన్‌(21)ను సంజూ అధిగమించాడు.

    👉ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో సెమీఫైనల్, ఫైనల్ రెండింటిలోనూ హాఫ్ సెంచరీలు సాధించిన మూడో ప్లేయ‌ర్‌గా శాంస‌న్ నిలిచాడు. శాంస‌న్ కంటే ముందు షాహిద్ అఫ్రిది, విరాట్ కోహ్లి ఈ ఫీట్ సాధించారు.

     

  • భారత టీ20 ఓపెనింగ్‌ జోడీ సంజూ శాంసన్‌- అభిషేక్‌ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఫైనల్‌లో యాభైకి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్‌ జంటగా ప్రపంచ రికార్డు సాధించారు. వీరిద్దరి విధ్వంసం కారణంగా.. టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌ లేదంటే ఫైనల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ సాధించిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.

    టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో న్యూజిలాండ్‌తో ఫైనల్లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అహ్మదాబాద్‌ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత ఓపెనర్లు సంజూ- అభిషేక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగారు. నాలుగో ఓవర్‌ ముగిసేసరికి సంజూ 14 బంతుల్లోనే 24, అభిషేక్‌ శర్మ 10 బంతుల్లోనే 23 పరుగులు సాధించారు.

    దీంతో టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో 50కి పైగా స్కోరు సాధించిన ఓపెనింగ్‌ జోడీగా భారత స్టార్లు నిలిచారు. ఇక ఆ తర్వాత కూడా సంజూ- అభిషేక్‌ జోరు కొనసాగించారు. అభిషేక్‌ కేవలం 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.

    మొత్తంగా 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపిన అభిషేక్‌.. రచిన్‌ రవీంద్ర బౌలింగ్‌లో టిమ్‌ సీఫర్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. సంజూతో కలిసి అభిషేక్‌ తొలి వికెట్‌కు 43 బంతుల్లో 98 పరుగులు జోడించాడు.

    కాగా టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఫైనల్‌లో అత్యధిక స్కోరు సాధించిన ఓపెనింగ్‌ జోడీగా పాకిస్తాన్‌ స్టార్లు కమ్రాన్‌ అక్మల్‌- షాజైబ్‌ హసన్‌ రికార్డు సాధించాడు. వీరు 2009లో లార్డ్స్‌ వేదికగా శ్రీలంక మీద 48 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజాగా వీరి రికార్డును బద్దలు కొడుతూ సంజూ- అభిషేక్‌ శర్మ కలిసి కేవలం నాలుగు ఓవర్లలోనే 51 పరుగులు సాధించారు. ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్‌ 33 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో టీమిండియా స్టార్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ కీల‌క మ్యాచ్‌లో త‌న ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. అహ్మదాబాద్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న ఫైన‌ల్ మ్యాచ్‌లో అభిషేక్ త‌న విశ్వ‌రూపాన్ని చూపించాడు. తన పేలవ ఫామ్‌కు చెక్‌ పెడుతూ కివీస్‌ బౌలర్లను ఉతికారేశాడు.

    నరేంద్ర మోడీ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో అభిషేక్‌ కేవలం 18 బంతుల్లోనే త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా టీ20 వరల్డ్‌కప్‌ నాకౌట్స్‌ మ్యాచ్‌లలో ఫాస్టెస్ట్‌ ఫిప్టీ చేసిన ప్లేయర్‌గా అభిషేక్‌ చరిత్ర సృష్టించాడు.

    ఇప్పటివరకు ఈ రికార్డు న్యూజిలాండ్‌ ఓపెనర్లు ఫిన్‌ అలెన్‌, ఇంగ్లండ్‌ యువ సంచలనం జాకబ్‌ బెతల్‌ పేరిట ఉండేది. వీరిద్దరూ ఇదే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌లో 19 బంతుల్లో ఆర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తాజా ఇన్నింగ్స్‌తో వీరిద్దరిని అభిషేక్‌ అధిగమించాడు.

    ఓవరాల్‌గా 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్‌.. 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు మరో ఓపెనర్‌ సంజూ శాంసన్‌ కూడా దూకుడుగా ఆడుతున్నాడు. ఫలితంగా భారత్‌ స్కోర్‌ కేవలం 7 ఓవర్లలోనే వంద పరుగుల మార్క్‌ దాటింది.


     

     

  • న్యూజిలాండ్‌తో టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో టాస్‌ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఊహాగానాలకు తెరదించుతూ సెమీ ఫైనల్లో ఆడిన తుదిజట్టునే టైటిల్‌ పోరులోనూ కొనసాగించింది. వరుస వైఫల్యాల తర్వాత కూడా.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ.. నంబర్‌ వన్‌ బౌలర్‌ వరుణు చక్రవర్తికి తుదిజట్టులో చోటు ఇచ్చింది.

    అదే వేదిక.. అదే అంపైర్‌
    ఇదిలా ఉంటే.. భారత్‌- కివీస్‌ జట్లకు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియాకు బ్యాడ్‌ సెంటిమెంట్‌ ఉంది. వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో ఇదే వేదికపై టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌.. తాజా ఫైనల్‌కు కూడా అంపైర్‌ కావడం గమనార్హం.

    అదృష్టం ఏమిటంటే
    ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ ఓడిపోవడం కూడా అభిమానులను కలవరపెడుతోంది. 2016 నుంచి ఇప్పటి వరకు 14 టీ20 ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లలో పదకొండు లక్ష్య ఛేదనకు దిగిన జట్లే గెలవడం ఇందుకు కారణం. అయితే, అదృష్టం ఏమిటంటే.. ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్టు గెలిచిన సందర్భాలలో.. మూడు విజయాలూ టీమిండియా ఖాతాలోనే ఉండటం. 

    కాగా టీమిండియా కివీస్‌తో ఫైనల్‌లో ఏ మార్పు లేకుండానే బరిలోకి దిగగా.. న్యూజిలాండ్‌ కోల్‌ మెకాంచీ స్థానంలో జేకబ్‌ డఫీని తీసుకువచ్చింది.

     

    తుదిజట్లు
    భారత్‌
    అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి , అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

     

    న్యూజిలాండ్‌
    టిమ్ సీఫెర్ట్ (వికెట్‌ కీపర్‌), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ .

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో తుది పోరుకు తేర లేచింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌-భార‌త్ త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ బ్లాక్ బ్లాస్ట‌ర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్న‌ర్ తొలుత టీమిండియాను బ్యాటింగ్‌కు అహ్హ‌నించాడు. న్యూజిలాండ్ ఒకే ఒక మార్పుతో బ‌రిలోకి దిగింది. 

    మెక్‌కాంచీ స్ధానంలో పేసర్ జాకబ్ డఫీ తుది జట్టులోకి వచ్చాడు. టీమిండియా మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. సెమీస్‌లో ఆడిన టీమ్‌నే కొనసాగించింది. ఇక టాస్ సందర్భంగా భారత కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

    "ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. గత కొన్ని మ్యాచ్‌లుగా మేము మొదట బ్యాటింగ్ చేస్తూ అద్భుతంగా రాణిస్తున్నాము. సెమీస్ లేదా ఫైనల్ వంటి మెగా మ్యాచ్‌లలో తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరును ప్రత్యర్ధి ముందు ఉంచిగల్గితే ఉత్తమంగా ఉంటుంది.

    2023 వరల్డ్‌కప్ ఓటమి గురుంచి మేము ఆలోచించడం లేదు. అది గతం మాత్రమే. ఇది డిఫెరెంట్ ఫార్మాట్‌. మా కుర్రాళ్లు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నారు. 1,20,000 మంది ప్రేక్షకుల ముందు ఇటువంటి మ్యాచ్ ఆడడం నిజంగా చాలా స్పెషల్‌. టాస్ వేసే సమయానికే స్టేడియం నిండిపోయింది. మా ఆట తీరుతో వారిని అలరిస్తామని" సూర్య పేర్కొన్నాడు.

    తుదిజట్లు
    భారత్‌
    అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

    న్యూజిలాండ్‌
    టిమ్ సీఫెర్ట్(వికెట్‌ కీపర్‌), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ

  • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026 ఫైన‌ల్లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా భార‌త్‌-న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డేందుకు సిద్ద‌మ‌య్యాయి. ఈ  తుది పోరును వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ స్టేడియం వ‌ద్ద‌కు చేరుకుంటున్నారు. అహ్మదాబాద్‌ ప్రస్తుతం 'క్రికెట్ ఫీవర్'తో ఊగిపోతోంది. ఇప్ప‌టికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు మొత్తం అమ్ముడుపోయాయి.

    బుక్‌మై షో యాప్ ద్వారా టికెట్లను విక్ర‌యించారు. ప్రారంభ టిక్కెట్ ధ‌ర రూ. 2 వేలు కాగా.. గ‌రిష్ట ధ‌ర రూ. 75000గా నిర్ణ‌యించారు. అయితే టిక్కెట్లు దొరకని అభిమానుల‌ను ధ‌ళారులు టార్గెట్ చేస్తున్నారు.బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో టిక్కెట్‌ను రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఈ విష‌యంపై గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) కార్యదర్శి అనిల్ పటేల్ స్పందించారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి ఫిజికల్ టిక్కెట్లను విక్రయించడం లేదని, కేవలం బుక్‌మైషో యాప్ ద్వారానే అధికారిక బుకింగ్స్ జరుగుతాయని స్పష్టం చేశారు. 

    అడ్డ‌దారుల్లో టిక్కెట్లు కొనవద్దని ఆయన హెచ్చరించారు.కేవలం టిక్కెట్లే కాదు, అహ్మదాబాద్, గాంధీనగర్ న‌గ‌రాల్లో హోటల్ గదుల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. సాధారణంగా అహ్మదాబాద్ హోట‌ల్లో ఒక రోజుకు ధ‌ర‌ రూ. 4,000గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఫైన‌ల్ మ్యాచ్ క్రేజ్‌ కార‌ణంగా ఈ ధరలు ఏకంగా 10 రెట్లు పెరిగాయి. అంటే ఒక్క రోజుకు రూ.40,000 పైగా వసూలు చేస్తున్నారు.

     

  • వరల్డ్‌ ఛాంపియన్‌గా భారత్‌
    టీ20 వరల్డ్‌కప్‌-2026 ఛాంపియన్‌గా భారత్‌ నిలిచింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా.. మూడోసారి పొట్టి ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. 256 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక కివీస్‌ చతికలపడింది. 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది.

    UPDATES
    న్యూజిలాండ్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 43 పరుగులు చేసిన శాంట్నర్‌.. బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

    బుమ్‌ బుమ్‌ బుమ్రా..
    16వ ఓవర్‌ వేసిన జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో కివీస్‌ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. మూడో బంతికి నీషమ్‌, నాలుగో బంతికి హెన్రీ క్లీన్‌ బౌల్డయ్యాడు. 16 ఓవర్లకు న్యూజిలాండ్‌ స్కోర్‌: 143/8

    ఆరో వికెట్ డౌన్‌.. మిచెల్ ఔట్‌
    124 పరుగుల వద్ద కివీస్ ఆరో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన డారిల్ మిచెల్‌.. అక్షర్‌పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    న్యూజిలాండ్‌ ఐదో వికెట్‌ డౌన్‌
    52 పరుగులు చేసిన టిమ్‌ సీఫర్ట్‌.. వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. 9 ఓవర్లకు కివీస్‌ స్కోర్‌: 80-5

    కివీస్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
    న్యూజిలాండ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 3 పరుగులు చేసిన చాప్‌మన్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    సీఫర్ట్‌ హాఫ్‌ సెంచరీ
    ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికి టిమ్ సీఫర్ట్ మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 23 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. 7 ఓవ‌ర్ల‌కు న్యూజిలాండ్‌ 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది.

    న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ డౌన్‌
    న్యూజిలాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 5 పరుగులు చేసిన గ్లెన్‌ ఫిలిప్స్‌.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

    కివీస్‌ రెండో వికెట్‌ డౌన్‌
    రచిన్‌ రవీంద్ర రూపంలో కివీస్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. ​​కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన రవీంద్ర.. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

    కివీస్‌ తొలి వికెట్‌ డౌన్‌
    256 పరుగుల భారీ లక్ష్యంంతో బరిలోకి దిగిన కివీస్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఫిన్‌ అలెన్‌.. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్లకు కివీస్‌ స్కోర్‌: 32/1

    న్యూజిలాండ్‌ టార్గెట్‌ ఎంతంటే?
    టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న ఫైన‌ల్లో టీమిండియా బ్యాట‌ర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడిన తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగులు చేసింది. 

    భారత బ్యాటర్లలో సంజూ శాంసన్‌(46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 89), అభిషేక్‌ శర్మ(52), ఇషాన్‌ కిషన్‌(54) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు. ఆఖరిలో శివమ్‌ దూబే(8 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) మెరుపులు మెరిపించాడు.

    18 ఓవర్లలో టీమిండియా స్కోరు: 220-4
    హార్దిక్‌ 12, తిలక్‌ 5 పరుగులతో ఉన్నారు.

    నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌
    15.6: సూర్యకుమార్‌ డకౌట్‌. నీషమ్‌ బౌలింగ్‌లో రచిన్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌. స్కోరు: 204-4(16). క్రీజులోకి తిలక్‌ వర్మ. హార్దిక్‌ ఒక పరుగుతో ఉన్నాడు.

    మూడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
    15.5: నీషమ్‌ బౌలింగ్‌లో మార్క్‌ చాప్‌మన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరిన ఇషాన్‌ (25 బంతుల్లో 54).

    రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌
    15.1: జేమ్స్‌ నీషమ్‌ బౌలింగ్‌లో సంజూ మెకాంచీ (సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌)కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 46 బంతుల్లో ఐదు ఫోర్లు, 8 సిక్స్‌లు కొట్టి 89 పరుగులు సాధించాడు.

    ఇషాన్‌ హాఫ్‌ సెంచరీ
    23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ హాఫ్‌ సెంచరీ

    14 ఓవర్లలో టీమిండియా స్కోరు: 191-1
    సంజూ 44 బంతుల్లో 88, ఇషాన్‌ కిషన్‌ 19 బంతుల్లో 43 పరుగులతో ఉన్నారు.

    శాంసన్‌ హాఫ్‌ సెంచరీ
    సంజూ శాంసన్‌ ఫైనల్లోనూ హాఫ్‌ సెంచరీ చేశాడు. 33 బంతుల్లో తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 12 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 161 పరుగులు చేసింది. 

    తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌
    అభిషేక్‌ శర్మ రచిన్‌ రవీంద్ర బౌలింగ్‌లో టిమ్‌ సీఫర్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. గత మ్యాచ్‌లలో విఫలమైన అభిషేక్‌ ఈసారి 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపాడు.

    పవర్‌ ప్లేలో టీమిండియా రికార్డు స్కోరు: 92-0(6)
    అభిషేక్‌ 19 బంతుల్లో 51, సంజూ శాంసన్‌ 17 బంతుల్లో 33 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

    అభిషేక్‌ శర్మ హాఫ్‌ సెంచరీ
    కేవలం 18 బంతుల్లోనే అభిషేక్‌ శర్మ అర్ధ శతకం బాదాడు. 

    రికార్డు అలర్ట్‌
    టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో 50కి పైగా భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనర్లుగా చరిత్ర సృష్టించిన భారత జోడీ సంజూ- అభిషేక్‌

    దూకుడుగా ఆడుతున్న భార‌త ఓపెన‌ర్లు
    ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌(23), సంజూ శాంస‌న్‌(24) దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి టీమిండియా వికెట్ న‌ష్ట‌పోకుండా 51 ప‌రుగులు చేసింది.

    తుదిజట్లు
    భారత్‌
    అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

    న్యూజిలాండ్‌
    టిమ్ సీఫెర్ట్(వికెట్‌ కీపర్‌), ఫిన్ అల్లెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ

    టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 తుది అంకానికి చేరుకుంది. అహ్మ‌బాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ పోరులో భార‌త్‌-న్యూజిలాండ్ జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఆదివారం సాయంత్రం 7 గంట‌ల‌కు ఈ హైవోల్టేజ్ మ్యాచ్ షురూ కానుంది. ఇందుకోసం ఇరుజట్లు ఇప్పటికే అహ్మదాబాద్‌ చేరుకున్నాయి. 

    ఊర్రూతలూగేలా..
    పాప్‌ స్టార్‌ రికీ మార్టిన్‌ క్లోజింగ్‌ సెర్మనీలో మారియా సాంగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. డాన్సులతో ఉర్రూతలూగించాడు. అంతకుముందు సుఖ్‌బీర్‌ తన పాటలతో స్టేడియాన్ని హోరెత్తించాడు.

    ధోని సైతం 
    అహ్మదాబాద్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియం వ‌ద్ద సంద‌డి వాతావర‌ణం నెల‌కొంది. ఫైన‌ల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు  అభిమానులు పోటెత్తుతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సైతం అహ్మ‌దాబాద్‌కు చేరుకున్నారు.

     సతీ సమేతంగా రోహిత్‌
    సతీ సమేతంగా భారత మాజీ కెప్టెన్‌, టీ20 ప్రపంచకప్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ రోహిత్‌ శర్మ అహ్మదాబాద్‌కు విచ్చేశాడు.

  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 ఫైన‌ల్లో భార‌త్‌-న్యూజిలాండ్ జ‌ట్లు అమీతుమీ తెల్చుకోవ‌డానికి సిద్ద‌మ‌య్యాయి. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు మ‌రి కొన్ని గంట‌ల్లో అహ్మ‌దాబాద్ వేదిక‌గా తెర‌లేవ‌నుంది.

    ఈ తుది పోరులో ఎలాగైనా గెలిచి మూడో సారి టైటిల్‌ను ముద్దాడాల‌ని భార‌త్ భావిస్తుంటే.. కివీస్ సైతం తొలి టైటిల్ సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉంది. అయితే ఈ ఫైన‌ల్ మ్యాచ్ కోసం భార‌త జ‌ట్టులో ఓ కీల‌క మార్పు చోటు చేసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

    వ‌రుణ్‌పై వేటు..?
    ‘మిస్టరీ స్పిన్నర్’ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిని ప‌క్క‌న పెట్టనున్న‌ట్లు స‌మాచారం. అత‌డి స్ధానంలో కుల్దీప్ యాద‌వ్‌ను తుది జ‌ట్టులోకి తీసుకోనున్న‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు వెల్ల‌డించాయి. ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు కుల్దీప్ నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మించ‌డం ఈ వార్త‌లకు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది. 

    వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి మాత్రం నామ‌మాత్ర‌పు ప్రాక్టీస్‌కే ప‌రిమితం కావ‌డం గ‌మనార్హం. కాగా ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో వరుణ్ చక్రవర్తి నంబర్ వ‌న్ బౌల‌ర్‌గా ఉన్నప్పటికీ, ఈ టోర్నమెంట్‌లో ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఈ త‌మిళ‌నాడు స్పిన్న‌ర్ లీగ్ స్టేజ్‌లో రాణించిన‌ప్ప‌టికి.. కీల‌క‌మైన సూప‌ర్‌-8 ద‌శ‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు.

    సెమీఫైనల్‌లో కూడా ఓ వికెట్ ప‌డగొట్టిన‌ప్ప‌టికి ప‌రుగులు మాత్రం ధారాళంగా స‌మ‌ర్పించుకున్నాడు.  ఈ క్ర‌మంలో అత‌డి స్ధానంలో కుల్దీప్‌ను జ‌ట్టులోకి తీసుకోవాల‌ని టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తుందంట‌. వ‌రుణ్ కంటే కుల్దీప్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మంచి రికార్డు ఉంది. 

    ఫ్లాట్ పిచ్‌పై కూడా బంతిని తిప్ప‌గలిగే స‌త్తా కుల్దీప్ యాద‌వ్‌కు ఉంది. సునీల్ గ‌వాస్కర్ వంటి దిగ్గ‌జాలు సైతం కుల్దీప్‌ను తుది జ‌ట్టులోకి తీసుకోవాల‌ని సూచించారు. మ‌రి టీమ్ మెనెజ్‌మెంట్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో మ‌రికొన్ని గంట‌ల్లో తేలిపోనుంది. కాగా ఈ టోర్నీలో కుల్దీప్ కేవ‌లం ఒక్క మ్యాచ్‌లో మాత్ర‌మే ఆడాడు.

    భారత తుది జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి/కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
    చదవండి: మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌

  • భారత స్టార్‌ క్రికెటర్‌ పృథ్వీ షా శుభవార్త చెప్పాడు. మనసిచ్చిన అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఆదివారం వెల్లడించాడు. ఆకృతి అగర్వాల్‌తో తన ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు తెలియజేశాడు.

    ఈ సందర్భంగా.. ‘‘మైదానంలో సిక్సర్లు బాదడం నుంచి.. జీవితకాలం మైదానం వెలుపలా అదే జోరు కొనసాగించేలా.. ఆమే నా పర్ఫెక్ట్‌ ఇన్నింగ్స్‌.. జస్ట్‌ ఇప్పుడే నిశ్చితార్థం చేసుకున్నా’’ అని 26 ఏళ్ల పృథ్వీ షా ఇన్‌స్టా వేదికగా తన ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు షేర్‌ చేశాడు. దీంతో కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

    ఆకృతి ఎవరంటే?
    సోషల్‌ మీడియా ఇన్ఫ్లూయెన్సర్‌, నటిగా 22 ఏళ్ల ఆకృతి అగర్వాల్‌ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమెకు మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఆకృతి.. ఉన్నత విద్య కోసం ముంబైకి వచ్చింది.

    ఈ క్రమంలో నటనపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. త్రిముఖ అనే చిత్రంలో మొదటిసారి నటించింది. ఇక పృథ్వీ షాతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. గతేడాది రొమాంటిక్‌ రీల్‌ చేయడం ద్వారా తమ బంధం గురించి వీరు అభిమానులకు సంకేతాలు ఇచ్చారు.

    ఇటీవల.. సచిన్‌ టెండుల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండుల్కర్‌- సానియా చందోక్‌ల వివాహానికి కూడా పృథ్వీ- ఆకృతి జంటగా హాజరయ్యారు. ఇంతలోనే.. వారం తిరగకముందే ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని అభిమానులకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. 

    పడిలేచిన ప్రయాణం
    చిన్న వయసులోనే క్రికెటర్‌గా సత్తా చాటిన పృథ్వీ షా.. కెప్టెన్‌గా భారత్‌కు అండర్‌-19 వరల్డ్‌కప్‌ అందించాడు. ఈ క్రమంలో టీమిండియాలో అరంగేట్రం చేసిన ఈ ముంబైకర్‌.. ఓపెనర్‌గా ఆరంభంలో సత్తా చాటాడు.

    అయితే, ఆ తర్వాత ఫామ్‌ కొనసాగించలేక జట్టులో స్థానం కోల్పోయాడు. పృథ్వీ షా కెప్టెన్సీలో అండర్‌ 19 వరల్డ్‌కప్‌ ఆడిన శుబ్‌మన్‌ గిల్‌ ఇపుడు టీమిండియా కెప్టెన్‌ స్థాయికి ఎదగగా.. క్రమశిక్షణా రాహిత్యంతో పృథ్వీ షా అధఃపాతాళానికి పడిపోయాడు. ఇటీవలే మళ్లి ఫామ్‌ అందుకున్న అతడు.. ముంబై తరఫున దేశీ ‍క్రికెట్లో రాణించాడు. ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ ఏడాది మినీ వేలంలో రూ. 75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడిని కొనుగోలు చేసింది.

    చదవండి: ఘనంగా అర్జున్‌ టెండుల్కర్‌- సానియా వివాహం.. వీడియో వైరల్‌

  • పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ ఆమిర్‌ మరోసారి టీమిండియాపై నోరు పారేసుకున్నాడు. సూర్యకుమార్‌ సేనపై మిచెల్‌ సాంట్నర్‌ బృందానిదే పైచేయి అవుతుందని పేర్కొన్నాడు. కివీస్‌ జట్టు సమిష్టిగా రాణిస్తుంటే.. టీమిండియా ఇంకా ఒకరిద్దరు ఆటగాళ్లపై ఆధారపడటమే ఇందుకు కారణమని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు.

    టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్‌కు ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం భారత్‌- కివీస్‌ (IND vs NZ) జట్లు టైటిల్‌ పోరులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇదిలా ఉంటే.. పాక్‌ మాజీ పేసర్‌ ఆమిర్‌ టోర్నీ ఆరంభం నుంచి టీమిండియాపై విమర్శల వర్షం కురిపిస్తున్నాడు.

    పదే పదే అదే మాట
    లీగ్‌ దశలో సూర్య సేన అజేయంగా నిలిచినప్పటికీ.. అది అదృష్టం వల్లేనని ఆమిర్‌ (Mohammad Amir) అన్నాడు. ఇక సూపర్‌-8 దశలోనూ టీమిండియా రాణించలేదని సెమీస్‌కు చేరలేదని వాదించాడు. అయితే, భారత జట్టు సెమీ ఫైనల్లో అడుగుపెట్టడమే కాకుండా.. ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌ చేరింది.

    న్యూజిలాండ్‌ గెలుస్తుంది 
    ఈ నేపథ్యంలో తాజాగా మొహమ్మద్‌ ఆమిర్‌ మరోసారి టీమిండియాపై అక్కసు వెళ్లగక్కాడు. ‘‘న్యూజిలాండ్‌ జట్టు సమిష్టి ప్రదర్శతో సెమీస్‌లో సౌతాఫ్రికాను ఓడించింది. కానీ టీమిండియా.. జస్‌ప్రీత్‌ బుమ్రా, సంజూ శాంసన్‌ వంటి ఇద్దరు ఆటగాళ్ల కారణంగా ఈరోజు ఫైనల్లో ఉంది. వాళ్లిద్దరు లేకుంటే పరిస్థితి వేరుగా ఉండేది.

    నరేంద్ర మోదీ స్టేడియం పిచ్‌ పరిస్థితులు న్యూజిలాండ్‌కు సరిగ్గా సరిపోతాయి. ముఖ్యంగా వాళ్ల బౌలింగ్‌ విభాగం టీమిండియా కంటే మెరుగ్గా ఉంది. భారత జట్టులో బుమ్రా తప్ప ఎవరూ ఫామ్‌లో లేరు. వరుణ్‌ చక్రవర్తి, హార్దిక్‌ పాండ్యా వికెట్లు తీసేందుకు కష్టపడుతున్నారు.

    నీ అంచనా తప్పుతుంది
    అయితే, బ్యాటింగ్‌ పరంగా ఇరుజట్లు సమానంగా ఉన్నాయి. రెండు జట్లలోనూ మంచి బ్యాటర్లు ఉన్నారు. ముందుగా చెప్పినట్లు న్యూజిలాండ్‌ బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. టీమిండియా ఎక్కువగా బుమ్రా మీదే ఆధారపడుతోంది. కాబట్టి న్యూజిలాండ్‌దే గెలుపు అని విశ్వసిస్తున్నాను’’ అని మొహమ్మద్‌ ఆమిర్‌ పేర్కొన్నాడు. 

    ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు ఆమిర్‌కు సోషల్‌ మీడియాలో కౌంటర్‌ ఇస్తున్నారు. సూర్య సేన ఈసారి సమిష్టిగా రాణించి గెలిచి తీరుతుందని.. మరోసారి నీ అంచనా తప్పని నిరూపిస్తుందని పేర్కొంటున్నారు.

    చదవండి: T20 WC Final: విజేత ఆ జట్టే: సౌతాఫ్రికా దిగ్గజాలు
     

  • ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తీరును తప్పుబట్టాడు. ఐసీసీ ఒక్కొక్క జట్టును ఒక్కోలా చూస్తుందని.. తాజాగా ఇంగ్లండ్‌కు పెద్ద పీట వేసిన తీరే ఇందుకు నిదర్శనమని విమర్శించాడు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి భారత్‌- శ్రీలంక ఆతిథ్యం దేశాలుగా ఉన్న విషయం తెలిసిందే.

    టైటిల్‌ పోరుతో తెర
    ఫిబ్రవరి 7న మొదలైన ఈ ఐసీసీ టోర్నీ నేటి (మార్చి 8) ఫైనల్‌తో ముగియనుంది. భారత్‌- న్యూజిలాండ్‌ (IND vs NZ) మధ్య జరిగే టైటిల్‌ పోరుకు అహ్మదాబాద్‌ వేదిక. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌ టోర్నీ మధ్యలోనే మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌, అమెరికా దాడులు.. అందుకు ఇరాన్‌ స్పందిస్తున్న తీరుతో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది.

    వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్లు ఇక్కడే!
    ఈ నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల గగనతలం మూసివేయడంతో వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ జట్లు భారత్‌లోనే చిక్కుకుపోయాయి. నిజానికి విండీస్‌ మార్చి 1 టీమిండియా చేతిలో ఓటమి తర్వాత టోర్నీ నుంచి నిష్క్రమించింది. పరిస్థితులు సాధారణంగా ఉండి ఉంటే.. ఆ మరుసటి రోజే స్వదేశానికి చేరుకోవాల్సింది.

    కానీ పశ్చియాసియాలో యుద్ధం కారణంగా విండీస్‌ జట్టు వారం రోజులుగా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు.. సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మార్చి 4 నాటి మ్యాచ్‌లో ఓడి ఎలిమినేట్‌ అయింది. యుద్ధ పరిస్థితుల వల్ల జట్టు కూడా ఇక్కడే ఉంది.  

    మరోవైపు.. సెమీ ఫైనల్లో మార్చి 5న టీమిండియా చేతిలో ఓడిన ఇంగ్లండ్‌ కూడా ఇక్కడే ఉండాల్సి రాగా.. ఐసీసీ జోక్యంతో శనివారం స్వదేశానికి ప్రత్యేక విమానంలో బయల్దేరింది. ఇక వెస్టిండీస్‌, సౌతాఫ్రికా జట్లకు కూడా ఐసీసీ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినా.. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ నుంచి అనుమతి రాలేదని సమాచారం.

    దీంతో ఆ రెండు జట్లు ఇంకా భారత్‌లోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విండీస్‌ హెడ్‌కోచ్‌ డారెన్‌ సామీ.. ‘‘మమ్మల్ని త్వరగా పంపిచేయండి’’ మహాప్రభో అంటూ మొరపెట్టుకున్న తీరు చర్చనీయాంశమైంది.

    ఇంగ్లండ్‌కి మాత్రం చార్టర్‌ ఫ్లైట్‌ దొరికింది
    ఈ పరిణామాలపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఐసీసీ తీరును విమర్శించాడు. ‘‘ఇంగ్లండ్‌ గురువారమే నాకౌట్‌ అయింది. వాళ్లకి మాత్రం చార్టర్‌ ఫ్లైట్‌ దొరికింది. వెస్టిండీస్‌ గత ఆదివారం నుంచి కోల్‌కతాలోనే చిక్కుకుపోయింది.

    సౌతాఫ్రికా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక్కడే అధికార దుర్వినియోగం ఎలా జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. జట్లన్నీ ఒకే పరిస్థితిలో ఉన్నపుడు.. వాటన్నింటీ ఒకే విధంగా ట్రీట్‌ చేయాలి కదా!.. ఓ దేశ బోర్డు శక్తిమంతమైనది అయినంత మాత్రాన ఐసీసీ వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వకూడదు’’ అని మైకేల్‌ వాన్‌ ట్వీట్‌ చేశాడు.

    ఓవరాక్షన్‌ వద్దు
    అయితే, వాన్‌ పోస్టుకు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇండియా- యూరోప్‌ మధ్య గగనతలంలో ఎలాంటి అడ్డంకులు లేవని.. అదే వెస్టిండీస్‌ వంటి జట్టు స్వదేశం చేరాలంటే గల్ఫ్‌ దేశాలు దాటాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

    ఒకవేళ యూరోప్‌ గుండా విండీస్‌ జట్టును పంపించాలన్నా ఇప్పటికిప్పుడు వీసా, ఒకే చోట 40- 50 మందికి సీట్లు అరేంజ్‌ చేయడం కుదరదని అంటున్నారు. భౌగోళిక పరిస్థితులను బట్టే ఓ జట్టు ముందు.. ఓ జట్టు వెనక వెళ్లడం జరుగుతుందని.. అంతే తప్ప ఇందులో అధికార దుర్వినియోగం ఏమీ లేదని వాన్‌కు చురకలు అంటిస్తున్నారు. కాగా ఆదివారం నాటికి వెస్టిండీస్‌, సౌతాఫ్రికా జట్లు స్వదేశానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    చదవండి: T20 WC Final: సాంట్నర్‌కు ఇచ్చిపడేసిన సూర్యకుమార్‌

  • ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో పెను సంచలనం నమోదైంది. 254 ఏళ్ల చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును న్యూజిలాండ్‌ పేసర్‌ బ్రెట్‌ రాండెల్‌ సాధించాడు. న్యూజిలాండ్‌లోని ప్లంకెట్ షీల్డ్ టోర్నీలో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఆడే బ్రెట్ రాండెల్.. నార్తర్న్ డిస్ట్రిక్ట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్‌ ఈ ఫీట్‌ను సాధించలేదు.

    ఈ మ్యాచ్‌లో రాండెల్‌ వరుసగా ఆరు బంతుల్లో ఆరు వికెట్లు సాధించలేకపోయినా, ఎనిమిది బంతుల్లో ఆరు వికెట్లు తీసి మరో రికార్డు సృష్టించాడు. మొత్తంగా 11 ఓవర్లలో 25 పరుగులకు 7 వికెట్లు తీసి తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. రాండెల్‌ ధాటికి నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులకే ఆలౌటైంది. రాండెల్‌ ధాటికి 4-0గా ఉన్న నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ స్కోర్‌ స్వల్ప వ్యవధిలో 11-7కి చేరింది.

    గతంలోనూ ఉన్నా..!
    ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన ఉదంతాలు గతంలో ఉన్నా.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో నమోదు కావడం మాత్రం ఇదే మొదటిసారి. 2021లో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్‌ బౌలర్‌ కర్టిస్‌ క్యాంఫర్‌ ఈ రేర్‌ ఫీట్‌ను సాధించాడు. 2024లో జింబాబ్వే మహిళా క్రికెటర్ కెలిస్ న్ద్లోవు ఓ అండర్‌-19 మ్యాచ్‌లో ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీశారు.  

    కాగా, తాజా ఉదంతంలో ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన రాండెల్‌కు ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం అనుకోకుండా వచ్చింది. సీనియర్ బౌలర్లు గాయాల కారణంగా అందుబాటులో లేకపోవడంతో రాండెల్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఆ అవకాశాన్ని ఆయన చరిత్రాత్మక ప్రదర్శనగా మార్చి, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.  
     

  • మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ (3 టీ20, 3 వన్డేలు, ఏకైక టెస్ట్‌) కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత మహిళల జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్‌.. ఆతర్వాత జరిగిన వన్డే సిరీస్‌లో క్వీన్‌ స్వీప్‌ అయ్యింది. ఇప్పుడు టెస్ట్‌ మ్యాచ్‌లో కూడా ఓడి, సిరీస్‌ మొత్తాన్ని కోల్పోయింది.

    మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (17-5-46-4), లూసీ హ్యామిల్టన్‌ (11-3-31-3), డార్సీ బ్రౌన్‌ (12.4-0-41-2) ధాటికి 62.4 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. భారత ఇన్నింగ్స్‌లో జమీమా రోడ్రిగ్స్‌ (52) ఒక్కరే అర్ద సెంచరీతో రాణించారు. షఫాలీ వర్మ (35), ఆఖర్లో కశ్వీ గౌతమ్‌ (34 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో భారత్‌ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

    అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 323 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. బంతితో సత్తా చాటిన సదర్‌ల్యాండ్‌ బ్యాట్‌తోనూ చెలరేగి సూపర్‌ సెంచరీ (129) చేసింది. ఎల్లిస్‌ పెర్రీ (76) అర్ద సెంచరీతో రాణించగా.. మిగతా ప్లేయర్లు ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. భారత బౌలర్లలో సయాలీ సత్ఘరే 4, క్రాంతి గౌడ్‌, దీప్తి శర్మ చెరో 2, స్నేహ్‌ రాణా, షఫాలీ వర్మ చెరో వికెట్‌ తీశారు.

    125 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ‍ప్రారంభించిన భారత్‌.. ఆసీస్‌ బౌలర్ల ధాటికి మరోసారి దారుణంగా పతనమైంది. హ్యామిల్టన్‌ (8-1-32-3), అలానా కింగ్‌ (10-2-23-2), ఆష్లే గార్డ్‌నర్‌ (4.2-1-8-2), సదర్‌ల్యాండ్‌ (6-2-15-2), డార్సీ బ్రౌన్‌ (14-2-45-1) దెబ్బకు 149 పరుగులకే ఆలౌటైంది. 

    ప్రతీక రావల్‌ (63) ఒంటరిపోరాటం చేయగా.. స్టార్‌ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. కెప్టెన్‌ హర్మన్‌(11), జెమీమా (14) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేయగా.. ఆఖర్లో స్నేహ్‌ రాణా (30) ఇన్నింగ్స్‌ పరాజయాన్ని తప్పించింది.

    అనంతరం 25 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. కేవలం 4.3 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా విజయతీరాలకు చేరింది. జార్జియా వాల్‌ 16, లిచ్‌ఫీల్డ్‌ 11 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ మ్యాచ్‌ మూడో రోజు తొలి సెషన్‌లోనే ముగిసింది. 
     

  • టీ20 ప్రపంచకప్‌ 2026 తుది అంకానికి చేరింది. ఇవాళ (మార్చి 8) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య అంతిమ సమరం జరుగనుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కాబోయే ఈ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్‌ వరుసగా తమ రెండో టైటిల్‌ను, ఓవరాల్‌గా మూడో టైటిల్‌ సాధిస్తుందా లేక న్యూజిలాండ్‌ తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుందా అన్న విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.

    చర్చలు, అంచనాలు ఎలా ఉన్నా.. టీమిండియాకు మాత్రం ఓ విషయం చాలా బూస్టప్‌ను ఇస్తుంది. అదేంటంటే.. భారత్‌కు టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఇప్పటివరకు ఓటమనేదే లేదు. ఇరు జట్లు ఈ మెగా టోర్నీలో 3 సార్లు ఎదురెదురుపడగా.. మూడు సార్లు టీమిండియానే పైచేయి సాధించింది.

    ఓవరాల్‌గా (మొత్తం టీ20ల్లో) చూసినా న్యూజిలాండ్‌పై టీమిండియాదే పైచేయిగా ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లు జరగ్గా.. 16 మ్యాచ్‌ల్లో భారత్, 11 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ గెలిచాయి. మూడు మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి.

    ఇరు జట్లు గత రెండు సందర్భాల్లో ఎదురెదురుపడినప్పుడు కూడా టీమిండియానే ఆధిక్యత ప్రదర్శించింది. 2023 వన్డే వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్లో, 2025 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో టీమిండియానే గెలిచింది.

    పై అంశాలతో పాటు మరో అంశం కూడా టీమిండియాకు సానుకూలంగా ఉంది. అదే హోం అడ్వాంటేజ్‌. భారత్‌ సహజంగానే స్వదేశంలో చెలరేగిపోతూ ఉంటుంది. అభిమానుల నుంచి లభించే విపరీతమైన ప్రోత్సాహం టీమిండియాను ఎంతటి ఒత్తిడినైనా అధిగమించేలా చేస్తుంది. 

    ఈ విషయం పలు సార్లు మిస్‌ ఫైర్‌ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ ఇదే నరేంద్ర మోదీ స్టేడియంలో ఆసీస్‌ చేతిలో చిత్తైంది. అయితే ఈసారి అలా జరగదని భారత అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

     

Business

  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ తన జీవితాన్ని ప్రభావితం చేసిన మహిళలను స్మరించుకున్నారు. ఒక మనిషి విజయానికి కేవలం అతని కృషి మాత్రమే కాదు.. అతని కుటుంబం, ముఖ్యంగా మహిళల ప్రోత్సాహం, విలువలు, ప్రేమ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. తన విజయాలకు పునాది తన కుటుంబ మహిళల నుంచే ఏర్పడిందని వెల్లడించారు.

    గౌతమ్ అదానీ తన బాల్యంలో.. తన తల్లి శాంతాబెన్ అదానీ చెప్పిన కథలను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా రామాయణంలోని కథలు ఆయనలో ధైర్యం, త్యాగం, బాధ్యత వంటి విలువలను నాటాయి. కేవలం 16 ఏళ్ల వయసులో ఆయన తన భవిష్యత్తు కోసం ముంబైకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఆయన తల్లి ఎంతో ధైర్యంతో తన కుమారుడిని తెలియని భవిష్యత్తు వైపు నడిపించింది. ఆ త్యాగం & ప్రేమను ఆయన జీవితాంతం గుర్తుంచుకుంటానని భావోద్వేగానికి లోనయ్యారు.

    అదానీ ఫౌండేషన్‌కు నాయకత్వం వహించడానికి దంతవైద్యంలో తన వృత్తిని విడిచిపెట్టిన తన భార్య ప్రీతి అదానీ గురించి కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫౌండేషన్ భారతదేశంలోని 22 రాష్ట్రాల్లో విద్య, ఆరోగ్యం, జీవనోపాధి వంటి రంగాల్లో పనిచేస్తూ ఒక కోటి మందికి పైగా ప్రజలకు సహాయం అందిస్తోందని తెలిపారు.

    తన కోడళ్లు పరిధి అదానీ & దివా అదానీలు కుటుంబంలోకి తాజా దృక్పథాలు & కొత్త శక్తిని తీసుకువచ్చారని ఆయన ప్రశంసించారు, అదే సమయంలో తన మనవరాలు తన జీవితంలోకి తెచ్చే ఆనందాన్ని గురించి కూడా పేర్కొన్నారు. పిల్లల కళ్లలో కనిపించే విశ్వాసం మరియు అమాయకత్వం జీవితం అసలు అర్థాన్ని గుర్తు చేస్తుందని చెప్పారు.

    ఇదీ చదవండి: 2026లో ధనవతుల జాబితా: టాప్ 10లో వీరే..

    మనిషి జీవితంలో పెద్ద కంపెనీలు, పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించవచ్చు. కానీ నిజమైన బలమైన పునాదులు కాంక్రీట్ లేదా ఉక్కుతో నిర్మితం కావు. మన జీవితాన్ని ప్రభావితం చేసే మనుషులతో నిర్మితమవుతాయి అని ఆయన అన్నారు. ముఖ్యంగా మహిళలు మన జీవితాలను తీర్చిదిద్దే గొప్ప శక్తిగా ఉంటారని గౌతమ్ అదానీ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు.

  • టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ తన యూజర్ల కోసం ఒక అద్భుతమైన ఆఫర్ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ప్రకారం 16 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 4జీబీ డేటా లభిస్తుంది. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    ''వరల్డ్ కప్ అంటే కేవలం ఒక టోర్నమెంట్ కాదు, ప్రతి ఇంట్లోనూ జరిగే ఒక వేడుక. పవర్ ప్లేల నుంచి చివరి ఓవర్ల వరకు చూడండి. కేవలం రూ.16కే 4జీబీ డేటా పొందండి. ఒక రోజు వ్యాలిడిటీ మాత్రమే. మ్యాచ్ ఇప్పుడు అంతరాయం లేకుండా చూడండి. ఎందుకంటే ప్రపంచ కప్ సమయం వచ్చినప్పుడు, మీ డేటా ఛాంపియన్ లాగా ఉండాలి'' అని బీఎస్ఎన్ఎల్ ఇండియా ట్వీట్ చేసింది.

  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. నీతా ముఖేష్ అంబానీ 'హీరోస్' ఉద్యమాన్ని ప్రారంభించి, ప్రతి మహిళా ఒక హీరో అని గొప్ప సందేశాన్ని ఇచ్చారు. 

    ఈ ప్రత్యేక ప్రచారం కోసం, రిలయన్స్ ఫౌండేషన్ ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న రంగాలు అయిన విద్య, క్రీడలు, ఆరోగ్యం, మహిళా వ్యాపార ప్రోత్సాహం, పర్యావరణ సంరక్షణ & గ్రామీణ అభివృద్ధి వంటి విభాగాల్లోని మహిళా హీరోలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రతి మహిళలో ఉన్న ధైర్యం, ప్రతిభ & నాయకత్వాన్ని గుర్తించి, ప్రతి మహిళ తనలోని హీరోను కనుగొని ధైర్యంగా ముందుకు సాగాలని ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహించబడింది.

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడటం వల్ల తన వ్యక్తిగత నైపుణ్యాలు తగ్గుతున్నాయేమో అనే అనుమానం కలుగుతోందని ఒక యంగ్ బ్యాక్‌ఎండ్ ఇంజనీర్ ఆందోళనల వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    టెక్ ప్రొఫెషనల్ 11 నెలలుగా బ్యాక్‌ఎండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తాను రోజువారీ ఆఫీస్ పనుల్లో ఎక్కువ భాగం ఏఐ టూల్స్ సహాయంతోనే పూర్తిచేస్తున్నాడు. ముఖ్యంగా కర్సర్ ఏఐ కోడ్ ఎడిటర్ & క్లౌడ్ ఏఐ అసిస్టెంట్ వంటివి కోడ్ రాయడంలో, APIలు రూపొందించడంలో మాత్రమే కాకుండా.. ఇతర సాంకేతిక పనులను పూర్తి చేయడంలో సహాయం చేస్తున్నాయి. ఈ టూల్స్ ఇచ్చిన సూచనల ప్రకారం పనులు పూర్తి చేస్తున్నానని అతను తెలిపాడు.

    ఇలాంటి సమయంలో అతనిలో ఒక సందేహం కలిగింది. సుమారు ఏడాదిగా పనిచేస్తున్నప్పటికీ.. నేను నిజంగా ఏమి నేర్చుకున్నాను. నేను ఇప్పటికే కొత్తగా ఉద్యోగంలో చేరిన వ్యక్తి మాదిరిగానే ఉన్నానని తన పోస్టులో పేర్కొన్నాడు. ఒకరోజు కర్సర్ ఏఐ సాంకేతిక సమస్య వల్ల పనిచేయకుండా పోయింది. అప్పుడు నేనే ఆ పనిని పూర్తి చేయాల్సి వచ్చింది. కానీ నేను ఏఐ సహాయం లేకుండా స్వతంత్రంగా పనిచేయలేకుండా పోతున్నానని, పని కష్టమవుతోందని వాపోయాడు.

    టెక్ రంగంలోకి ప్రవేశించడం తనకు అంత సులభం కాదని కూడా సోషల్ మీడియా పోస్టులో వివరించాడు. 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. అనేక ఇంటర్వ్యూలు విఫలమైన తర్వాత 2025లో ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఏఐ ఉపయోగించకుండా.. చేయాల్సిన పని కష్టం అయితే.. ఉద్యోగం బహుశా పోవచ్చు కూడా.

    ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కర్సర్ లేకుండా పని చేయడం కష్టమే అని కొందరు సీనియర్లు సరదాగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఏఐ ఉపయోగిస్తూ.. పని సులభంగా ఉందని సంబరపడిపోయే వారికి ఇదొక హెచ్చరిక అని ఇంకొందరు చెబుతున్నారు.

  • భారతదేశ బిలియనీర్ల జనాభా వేగంగా విస్తరిస్తోంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం, ఇండియాలో ఇప్పుడు 308 మంది బిలియనీర్లు ఉన్నారు, వారి మొత్తం సంపద రూ. 112 లక్షల కోట్లు అని అంచనా. దీంతో భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద బిలియనీర్ల కేంద్రంగా నిలిచింది, యునైటెడ్ స్టేట్స్, చైనా ముందు వరుసలో ఉన్నాయి.

    2026లో భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. రెండవ స్థానంలో గౌతమ్ అదానీ, మూడో స్థానంలో రోష్ని నాడర్ మల్హోత్రా నిలిచారు.

    భారతదేశంలోని టాప్ 10 ధనవంతులు
    ➤ముఖేష్ అంబానీ: రూ. 9.8 లక్షల కోట్లు
    ➤గౌతమ్ అదానీ: రూ. 7.5 లక్షల కోట్లు
    ➤రోష్నీ నాడార్: రూ. 3.2 లక్షల కోట్లు
    ➤సైరస్ ఎస్ పూనావల్ల: రూ. 3.0 లక్షల కోట్లు
    ➤కుమార్ బిర్లా: రూ. 2.5 లక్షల కోట్లు
    ➤దిలీప్ షాంఘ్వీ: రూ. 2.3 లక్షల కోట్లు
    ➤అజీమ్ ప్రేమ్‌జీ: రూ. 2.3 లక్షల కోట్లు
    ➤నీరజ్ బజాజ్: రూ. 2.2 లక్షల కోట్లు
    ➤అశోక్ హిందూజా: రూ. 2.2 లక్షల కోట్లు
    ➤రాధాకృష్ణ దమానీ: రూ. 1.5 లక్షల కోట్లు

  • మహారాష్ట్ర ప్రభుత్వం పాత వాహనాలను రద్దు చేసి.. కొత్తవి కొనుగోలు చేసే వాహనదారులకు పన్ను ప్రోత్సాహకాలను ప్రతిపాదించింది. ఈ సమయంలో.. కొన్ని పాత ప్రైవేట్ వాహనాలపై పర్యావరణ పన్నును పెంచాలని కూడా యోచిస్తోంది. 2026–27 రాష్ట్ర బడ్జెట్‌ సమయంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. రోడ్డుపై పాత లేదా కాలుష్య కారక వాహనాల సంఖ్యను తగ్గించడం & రాష్ట్రవ్యాప్తంగా గాలి నాణ్యతను మెరుగుపరచడం ఈ చర్యల లక్ష్యం అని అన్నారు.

    కొత్త ప్రతిపాదన ప్రకారం.. ఇప్పటికే ఉన్న వాహనాన్ని స్క్రాప్ చేసి, కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే కొనుగోలుదారులకు మోటారు వాహన పన్నులో రాయితీ లభిస్తుంది. BS-4 లేదా కొత్త ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వాహనాలను స్క్రాప్ చేసేవారికి 16 శాతం పన్ను రాయితీ లభిస్తుంది. BS-3 లేదా పాత ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలను స్క్రాప్ చేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేవారికి 30 శాతం అధిక రాయితీ లభిస్తుంది.

    బీఎస్-4 & అంతకు ముందు ఉద్గార ప్రమాణాలు కలిగిన నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని ఫడ్నవీస్ అన్నారు. దీనిని పరిష్కరించడానికి.. పన్నును రెట్టింపు చేయాలని ప్రతిపాదించడం జరిగిందని పేర్కొన్నారు.

  • భారతదేశంలో బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో కేజీ సిల్వర్ రేటు వారం రోజుల్లో సుమారు రూ. 35వేలు తగ్గింది. ఈ కథనంలో లేటెస్ట్ సిల్వర్ ధరల గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

    మార్చి 1న రూ.3.25 లక్షల వద్ద ఉన్న కేజీ వెండి రేటు మార్చి 7 నాటికి రూ.2.90 లక్షలకు చేరింది. అంటే వారం రోజుల్లో రూ.35వేలు తగ్గిందన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే రేట్లు కొనసాగుతున్నప్పటికీ.. ప్రస్తుతం దేశ రాజధాని నగరం ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.85 లక్షల దగ్గర ఉంది. దీన్నిబట్టి చూస్తే దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో వెండి రేటు కొంత తక్కువగా ఉందని తెలుస్తోంది.

    ఇరాన్.. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్నవేళ బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయనుకుంటే.. మెల్లగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ తగ్గుదల కేవలం తాత్కాలికం మాత్రమే. రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు తప్పకుండా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

    (Disclaimer: పైన పేర్కొన్న వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

  • ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దేశీయ గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌కు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఒక సిలిండర్ డెలివరీ తర్వాత మరొక సిలిండర్ బుక్ చేయడానికి 15 రోజుల గడువు ఉండేది. ఇకపై ఈ వ్యవధిని 21 రోజులకు పెంచారు. అంటే ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత మరో సిలిండర్ డెలివరీకి కనీసం 21 రోజుల విరామం ఉండాల్సి ఉంటుంది.

    ఈ కొత్త నిబంధన అమలుకు గ్యాస్ ఏజెన్సీల సాఫ్ట్‌వేర్‌ను వెంటనే అప్‌డేట్ చేశారు. అయితే బుకింగ్ విధానం మాత్రం యథాతథంగా కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి తాత్కాలికమే అయినా భవిష్యత్తులోనూ 21 రోజుల గడువు పూర్తైన తర్వాత మాత్రమే బుకింగ్ చేసుకునే విధానాన్ని అమలు చేయాలనే విషయాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.

    ఏడాదికి 15 సిలిండర్ల కొనుగోలుకు అనుమతి
    దేశీయ గ్యాస్ సిలిండర్ల వినియోగంపై చమురు సంస్థలు ఇప్పటికే కొన్ని నిబంధనలు అమలు చేస్తున్నాయి. వాటి ప్రకారం ప్రతి వినియోగదారు సంవత్సరానికి గరిష్టంగా 12 సబ్సిడీ సిలిండర్లు మాత్రమే పొందగలరు. అదనంగా మూడు సబ్సిడీ రహిత సిలిండర్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా ఏడాదిలో ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఒక్క గ్యాస్ కనెక్షన్‌పై మొత్తం 15 సిలిండర్లు కొనుగోలు చేయడానికి అనుమతి ఉంటుంది.

    24 గంటల్లో సిలిండర్ డెలివరీ
    వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని బుకింగ్ చేసిన తర్వాత 24 గంటలలోపు సిలిండర్ డెలివరీ చేయాలని చమురు కంపెనీలు ఏజెన్సీలకు సూచించాయి. ఈ నిబంధన వల్ల వినియోగదారులకు మరింత సౌలభ్యం కలగనుంది.

    21 రోజుల తర్వాతే రెండో సిలిండర్ డెలివరీ
    కొత్త నిబంధన ప్రకారం మొదటి సిలిండర్ అందుకున్న 21 రోజుల తర్వాత మాత్రమే రెండో సిలిండర్ డెలివరీ ఇవ్వబడుతుంది. దీనిని ఏజెన్సీల సాఫ్ట్‌వేర్‌లో లాక్ చేశారు. అయితే సిలిండర్ల కొరత ఏమీ లేదని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లిపారు. ఇక సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ వారం బాట్లింగ్ ప్లాంట్లు ఆదివారాల్లో కూడా పనిచేయనున్నట్లు సమాచారం.

    గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఇలా..
    పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన ధరలు పెరగడంతో భారతదేశంలో డొమెస్టిక్ ఎల్‌పీజీ (14.2 కేజీలు) సిలిండర్ ధరలు మార్చి 7 నుంచి రూ.60 పెరిగాయి. ఈ పెంపు ఉజ్వల యోజన లబ్ధిదారులకు వర్తించదు. వారికి రూ.300 సబ్సిడీ కొనసాగుతుంది.

    దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం డొమెస్టిక్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధరలు ఇలా ఉన్నాయి..  ఢిల్లీలో రూ.913, ముంబైలో రూ.912.50, కోల్‌కతాలో రూ.939, చెన్నైలొ  రూ.928.50, బెంగళూరులో రూ.915.50, హైదరాబాద్‌లో రూ.965లుగా ఉన్నాయి.

  • పాకిస్తాన్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను దాదాపు 20 శాతం వరకు పెంచినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.

    ఆ దేశ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ టెలివిజన్ ద్వారా దేశ ప్రజలకు  పెట్రోల్‌, డీజిల్‌ పెంపు విషయాన్ని ప్రకటించారు. ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు భారీగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

    ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు 55 పాకిస్తాన్ రూపాయలు పెంచి 321.17 రూపాయలకు నిర్ణయించింది. అలాగే డీజిల్ ధరను లీటరుకు 335.86 రూపాయలకు పెంచింది. ఇటీవలి సంవత్సరాల్లో ఇది అతిపెద్ద ధర సర్దుబాట్లలో ఒకటిగా భావిస్తున్నారు.

    ద్రవ్యోల్బణంపై ప్రభావం
    ఇంధన ధరల పెరుగుదలతో దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలపై ఇది తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా ఇంధన ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరగడం, దాంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడం సాధారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

    పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు
    ధరల పెంపు ప్రకటనకు ముందే లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల్లోని పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. కొరత వచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ముందుగానే ఇంధనం కొనుగోలు చేయడానికి ఎగబడినట్లు రాయిటర్స్‌ కథనం పేర్కొంది.

    ప్రభుత్వం హెచ్చరిక
    ఇంధన నిల్వలు చేసుకునే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని షెహబాజ్ షరీఫ్ హెచ్చరించారు. దేశంలో తగినంత పెట్రోల్ నిల్వలు ఉన్నప్పటికీ మధ్యప్రాచ్య పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయో తెలియకపోవడంతో వాటిని జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.

    చమురు దిగుమతులపై ఆధారపడిన పాకిస్తాన్
    పాకిస్తాన్ తన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ సరఫరాలు ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా వస్తాయి. ఇకపై అంతర్జాతీయ చమురు ధరల మార్పులకు అనుగుణంగా ఇంధన ధరలను ప్రతి వారం సమీక్షిస్తామని పాకిస్తాన్ చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

  • దేశీయంగా మహిళలకు ఆర్థిక సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆర్థిక భద్రత, సంపద సృష్టి అవకాశాలు పరిమితంగానే ఉంటున్నాయని ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫాం ఎల్‌ఎక్స్‌ఎంఈ ఫౌండర్‌ ప్రీతి రాఠీ గుప్తా తెలిపారు. చాలా మంది మహిళల్లో పొదుపు చేసే అలవాటు ఉన్నప్పటికీ మ్యుచువల్‌ ఫండ్స్, ఈక్విటీలు, పెన్షన్లు, లేదా బీమాలాంటి సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసే వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటోందని వివరించారు.

    చాలా మంది బంగారం, నగదు, చిట్‌ఫండ్స్‌పైనే ఆధారపడుతుంటారని, వీటిపై దీర్ఘకాలంలో రాబడులు అంతంత మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక పురోగతికి సంబంధించి ఎల్‌ఎక్స్‌ఎంఈ–ఈవై ఉమెన్స్‌ ఫైనాన్షియల్‌ ప్రాస్పరిటీ ఇండెక్స్‌ (2026) అధ్యయనం ప్రకారం భారత్‌కి 100కి 28.1 స్కోరు మాత్రమే లభించిందని గుప్తా చెప్పారు. బీమా లేకపోవడం, అసంఘటిత రంగంలో ఉద్యోగం, వేతనజీవులకు మాత్రమే రూపొందించబడిన సిస్టంలు మొదలైనవి మహిళల పురోగతికి ఆటంకాలుగా ఉంటున్నాయని వివరించారు.

    అయితే, మహిళలు క్రమంగా ఆర్థిక భద్రతపై మరింతగా దృష్టి పెట్టే ధోరణి పెరుగుతోందని తెలిపారు. ఎమర్జెన్సీ నిధి, బీమా కవరేజీ, ఆర్థిక పరిజ్ఞానం, కమ్యూనిటీ మద్దతు మొదలైనవి మహిళలు పెట్టుబడులు పెట్టడాన్ని ప్రారంభించేందుకు, క్రమంగా సంపద నిర్మించుకునేందుకు తోడ్పడతాయని ఆమె చెప్పారు. పెట్టుబడుల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 40 లక్షల కోట్ల మేర జత కాగలదని గుప్తా పేర్కొన్నారు.

  • పసిడి ప్రియులకు గడిచిన వారమంతా ఆనందమే కలిగింది. దేశంలో బంగారం ధరలు గత వారం రోజులుగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా ధరలు పడిపోవడంతో పసిడి కొనే వారికి  భారీ ఊరట లభించింది. గత వారంలో, అంటే మార్చి 2 నుంచి మార్చి 8 వరకు దాదాపు వారమంతా పసిడి ధరలు గణనీయంగా క్షీణించాయి. ఈ కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు కూడా ఒత్తిడికి గురయ్యాయి, దీంతో స్థానికంగా కూడా ధరలు పడిపోయాయి.

    ధరలు దిగొచ్చాయిలా..
    హైదరాబాద్‌, విశాఖ పట్నం సహా తెలుగు రాష్ట్రాలలో గత వారం బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే.. మార్చి 2న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,70,510  ఉండగా మార్చి 8 నాటికి రూ.1,63,640 లకు దిగొచ్చింది.  అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర మార్చి 2న రూ. 1,56,300  ఉండగా మార్చి 8 నాటికి రూ.1,50,000 లకు క్షీణించింది.

    అంటే వారం మొత్తంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.6,870 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ.6,300 తగ్గుదలను నమోదు చేసింది.  

    ఈ వారంలో ధరలు రోజుకు రోజూ తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా మార్చి 3, 4 తేదీల్లో భారీ తగ్గుదల నమోదైంది. తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నా మొత్తంగా వారం అంతా క్షీణతే కనిపించింది. మార్చి 8న మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి.

    బంగారం ధరల తగ్గుదలకు ప్రధాన కారణాలు
    అంతర్జాతీయంగా బంగారం ధరలు మార్చి ప్రారంభంలో రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి (ఔన్స్‌కు సుమారు 5,400 డాలర్ల పైన). కానీ తర్వాత అమెరికా డాలర్ బలపడటం, ట్రెజరీ యీల్డ్స్ పెరగడం, మిడిల్ ఈస్ట్ ఘర్షణల నేపథ్యంలో ఇన్‌ఫ్లేషన్ భయాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాల మార్పు వల్ల సేఫ్-హెవెన్ డిమాండ్ తగ్గింది. ఇది బంగారం ధరలపై ఒత్తిడి తెచ్చింది. అలాగే, కొన్ని రోజుల్లో ప్రాఫిట్ బుకింగ్, స్పెక్యులేటివ్ సెల్లింగ్ కూడా జరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు పడిపోయాయి.

    (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Telangana

  • ‘ఫ్యూచర్ రెడీ’ పోలీసింగ్‌లో తెలంగాణను దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలపాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పోలీసింగ్ లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘ట్రిపుల్ టీ’(టెక్నాలజీ, ట్రస్ట్, టాలెంట్) వ్యూహంతో ముందుకెళ్తున్నామన్నారు.  ఆదివారం ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో పోలీస్ ఉన్నతాధికారులకు ‘తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్ 2026’ పేరిట నిర్వహించిన ప్రత్యేక కార్యశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

    ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.... ఒకప్పుడు పోలీసింగ్ అంటే కేవలం శాంతి భద్రతల పరిరక్షణ మాత్రమే, ఇప్పుడు డేటా సెక్యూరిటీ, డిజిటల్ ట్రస్ట్ గా రూపాంతరం చెందిందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా క్రైం కూడా భౌతిక సరిహద్దులను దాటి డిజిటల్ రూపంలోకి విస్తరించిందన్నారు. డీప్‌ఫేక్ వీడియోలు, వాయిస్ క్లోనింగ్, ఆటోమేటెడ్ ఫిషింగ్ స్కామ్‌లు పోలీసులకు పెను సవాల్‌గా మారాయన్నారు. 

    ప్రస్తుతం నేరగాళ్లకు ఆయుధాలతో పనిలేదని, స్మార్ట్ ఫోన్, డేటా, డిజిటల్ ఐడెంటిటీస్ తో నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఒక్క 2024లో దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రూ.22,845 కోట్లు  కొల్లగొట్టారని, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది 206 శాతం ఎక్కువన్నారు. సైబర్ బాధితుల్లో నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులే అధికంగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

    ఇలాంటి తరుణంలో ప్రొఫెషనలిజం, ఆపరేషనల్ రెడీనెస్, లీడర్‌షిప్, ఇన్నోవేషన్, కొలాబరేషన్ , ఎథిక్స్ తో కూడిన ఫ్యూచర్ రెడీ పోలీసింగ్ ఆవశ్యకమన్నారు. ఇప్పటికే టెక్నాలజీ ఎనేబుల్డ్ పోలీసింగ్ లో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. రాబోయే రోజుల్లో డేటా అనలిటిక్స్, ఏఐ లాంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ సాయంతో నేరాల జరగకముందే అడ్డుకునే ‘ప్రెడిక్టివ్ పోలీసింగ్’కు పెద్దపీట వేస్తామన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్య సాధనలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. 

    ప్రజల నమ్మకాన్ని చూరగొన్నప్పుడే అసలైన పోలీసింగ్ సాధ్యమవుతుందన్నారు. నక్సలిజంపై పోరాటంలో అసువులు బాసిన పోలీస్ అమరవీరులను ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు స్మరించుకున్నారు. వారి త్యాగం వృథా కాలేదన్నారు. కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష భిష్త్, రిటైర్డ్ డీజీపీలు హెచ్ జే దొర, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లి వైజంక్షన్‌లోని లేక్‌ షేర్‌ మాల్‌లో ప్రమాదం జరిగింది. సందర్శకులపై హోర్డింగ్‌లు, యాడ్‌ బోర్డులు పడ్డాయి. పలువురికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సెలవు దినం కావడంతో మాల్‌లో జనసంచారం తక్కువగా ఉంది. ఈ సమయంలో ఘటన జరగడంతో పెను ప్రమాదమే తప్పింది.

    హోర్డింగ్‌లు ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒక్కసారిగా వినియోగదారులంతా భయంతో పరుగులు తీశారు. మాల్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

     

     

  • హైదరాబాద్‌: ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పనులపై సమీక్ష చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్‌ నాయకత్వంలో కృష్ణా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్‌.  ఆ నీటిని ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలకు అందిస్తామన్నారు.  

    ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి తెలంగాణ ఏర్పడిన తర్వాత అత్యదిక వరి సాగు ఈ ఖరీఫ్ పంటలో వచ్చింది. కృష్ణా, గోదావరి బేసిన్‌లలో అత్యధిక సాగు పంటలు పండాయి. ఇరిగేషన్ విషయంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం. అన్ని ప్రాజెక్టులపై రివ్యూ చేశాం. ప్రాజెక్టులకు భూ సేకరణను జూన్ 2 లోపు 5 వేల కోట్ల తో కంప్లిట్ చేస్తాం. పాలమూరు - రంగా రెడ్డి ప్రాజెక్టుకు నిధుల అంశాన్ని చర్చించాం. 

    పాలమూరు ను 90 శాతం చేశామని గత పాలకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రూ. 55 వేల కోట్ల ప్రాజెక్టులో రూ. 27 వేల కోట్లు ఖర్చు చేస్తే అది 90 శాతం అయినట్ల..?, వారి హయాంలో నే పాలమూరు అంచనాలు రూ. 84 వేల కోట్లకు పెంచారు. రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదు.పాలమూరు ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలంకు షిఫ్ట్ చేయడం వల్ల తీరని అన్యాయం జరిగింది. 2028 డిసెంబర్ లోపు అన్ని ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తాం’ అని తెలిపారు.

  • నల్గొండ జిల్లా: సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో పట్టువదలని విక్రమార్కుల్లా కష్టపడిన ఇద్దరు అన్నదమ్ములు ఆరో ప్రయత్నంలో ర్యాంకులు సాధించారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం సుంకెనపల్లి గ్రామానికి చెందిన వెలిమినేటి అలివేలు, అంజిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు విజయసింహారెడ్డి, విక్రమసింహారెడ్డి, కుమార్తె అర్చన ఉన్నారు. అంజిరెడ్డి ఆర్టీసీ కండక్టర్‌గా రిటైరయ్యారు. అలివేలు గృహిణి. వీరు పెద్ద చదువులు చదువుకోకపోయినా తమ పిల్లలు ఉన్నతస్థాయిలో ఉండాలని కోరుకున్నారు. ఈ మేరకు పిల్లల చదువుల కోసం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 

    ఆరో ప్రయత్నంలో విజయం..
    విజయసింహారెడ్డి, విక్రమసింహారెడ్డి ఉస్మానియా యూనివర్సిటిలో ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. అనంతరం వారు సివిల్స్‌ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగారు. ఈ క్రమంలో గతేడాది గ్రూప్‌–1 ఫలితాల్లో పెద్ద కుమారుడు విజయసింహారెడ్డి ఎంపీడీఓగా, చిన్న కుమారుడు విక్రమసింహారెడ్డి అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌గా ఎంపికయ్యారు. అయినప్పటికీ వారిద్దరు సివిల్స్‌ లక్ష్యాన్ని మరువలేదు. ఐదుసార్లు విఫలమైనప్పటికీ ఆరో ప్రయత్నంలో భాగంగా శుక్రవారం విడుదలైన ఫలితాల్లో విజయసింహారెడ్డి ఆలిండియా 642వ ర్యాంకు, విక్రమసింహారెడ్డి 541వ ర్యాంకు సాధించారు. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి సివిల్స్‌ ర్యాంకులు సాధించటం పట్ల వారి కుటుంబ సభ్యులతో పాటు సుంకెనపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కాగా అంజిరెడ్డి కుమార్తె కుమార్తె అర్చన కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తోంది.  

  • సాక్షి, కరీంనగర్‌ డెస్క్‌: యక్షగానంతో ఆమె ప్రస్థానం ప్రారంభించింది. నాన్న పాటలను కైకట్టి నేర్చుకుంది. చదువుకోకున్నా జానపదాన్ని ఒంట పట్టించుకుంది. పంటపొలాల సాక్షిగా తన పాటలను ప్రపంచానికి పరిచయం చేసింది. ‘తిరుపతి రెడ్డి’ అంటూ మొదలు పెట్టి ‘మోహన లా లి’ పాటతో పాపులర్‌ అ య్యింది. మంగ్లీతో జతకట్టి  ‘బాయిలోనే బల్లి పలికే’ పాటతో వరల్డ్‌ ఫేమస్‌ కాగా.. ఇటీవల విడుదలైన ‘మామిడి కొనాల మీన’ పాటతో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ సృష్టిస్తోంది జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం 
    గుల్లకోటకు చెందిన నాగవ్వ.

     

    యక్షగానంతో ప్రారంభమై..
    తల్లిగారి ఊరైన అంబారిపేటలో యక్షగానంతో నాగవ్వ పాట ప్రారంభమైంది. తండ్రి యక్షగానం వింటూ పెరగడంతో పాటు తనూ బతుకమ్మ పాటలు, జానపదాలు, కాముని పాటలు పాడేది. పెళ్లి తరువాత అత్తగారిల్లు గుల్లకోటకు వచ్చాక కూడా పాటను మర్చిపోలేదు. తన భర్త భజన పాటలు పాడుతూ.. నాగవ్వను కూడా గొంతు బాగుంటుందని ప్రోత్సహించడంతో పాటు కొడుకులిద్దరూ కలిసి ‘సీఎంఎస్‌ చానెల్‌’ పెట్టి జానపదాలు పాడించారు. అలా తను తొలిపాట ‘తిరుపతి రెడ్డి’తో ప్రేక్షకుల ముందుకొచి్చంది. ‘మోహనలాలి’ పాటతో మరింత దగ్గరైంది. ‘సారంగదరియా షో’లో మూడు ఎపిసోడ్లలో పాల్గొంది. మంగ్లీతో కలిసి ‘కొప్పులోని పువ్వమ్మ బాయికాడి బతుకమ్మ’ పాట పడింది. తరువాత ‘బాయిలోనే బల్లి పలికే’ పాట ప్రపంచాన్ని ఊర్రూతలూగించింది. లక్షల్లో వ్యూస్‌ సంపాదించింది. ఇటీవల విడుదలైన ‘మామిడి కొనాల మీన’ పాట సరికొత్త ట్రెండ్‌ సృష్టిస్తూ.. వ్యూస్‌లో లక్షల్లో దూసుకెళ్తుంది. తనకు గుర్తింపు రావడానికి తన కుటుంబ ప్రోత్సాహం ఎంతో ఉందని నాగవ్వ చెబుతోంది. ముఖ్యంగా కొడుకులిద్దరూ తాను పాడడాన్ని ఎంతో ప్రోత్సహిస్తారని వివరించింది.

     

    క్యాష్‌లెస్‌ లావాదేవీల్లో ‘నిర్మల’
    యైటింక్లయిన్‌కాలనీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు డిజిటల్‌ చెల్లింపులపై రామగుండం కార్పొరేషన్‌ యైటింక్లయిన్‌కాలనీ అల్లూరు గ్రామానికి చెందిన చిరు కిరాణా వ్యాపారి బాలసాని నిర్మల శ్రద్ధపెట్టారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించి, అత్యధికంగా రూ.5,340 క్యాష్‌ బ్యాక్‌ పొంది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె దృఢసంకల్పానికి అబ్బురపడిన కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి 26 గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. నిర్మల తన భర్త బాలసాని రవికుమార్‌ గౌడ్‌తో కలిసి ఢిల్లీలోని గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్‌ అరుణశ్రీ చేతుల మీదుగా సత్కారం పొందారు.

    స్వనిధి రుణంతో నవచైతన్యం
    నిర్మల నవ చైతన్యం–2020లో సీఎం స్వనిధి పథకంలో తొలి విడతగా రూ.10వేలు రుణం పొంది ఇంట్లో కిరాణం ప్రారంభించారు. క్రమం తప్పకుండా రుణ వాయిదాలు డిజిటల్‌ రూపంలో చెల్లించడంతో ప్రభుత్వం రెండో విడతగా రూ.20 వేలు మంజూరు చేసింది. ఆ మొత్తంతో కిరాణంతో పాటు చీరల వ్యాపారం, కుట్టు మిషన్, మగ్గంవర్క్‌ ప్రారంభించి సక్సెస్‌ అయ్యారు. మూడోవిడత రూ.50వేలు రుణం పొంది ఆదర్శంగా నిలిచారు. 

International

  • ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి తెర తీసి దాదాపు తొమ్మిది రోజులు పూర్తయ్యాయి. ఈ యుద్ధం కనీసం మరో రెండు వారాలు, అంతకుమించి కొనసాగేలా కనిపిస్తోంది.  తీవ్రస్థాయి దాడులు, ప్రతి దాడులతో ఇరాన్, ఇజ్రాయెల్‌ దద్దరిల్లిపోతున్నాయి. దాడులను మరింత విస్తరిస్తామని.. చాలా బలంగా దెబ్బతీస్తామంటూ ఇరాన్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్ ప్రజలు లొంగిపోవాలనే శత్రువుల కోరిక వారి సమాధుల్లోనే కలిసిపోతుందంటూ  ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఘాటుగానే స్పందించారు.

    కాగా, రెండు, మూడు రోజులుగా ఇరాన్‌ దాడుల తీవ్రత తగ్గినట్టు అమెరికా చెబుతోంది. క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్‌ దాడులు 83 శాతం తగ్గుముఖం పట్టాయంటోంది. నానాటికీ నిండుకుంటున్న ఆయుధ నిల్వలే ఇందుకు కారణం కావచ్చు. ఇరాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను 80 శాతానికి పైగా నాశనం చేసి దాని గగనతలంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించినట్టు ఇజ్రాయెల్‌ చెబుతోంది. అమెరికా వద్ద కూడా క్షిపణి నిల్వలు మరో వారం రోజులకు మించి లేవని పెంటగాన్‌ నివేదిక పేర్కొంది. కానీ తొలి రోజే నాయకున్ని కోల్పోయినా ఇరాన్‌ మాత్రం మొండిగా పోరాడుతూనే ఉంది.  

    యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలకు నానా సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం దాకా జరిగే హార్మూజ్‌ జలసంధి మూతబడింది. దాంతో సరఫరా తగ్గి చమురు ధరలు ఇప్పటికే 10 శాతానికి పైగా పెరిగిపోయాయి. ఈ ప్రభావం భారత్‌పైనా అధికంగానే పడుతోంది. తాత్కాలిక ప్రత్యామ్నాయంగా మళ్లీ రష్యా చమురు వైపు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

    హార్మూజ్‌ గుండా భారత్‌కు వచ్చే పామాయిల్, పప్పులు, ఔషధాల దిగుమతులు ఆగిపోవడంతో వాటి ధరలు పెరిగేలా కనిపిస్తున్నాయి. అలాగే పశ్చిమాసియా దేశాలకు మన బాస్మతి బియ్యం ఎగుమతులపైనా ప్రభావం పడుతోంది. పశ్చిమాసియా నుంచి సహజ వాయువు సరఫరాలు కూడా పడకేశాయి. దాంతో వాటిపై అధికంగా ఆధారపడే యూరప్, ఆసియా దేశాలు కూడా అల్లాడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రవాణా కూడా తీవ్రంగా ప్రభావితమైంది. పశ్చిమాసియాలో ఈ వారం రోజుల్లో ఏకంగా 11 వేల విమానాలు రద్దయ్యాయి! ఆ దేశాల్లో లక్షలాదిగా ప్రయాణికులు చిక్కుబడిపోయారు.


     

  • ఇరాన్‌ తదుపరి సుప్రీం లీడర్‌ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని.. కొత్త నాయకుడిని ఎన్నుకున్నారంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నాయకుడిని అసెంబ్లీ సెక్రటేరియట్‌ అధిపతి ప్రకటించనున్నారు. అధికారికంగా పేరుబయట పెట్టకపోయినప్పటికీ ఖమేనీ కుమారుడు మజ్తబానే కొత్తనాయకుడంటూ అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

    వారసత్వ నాయకత్వంపై అసెంబ్లీలో కొంతమంది సభ్యుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే కొత్త నాయకుడి ప్రకటన జాప్యం అవుతుందని సమాచారం. కొత్త నాయకుడిని ఇజ్రాయెల్‌ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్నందున.. కొత్త నాయకుడి పేరు ప్రకటించే లోపు ఇరాన్‌ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.

    ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తర్వాత వారసుడు ఎవరు? అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే, ఖమేనీ తన జీవితకాలంలో ఎవరినీ అధికారిక వారసుడిగా ప్రకటించలేదు. అయితే ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కొడుకు రెండో కుమారురు మొజ్తబా ఖమేనీకి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం.

    ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, కొత్త సుప్రీం లీడర్‌ను ఎంపిక చేసే బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ కి ఉంటుంది. ఇందులో 88 మంది అగ్రశ్రేణి మత పండితులు ఉంటారు. వీరు చర్చించి కొత్త నేతను ఎన్నుకుంటారు. కేవలం మత పెద్దలే కాదు, ఇరాన్ సైనిక విభాగమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) పాత్ర ఇందులో అత్యంత కీలకం. దేశంలో అత్యంత శక్తివంతమైన ఈ సైన్యం ఎవరికి మద్దతు ఇస్తే వారే పీఠం దక్కించుకునే అవకాశం ఉంది.

     

  • వాషింగ్టన్‌: రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోళ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ప్రపంచ ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించడానికే రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు భారత్‌కు తాత్కాలిక అనుమతి ఇచ్చామని అన్నారు. పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరా మార్గాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.

    ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతూ.. “కొంత ఒత్తిడిని తగ్గించడానికి నేను ప్రయత్నిస్తాను. మా దేశంలో భారీగా చమురు ఉంది. బయటి దేశాల్లో కూడా చాలా చమురు ఉంది. చమురు సరఫరా సమస్య చాలా త్వరగా సర్దుకుంటుంది” అని ట్రంప్‌ తెలిపారు.

    కాగా, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు అంశంపై అమెరికా-భారత్‌ మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. యుక్రెయిన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేయిస్తున్న యుద్ధానికి భారత్‌ చమురు కొనుగోలు ద్వారా మద్దతు ఇస్తోందని అమెరికా ఆరోపించింది. శాంతి కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు కూడా దీని ద్వారా దెబ్బతింటున్నాయని విమర్శించింది.

    ఇదీ చదవండి: నీటిలో అంతిమ సంస్కారాలు.. స్కాట్లాండ్‌ అనుమతి 

    మరోవైపు, అమెరికాలోని ప్రజలు, వ్యాపారాలు, కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరాలు, మోసాలు, దోపిడీదారులపై విస్తృతంగా చర్యలు తీసుకోవాలని ఫెడరల్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ కార్యనిర్వాహక ఆర్డర్లపై డొనాల్డ్ ట్రంప్ ఆదివారం సంతకం చేశారు.

    ఆ ఆదేశం ప్రకారం అమెరికా విదేశాంగ కార్యదర్శి విదేశీ ప్రభుత్వాలతో చర్చలు జరిపి, వారి భూభాగాల్లో పనిచేస్తున్న అంతర్జాతీయ నేరస్థులపై చర్యలు తీసుకోవాలని కోరాల‍్సి ఉంటుంది. 
     

  • సాధారణంగా అంత్యక్రియలు అనగానే మనకు ఖననం చేయడం, దహన సంస్కారాలు నిర్వహించడం మాత్రమే గుర్తుకొస్తాయి. అంత్యక్రియలు అనేవి మతపరమైన, సామాజిక, కుటుంబపరమైన విలువలతో కూడి ఉంటాయి. మనిషి చనిపోయిన తర్వాత కూడా అతడి మృతదేహాన్ని ఎంతో గౌరవంగా సాగనంపాలని భావిస్తాం. ఇప్పటివరకైతే ఖననం, దహన సంస్కారాలు వంటివాటినే పాటిస్తున్నాం. యుగయుగాలుగా ఉన్న ఈ సంప్రదాయాలకు ప్రత్యామ్నాయంగా మరికొన్ని పద్ధతులు వస్తున్నాయని మీకు తెలుసా? 

    నీటి ద్వారా అంతిమ సంస్కారాలు (వాటర్ క్రిమేషన్) నిర్వహించుకునే పద్ధతి కూడా ఉంది. తాజాగా, వాటర్ క్రిమేషన్‌కు స్కాట్లాండ్‌ చట్టబద్ధ అనుమతి ఇచ్చింది. యునైటెడ్ కింగ్డమ్‌(యూకే)లో ఇటువంటి అనుమతి ఇచ్చిన తొలి దేశంగా స్కాట్లాండ్ నిలిచింది. దీని ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని, నీటిలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే తక్కువ ఉద్గారాలు విడుదల అవుతాయని స్కాట్లాండ్ భావిస్తోంది. ఈ నిర్ణయం స్కాట్లాండ్‌లోని అంత్యక్రియల చట్టాల్లో 100 సంవత్సరాలకు పైగా కాలంలో జరిగిన అతిపెద్ద సంస్కరణ.  

    ఈ పద్ధతిలో ఎలా చేస్తారు?
    వాటర్ క్రిమేషన్‌ కోసం స్కాట్లాండ్ పార్లమెంట్ ఆల్కలైన్ హైడ్రోలిసిస్ అనే విధానానికి ఆమోదముద్ర వేసింది. ఈ విధానాన్ని సాధారణంగా వాటర్ క్రిమేషన్ లేదా ఆక్వమేషన్ అని పిలుస్తారు. ఆల్కలైన్ హైడ్రోలిసిస్ అంటే నీరు, ఆల్కలైన్ రసాయనాల సాయంతో శరీర కణజాలాన్ని వేగంగా సహజ విచ్ఛిన్నం చేసే శాస్త్రీయ ప్రక్రియ.

    ఈ విధానంలో ఒత్తిడి తట్టుకునే స్టెయిన్‌లెస్ స్టీల్ ఛాంబర్‌లో మృతదేహాన్ని ఉంచుతారు. ఆ ఛాంబర్‌లో 95 శాతం నీరు, 5 శాతం ఆల్కలైన్ రసాయనాల ద్రావణం నింపుతారు. ద్రావణాన్ని సుమారు 150 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు వేడి చేస్తారు. 3 నుంచి 4 గంటల సమయంలో మృదు కణజాలం పూర్తిగా విచ్ఛిన్నం అవుతుంది. చివరగా ఎముక ముక్కలు మాత్రమే మిగులుతాయి. వాటిని ఎండబెట్టి సాంప్రదాయ దహనంలో వచ్చే బూడిదలా తెల్లటి పొడిగా తయారు చేస్తారు.

    అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రక్రియలో నేరుగా ఉద్గారాలు విడుదల కావు. సాధారణ దహనం కంటే చాలా తక్కువ శక్తి వినియోగం జరుగుతుంది.  కార్బన్ ఫుట్‌ప్రింట్ చాలా తక్కువగా ఉంటుంది. కార్బన్ ఫుట్‌ప్రింట్ అంటే ఒక చర్య వల్ల వాతావరణంలో విడుదలయ్యే మొత్తం గ్రీన్‌హౌస్‌ గ్యాసెస్‌ పరిమాణం.

    ప్రజల ఇష్టానికి ప్రాధాన్యం
    ఆరోగ్య మంత్రి జెన్నీ మింటో తెలిపిన వివరాల ప్రకారం.. అంతిమ సంస్కారాలు వంటి నిర్ణయాలు చాలా వ్యక్తిగతమైనవి. సంస్కృతి, పర్యావరణ అవగాహన, కుటుంబ విలువలు వంటి అంశాలు వాటిపై ప్రభావం చూపుతాయి. ఇప్పుడు వాటర్ క్రిమేషన్‌ను కూడా తీసుకురావడంతో మృతుల కుటుంబాలకు కొత్త ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంటుంది. 2023లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 84 శాతం మంది ఈ విధానం ప్రవేశపెట్టడానికి సమర్థించారు.

    ఈ సేవలు ఎప్పటి నుంచి షురూ? 
    చట్టబద్ధ అనుమతి వచ్చినప్పటికీ వాటర్ క్రిమేషన్ సేవలు వెంటనే ప్రారంభం కావు. ఈ కేంద్రాలు ప్రారంభం కావాలంటే మరిన్ని అనుమతులు అవసరం. అధికారుల అంచనా ప్రకారం.. మొదటి వాటర్ క్రిమేషన్ కేంద్రం 9 నెలల్లో ప్రారంభం కావచ్చు.  

    ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ
    వాటర్ క్రిమేషన్ ఇప్పటికే కెనడా, ఐర్లాండ్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో అమలులో ఉంది. వాటర్ క్రిమేషన్ ద్వారా పర్యావరణ ప్రయోజనాలు ఉండడంతో అనేక కుటుంబాలు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నాయి. పర్యావరణ సంస్థలు స్కాట్లాండ్ నిర్ణయాన్ని ప్రశంసించాయి. భవిష్యత్తులో ఇంగ్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి చట్టాలు రావచ్చు.

     

  • అహ యేమి హాయిలే హలా.. అంటూ హాయిగా స్నానం చేసే భాగ్యం కూడా ఇప్పుడు ఇజ్రాయెల్‌ ప్రజలకు లేదు. ఇరాన్‌ దాడుల వేళ నచ్చినప్పుడు బాంబ్‌ షెల్టర్ల నుంచి బయటికొచ్చి ఇంట్లో కిటికీల సమీపంలో స్నానం చేసే ఆస్కారం ఇప్పుడు ఇజ్రాయెల్‌ ప్రజలకు లేదు. ఇంట్లో స్నానం చేసేటప్పుడు బాంబులు పడితే ఇక అంతే. అందుకే ఇప్పుడు ఇజ్రాయెలీల స్నానభయాలను పోగొట్టేందుకు కొత్త యాప్‌ అందుబాటులోకి వచ్చింది. రోజులో ఏ సమయంలో క్షిపణులు తక్కువ పడే అవకాశం ఉందో అంచనావేసి యూజర్లకు సూచిస్తుంది. అవసరం.. ఆవిష్కరణకు తల్లిలాంటిది అంటారు.

    అలా ఇజ్రాయెలీల పలు రకాల అవసరాలకు తగ్గట్లు వినూత్న యాప్‌లు ఇప్పుడు ఆ దేశంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. రాకెట్‌లు తక్కువగా పడే సమయాన్ని దాదాపు ఖచ్చితంగా అంచనావేసి చెప్పే ‘కెన్‌ ఐ షవర్‌?(నేనిప్పుడు స్నానం చేయొచ్చా?’అనే యాప్‌ ఇప్పుడు అక్కడ తెగ ఆదరణ పొందుతోంది. ఇప్పటికే అంకురసంస్థల దేశంగా పేరొందిన ఇజ్రాయెల్‌లో ఇప్పుడు ఈ యాప్‌కు ట్రెండింగ్‌లో ఉంది. యాప్‌ను ఉపయోగించే యూజర్‌ ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నాడు? బాంబు షెల్టర్‌ నుంచి అతని స్నానాల గది ఎంత దూరంలో ఉంది? అతను ఎంతసేపు స్నానంచేస్తాడు?

    స్నానంచేశాక తిరిగి బాంబుషెల్టర్‌కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది? అనే వివరాలను యాప్‌కు అందజేస్తే ఆయా వ్యక్తులు స్నానంచేసే వేగం, షెల్టర్‌ దూరం, క్షిపణులు పడే అవకాశాలను గణించి ఆయా వ్యక్తులకు తగ్గట్లుగా ‘స్నానం సమయం’ను యాప్‌ సూచిస్తుంది. రోజులో ఎన్ని గంటలకు బాత్రూమ్‌కు వెళ్లాలో చెబుతుంది. రాకెట్లు పడిన సమయాలు, ఎంతసేపు పడ్డాయి, ఎక్కడ పడ్డాయి, ఎంత సేపు ప్రభుత్వం అలర్ట్‌లు, సైరన్‌లు ఇచ్చిందనే డేటాను విశ్లేషించి ఆరోజుకు ‘సురక్షిత స్నాన సమయం’ను యాప్‌ సూచిస్తుంది. ‘హోం ఫ్రంట్‌ కమాండ్‌’, ‘రెడ్‌ అలర్ట్‌’వంటి యాప్‌లు సైతం వార్నింగ్‌ సందేశాలను పంపిస్తూ పౌరులను అప్రమత్తం చేస్తున్నాయి.

    యుద్ధంలోనూ ప్రేమ.. 
    యుద్ధజ్వాలల్లోనూ ప్రేమాగ్నిలో కరిగిపోయే జంటలు, యువత కోసం విభిన్నమైన యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. పనిమీద బయటికొచ్చాక సైరన్‌లు మోగగానే సమీప బంకర్‌ వైపు పరుగెడతారు. అప్పటికే ఆ బంకర్‌లో మనకు తెల్సిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? మనతో ఆత్మీయంగా మాట్లాడేందుకు ఎవరైనా ఆసక్తిచూపిస్తున్నారా? అని తెల్సుకునేందుకు కొన్నియాప్‌లు రంగంలోకి దూకాయి. బంకర్‌ ముఖద్వారాల వద్ద క్యూఆర్‌ కోడ్‌లను అందుబాటులోకి తెచ్చా రు. ఆ కోడ్‌ను స్కాన్‌చేస్తే ఆ బంకర్‌లో ఉన్న వాళ్ల సోషల్‌మీడియా ప్రొఫైళ్లు ప్రత్యక్షమవుతాయి. కావాలంటే వాళ్లకు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపడం లేదా చాటింగ్‌ మొదలెట్టవచ్చు. ఏకాకులుగా ఉండిపోయిన సింగిల్స్‌తో మాట్లాడించే డేటింగ్‌ యాప్‌లూ బాంబర్‌ల వద్ద క్యూఆర్‌ కోడ్‌రూపంలో ప్రత్యక్షమవుతున్నాయి.  

    సురక్షిత మార్గాలనూ చూపుతూ.. 
    ఇప్పటిదాకా క్షిపణులు పడని ప్రాంతాలను గుర్తించి స్థానికులకు ఆయా సమాచారాన్ని కొన్ని యాప్‌లు చేరవేస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతం గుండా వెళ్లే ఇతరులు ఆ డేటా ప్రకారమే సురక్షిత రోడ్లు మార్గాల్లోనే ప్రయాణించేందుకు అవకాశం చిక్కుతోంది. వేరే ప్రాంతాలకు వచ్చినప్పుడు సమీపంలోని షెల్టర్‌ లొకేషన్‌ను సూచించే యాప్‌లు వచ్చేశాయి. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

  • ఇరాన్‌ సుప్రీం ఆయతుల్లా ఖమేనీ అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన హత్యతో పశ్చిమాసియా భగ్గుమంది. ఇరాన్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే ఖమేనీ హత్యపై  ఇరాన్ దేశ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ తీవ్రంగా స్పందించారు. తమ దేశ సుప్రీం హత్యకు ట్రంప్ మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు.

    ఫిబ్రవరి 28 ఇరాన్ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ.. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడిలో మృతి చెందారు. దీంతో ఇరాన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రతీకారేచ్చతో రగిలిపోయి ఏక కాలంలో గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతుంది. తాజాగా ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లారిజానీ ఈ అంశంపై స్పందించారు.  ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.

    "మేము మా నాయకుడి రక్తానికి మా ప్రజల మృతికి నిరంతరం ప్రతీకారం తీర్చుకుంటాం. ట్రంప్ దీనికి మూల్యం చెల్లించాలి. చెల్లిస్తాడు కూడా మేము ఆయనను ఒంటరిగా వదిలిపెట్టం, అతను మా నాయకున్ని చంపడంతో పాటు 1000 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నాడు. ఇది మాములు విషయం కాదు " అని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇస్లామిక్ రిపబ్లిక్‌ను విడగొట్టే కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు.

    వెనెజువెలా మాదిరి ఇరాన్‌లో కూడా ప్రభుత్వాన్ని  కూలదోయాలనుకున్నారు. కానీ వారు అనుకున్న విధంగా జరగలేదు. ఇరాన్‌లోని పరిస్థితిని అంచనా వేయడంలో వారు పూర్తిగా విఫలమయ్యారని లారిజానీ అన్నారు.  గల్ఫ్ దేశాలు వారి దేశంలో నుంచి తమపై దాడి చేయకుండా నియంత్రించాలని లేని పక్షంలో ప్రతి దాడి చేయడం తప్పదన్నారు.

    లారిజానీ ఖమేనీకి సన్నిహితుడు ఇతను గతంలో IRGCలో పనిచేశారు. ఇతని సోదరుడు సాదిక్ లారిజానీ ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ పోటీదారులలో ఒకరు.

  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నారీ శక్తి గురించి చర్చలు జరుగుతున్నాయి. వయసు మారుతున్న కొద్దీ మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, మెరుగైన జీవన ప్రమాణాలను పెంపొందించుకునేందుకు ‘ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్’ కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏ వయసులో ఏయే పరీక్షలు చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

    20 ఏళ్ల ప్రాయంలో వ్యాక్సినేషన్
    జీవితంలో అత్యంత చురుగ్గా ఉండే 20 ఏళ్ల వయసులో మహిళలు తమ ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలి. ఈ దశలో ప్రధానంగా గర్భాశయ క్యాన్సర్ నివారణకు పాప్ స్మియర్ పరీక్షతో పాటు, హెచ్ పీవీ (HPV) వ్యాక్సినేషన్ తీసుకోవడం ఉత్తమం. వీటితో పాటు రక్తహీనతను గుర్తించే హిమోగ్లోబిన్ పరీక్ష, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరిశీలించుకోవాలి. నెలసరిలో ఏవైనా అసాధారణ మార్పులు ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం తప్పనిసరి.

    30 ఏళ్లలో క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్
    ముప్పై ఏళ్లలో అడుగుపెట్టిన తర్వాత సంతానోత్పత్తి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడంతో పాటు మెటబాలిక్ సమస్యలపై మహిళలు దృష్టి పెట్టాలి. ప్రతి 3 నుంచి 5 ఏళ్లకోసారి పాప్ స్మియర్ పరీక్షను కొనసాగించాలి. మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలు, విటమిన్ లోపాలను గుర్తించే పరీక్షలు చేయించుకోవడం అవసరం. ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉంటే, ముందస్తుగా క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం మేలు.

    40 ఏళ్లలో బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్
    నలభై ఏళ్లు దాటిన మహిళల్లో 'పెరీ మెనోపాజ్' (మెనోపాజ్ ముందు దశ) లక్షణాలు మొదలవుతాయి. ఈ వయసులో ప్రతి రెండేళ్లకోసారి మమోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చు. రక్తపోటు, థైరాయిడ్, హార్మోన్ల స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించాలి. అవసరమైతే ఎముక సాంద్రతను తెలిపే 'బోన్ డెన్సిటీ' పరీక్షను కూడా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

    50 ఏళ్లలో హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ
    యాభై ఏళ్ల వయసులో మెనోపాజ్ కారణంగా ఎముకలు బలహీనపడటం, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ దశలో బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్, కార్డియాక్ రిస్క్ అసెస్‌మెంట్, కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరి. హాట్ ఫ్లాషెస్, నిద్రలేమి తదితర సమస్యలు తీవ్రంగా ఉంటే హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (HRT)పై  వైద్యుల సలహా తీసుకోవాలి.

    60 ఏళ్ల పైబడిన తర్వాత..
    అరవై ఏళ్లు దాటిన తర్వాత కిడ్నీ (RFT), లివర్ (LFT) ఫంక్షన్ టెస్టులతో పాటు జ్ఞాపకశక్తికి సంబంధించిన 'కాగ్నిటివ్ హెల్త్' పరీక్షలు చేయించుకోవాలి. మెనోపాజ్ తర్వాత అకస్మాత్తుగా రక్తస్రావం కావడం లేదా పొత్తికడుపులో వాపు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టరును  కలవాలి.
    ముందస్తుగా చేయించుకునే ఇటువంటి ఆరోగ్య పరీక్షలు ప్రాణాంతక వ్యాధులను ప్రారంభంలోనే అడ్డుకునేందుకు సహకరిస్తాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరీక్షలు చేయించుకోవడం వల్ల చికిత్స ఖర్చు తగ్గడమే కాకుండా, ఆయుష్షు కూడా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

    ఇది కూడా చదవండి: Women's Day: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్‌ స్కాలర్‌ విజయ గాథ

  • వాషింగ్టన్‌: న్యూయార్క్‌ మేయర్‌ జోహ్రాన్ మమ్దాని ఇంటి వద్ద కలకలం చెలరేగింది. మామ్దానికి చెందిన గ్రేసీ మాన్షన్ ఇంటి ముందు ఓ వ్యక్తి పేలుడు పదార్థాలను విసిరాడు. ఫార్‌ రైట్‌ ఇన్‌ప్లుయెన‍్సర్‌ జేక్ లాంగ్.. గ్రేసీ మాన్షన్ ముందు "ఇస్లామీకరణ"కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్‌లో ప్రజలు తిరిగే ప్రాంతాల్లో ముస్లింలు ప్రార్థనలు నిలిపివేయాలని జేక్ లాంగ్ డిమాండ్ చేశారు.

    న్యూయార్క్ పోలీస్ శాఖ కమిషనర్ జెసికా టిష్ తెలిపిన వివరాల ప్రకారం.. నిరసనకారుడు విసిరిన పరికరంలో నట్స్, బోల్ట్స్, స్క్రూలు, ఫ్యూస్ ఉన్నాయి. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు, ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధానికి సంబంధం లేదని అధికారులు చెప్పారు. ముస్లిం మేయర్ అయిన మమ్దానిపై “ఇస్లామీకరణ” ఆరోపణలు చేస్తూ ఈ నిరసన తెలిపారని అన్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. సుమారు 20 మంది నిరసనలో పాల్గొన్నారు.  

    నలుపు రంగు హుడ్ స్వెట్షర్ట్, బేజ్ కార్గో ప్యాంట్ ధరించిన వ్యక్తికి మరొక కార్యకర్త టేప్ చుట్టిన, పొగ వస్తున్న పరికరం ఇచ్చాడు. ఆ వ్యక్తి పోలీసుల దగ్గర ఆ పరికరం వదిలి, వెంటనే అక్కడి బారికేడ్‌ను దాటి వెళ్లాడు.

    అదే వ్యక్తి లాంగ్ చుట్టూ నిలిచిన నిరసనకారుల దగ్గర ఇలాంటి మరొక పరికరం విసిరాడు. “ఆ పరికరం నుంచి మంటలు, పొగ వచ్చాయి. అది పోలీసుల దగ్గర కొన్ని అడుగుల దూరంలో ఉన్న బారికేడ్‌ను కూడా తాకింది” అని అధికారులు తెలిపారు. అనుమానితుడు 18 ఏళ్ల అమీర్ బాలట్ అని అన్నారు. నిరసన జరిగిన ప్రదేశంలో భారీగా మోహరించిన పోలీసులు వెంటనే నిందితుడిని, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

    “బాంబు స్క్వాడ్ అక్కడికి చేరుకుంది. ప్రాథమిక పరీక్షలు, ఎక్స్‌రే పరిశీలన తర్వాత ఆ పరికరాలు ఫుట్‌బాల్ కంటే కొద్దిగా చిన్న పరిమాణంలో ఉన్న సీసాల్లా  కనిపించాయి. వాటిపై నల్ల టేప్ చుట్టి, లోపల నట్స్, బోల్ట్స్, స్క్రూలు, హాబీ ఫ్యూస్ అమర్చారు” అని అధికారులు చెప్పారు. ఆ పరికరాల్లో నిజంగా పేలుడు పదార్థం ఉందా అనే విషయం ఇంకా తెలియరాలేదు. జేక్‌ లాంగ్ టీమ్‌ నుంచి ఒక నిరసనకారుడు పెప్పర్ స్ప్రే వాడాడని, ఆ ఘటనలో పోలీసులు అతనిని కూడా అరెస్ట్ చేశారని అధికారులు తెలిపారు.

     

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై రాజ్యసభ ఎంపీ కమల్‌ హాసన్‌ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. రెండు సౌర్వభౌమాధికారం ఉన్న దేశాలు అభిప్రాయాలను పరస్పరం గౌరవించుకోవడమే ప్రపంచ శాంతికి పునాది రాయన్నారు.  అవతలి వారి విషయాల్లో తలదూర్చకుండా ట్రంప్ తన పని తాను చూసుకోవాలని హెచ్చరించారు.

    ఇండియా విషయంలో ట్రంప్ వ్యవహార శైలి తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఇది వరకే భారత అంతరంగిక విషయాలు పలు మార్లు అమెరికా అధ్యక్షుడు బహిరంగ విమర్శలు చేశారు. వీటిని భారత్ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ ట్రంప్ తీరు మార్చుకోలేదు. తాజాగా రష్యా నుంచి భారత్ నెల రోజుల పాటు  చమురు కోనుగోలు చేసుకోవచ్చని దానికి అనుమతిచ్చామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అన్నారు. ఈ వ్యాఖ్యల  పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.  

    తాజాగా ఈ అంశంపై రాజ్యసభ ఎంపీ కమల్‌ హాసన్‌ స్పందించారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా ట్రంప్‌కు లేఖ రాశారు. " ప్రియమైన ప్రెసిడెంట్  భారత ప్రజలు సౌర్వభౌమ దేశానికి చెందిన వారు. మాకు వేరే దేశాల అనుమతులు అవసరం లేదు. దయచేసి మీ సామర్థ్యం మేరకు మీ పని చూసుకొండి" అన్నారు. సౌర్వభౌమ దేశాల అభిప్రాయాలకు పరస్పర గౌరవమివ్వడమే శాంతికి మూలమని మీ దేశ ప్రజలకు  శాంతి, సౌభాగ్యం లభించాలని కోరుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.

    అంతకు మందు స్కాట్ బెసెంట్ " ఇండియన్స్ మంచి యాక్టర్స్, వారికి మేము రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపాలని కోరాం. వారు అలానే చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్యా ఆజ్ఞలకు తాత్కాలిక విరమింపు ఇచ్చాం. వారికి చమురు కొనుగోలుకు అనుమతి ఇచ్చాం" అని అన్నారు. దీంతో బీసెంట్‌ వ్యాఖ్యలపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

National

  • ఢిల్లీ: దేశంలోనే తొలి ‘రింగ్ మెట్రో’ను ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించి రెండు కొత్త కారిడార్లను ప్రధాని ప్రారంభించారు. 12.3 కిలో మీటర్ల పొడవు కలిగిన మజ్లిస్ పార్క్-మౌజ్‌పూర్-బాబర్‌పూర్ (పింక్‌లైన్), 9.9 కిలోమీటర్ల దూరం విస్తరించిన దీపాలి చౌక్-మజ్లిస్ పార్క్‌ (మజెంటా లైన్) కారిడార్‌లను మోదీ ప్రారంభించారు.

    మజ్లిస్ పార్క్ - మౌజ్‌పూర్ - బాబర్‌పూర్ కారిడార్.. ఈ కారిడార్‌లో ఎనిమిది ఎలివేటెడ్ స్టేషన్లు ఉన్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న మజ్లిస్ పార్క్ - శివ్ విహార్ పింక్ లైన్‌లో భాగంగా ఉంటుంది. ఈ కొత్త మార్గంతో పింక్ లైన్ మొత్తం పొడవు 71.56 కిలోమీటర్లు. దీంతో ఇది భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్థాయి 'రింగ్ మెట్రో'గా అవతరించింది. మజ్లిస్‌ పార్క్, బురారీ, జరోడా మజ్రా, జగత్‌పూర్-వజీరాబాద్, సూర్ఘాట్, నానక్సర్-సోనియా విహార్, ఖజూరీ ఖాస్, భజన్‌పురా, యమునా విహార్, మౌజ్‌పూర్-బాబర్‌పూర్ స్టేషన్లు ఉన్నాయి.

    ఈ మార్గంలో యమునా నదిపై కొత్త వంతెన, మెట్రో లైన్, రోడ్డు ఫ్లైఓవర్ రెండూ ఉండేలా నిర్మించిన 'డబుల్ డెక్కర్ వయాడక్ట్' ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీపాలి చౌక్ - మజ్లిస్ పార్క్ కారిడార్.. ఇది బొటానికల్ గార్డెన్ - కృష్ణా పార్క్ ఎక్స్టెన్షన్ మెజెంటా లైన్‌కు ఎలివేటెడ్ పొడిగింపు. ఇందులో ఏడు స్టేషన్లు ఉన్నాయి.  ఈ కారిడార్‌ మొత్తం పొడవు 49 కిలోమీటర్లు.. దీపాలి చౌక్, మధుబన్ చౌక్, ఉత్తర పితాంపుర-ప్రశాంత్ విహార్, హైడర్‌పూర్ విలేజ్, హైడర్‌పూర్ బాద్లీ మోర్, భల్స్వా, మజ్లిస్ పార్క్ స్టేషన్లు ఉన్నాయి. దీపాలి చౌక్-మజ్లిస్ పార్క్ కారిడార్ 28.36 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. ఇది ఢిల్లీ మెట్రో స్టేషన్లలోనే అత్యంత ఎత్తైనది. వీటితోపాటు మరో మూడు కొత్త కారిడార్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

  • న్యూఢిల్లీ:  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్‌ పర్యటనకు సంబంధించి సరైన ఏర్పాట్లు చేయకపోవడం కేంద్రం తీవ్ర ఆగ్రహం‍ వ్యక్తం చేసింది. రాష్ట్రానికి రాష్టపతి వస్తే.. ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ కనీసం పట్టించుకోరా అంటూ మండిపడింది. దీనికి సమాధానం చెప్పాలంటూ రాష్ట్ర  చీఫ్‌ సెక్రటరీ నందిని చక్రవర్తిని కేంద​ హోం సెక్రటరీ గోవింద్‌ మోహన్‌ వివరణ కోరారు.  

    సాధారణంగా రాష్ట్రపతి ఒక రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు స్వాగతం పలకడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ముర్ముకు రాష్ట్రం నుంచి ఎటువంటి స్వాగతం కానీ ఆహ్వానం కానీ లభించలేదు. దీన్నే కేంద్రం ప్రధానంగా ప్రస్తావించింది. 

    ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్‌లు.. రాష్ట్రపతిని ఆహ్వానించడానికి కానీ వీడ్కోలు చెప్పడానికి కానీ ఎందుకు హాజరు కాలేదు? రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్‌రూమ్‌లో నీరు లేదు 3)  రాష్ట్రపతి వచ్చే మార్గం చెత్తతో నిండి ఉంది 4) డార్జిలింగ్ జిల్లా మేజిస్ట్రేట్, సిలిగురి పోలీసు కమిషనర్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ బాధ్యులు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. దీనికి ఐదు గంటల్లోగా సమాధానం చెప్పండి’ అంటూ  కేంద​ హోం సెక్రటరీ గోవింద్‌ మోహన్‌ ఆదేశించారు.

    అదొక ప్రైవేట్‌ ఆర్గనైజేషన్‌: సీఎం మమతా
    సిలిగురిలో జరిగిన 9వ అంతర్జాతీయ ఆదివాసీ సంతల్ సమావేశానికి గౌరవనీయులైన రాష్ట్రపతిని ఆహ్వానించారు. అంతర్జాతీయ సంతల్ కౌన్సిల్ అనేది ప్రైవేట్‌ ఆర్గనైజేషన్‌.  ఈ కార్యక్రమం ఏర్పాట్లకు సిబ్బంది తగినంత లేరని జిల్లా యంత్రాంగం రాష్ట్రపతి కార్యాలయానికి  లిఖిత పూర్వకంగా తెలియజేసింది. ఫోన్‌ ద్వారా కూడా తెలియజేశాం. 

    గౌరవనీయులైన రాష్ట్రపతిని మేయర్ సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్, డిఎం డార్జిలింగ్   సిలిగురి పోలీస్ కమిషనరేట్ స్వాగతించి, వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి సచివాలయం ఆమోదించిన లైనప్ ప్రకారం ఇది జరిగింది.  ఈ లైనప్‌లో ‍కానీ వేదిక ప్రణాళికలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి భాగం కాలేదు. జిల్లా యంత్రాంగం వైపు నుండి ఎటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదు’ అని మమతా ట్వీట్‌ చేశారు. 

    కాగా, 9వ అంతర్జాతీయ సంతల్ సదస్సులో పాల్గొనడానికి సిలిగురికి వచ్చిన తనకు.. ముఖ్యమంత్రి నుంచి, రాష్ట్ర  మంత్రుల  నుంచి కూడా తనకు ఆహ్వానం అందలేదన్నారు ముర్ము. ‘మమత నా చెల్లెలు లాంటిది. బహుశా ఆమె కోపంగా ఉండవచ్చు.  నేను బెంగాల్‌ పర్యటనకు వస్తే ఆమె నన్ను పట్టించుకోలేదు. సంతాల్‌ దివస్‌కు సరైన ఏర్పాట్లు చేయలేదు.  ఆ కార్యక్రమానికి మమత హాజరు కాకపోవడం నన్ను బాధించింది.

    ఆమె అంతర్జాతీయ కార్యక్రమాన్ని ఇంత ఇరుకైన ప్రదేశంలో నిర్వహించాలని ఎంచుకుందో నాకు తెలియదు. వేదిక పెద్దదిగా ఉంటే, సమావేశానికి ఎక్కువ మంది హాజరయ్యేవారు అని ఆమె బిధాన్‌నగర్‌లో జరిగిన మరో కార్యక్రమంలో స్పష్టం చేశారు.. బిధాన్‌నగర్‌లో సమావేశం జరిగి ఉంటే ఐదు లక్షల మంది సులభంగా హాజరయ్యేవారని కూడా ముర్ము ప్రధానంగా  ప్రస్తావించారు.

    రాష్ట్రపతితో రాజకీయాలు సరికాదు
    రాష్ట్రపతితో కూడా రాజకీయాలు చేయాలనుకోవడం సరైనది కాదని ప్రధాని మోదీ నిన్ననే(శనివారం, మార్చి 7వ తేదీ) ఆగ్రహం వ్యక్తం చేశారు.  బెంగాల్‌ పర్యటనలో రాష్ట్రపతిని టీఎంసీ అవమానించింది. టీఎంసీ హద్దు మీరి ప్రవర్తిస్తోంది’ అని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

  • సాఫ్ట్‌వేర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం సృష్టిస్తోంది. సంక్లిష్టమైన కోడింగ్‌ను నిమిషాల్లో పూర్తి చేస్తూ, డెవలపర్ల పనిని మరింత సులభతరం చేస్తోంది. అయితే ఇదే ఏఐపై అతిగా ఆధారపడటం వల్ల తలెత్తుతున్న పరిణామాలు ఇప్పుడు ఐటీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాను రాసిన (ఏఐ సాయంతో) కోడ్‌ను వివరించలేక తోటి ఉద్యోగుల ముందు అభాసుపాలైన ఘటన వెలుగులోకి వచ్చింది.

    సాధారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో డెవలపర్లు తాము రాసిన కోడ్‌ను రివ్యూ కోసం ‘పుల్ రిక్వెస్ట్’ రూపంలో సమర్పిస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ టెక్ కంపెనీకి చెందిన డెవలపర్ ఒక ఫంక్షన్‌కు సంబంధించిన కోడ్‌ను తన టీమ్ లీడర్‌కు పంపాడు. ఆ కోడ్ అద్భుతంగా పని చేస్తోంది. ఎటువంటి ఎర్రర్స్ లేవు. అయితే ఆ కోడ్ వెనుక ఉన్న లాజిక్‌ను వివరించాల్సిందిగా సీనియర్ ఎడిటర్ కోరడంతో అసలు విషయం బయటపడింది. ఆ డెవలపర్ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. నిశ్శబ్దం రాజ్యమేలింది. చివరకు తల దించుకుని తాను ఆ కోడ్‌ను 'క్లాడ్' (Claude) అనే ఏఐ టూల్ నుంచి నేరుగా కాపీ-పేస్ట్ చేశానని తెలిపాడు.

    ఈ ఉదంతాన్ని సదరు టీమ్ లీడర్ ‘ఎక్స్’ వేదికగా పంచుకోవడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ‘అతనికి కోడింగ్ రాదని కాదు.. కానీ తాను స్వయంగా రాయకపోవడం వల్ల అందులోని లాజిక్‌ను విశ్లేషించలేకపోయాడు. ఏఐ ఇచ్చింది.. పంపేశాడు.. అంతే!’ అంటూ ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం 50 శాతం కంటే ఎక్కువ పుల్ రిక్వెస్టుల్లో ఏఐ ప్రమేయం ఉంటోందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. స్టాక్ ఓవర్‌ఫ్లో వంటి వెబ్‌సైట్ల నుంచి గతంలో కోడ్ తీసుకునేవారని, కానీ అప్పట్లో కనీసం ఆ కోడ్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవారని సీనియర్లు గుర్తుచేస్తున్నారు.

    ఇప్పుడు ఏఐ టూల్స్ నేరుగా పరిష్కారాన్ని అందిస్తుండటంతో, యువ డెవలపర్లు మౌలిక సూత్రాలను (Fundamentals) విస్మరిస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. కోడ్ పని చేస్తే చాలు, అది ఎలా ఉన్నదనేది ముఖ్యం కాదు అనే ధోరణి భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ మెయింటెనెన్స్‌లో తీవ్ర ఇబ్బందులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐని ఒక సహాయకారిగా చూడాలే తప్ప, అది ఇచ్చే సమాచారాన్ని కళ్లు మూసుకుని వాడటం వృత్తిపరమైన ఎదుగుదలకు ఆటంకమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

    ఇది కూడా చదవండి: Women's Day: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్‌ స్కాలర్‌ విజయ గాథ

Family

  • స్కేటింగ్‌, స్నోబోర్డింగ్‌ వంటివి చీరతో సాధ్యమయ్యేవి కావు. అందులోనూ మంచు పర్వతాల్లో రెయ్‌రెయ్‌ మని వెళ్లాలంటే శారీతో సాధ్యమైన పనికాదు. కానీ ఇద్దరు మహిళలు చీరతో చాలా ఈజీగా చెయ్యొచ్చని చూపించి అందర్నీ షేక్‌ చేశారు. భారతీయతను ఉట్టిపడేలా చేసే చీరకట్టుతో చేసిన స్నోబోర్డింగ్‌ అందర్నీ కట్టిపడేసింది. ఆరుగజాల చీరలో ఊర్మిలా పేబుల్, లిండా ష్మిటర్‌ అనే ఇద్దరు మహిళలు మంచు పర్వతాల్లో చాలా చక్కగా స్కోబోర్డింగ్‌ చేసి నోటమాట రాకుండా చేశారు. 

    ప్రొఫెషనల్‌ అథ్లెట్లు అయినా ఈ ఇద్దరూ చీరకట్టుతో స్నోబోర్డింగ్‌ చేసే థ్రిల్‌ కోసం చేసినా..అందర్నీ ఆలోచించేలా చేసింది. భారతీయురాలైన ఊర్మిలా పేబుల్‌, తన స్విస్‌ స్నేహితురాలితో కాశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో మంచుకొండలపై ఈ స్టంట్‌ చేశారు. అందుకు సంబంధించిన కమనీయ దృశ్యాల్ని స్వీడిష్‌లో జన్మించిన అడ్వెంచర్ ఫిల్మ్ మేకర్, డ్రోన్ పైలట్ అయిన హెరాల్డ్ ఎడ్లండ్ కెమెరాలో బంధించారు. ఊర్మిళ, లిండా మాదిరిగానే, అతను పారాగ్లైడింగ్, స్పీడ్‌ఫ్లైయింగ్ వంటి అనేక హై-ఇంటెన్సిటీ అడ్వెంచర్ క్రీడలపై ఆసక్తితోపాటు, పర్వత ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించడంలో నిపుణుడు. 

    అయితే ఆ దృశ్యాలకు "శారీ నాట్‌ సారీ" అనే క్యాప్షన్‌ జోడించి మరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది ఊర్మిలా పేబుల్. ఇదిలా ఉండగా, ఊర్మిలా 19 ఏళ్ల ఉత్సాహభరితమైన ప్రొఫెషనల్ స్కేట్‌బోర్డర్. ఐదేళ్ల వయసులో రోలర్‌ స్కేటింగ్‌ నేర్చుకుంది. అలా ఆమెకు స్కేట్‌ బోర్డింగ్‌ పట్ల మక్కువ పెరిగింది. ఇక లిండా ష్మిటర్‌ స్విట్జర్లాండ్‌, హిమాలయాలు, వంటి దిగ్గజ ప్రదేశాలలో సాహసోపేతమైన కంటెంట్‌కు ప్రసిద్ధి చెందింది. అలాగే ఆమెకు బర్టన్, మమ్ముట్ వంటి ప్రధాన బహిరంగ స్నోబోర్డింగ్ బ్రాండ్‌ల నుంచి అనేక స్పాన్సర్‌షిప్‌లు కూడా వచ్చాయి.

     

    (చదవండి: ఫ్లైట్‌ వాష్‌రూమ్‌ని జిమ్‌గా మార్చేశాడుగా..!)

     

  • మహిళా సాధికారత, మహిళా చైతన్యం అని ఏవేవో చెబుతుంటారు గానీ ఇంకా వివక్ష తగ్గలేదనే గణాంకాలు చెబుతున్నాయి. అందుకు నిదర్శనంగా సమాజంలో జరుగుతున్న కొన్ని ఉదంతాలే ఉదాహరణ. వాటిని చూస్తే..ఇంకా ఏ కాలంలో ఉన్నామనే ఫీల్‌ కలుగుతుంది. మహిళలు పురుషులతో సమానమని పైపై మాటలుగా చెబుతుంటారే గానీ వాస్తవికంగా అది పూర్తి స్థాయిలో జరగదు. అయినప్పటికీ కొందరు ధీర వనితాలు.. ఆ మాటను అక్షరాల నిజం చేసి..అందర్నీ ఆశ్చర్యపరిచేలా సక్సెస్‌ని అందుకుంటున్నారు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా వివక్ష, గృహహింసను ఎదుర్కొంటూనే అంచలంచెలుగా ఎదిగిన ఈ నారీమణి గురించి తెలుసుకుందామా. పైగా పురుషాధిక్య వ్యాపారమైన వైన్‌ బిజినెస్‌లో రాణిస్తున్న ఏకైక మహిళగా పేరు కూడా తెచ్చుకుందామె. ఇంతకీ ఎవరామె అంటే..

    ఆ శక్తిమంతమైన మహిళే 45 ఏళ్ల నమ్రత స్టాన్లీ. బెంగళూరు చెందిన నమ్రత కుటుంబంలో కూడా ఆడపిల్లకు ఉద్యోగం ఎందుకు అనే భావజాలం ఎక్కువగా ఉండేది. అంతగా ఆడపిల్లలకు ప్రాధాన్యతలోని తన కుటుంబంలో తండ్రి తీరు అస్సలు నచ్చేది కాదు నమ్రతకు. ఆమె తల్లి గృహిణిగి ఇంటి బాధ్యతలు చూసుకోవాలి. ఆయన ఇంటి నిర్ణయాలన్నింటిని తీసుకునేవారు. మా అమ్మకు ప్రతిభ ఉన్న ఇంటి గోడలకే పరిమితం చేశారాయన. ఇక నమ్రత ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో హాస్పిటాలిటీ చదివింది, అలాగే పాటిస్సేరీ(డెజర్ట్స్‌ తయారీ) నైపుణ్యం ఉందామెకు. 

    2024లో సరిగ్గా పెళ్లైంది. ఇక అక్కడ కూడా ఆడపిల్లలకు జాబ్‌ అనవసరం అనే అభిప్రాయమే బలంగా ఉండేది. అంతేగాదు ఆమె అ‍త్తారింటిలో చీరకట్టుకుంటే గానీ బయటకు రాకూడదు, కనీసం స్నేహితులను కలవకూడదు, బేకరీ లాంటి వ్యాపారం వంటివి ఏమి చేయకూడదు. ఇంతలో 2007లో తనకు పాప జన్మించడంతో గృహహింస, ఛీత్కారాలు మొదలయ్యాయి. ఇవన్ని కూడా ఆమెను ఆపలేకపోయాయి. వీటన్నింటిని తట్టుకుంటూనే బెంగళూరులోని అలయన్స్ ఫ్రాంకైస్ స్థానిక కేంద్రానికి సమీపంలో నివసిస్తున్న ఆమె రహస్యంగా ఫ్రెంచ్ తరగతుల్లో చేరింది. 

    మార్కెట్‌కి వెళ్తున్నా అని ఫ్రెంచ్‌ క్లాస్‌లకు వెళ్లేది. రాత్రిపూట కూతుర్ని పడుకోబెట్టి హెడ్‌ఫోన్‌లలో చదువుకునేది. ఇక తన కుటుంబానికి తానెంటో చూపాలనే ఉద్యేశ్యంతో 2013లో రెజ్యూమ్‌ని ఒక జాబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. అయితే స్టాన్లీ స్కిల్స్‌కి ఫిదా అయ్యి ఒక ఫ్రెంచ్‌ ఐటీ సంస్థ ఆమెను పారిస్‌లో నియమించుకుని శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. తన పాపను అమ్మ చూసుకుంటుందని ఒప్పించి, భర్త అనుమతితో వెళ్లింది. అది కూడా ఒక నెలపాటు ట్రైనింగ్‌కి మాత్రమే పంపించారు స్టాన్లీని. 

    అయితే స్టాన్లీ అక్కడ విజయవంతంగా ట్రైనింగ్‌ని పూర్తిచేసుకుని కుమార్తె కోసం ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఫ్రెంచ్‌కి వెళ్లినప్పుడు సరదాగా భుజం మీద వేయించుకున్న టాటు కారణంగా భర్త ఆగ్రహానికి గురైంది. ఆ తర్వాత బెంగళూరులో జాబ్‌లు అన్వేషిస్తున్న ఆమెను వారించే ప్రయత్రం చేయడమే గాక, ఆమె పాస్‌పోర్ట్‌ని మాయం  చేయడం, అర్థరాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు పంపించేయడం వంటి టార్చర్‌ ఎక్కువైంది. దాంతో ఆ గృహహింస నుంచి బయటపడి 2017లో తల్లి మద్దతుతో ఫ్రాన్స్‌ బోర్డియక్స్‌లో వైన్ మార్కెటింగ్ అండ్‌ మేనేజ్‌మెంట్ MBA ప్రోగ్రామ్‌లో చేరింది. 

    చెప్పాలంటే ఆ క్లాస్‌లో అందరికంటే పెద్దది స్టాన్లీనే..అయినా సరే..లక్ష్యంపైనే ఫోకస్‌ పెట్టేది స్టాన్లీ. వైన్‌ తయారీ ప్రక్రియకు సంబంధించి.. ద్రాక్షపండను పండించడం నుంచి వైన్‌గా మారే వరకు ప్రతిదాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంది. అదీగాక బోర్డియక్స్‌లోని కఠినమైన చట్టాలు నీటిపారుదలను నిషేధిస్తాయి, దాంతో ద్రాక్ష పాదులను పండించడం చాలా సవాలుగా ఉండేది. అదే తనకు స్ట్రాంగ్‌గా పోరాడుతూ నిలబడటం ఎలాగో నేర్పిందని అంటోంది స్టాన్లీ. అలాగే ఈ వైన్‌ తయారీలో ప్రతి దశ చాలా కచ్చితత్వం అవసరమని అంటోంది. 

    ఆ తర్వాత వైన్‌ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని..వైన్‌ తయారీ కేంద్రాల నుంచి నేరుగా సోర్సింగ్‌ చూస్తూ..కంపెనీని బోర్డియక్స్‌లో నమోదు చేయించుకుంది. క్రమేణ తన సొంత బ్రాండ్‌ 'సోలికాంటస్‌' పేరుతో వైన్‌ని విక్రయించే రేంజ్‌కు చేరింది. ఇక్కడ సోలి అంటే నేల, కాంటస్‌ అంటే లాటిన్‌లో శ్రావ్యత. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే ఈ వైన్‌ వ్యాపార సామ్రాజ్యంలో శక్తిమంతమైన వ్యాపారవేత్తగా సాగుతూ..మహిళలు ఎందులోనైనా రాణించగలరు అని చాటి చెబుతోంది. అంతేగాదు స్టాన్లీ వైన్‌ నాణ్యత, రుచిని నిర్ణయించేది కూడా ఆమెనే కావడం విశేషం. 

    (చదవండి: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్‌ స్కాలర్‌ విజయ గాథ)
     

  • నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఈ సందర్భంగా స్ఫూర్తిదాయక మహిళలను గుర్తుచేసుకోవడం మన కర్తవ్యం. కేరళకు చెందిన రేవతి విజయన్  ఓ వైపు ఉన్నత చదువుల కోసం ‘పరిశోధన’ సాగిస్తూ, మరోవైపు కుటుంబాన్ని  ఆదుకునేందుకు అర్ధరాత్రి వరకు ఇడ్లీల వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఒట్టపాలం మయన్నూర్ వంతెన సమీపంలో రాత్రిపూట రోడ్డు పక్కన ఆమె నడుపుతున్న చిన్నపాటి ఇడ్లీ స్టాల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది.

    త్రిస్సూర్ జిల్లా పజయన్నూర్ నివాసి అయిన 30 ఏళ్ల రేవతికి చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో మక్కువ. తండ్రి విజయన్ టైలర్ కాగా, తల్లి ప్రియ పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తున్నారు. త్రిస్సూర్‌లోని విమల కళాశాలలో మలయాళంలో డిగ్రీ, అనంతరం ఒట్టపాలం ఎన్ఎస్ఎస్ కళాశాలలో రేవతి బీఈడీ పూర్తి చేశారు. తన చదువు ఖర్చుల కోసం కుటుంబంపై భారం పడకూడదనే ఉద్దేశంతో రేవతి ట్యూషన్లు చెబుతూ, ఆర్థిక స్వాలంబన సాధించారు.

    వివాహం, ఇద్దరు పిల్లల బాధ్యతల మధ్య తన విద్యాభ్యాసం ఆగిపోతుందేమోనని రేవతి ఆందోళన చెందారు. అయితే తిరిగి పుస్తకం చేత పట్టి, పీజీ పూర్తి చేయడమే కాకుండా, గోల్డ్ మెడలిస్ట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొదటి ప్రయత్నంలోనే ‘నెట్’ (NET) అర్హత సాధించారు. అనంతరం  రేవతికి పీహెచ్‌డీ చేసే అవకాశం లభించింది. అయితే ఇందుకోసం ప్రతిరోజూ పజయన్నూర్ నుంచి త్రిస్సూర్ వరకు ప్రయాణించడం ఆర్థికంగా భారమైంది. దీంతో రాత్రిపూట ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న రేవతి మయన్నూర్ వంతెన వద్ద ‘ఫ్రెష్ మూన్’ పేరుతో ఇడ్లీ స్టాల్ ప్రారంభించారు.

    కేవలం సాధారణ ఇడ్లీలే కాకుండా.. తట్టు ఇడ్లీ, మసాలా ఇడ్లీ, ఎగ్ ఇడ్లీ, మటన్ ఇడ్లీ, చికెన్ ఇడ్లీ, పొడి ఇడ్లీ వంటి దాదాపు 10 రకాల వైవిధ్యమైన రుచులతో వినియోగదారుల మనసు గెలుచుకుంటున్నారు. రేవతి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కళాశాలలో పరిశోధన పనుల్లో నిమగ్నమై, సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12:30 గంటల వరకు స్టాల్ దగ్గర కష్టపడుతుంటారు. ఈ ప్రయాణంలో ఆమె భర్త అనూప్, సోదరి గౌరీ నంద ఆమెకు  సాయంగా నిలుస్తున్నారు. 

    ఇది కూడా చదవండి: రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం

  • ‘‘శేఖర్‌ గారూ! మీ ఆవిడకు ఎంబ్రియోస్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్జరీ చాలా బాగా జరిగిందండీ! ఐవీఎఫ్‌ ప్రాసెస్‌లోని ప్రధానాంకం ముగిసింది. సక్సెస్‌ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తనను ఓ ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్‌లో అబ్జర్వేషన్‌లో ఉంచి, ఇంటికి పంపిస్తాము. ఇచ్చిన మెడిసిన్స్‌ జాగ్రత్తగా వాడుకుంటూ, పదిహేను రోజుల తరువాత బ్లడ్‌ టెస్ట్‌కి రావాల్సి ఉంటుంది. ఓకేనా?’’ చెపుతున్న డాక్టర్‌ మాటలను శ్రద్ధగా ఆలకిస్తూ, సరేనన్నట్లు తలాడించి, ‘‘థాంక్స్‌ డాక్టర్‌గారూ..!’’ అన్నాను.‘‘ఇంకా రెండుసార్లు వాడుకునేందుకు మీ ఎంబ్రియోస్‌ ఉన్నప్పటికీ మీకా అవసరం రాకపోవచ్చు లెండి. ఆల్‌ ది బెస్ట్‌! ఆమెను జాగ్రత్తగా చూసుకోండి!...’’ అంటూ ముందుకు కదిలింది డాక్టర్‌.‘ఇప్పుడు సక్సెస్‌ అయితే అయినట్లు. లేదంటే, నేరుగా ఎడాప్షన్‌ కు వెళ్ళిపోవడమే. గత నాలుగైదేళ్ళ నుంచి పడినపాట్లు చాలు. ఇంకా శ్రావ్యను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు...’ అనుకుంటూ, మగతగా పడుకున్న తనను కదిలించకుండా, బ్రేక్‌ఫాస్ట్‌ చేసి వద్దామని బయటకు నడిచాను. అలవాటుగా సుబ్బన్న బడ్డీ హోటల్‌ దాపుకు చేరుకున్నాయి నా కాళ్ళు. 

    అక్కడి అనూహ్య దృశ్యాన్ని చూసి, నా చిన్నకళ్ళు పెద్దవయ్యాయి. ఆకలిని రెట్టింపు చేసే దోసెలను, అలసటను ఆవిరి జేసే ఇడ్లీలను, నోరును ఊట బావిగా మార్చేసే పూరీలను కొసరి కొసరి వడ్డిస్తూ, ఆ పదార్థాలంత కమ్మగా పలకరిస్తూ, పైరగాలి వీచినంత ఒడుపుగా పొట్లాలు కడుతూ నిత్యం పారే ఏరల్లే కనిపించే సుబ్బన్న– సముద్రుడిలా గంభీరంగా వంట సామాగ్రినంతా గోతాలకు సర్దేస్తున్నాడెందుకో!రాములవారి వెంట సీతమ్మలా, ఆదిశివుడిలో సగమైన గౌరమ్మలా సుబ్బన్న చేతి ఒడుపుకనుగుణంగా సైనికురాలిలా వెంట ఉంటూ, ముప్పొద్దులా వండి అందించే అతని ఇల్లాలేది, ఎక్కడా కనబడదే...!? తినడానికి వచ్చిన జనాలు పిలుస్తున్నా వినబడనట్లు అలా మిన్నకున్నాడేంటి ఈ సుబ్బన్న. ఏం జరిగుంటుంది? తెలుసుకోమని మనసు రొద పెడుతుంటే, అతనికి దగ్గరగా వెళ్ళి నిలబడి, ‘‘ఏంటి సుబ్బన్నగారూ.. ఏమయింది..?’’ అన్నాను. 

    అతనేం మాట్లాడకపోయే సరికి మళ్లీ రెట్టించాను. తలెత్తకుండానే, ‘‘ఈ ఊరొదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం సార్‌..!’’ అన్నాడు. ‘‘అరెరే... ఏమయింది?...’’ అని మొదలెట్టి, కొనసాగింపుగా ఓ పది ప్రశ్నలు వేశాను. దేనికీ జవాబు చెప్పలేదు కానీ, ‘‘ఇప్పుడేమీ అడగొద్దు సార్‌..!’’ అంటున్నప్పుడు అతని గొంతులో జీర నా చెవులను దాటిపోలేదు. ఏదో తీరని వేదనలో ఉన్నట్లున్నాడు. ముఖం కూడా చూపించలేక పోతున్నాడు. ఇంకా అక్కడే ఉండి, అతన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకనిపించి, వేరేచోటకు వెళ్ళి తినేసి, శ్రావ్యకు పార్సిల్‌ కట్టించుకుని హాస్పిటల్‌కు చేరుకున్నాను.తనను ఎక్కువగా మాట్లాడించడమంత మంచిది కాదనిపించి, తన పనులన్నీ చూచి, పక్క బెడ్‌పై కూర్చున్నాను. తలపుల గూడులోకి సుబ్బన్న ప్రవేశించాడు. 

    దాదాపు ఐదేళ్ళక్రితం.., ఈ హాస్పిటల్‌కు వచ్చిన మొదటిరోజు ఓపీ వ్రాయించి, ఏదైనా తిందామని మేమిద్దరమూ బయలుదేరాము. అక్కడికి దగ్గరలో ఓ ప్రభుత్వ భవనపు ప్రహరీగోడ మూల మీద నాలుగు రేకులు వేసి, వాటికింద నాలుగు అరుగులు కట్టి ఉన్నాయి. సుబ్బన్న దంపతులు వండి, అందిస్తుంటే... జనాలు కూర్చుని తింటున్నారు.‘‘ఇక్కడ తినేసి వెళదామా..?’’ అంది శ్రావ్య. ‘‘ఆ అరుగుల వెనక చూడు... అంతా బురద... పైగా పందులు, కుక్కలు పొర్లుతున్నాయి ఛండాలంగా... ఇక్కడెలా తింటాము?’’ అన్నాను. ‘‘ఒక్కసారి తిని చూడండి... వదిలిపెట్టరు...’’ అక్కడ తిని వెళుతున్న ఒక వ్యక్తి అన్నాడు. ఇక చేసేదిలేక, అప్పటికంత కన్నా దూరం వెళ్ళలేక అక్కడే తినడానికి కూర్చున్నాము. మా ఇంట్లో చేసుకున్నంత రుచిగా, శుచిగా అనిపించాయి దోసె, ఇడ్లీ... ధర కూడా చాలా సాధారణంగా అనిపించింది. డబ్బులు ఇచ్చేటప్పుడు మంచీ చెడ్డా మాట్లాడుతూ, అతని వివరాలు కనుక్కొని, ‘‘ఆ వెనక పందులవీ తిరగకుండా శుభ్రం చేయించకూడదా సుబ్బన్నగారూ?’’ అన్నాను నవ్వుతూ.

    ‘‘చేయిద్దామనే అనుకుంటున్నాను సార్‌... ఏ నెలకానెల మా అబ్బాయి ఫీజులకనీ, పుస్తకాలకనీ వచ్చిన డబ్బు కాస్తా అయిపోతా ఉంది. వచ్చే నెల సెలవులు వస్తున్నాయిగా, కాస్తన్నా మిగుల్చుకుని గోడ పెట్టిచ్చేస్తా’’ అన్నాడతను. ‘‘ఏం చదువుతున్నాడు మీ అబ్బాయి..? ఎందరు పిల్లలు మీకు?’’ అడిగాను. ‘‘ఒక్కడే అబ్బాయండి... ఆరోక్లాసయి పోయి, ఏడుకొస్తాడింక... మామూలు గవర్నమెంటు బడికి పంపుదామంటే, ఈ మనిషి వినకుండా పెద్దపెద్దోళ్ళ పిల్లలు చదివే బడిలో చేర్చాడు. ఆ ఖర్చులు పెరుగుతూనే వున్నాయి. తట్టుకోలేక పోతున్నాము’’ అంటున్న భార్యను వారించి, ‘‘మనం ముప్పొద్దులా తిప్పలు పడేదెందుకు... వాడికోసం కాదూ..?’’ అన్నాడు. ‘‘ఏంటో ఈ మనిషి పిచ్చి... ఆ కొడుకే లోకం. వాడిమీద ఈగ వాలనివ్వడు కదా..! పాతికేళ్ళ నుంచి చేయి కాల్చుకుంటున్నా గాని, తలదాచుకునేందుకు చిన్నపాక గూడా వేసుకోలేకపోయాము’’ అందామె.

    వాళ్ళిద్దరికీ నలభై ఏళ్ళపైనే ఉంటుంది వయస్సు. అతనేమో ఇనుపకడ్డీలాగ నల్లగా, పొడవుగా ఉన్నాడు. ఆమేమో, బంగారపు ముద్దలాగా తెల్లగా, బొద్దుగా ఉంది. ఇద్దరికీ కొడుకంటే పంచప్రాణాలు కాబోలు. అయినా పిల్లలు పుడితే అంతేనేమో! వాళ్ళకోసం సర్వ సుఖాలను ఒడ్డి, పోరాటం చేయాలనిపిస్తుందేమో..! త్వరగా మేము కూడా తల్లిదండ్రులమైతే ఎంత బాగుంటుంది..!? ఇద్దరం మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వచ్చేశాము. ఓ రెండునెలల తరువాత, మళ్ళీ హాస్పిటల్‌కు వెళ్ళినపుడు, సుబ్బన్న హోటల్‌కే వెళ్ళాము తినడానికి. ఆ వెనుక వైపంతా చదును చేయించి, నాపరాళ్ళు పరిపించి ఓ పరదా కట్టాడు. ‘‘ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంది సుబ్బన్నగారూ..!’’ అన్నాను దోసె తింటూ. ‘‘గోడ పెడదామంటే, డబ్బులు చాల్లేదు సార్‌!’’ నొచ్చుకుంటున్నట్లు అన్నాడు. ‘‘పోన్లెండి, ఆ పందులవీ లేకుండా ప్రశాంతంగా ఉంది..’’ అన్నాను.

    ‘‘అవి మురికి జీవాలు సార్‌... మిగిలిపోయినవి, మురిగిపోయినవి అక్కడ పారబోస్తే తిని, ఆ బురదలోనే పొర్లుతుండేవి. ఈ బండలు పరిచిన తరువాత, మేమేది పడేసినా తినడానికి కూడా రావట్లేదు. ఏ మురుగులో బతుకీడుస్తున్నాయో పాపం..!’’ అన్నాడు జాలిగా ముఖంపెట్టి. ‘‘పోన్లెండి... అవి పంకిల ప్రేమికులు కదా, నచ్చిన గూటికి చేరుంటాయి’’ అన్నాను అతన్ని నవ్విద్దామని. ‘‘డాడీ... అర్జెంట్‌గా ఓ తౌజెండ్‌ రూపీస్‌ కావాలి... రేపు మా స్కూల్‌ పిల్లలమంతా ఎక్స్‌కర్షన్‌కు వెళుతున్నాం’’ అంటూ సుబ్బన్న చెంతకు చేరుకున్నాడొక పిల్లవాడు. పదకొండేళ్ళు ఉంటాయేమో, చాలా తెల్లగా, బొద్దుగా ఉండి... భలే ముద్దొస్తున్నాడు. ‘‘మీ బాబు, వాళ్ళమ్మ పోలికట్లుందండి... చాలా బాగున్నాడు’’ అన్నాను. అతను గుంభనంగా నవ్వుకుంటూ, కొడుకుకు డబ్బులిచ్చి, జాగ్రత్తలు చెప్పి పంపించాక, ‘‘మీకు కూడా మా మనీష్‌ లాంటి మంచి బాబు పుడతాడు లెండి సార్‌!’’ అన్నాడు చిరునవ్వుతో.‘‘థాంక్సండి!’’ అంటూ డబ్బిచ్చి వచ్చేశాము.
     
    అలా డాక్టర్‌ రమ్మన్నప్పుడల్లా హాస్పిటల్‌కు, అటునుండి సుబ్బన్న హోటల్‌కు ఐదేళ్ళుగా తిరుగుతున్నా గాని, శ్రావ్య కడుపు పండలేదు, అమ్మానాన్నలు కావాలనే మా కాంక్ష తీరలేదు. కాని, సుబ్బన్నతో, అతని కుటుంబంతో మంచి స్నేహం ఏర్పడింది. ఈ ఊరు వచ్చినప్పుడల్లా అక్కడే తినడం, అతనితో పిచ్చాపాటీ మాట్లాడడం పరిపాటైపోయింది. జ్ఞాపకాల నుంచి బయటికొచ్చిన నాకు, ‘ఇప్పుడింత అర్ధాంతరంగా, మంచి ఆదాయాన్నిస్తున్న హోటల్‌ని ఎందుకు తీసేసుకుంటున్నట్లు? పుట్టి పెరిగిన ఊరునెందుకు వదిలి వెళుతున్నట్లు? ఏం కష్టమొచ్చిందో పాపం..! ఎలా అతని బాధ తెలుసుకోవడం..’ అనుకుంటూ లేచి కూర్చున్నాను. ‘‘శేఖర్‌..!’’ మెల్లిగా శ్రావ్య పిలుపు వినబడడంతో,తనకు చేరువగా వెళ్ళి, ‘‘ఏంటి శ్రావ్యా..!’’ అన్నాను.
     
    ‘‘ఈ పదిహేను రోజులు ఈ ఊళ్ళోనే ఉండనా... అదే మా వాణీ వాళ్ళింట్లో ఉండనా నేను? తననడిగితే, సంతోషంగా రమ్మంది. ఈ పరిస్థితిలో దూర ప్రయాణం అంత మంచిది కాదేమో కదా..!’’ ఆశగా అడిగింది. వాణి శ్రావ్య పెద్దమ్మ కూతురు. తనమాట తోసివేయలేక సరేనన్నాను. తరువాతి రోజు హాస్పిటల్‌ నుంచి వాణీ వాళ్ళింటికి చేరుకున్నాము. ప్రతిరోజూ బోలెడు మాత్రలు మింగడంతో పాటు, బొడ్డుకు ఇంజక్షన్లు కూడా చేయించవలసి రావడంతో, ఓ నర్సును మాట్లాడి, మిగతా ఏర్పాట్లన్నీ చూసి, వ్యాపార పనుల నిమిత్తమై నేను మా ఊరు వచ్చేశాను. కాల్‌ చేసినప్పుడల్లా, కన్సీవ్‌ అవుతుందో, లేదోనని ఆందోళన పడుతున్న శ్రావ్యకు ఒక దారి మూసుకు పోయినప్పుడు మరిన్ని దారులు తెరచుకుంటాయని, ఇది కాకపోతే దత్తతావకాశం ఉండనే ఉన్నదని, పాజిటివ్‌గా ఉండమని చెప్పి ధైర్యాన్ని అందించాను.

    పదిహేనవ రోజు శ్రావ్య రక్తం తీసుకుని, హాస్పిటల్‌ ల్యాబ్‌లో ఇస్తే, సాయంత్రం ఐదుగంటలకు రమ్మన్నారు వాళ్ళు. ఎంత వద్దనుకున్నా, గుండెలో అలల్లా అలజడి. ఓ క్షణం పాజిటివ్‌ తీరానికి చేరుకుంటుంది.. మరుక్షణమే నెగెటివ్‌ అగాధానికి తీసుకెళుతుంది. ఇలాంటి అనిశ్చితమైన మనసుతో శ్రావ్య ఎదుట ఎందుకు లెమ్మని, లేని పని కలిగించుకుని... ఊళ్ళో బలాదూరు తిరుగుడు మొదలెట్టాను. అలవాటుగా సుబ్బన్న హోటల్‌ వైపుకు మళ్ళాయి కాళ్ళు. సుబ్బన్న స్థానంలో మరొకతను కనిపించాడు. పరదా బదులు గోడ, అరుగుల స్థానే ప్లాస్టిక్‌ కుర్చీలు కనిపించాయి. ‘లోపలికెళ్ళి, సుబ్బన్న వివరాలు అడిగితేనో..’ మెదడు తలపును, తడబాటునున్న మనసు తోసిపుచ్చేసింది. కళ్ళు ఆ వైపుకే చూస్తున్నా, కాళ్ళు మాత్రం ముందుకు కదిలాయి. అలా మూడు, నాలుగు వీధులు నడుచుకుంటూ వెళ్ళాక... రోడ్డు దాటబోతుంటే, చాట్‌ మసాలా, పానీపూరితో కూడిన తోపుడుబండి ఎదురొచ్చింది.

    దాన్ని తప్పించుకునే క్రమంలో అప్రయత్నంగా బండిని తోసే వ్యక్తిని చూసి నిర్ఘాంతపోయి, నిలబడిపోయాను. నేను తేరుకుని, అతన్ని పిలిచేటప్పటికల్లా.., గబగబా బండిని తోసుకుంటూ వీధి మలుపు తిరిగేశాడు. వెంబడిద్దామనుకున్నాను కాని, తను ఉద్దేశపూర్వకంగా వెళ్ళినపుడు ఎందుకు లెమ్మని వాచ్‌ చూసుకుని హాస్పిటల్‌ వైపుకు మళ్ళాను. వెళ్ళేదారిలో యథాలాపంగా హోటల్‌ వైపుకు మళ్ళాయి నా కళ్ళు. ‘‘రండి సార్‌... వేడివేడి బజ్జీలు తిందురు గానీ..!’’ అన్నాడా కొత్త యజమాని. విషయం తెలుసుకోవాలనే ఉత్కంఠకు ఆ పిలుపును జోడించి కాళ్ళను హోటల్లోకి మళ్ళించాను. ‘‘సుబ్బన్న ఉన్నప్పుడు మీరు తరచు వస్తుండేవారు కదా సార్‌..! నేను చాలాసార్లు చూశాను’’ బజ్జీలు అందిస్తూ అన్నాడతడు. తీగ లాగడానికి మార్గం సుగమమయిందని తృప్తిపడుతూ, ‘‘అవును వచ్చేవాణ్ణి. సుబ్బన్నకు ఏమైందసలు..? వాళ్ళబ్బాయి పానీపూరి బండి దగ్గరున్నాడేంటీ..!?’’ అడిగేశాను.

    అతను ఓ నిట్టూర్పు విడిచి, ‘‘ఏముంది సార్, ఆయనది చల్లటి గుండె కదా... రగిలిన మమతల మంటల్లో మండిపోయింది’’ అన్నాడు.
    ‘‘మమతలేంటీ.. మండటమేంటి..? అర్థమయ్యేట్లు చెప్పవయ్యా..!’’ అన్నాను. ‘‘పదహారేళ్ళు ప్రాణప్రదంగా పెంచుకున్న కొడుకు... ఆ తల్లిదండ్రుల మనసుల్లో మంటలు రాజేసి వెళ్ళిపోయాడు సార్‌!’’ మరుగుతున్న నూనెలో వడల పిండి వేస్తూ చెపుతున్నాడతడు.
    ‘‘పదహారేళ్ళ పసివాడు ఎక్కడికి వెళతాడు..? తల్లిదండ్రులను వదిలి ఎలా బతుకుతాడు..?’’ ఆవేశంగా అన్నాను.‘సుబ్బన్న దంపతులకు పెళ్ళయ్యాక పదిహేనేళ్ళు గడచినా బిడ్డలు కలగకపోతే, ఏడుగురు పిల్లలను సాకలేక తిప్పలు పడుతున్న వడ్డెర దంపతులతో మాట్లాడి, వాళ్ళకు కొంత పైకమిచ్చి, రెండు నెలల పసిగుడ్డయిన మనీషుని దత్తత తెచ్చుకున్నారంట! వాడు వీళ్ళ నీడన పెరుగుతూ.. చెడు స్నేహాలు పెంచుకుని, దురలవాట్లు నేర్చుకున్నాడు. 

    అది తెలుసుకుని, సుబ్బన్న మందలిస్తుండేసరికి.., స్నేహితులు, చుట్టాల ద్వారా అసలు తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వెళ్ళిపోయాడు. ఆ కుటుంబంలో తండ్రీ, తోబుట్టువులంతా తాగుడికి బానిసలయ్యారని, ఇల్లు గడిచే పరిస్థితి లేదని మనీష్‌ కన్నతల్లి వీడిని చదువు మానిపించేసి, పనిలో పెట్టిందట. ‘అదేమిట్రా..’ అని అడిగితే, ‘నన్ను కన్నోళ్ళు, నాకు తోడబుట్టినోళ్ళే నావాళ్ళు, వాళ్ళతోనే బతుకుతాను... బతకలేక పోతే చస్తాను..’ అని తెగేసి చెప్పాడట!’ సుబ్బన్న దంపతులు తట్టుకోలేక, ఊరొదిలి పెట్టి వెళ్ళిపోయారు. ఇన్నాళ్ళూ సుబ్బన్న దంపతుల కష్టంతో ఇంటర్నేషనల్‌ స్కూల్లో చదువుకున్న వాడు, పశువుల పాక వంటి మురికింట్లో పడుకుంటూ, పానీపూరీ అమ్ముకుంటున్నాడు.

     ‘‘ప్రేమ పెంచుకున్న కొడుకు దూరమవడం, పదిమందిలో పరువు పోవడం జీర్ణించుకోలేక, పెంచిన మమతను వదులుకోలేక ఈ హోటల్‌ను నాకు అమ్మేసి, వాళ్ళెటో వెళ్ళిపోయారు సార్‌! ఈ పిల్లవాడికి తెలివిలేకపోయింది సరే.. కనీసం ఏడుగుర్ని కన్న ఆ తల్లికైనా వీళ్ళమీద జాలి లేకపోయింది. ఎవరో తెలియని అనాథను చట్టబద్ధంగా దత్తత తీసుకుని ఉంటే, ఇవాళ సుబ్బన్నకింతటి కడుపుకోత ఉండేది కాదేమో..! ఇట్లా ఎన్నెన్నో అనుకుంటాం గాని, కడుపున పుట్టినోళ్ళతో సాటిరాగలరా సార్, ఈ సాకుడు పిల్లలు..!?’’ అతడింకా ఏదో చెపుతున్నాడు. ఆ గాథ అంతా వినేసరికి, నా మనసంతా మొద్దుబారిపోయింది. ‘నాది అనే భావన ముందు ఇంకేదీ నిలవదా? అమ్మో... బ్లడ్‌ టెస్ట్‌ రిపోర్ట్‌ ఎలా వస్తుందో..! మమతల విలువ తెలియని ఈ వ్యవస్థలో వేరెవరినైనా దత్తత తీసుకోవడమంటే, మరణంతో సమానమే కదా..! సుబ్బన్న వంటి దుస్థితిని ఎదుర్కోవడం మా వంటి సున్నిత మనస్కులకు సాధ్యమయ్యే పనేనా? ప్రస్తుతం ఫలితమెలా ఉన్నా..

    మిగిలున్న ఎంబ్రియోలను వాడుకోవడం నయం కదూ..? నేను వెళుతున్న కృత్రిమ పద్ధతే రాళ్ళదారి అనుకుంటే, దత్తత ముళ్ళదారైతే... పిల్లలు కలగని మావంటి వారి పరిస్థితి ఏమిటి? చట్టపరమైన దత్తతకు చెట్టు ఆకులన్ని నిబంధనలు ఉండటం వలనేకదా... సుబ్బన్న దంపతుల వంటివారు అవస్థలకు లోనవుతున్నది? అనేక మార్గాలవెంట పయనించి, పాట్లు పడుతున్నది..! ఇటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే, పెంపుడు తల్లిదండ్రులకు సమాజం నుంచి సవాళ్ళు ఎదురైతే, ఏ ఆదరణకూ నోచుకోని అనాథల గతేంకాను..? మమతలు పంచాలనుకునే మనస్సులెలా లభించేను!? మానవత్వపు చిరునామా ఎటుపోయేను..!?’ అనే సందిగ్ధ ఆలోచనలు, సంశయాల ఆందోళనల మధ్య హాస్పిటల్‌ మెట్లు ఎక్కాను.  

  • ఈసారి సెలబ్రిటీల జంట ట్రెండ్‌ని సెట్‌ చేయడం లేదు. వాళ్లే సరికొత్త ట్రెండ్‌ని సెట్‌ చేసేలా భారతీయ మూలాలను గౌరవించడం విశేషం. ఈ మార్చి 6న అల్లు శిరీష్‌ నయనిక రెడ్డీల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో అల్లు శిరీష్‌ చేతి మెహందీ అందర్నీ అమితంగా ఆకర్షించింది. మన సంస్కృతికో పాతుకపోయిన గోరింటాకు అంతరార్థాన్ని తెలియజెప్పేలా శిరీష్‌ చేతి మెహిందీ ఉంది. నిజంగానే మన భారతీయ సంప్రదాయంలో వధువరులను లక్ష్మీ నారాయణులుగా భావిస్తారు. 

    నారాయణుడకి తమ ఇంటి ఆడపిల్ల చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతిని అందిస్తున్నాం అన్నట్లుగా కాళ్లు కడిగి మామగారు అల్లుడి చేతిలో పెడతారు. నారాయణ..మా లక్ష్మీకి ఇక నుంచి అన్ని నీవే అని చెబుతారు. ఆ నేపథ్యాన్ని ఇలా శిరీస్‌ చేతిపై ఉన్న మెహందీ డిజైన్‌ ద్వారా చెప్పకనేచెప్పారు. ఈ శంకు చక్రాలు ఎక్కువగా వైష్ణవులు తమ భుజాలపై ఛాతీపై ధరిస్తారు. అలాగే ప్రతి వైష్ణవ ఆలయాల్లో ఇవి దర్శనిమిస్తాయి. నిజంగా ఆ వివాహ వేడుకలో నారయణుడిగా శిరీష్‌..లక్ష్మీదేవిగా నయనికలు అతిథులకు చూడచక్కని జంటలా కనువిందు చేశారు. 

    ఇక్కడ శంఖం అనేది శుభ శుచికానికి, ధనానికి ప్రతీక అయితే..చక్రం మన జీవిత గమనానికి సంకేతం..ఇక మధ్యలో ఉండే తిరునామాలు..అందరిలోనూ ఉండే సర్వాంతర్మామి ఆ నారాయణుడి అని గొంతెత్తి చెప్పేలా చాలామంది వైష్ణవులు ముఖంపై ధరిస్తుంటారు. కాగా ఈ వివాహ వేడుకలో అల్లు శిరీష్‌ బంగారు రంగులో క్లిష్టమైన ఎంబ్రాయిడీ కలిగి న్న ఆఫ్‌ వైట్‌ సిల్క్‌ షేర్వానీని ఎంచుకోగా, నయనికా రెడ్డి బంగారం వెండి జర్దోజీ వర్క్‌తో అంకరించబడిన లావెండర్‌ రంగు పట్టు చీరను ఎంచుకుంది. దానికి అనుబంధంగా రూబీ, వజ్రాల నెక్లెస్‌లు, స్టేట్‌మెంట్‌ చెవిపోగులు, గాజులతో ముగ్ధమనోహరంగా ఉంది.

     

    (చదవండి: Arjun Saaniya Chandhoks wedding: సారా మీనాకారి నెక్లెస్‌..! ఇంత స్పెషాల్టీ దాగుందా..?!)

     

Politics

  • సాక్షి, తాడేపల్లి: మహిళలకు మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని.. ఐదేళ్లలోనే యాభై ఏళ్ల సంస్కరణలు తెచ్చారని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో​‍-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఉమెన్స్ డే వేడుకల్లో మాట్లాడుతూ.. పార్టీలో మహిళా విభాగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అన్నిఅనుబంధ విభాగాల్లోనూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సజ్జల అన్నారు.

    ‘‘మండల, గ్రామస్థాయిలో కమిటీలను పూర్తి చేయాలి. అప్పుడు క్షేత్రస్థాయిలో మహిళా విభాగం మరింత పటిష్టంగా మారుతుంది. ఏదైనా సమస్యలపై గట్టిగా పోరాటం చేయవచ్చు. స్థానికంగా ఉన్న సమస్యలపై అక్కడే పోరాటం చేయాలి. పార్టీ పిలుపునిచ్చే రాష్ట్రస్థాయి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి. మీ దృష్టికి వచ్చిన సమస్యలను స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేయాలి. లీడర్లుగా ఎదగాలంటే చొరవ చూపి ముందుకు నడవాలి. చంద్రబాబు మహిళలకు అన్యాయం చేశారు. ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయకుండానే చేసినట్లు చెప్పుకుంటున్నారు.

    ..వైఎస్ జగన్ అనేక పథకాలను మహిళలే కేంద్రంగా అమలు చేశారు. మహిళల జీవన ప్రమాణాలను పెంచేలా కృషి చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. దీని వలన జరుగుతున్న నష్టాలపై ఎక్కడికక్కడే సమావేశాలు పెట్టాలి. అందరిలోనూ చైతన్యం తీసుకు రావాలి. వచ్చే ఎన్నికల నాటికి మహిళలే కీలక పాత్ర పోషించేలా నాయకత్వం వహించాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

  • సాక్షి, తాడేపల్లి: మహిళా సాధికారత కోసం కృషి చేసిన వ్యక్తి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహిళలు రాజకీయాల్లో ఎదగాలంటే చాలా కష్టమని.. కానీ వైఎస్ జగన్ ప్రోత్సాహంతో పార్టీలో ఎంతోమంది మహిళలు ఎదిగారని ఆమె పేర్కొన్నారు. ఆదివారం.. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళా నేతలు ఆర్కే రోజాతో పాటు వరుదు కళ్యాణి, రాయన భాగ్యలక్ష్మి, పూజిత, హారిక సహా పలువురు పార్టీ నేతలు కేక్ కట్ చేశారు.

    ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. ‘‘నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రి పదవి ఇచ్చి వైఎస్‌ జగన్‌ ప్రోత్సాహించారన్నారు. కష్టపడే వారికి, టాలెంట్ఉన్న వారికి వైఎస్ జగన్ ఎప్పుడూ అవకాశం కల్పిస్తారు. వరుదు కళ్యాణి తన ఎమ్మెల్సీ పదవి అలంకార ప్రాయం కాదని.. ఆయుధమని నిరూపించారు. ప్రతి మహిళ ఒక శక్తిగా ఎదగాలి. టీమ్ వర్క్‌గా పని చేసి మళ్లీ  జగన్‌ను సీఎంగా చేసుకోవాలి’’ అని ఆర్కే రోజా పేర్కొన్నారు.

    ‘‘రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన సాగుతోంది. మహిళలకు రక్షణ కల్పించలేని దిక్కమాలిన ప్రభుత్వం ఇది. హోంమంత్రి అనిత తన పదవిని పట్టించుకోకుండా ఆట, పాటలతో కాలం గడుపుతోంది. అనితతో పాటు మరో ఇద్దరు మంత్రులు మహిళలకు ఏం మేలు చేశారు?. అలాంటి మంత్రులు  సబిత, అనిత, గుమ్మడి సంధ్యారాణిలకు మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. అన్యాయానికి గురైన మహిళలు ఫిర్యాదులు చేస్తే వారిమీదే కేసులు పెడుతున్న దుస్థితి నెలకొంది.

    ..కులం, మతం, పార్టీ చూడకుండా వైఎస్ జగన్ అందరికీ మేలు చేశారు. చంద్రబాబు మాత్రం కులం, మతం, పార్టీ చూసి అందరికీ వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత లేదు. పవన్ కళ్యాణ్‌ సుగాలి ప్రీతి పేరు చెప్పుకుని, ఆమె తల్లి కన్నీటిని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసిన వ్యక్తి. ముప్పై వేల మంది మహిళలు కనిపించకపోయారని చెప్పిన పవన్ ఈ ఇరవై నెలల్లో ఎంతమందిని తిరిగి తీసుకు వచ్చారు?.

    మనం చేసిన మంచి వలనే ఇప్పటికీ జనం మనల్ని గౌరవవిస్తున్నారు. కూటమి నాయకులు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితే లేదు. చంద్ర మండలానికి కూడా చంద్రబాబు సీఎం అవుతాడని ఎల్లో మీడియా జాకీలు ఎత్తుతోంది. బీఆర్ నాయుడు తప్పు చేస్తే అందులో తప్పేం ఉందని ఎల్లోమీడియా ప్రశ్నిస్తోంది. బీఆర్ నాయుడుకి ఒళ్లంతా అహంకారమే. లడ్డూపై విష ప్రచారం చేసిన వారందరి లెక్కలూ వెంకటేశ్వరస్వామి తేల్చుతున్నాడు’’ అని ఆర్కే రోజా వ్యాఖ్యానించారు.

  • పాట్నా: బిహార్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్‌ కుమార్‌ రాజ్యసభలో అడుగు పెట్టనున్న తరుణంలో ఆయన కుమారుడు నిశాంత్‌ కుమార్‌ జేడీయూలో చేరారు. ఆదివారం నితీష్‌ ఆధ్వర్యంలో నిశాంత్‌ పార్టీ సభ్యత్వం పొందారు. ఈ సందర్భంగా నితీష్‌ కుమార్‌ తన కుమారుడికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

    రెండు దశాబ్దాలకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించిన నితీష్‌ కుమార్‌ త్వరలో రాజ్యసభకు వెళ్లనున్నారు. ఆయన నిర్ణయంతో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న నిశాంత్‌ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. త్వరలో బిహార్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది.

    బిహార్‌లో అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ‘సుశాషన్ బాబు’ (మంచి పాలన అందించే వ్యక్తి) అనే పేరు తెచ్చుకున్న నితీష్‌ మార్చి 16న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్‌ దాఖలు చేశారు. త్వరలో ముఖ్యమంత్రి పదవిని వదులుకోనున్నారు.

Cartoon